పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్

పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్

సుసెట్టీని కాంతి కనుల కోమలి –‘’ఇంషటా తూంబా’’అంటారు .జోసెఫ్ లా ఫ్లేషీ ,మేరీ గేల్ అనే పోనాకా అమ్మాయిల అయిదుగురు సంతానంలో ఒకరు .తండ్రి ఫర్ వ్యాపారంలో బాగా సంపాదించి ధనికుడైన ఫ్రాన్స్ దేశ౦ నుంచి వచ్చినవాడు .తండ్రిని ‘’ఉక్కు కన్నులవాడు ‘ఇంస్టామాజా ‘’అని పిలిచేవారు.ఫ్రాన్స్ నుంచి అమెరికా కు వలస వచ్చి ,16 వ ఏటనే అమెరికన్ ఫర్ కంపెనీలో చేరి ఎప్పుడూ టూర్ లలో ఉండేవాడు. సుసెట్టీ కూడా తన 10 వ యేటనుండే తండ్రితో టూర్ లలో పాల్గొనేది ..భర్త ఎప్పుడూ ఇల్లు పట్టి ఉండక తిరుగుతూ ఉండటం తో భార్య అతన్నివదిలేసి౦ది ,కూతుర్నితన తల్లిదండ్రులు కుటుంబం ఒహామా లో ఉంటూ జాగ్రత్తగా పెంచింది .తల్లి మళ్ళీ పెళ్లి చేసుకొన్నది .తండ్రి  వేరే పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి జోసెఫ్ మారుటి తమ్ముడు తెల్ల హంస అనబడే ఫ్రాంక్ లాఫ్ పోనాక్ చీఫ్ .ఆయన ప్రభావం సుసెట్టీ పై బాగా పడింది .
చదువు –పొనకా చైతన్యం
రిజర్వేషన్ ఉద్యమం లో ప్రెస్ బిటేరియన్మిషన్ స్కూల్ మూత పడటం తో సుసెట్టీ న్యూజెర్సిలోని ఎలిజబెత్ లో ఉన్న గర్ల్స్ స్కూల్ లో చేరి చదివింది .చెల్లెళ్ళు మార్గరెట్ ,సుసాన్ లు కూడా ఇక్కడే చేరి చదివారు .ఈ స్కూల్ లో ఉన్నప్పుడే ఆమె రచనా పాటవం బయట పడింది .అందరూ మెచ్చి ప్రోత్సహించారు .క్రమంగా రచయిత్రి గా పేరొచ్చింది .అన్ని రంగాలలోను దూసుకు వెళ్లి అగ్రస్థానం లో నిలిచింది. చెల్లెలు సుసాన్ లా ఫ్లేషీ పికోటీ మొట్టమొదటి నేటివ్ అమెరికన్ ఫిజిషియన్ అయింది ..నేటివ్ ఇండియన్ రిజర్వేషన్ లో మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్ ను స్థాపించి రికార్డ్ నెలకొల్పింది .మరో చెల్లెలు రోసేల్లీ ఒమాహా నేషన్ కు ఫైనాన్సియల్ మేనేజర్ అయి ,నివాస భూమి కాని ప్రదేశాలలో అంటే అదనంగా ఖాళీ గా ఉన్న స్థలాలలో గడ్డి పెంచటం లీజ్ కివ్వటం చేసి సంపాదనా పరురాలైంది .ఇంకో చెల్లెలు మార్గరేట్ యాక్టన్ సియోక్స్ రిజర్వేషన్ లో టీచర్ అయింది .ఇలా నేటివ్ అమెరికన్ కుటుంబం లోని వీరంతా బాగా విద్యా వ్యాపార రంగాలలో చక్కని అభివృద్ధి సాధించారు .ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ను సార్ధకం చేసుకొని తమ జీవితాల్లో  వెలుగులు నింపుకొని తమ జాతికి వెలుగు నిచ్చారు .మారుటిసోదరుడు ఫ్రాన్సిస్ లా ఫ్లేషీ –స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూట్ లో మానవ జాతి శాస్త్ర వేత్త (ఎత్నాలజిస్ట్ ))అయి ,తమజాతులైన ఒమాహా, ఒసాజా లపై పరిశోధనాత్మక రచనలు చేశాడు .వారి సంప్రదాయ గీతాలను సంగీతాన్ని రికార్డ్ చేసి భద్ర పరిచాడు .
