గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
48-సంస్కృతం లోనే సంభాషించే రెండు ఆడర్శగ్రామాలు –మత్తూరు ,హోసహళ్లి
సంస్కృతభాషలో కవిత్వం ,నాటకం ,నవల ,వ్యాసం వ్యాఖ్యానం రాసి గీర్వాణ సేవ చేసిన మహాను భావుల నెందరినో గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో పరిచయం చేసుకోన్నాం .ఆ తర్వాత సంస్కృతం లో సినిమాలు తీసిన శ్రీ జి వి అయ్యర్ గురించీ తెలుసుకొన్నాం .అంతకంటే ఆశ్చర్యకరమైన మరో విషయం ఇప్పుడు తెలుసుకో బతున్నాం .అసలు సంస్కృతం మృత భాష ,దాన్ని ఎవరు చదువుతారు అందులో ఎవరు రాస్తారు ,చాదస్తంగా మీ లాంటి వాళ్ళు ఇంకా దాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు అని చాలా మంది అనుకొంటారు .కానీ ఈ 21 వ శతాబ్దం లో ఎనిమోదో ,తోమ్మిదోదో అయిన వింత ఒకటి వింటే అవాక్కై పోతాం. అదే కర్నాటక రాష్ట్రం లో మత్తూరు,హోసన హళ్లి అనే రెండు గ్రామాల ప్రజలు నిత్య వ్యవహారాలలో కూడా సంస్కృతంలోనే మాట్లాడు కొంటారని తెలిస్తే నాబోటి వాళ్ళం ఎగరలేక పోయినా గంతులేస్తాం .వారి సంస్కృతీ భాషా పరిరక్షణకు జేజేలు పలకాల్సిందే .
సంస్కృత గ్రామాలు
మత్తూరు ,హోసనహళ్లి.అనే రెండుగ్రామాలు కర్ణాటకలో తుంగా నదీ తీర౦ లో శివ మొగ్గ కు దగ్గరలో ఉన్నాయి .ఆ గ్రామాలను ‘సంస్కృత గ్రామాలు ‘’అంటారు అక్కడ గుడి, బడి ,అంగడి వీధులలో ,ఇళ్ళల్లో చిన్నా పెద్ద ,ఆడా మగా అందరూ సంస్కృతం లోనే మాట్లాడుతారు .అలా మాట్లాడుతున్నందుకు వాళ్ళు చాలా గర్వంగా భావిస్తారు .కొత్తవారు ఈ గ్రామాలలోకి వెళ్ళంగానే వాళ్ళు ‘’భవత్ నాం కిం ?”’అని అడుగుతారు .అంటే ‘’అయ్యా ! తమ పేరేమిటి ?”’అని అర్ధం పేరు చెప్పాక ‘’కతమ్ ఆస్తి ‘’? అనగా ‘’తమరు ఎలా ఉన్నారు ?’’అని అడుగుతారు .ఇలాసంభాషణ కొనసాగిస్తారు .ఈ గ్రామస్తులకు సంస్కృతం తప్ప ఇంకా ఏభాషా తెలియదు అనుకొంటే’’ భాషా పప్పు’’ లో కాలేసినట్లే మనం .వారికి తెలుగు కన్నడం మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఉంది .కుటుంబం లో ఒక్కరైనా ఇంజనీరింగ్ చదివి ఉత్తీర్ణులైన వారున్నారు .అయినప్పటికీ వారందరూ సంస్కృతం లోనే విధిగా మాట్లాడాలని దృఢ నిశ్చయం లో ఉన్నారు ..దీనికి కారణం భారత దేశం లో సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న ‘’సంస్కృత భారతి ‘’అనే స్వచ్చంద సంస్థ .
సంస్కృత భారతి సేవ
1981 లో సంస్కృత భారతి మత్తూరు గ్రామం లో ‘’సంస్కృత భాష గొప్ప దనం –ప్రస్తుతం దేశం లో దాని వైభవపతనానికి కారణాలు ‘’అనే అంశం పై 10 రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించింది .చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చాలా మంది వచ్చారు .ఈ వర్క్ షాప్ లో ఒకాయన ‘’సంస్కృతం లో ఒకడు అనర్గళంగా మాట్లాడితే అతడిని పండితుడు అంటారు .కానీ ఊరి వారంతా సంస్కృతం లో మాట్లాడితే ఏమనాలి ?అనే ప్రశ్న వేసుకొని అలా౦టిగ్రామాన్ని ‘’సంస్కృత గ్రామం ‘’అనాలి అని నిర్ణయించారు .సంస్కృత భారతి చెప్పిన ఈమాటను పై రెండు గ్రామాల వారికీ బాగా నచ్చి ,అందరూ సంస్కృతం నేర్చుకోవటం మొదలు పెట్టి సంస్కృతం లో మాట్లాడటం ప్రారంభించి సంస్థ ఆశయాన్ని ఆచరణలోకి తెచ్చి తమ ప్రత్యేకతను చాటి చెప్పి దేశం లోనే సంస్కృత భాషా పరంగా ఆదర్శ గ్రామాలు అని పించారు .సంస్కృతం తో పాటు మరొక మిశ్రమభాష ‘’సంకేతి ‘’ని కూడా వీరు మాట్లాడుతారు .ఇది సంస్కృత ,కన్నడ తెలుగు ,తమిళ మిశ్రమ భాష .ఇది వ్యావహారిక భాష .దీనికి లిపి లేదు దేవ నాగరి లిపినే వాడుతారు .సుమారు 6 00ఏళ్ళక్రితం కేరళనుంచి సంకేతి బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి .వీరి దినదిన జీవితమంతా సంస్క్రతం చుట్టూనే పరిభ్రమిస్తుంది . సంస్కృతమే అందరూ మాట్లాడుతారుకదా అని అందరూ పిలక పెట్టుకొని పంచె లేక లుంగీ తో ఉంటారు అనుకొంటే పొరబడ్డట్టే .జీన్స్ పాంట్ వాళ్ళూ చెవుల్లో సెల్లు లవాళ్ళూ మోటార్ బైక్ రాయుళ్ళూ అందరూ ఉంటారు .కాని మాట్లాదేదిమాత్రం సంస్కృతమే . ఒకరకం గా ఈ జంట గ్రామాలు పురాతన ఆధునికతలకు తీపి గుర్తులు .
