ఉయ్యూరులో “శ్రీ సువర్చలాంజ నేయ శతక త్రయం” ఆవిష్కరణ మహోత్సవం

ఈ రోజు ఉయ్యూరులో “శ్రీ సువర్చలాంజ నేయ శతక త్రయం” ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా, రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచించిన ‘’శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకము ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రచించిన ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకము ‘’3-శ్రీ మంకు శ్రీను గారు(కొప్పర్రు –ప.గో. జి .) రచించిన ‘’శ్రీ సువర్చలేశ్వర శతకము ‘’ అనే శతక త్రయాన్ని ‘’సరసభారతి’’ ప్రచురించగా, ఆ పుస్తకాలను ఆవిష్కరించిన మన శాసన మండలి సభ్యులు గౌ”శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్యామలదేవి గారు, శ్రీనివాస విద్యాసంస్థల అధినేత పరుచూరి శ్రీనివాసరావు గారు, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం గారు, గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు, , కూనపురెడ్డి వాసు గారు, నాగరాజు గారు, పండు గారు, బాబి గారు, చిన్ని గారు మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.