రాజకీయ రంగ ప్రవేశం
యవ్వనం రాగానే సుసెట్టీ రాజకీయ రంగ౦పై ఆసక్తికలిగి ఇంగ్లీష్ లో ఎలా చక్కగా మాట్లాడాలో మెళకువలు నేర్చుకొన్నది .మొదట టీచర్ గా ఒమాహా రిజర్వేషన్ లో చేరి పని చేసింది .నాయనమ్మ ,మేనమామలు పోనాకా అవటం వలన తండ్రితో విస్తృతంగా ఒక్లహామా లో పర్యటించి,నెబ్రాస్కా నుంచి తమ జాతిని బలవంతంగా ఇండియన్ సరిహద్దుకు తరలి౦పబడటానికి కారణాలను అన్వేషించి అర్ధం చేసుకొన్నది .అమెరికా ప్రభుత్వం మళ్ళీ నెబ్రాస్కలోని పోలాకా భూమిని గ్రేట్ సియోక్స్ రిజర్వేషన్ కు తిరిగి అప్పగించేసింది .ఒమాహా వరల్డ్ హెరాల్డ్ సంపాదకుడు ధామస్ ట్రిబుల్స్ తో కలిసి పనిచేసి దక్షిణ రిజర్వేషన్ ప్రాంతం లో ఉన్న ప్రజల పేదరికాన్ని ,సౌకర్యాలు లేకపోవటాన్ని ప్రజల దృష్టికి తెచ్చింది .పోనాకాలు అక్కడికి ఆలస్యంగా చేరుకోవటం వలన సకాలం లో పంటలు సాగు చేయ లేకపోయారు .ప్రభుత్వమూ ఆలస్యంగా స్పందించి వారి ఆరోగ్య పారిశుద్ద్య నివాసాల విషయమై పెద్దగా శ్రద్ధ చూపక పోవటం వలన అక్కడ మలేరియా వంటి అంటు వ్యాధులు ప్రబలాయి . మొదటి రెండేళ్లలో సుదూర ప్రయాణం, కొత్త ప్రాంతం లో జీవనం ,సదుపాయాల కొరత ,వ్యాధుల వలన ఆ జాతిలో మూడవ వంతు జనాభా మరణించారు .ముఖ్యనాయకుడైన ‘’స్టాండింగ్ బేర్ ‘’పెద్దకొడుకు ముసలితనం లో చనిపోయాడు .తన అనుచరుల సాయం తో కొడుకును తమ సంప్రదాయ నెబ్రాస్కా లో వారి పద్ధతులప్రకారం ఖననం చేయించాడు ముఖ్య నాయకుడు .ఫెడరల్ ప్రభుత్వ ఆజ్ఞల తో ప్రభుత్వం వీరిని నిర్బంధించి ఒమాహా కోట లో బంధించింది .యువ నాయకుడు ‘’స్టాండింగ్ బేర్ ‘’నాయకత్వం లో అటార్నీ జనరల్ ను ఏర్పాటు చేసుకొని అమెరికా ప్రభుత్వం పై అతని అరెస్ట్ కు కారణాలు తెలుసుకోవటానికి ‘’హెబియస్ కార్పస్ పిటిషన్’’వేశారు .
నెబ్రాస్కాలోని ఫోర్ట్ ఒహామాలో నిర్బంధం లో ఉన్న నాయకుని తరఫున సుసెట్టీ లా ఫ్లేషీ 1879 లో ముఖ్య దుబాసీ గా పని చేసింది .అక్కడి ప్రజల అసౌకర్యాలు వ్యాధులు చికిత్స కు సౌకర్యాలు లేకపోవటం అన్నీ ప్రభుత్వ దృష్టికి తెచ్చి స్టాండింగ్ బేర్ అరెస్ట్ కు ప్రాధమిక విషయాలేమీ లేవని నేటివ్ ఇండియన్ లు అమెరికా జాతీయ పౌరులేనని ,మిగిలిన అమెరికన్ లతోపాటు వారికీ సమాన హక్కులు ఉండాలని పోరాడి గెలిచి అతని విడుదలకు కృషి చేయగలిగింది . ట్రిబుల్స్ ఈ కేసుకు హాజరై వివరాలన్నీ రాసి మొత్తం దేశ ప్రజల దృష్టికి సమస్యను తీసుకొని వెళ్లి సంచలనం కలిగించాడు .ఈ కేసు సివిల్ రైట్స్ విషయం లో ఒక లాండ్ మార్క్ గా నిలిచింది .