గుడే బడి
ఈ గ్రామాల దేవాలయాలలో సంస్కృతం నేర్పించే పాఠశాలలుఉన్నాయి వీటిని ‘’వేద శాలలు ‘’అంటారు .శిధిలా వస్థలో ఉన్న ప్రాచీన తాళపత్ర గ్రంధాలను ఇక్కడే తిరగ రాసి ,కంప్యూటరైజ్ చేస్తారు .ఈ రెండు గ్రామాల వారే సంస్కృతం లో సంభాషిస్తున్నారు కాని ఇతర గ్రామాలవారెవ్వరూ ముందుకు రావటం లేదు .కాని జర్మని ,రష్యా వంటి విదేశీ యువత సంస్కృతం నేర్చుకోవటానికి అమితాసక్తి చూపిస్తున్నారు .జర్మనీ యూని వర్సిటీలలోని సంస్కృత కోర్సులకు ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా వారిలో పదుల సంఖ్యలలోనే విద్యార్ధులను ఎంపిక చేస్తున్నారు .కారణం సంస్కృతం బోధించే ప్రొఫెసర్లు తగినంత మంది లేక పోవటమే .అందుకే విదేశాలనుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి సంస్కృతం అభ్యసిస్తున్నారు .ఈ జంటగ్రామాల గోడలపై రాతలూ సంస్కృతం లోనే ఉంటాయి ..
మహా పండితులకు జన్మస్థానం
ఇక్కడి ఈ జంట గ్రామాల ప్రజల జీవనాధారం వ్యవసాయం .ఇక్కడి ప్రధాన పంట వక్కలు (పోచెక్కలు ).మత్తూరు నుంచి 30 కి పైగా సంస్కృత పండితులు బెంగళూరు మంగళూరు ,మైసూరు మొదలైన ప్రాంతాలలో యూని వర్సిటి ప్రొఫెసర్లు గా ఉన్నారు .భారతీయ విద్యా భవన్ పాఠశాల నుఇక్కడ స్థాపించిన మత్తూరు కృష్ణ మూర్తి ,వయోలిన్ విద్వాంసుడు వెంకటరాం ,కన్నడ శాస్త్రీయ సంగీత కారుడు హెచ్ .ఆర్.కేశవ మూర్తి వంటివారు జన్మించిన భూమి మత్తూరు .
గమక సంగీత రూపక సంప్రదాయ పునరుద్ధరణ
సంస్కృతాన్ని మాత్రమె పునరుజ్జీవింప జేయటం కాదు వీరి కన్నడ శాస్త్రీయ’’ గమక ‘’సంగీత రూపక సంప్రదాయ౦ అంతరించి పోతుంటే వీరందరూ జాగరూకులై దాన్ని అంతరించి పోనివ్వకుండా పునరుజ్జీవింప జేసి కాపాడారు .గమక అంటే కన్నడ సంగీత రాగం లో కద ను వివరించటం .దీనినే ‘’కావ్య వచన ‘’అంటారు వీళ్ళు .కన్నడ దీశం లో గమక ప్రదర్శనకు జనం విపరీతంగా హాజరై ఆనందిస్తారు .
ప్రధాని నరేంద్ర మోడీ సి .బి .ఎస్. ఇ .సిలబస్ లో ఉన్న జర్మన్ భాష బదులు సంస్కృతం నుప్రవేశ పెట్ట్టే ప్రణాళికలో ఉన్నారని తెలిసి ఈ గ్గ్రామస్తులు పరమానంద భరితులవుతున్నారు .
ఆధారం –1-ఆంధ్ర జ్యోతి -29-1-17 ఆదివారం స్పెషల్ 2- వీకీ పీడియా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-17 –ఉయ్యూరు