విచారణ తర్వాత లాఫ్లెషీ ,ఆమె సోదరుడు ఫ్రాన్సిస్ స్టాండింగ్ బేర్ ఆధ్వర్యం లో తూర్పు అమెరికా ప్రాంతమంతా పర్యటించి ఆ జాతి సభలలో ఉపన్యాసాలు చేసి మద్దతు కూడా గట్టారు .సుసెట్టీ తన వాక్ పటిమతో అందరి హృదయాలను కదిల్చి గెలిచి జాతిప్రజలకు బాగా దగ్గరైంది .1880 లో జరిగిన కాంగ్రెషనల్ కమిటీ దృష్టికి పోనాకా గెంటివేత సమస్యను లాసేట్టీ, ట్రిబుల్స్ తీసుకొని వెళ్ళారు .నేటివ్ అమెరికన్ హక్కులకోసం లాసెట్టీ తీవ్రంగా పోరాడింది .అమెరికాలోని ప్రసిద్ధ రచయితలూ కవులు అయిన హెచ్ .డబ్ల్యు లాంగ్ ఫెలో ,హెలెన్ హంట్ జాక్సన్ లను కలిసి విషయాన్ని తెలియ బర్చి వారి సానుభూతి సహకారాలు పొంద గలిగారు .1881 లో జాక్సన్ ‘’ఏ సెంచరీ ఆఫ్ దిజానర్ ‘’పేరిట అమెరికాలో నేటివ్ అమెరికన్ ల కష్టాలు, బాధలు కన్నీళ్లు వారిపై జరిగిన అమానుష కృత్యాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు రాసి ప్రచురించాడు .అలాగే దక్షిణ కాలి ఫోర్నియాలో ఇండియన్ ల సమస్యలపై 1884 లో ‘’రామోనా ‘’నవల రాశాడు .లాంగ్ ఫెలో కవి ‘’ది సాంగ్ ఆఫ్ ఇహవాతా ‘’కవితలో ‘’నేటివ్ ఇండియన్ హీరోయిన్ ‘’లోసేట్టీ ని ‘దిస్ కుడ్ బి మిన్నేహాహా ‘’అని శ్లాఘించాడు .
వివాహం –రచన –మరణం
లా ఫెట్టీ ట్రిబుల్స్ ను పెళ్లి చేసుకొని స్టాండింగ్ బేర్ తోకలిసి 10 నెలలు  ఇంగ్లాండ్ ,స్కాట్లాండ్ లలో స్పీకింగ్ టూర్ చేశారు .ముఖ్యనాయకుని ముఖ్య దుబాసీగా లాసేట్టీ కొనసాగుతూనే ఉంది .ఈ ముగ్గురివలన అమెరికన్ ఇండియన్ ల కన్నీటి కష్ట గాధలు ప్రజలు అర్ధం చేసుకోగలిగారు. టూర్ నుంచి తిరిగి వచ్చాక సుసెట్టీ దంపతులు తమ సంప్రదాయ ఘోస్ట్ డాన్స్ సియోక్స్ బాండ్ ఉద్యమం నిర్వహించారు .1890 లో ‘’పైన్ రిడ్జ్ ఏజెన్సీ ‘’కి వెళ్లి అక్కడి పరిస్థితులు , ‘’ఊండెడ్ నీ మాసకర్’’ గురించి విస్తృతంగా రాశారు . లాసెట్టీ జర్నలిజం కెరీర్ లో ఈ పుస్తకం హై లైట్ గా భావిస్తారు .1881 లో వివాహం చేసుకొన్న ఈ జర్నలిస్ట్ జంట రెండేళ్ళు వాషింగ్టన్ డి. సి .లో ఉన్నారు .ఎక్కువకాలం నెబ్రాస్కాలోనే గడిపారు నేటివ్ అమెరికన్ సమస్యలపై విస్తృతంగా రాస్తూ ,ప్రసంగిస్తూ లా సేట్టీ గడిపింది .అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ వుమెన్ పై ఉపన్యసిస్తూ నేటివ్ ఇండియన్ ల స్థానం,వృత్తి ,సంస్కృతీ పై ప్రధాన ప్రస౦గం చేసింది .భర్త మామగారి వ్యవసాయ భూములను,ఆస్తులను పరిరక్షిస్తుంటే లాసేట్టీ ప్రభుత్వం ఇచ్చిన ఒమాహా రిజర్వేషన్ భూమిలో పంటలూ , రచనలూ పండిస్తూ గడిపింది . .ఆమె రచనలలో ముఖ్యమైనవి –ఒమాహా లెజెండ్స్ అండ్ టెంట్ స్టోరీస్ ,నేడావి యాన్ ఇండియన్ స్టోరి ,ఇంట్రడక్షన్ టు పోనాకా చీఫ్ .ప్రసిద్ధ పత్రిక ఓమహా వరల్డ్ హెరాల్డ్ లోను భర్త నిర్వహిస్తున్న ప్రజా పత్రిక ‘’ది ఇండిపెండెంట్ ‘’లోను నిరంతరం వ్యాసాలూ రాస్తూ కాలమ్స్ నిర్వహించింది .1903 లో లాసెట్టే చనిపోయింది మరణానంతరం అమెరికా సెనేట్ ఆమెను ఘన౦గా ప్రస్తుతించి ఆమె సేవను శ్లాఘించింది .1983 లో నెబ్రాస్కా హాలాఫ్ ఫేం లో ‘’సుసెట్టీ (బ్రైట్ ఐస్ )లా ఫ్లషీ టిబిల్స్ ‘’కు గౌరవ స్థానం కల్పించారు .
-గబ్బిట దుర్గా ప్రసాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.