వరద జ్ఞాపకాల వెల్లువే ‘’వరద కాలం ‘’
1985 లో ‘’ఉదయం ‘’డైలీ లో వారం వారం ధారావాహికగా వరద రాసిన సాహిత్య స్మృతులు ‘’వరద కాలం ‘’గా 1990లో పుస్తకంగా వచ్చింది .దీనికి ప్రేరకులు ఎడిటర్ శ్రీ ఏ బి కె ప్రసాద్ .దీనిలో సాహిత్యం లో ఒక యుగం కళ్ళముందు నిలిపాడు వరద .వ్యక్తుల వ్యక్తిత్వ ఆవిష్కారం ,చరిత్రలో వారి సంబంధం కనుమరుగు కాకుండా కాపాడి అందించాడు .ప్రయోక్త ,ప్రచురణకర్త ,కవి ,నాటకకర్త ,రచయితా ,పాత్రికేయుడు అయిన వరద నవ్య సాహిత్య చరిత్రకు ,ఆధునిక ఆంద్ర సాహిత్య చరిత్రకు ,కవితా విప్లవాలకు పూర్వ రంగాన్ని ,వాటి ఉత్దాన పతనాలను ప్రత్యక్ష సాక్షిగా నిలిచి రాసిన రచన .ఆయన అర్ధ శతాబ్దపు సాహితీ యానం .సాహితీ మూర్తుల హృదయ వీణా తంత్రుల నిక్వాణ౦ .తెలుగు దేశం లో నాటక రంగస్థల నిర్మాణ ,నిర్వహణ ,నాటికా నాటకాల ప్రయోగ వైశిష్ట్యం ,తన ప్రత్యక్ష అనుభవ ,అనుభూతులు’’నాట్య గోష్టి ‘’గా పొందు పరచాడు .’’రచనలో నైశిత్యం ,వాక్కులో చమత్కారం రధ చక్రాలుగా సాగిన శారదా మూర్తి ఈ గ్రంధం ‘’అన్నాడు ఏ బి కె .గురజాడ గిడుగు ,రాయప్రోలు అబ్బూరి రామకృష్ణారావు ,కృష్ణ శాస్త్రి శ్రీ శ్రీ లకవితా రచనలకు చక్కని వ్యాఖ్యానం .ఈ తరానికి తెలియని ఎన్నో విషయాలు వివరించి చెప్పాడు .వ్రుత్తి పద ప్రయోగ కోశాలకు ,పత్రికా సారస్వతాను బంధాలకు ,రసమంజరీ నాదాలకు తొలి పూజ చేసిన తండ్రి బహు ముఖీన కృషికి అద్దంపట్టాడు .తొలి కదానికకు ఒరవడి పెట్టిన ఇద్దరిలో తండ్రీ ఉన్నాడు .’’మంగళ సూత్రం ‘’డిటెక్టివ్ నవలకు ,’’తెలుగు సంసారానికీ ‘’ఆయనే కర్త .హిందూ ఆంగ్లపత్రికలో పని చేసిన మొదటి తెలుగు వాడు కుందూరి ఈశ్వర దత్తు ,హిందూ పత్రిక వ్యవస్థాపకులలో ఒకడైన న్యా పతి సుబ్బారావు లగురించి విశేషాల కుంభ వృష్టి కురిపించాడు ‘’కవిత ‘’సంచికలకు ,మోడరన్ తెలుగు పోయెట్రి ‘’సంకనలాకు బాధ్యురాలు వరద భార్య చాయాదేవి ..వర్కింగ్ జర్నలిస్ట్ ల భారతీయ సమాఖ్య,హైదరాబాద్ యూనియన్ల వ్యవస్థాపకులలో ఒకడు వరద .అక్కిరాజు ,దుగ్గిరాల, ,కొండా ,సుందరయ్య ,బసవ రాజు ,బళ్ళారి ,లంక సుందరం, చలం ,తాపీ ,మరో మధురవాణి లాంటి దీప స్తంభాలను, వారి వెలుగులను గుమ్మరించాడు .ఎన్నెన్నో విశ్వ విద్యాలయాల విద్యా కేంద్రాల జ్ఞాపకాల గుబాళింపులతో పరవశం కలిగించాడు .ఆంద్ర దేశ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యుదయ పదానికి వరద సేవ చిరస్మరణీయం .’’వరద కాలం ‘’అందరికి కరదీపిక .రాజులదండ యాత్రలను యాత్రలుగానే చిత్రించి ,ఆత్మ గౌరవాన్ని చంపుకొన్న తెలుగు మేధావులనుఉమాకాంతం శఠించినందుకు వరద మెచ్చుకున్నాడు .రాజకీయాల పతనం ,డేమోక్రసిలో నామినేషన్ డామినేషన్ సంస్కృతీ ఎండ గట్టాడు వరద .’’మాతరం దిగ్గజాల్లాంటి రాజకీయ నాయకుల్ని ,గాయకుల్ని ,గాయకుల్ని ,పండిత ,కవుల్నీ ,నటుల్నీ చూసింది .ఆ నాడు పెద్దమనుషులే నిజాయితీ పరులే రాజకీయాలలోకి వచ్చేవారు .అప్పటికి రాజకీయం వృత్తి కాలేదు .తెలుగు వాడు దుర్యోధనుడు లాంటి వాడు .తనకేదీ కావాలనుకోడు .ఇతరులకు మాత్రం ఏమీ ఉండకూడదు అనుకొంటాడు .ముగ్గురు తెలుగువాళ్ళు కలిస్తే పార్టీ ,ఇద్దరుకలిస్తే ముఠా ,ఒక్కడే అయితే ప్రతి పక్షం పెడతారు .ఈ శతాబ్దపు రెండో దశాబ్దం లో కూడా తెలుగు వాడి మానసిక స్థితి అలానే ఉంది ‘’అని బాధ పడ్డాడు వరద .’’వరద రచన ఇంగ్లాండ్ లోని బ్లూమ్స్ బరీ గ్రూపు ప్రముఖుడు లిటన్ స్త్రాచీ సారస్వత వివేచనా తో ,ట్రూమన్ కపాటే ‘’ది మ్యూజేస్ ఆర్ హెర్డ్ ‘’తోనూ పోల్చదగినవి .’’అన్నాడు ఏ బి కె .వరద ఇల్లు ఒక శారదా నికేతనం .అందులో ఆతను ప్రేక్షకుడేకాడు పాత్ర దారికూడా చతురంగా తగాదా పడటం వరద హాబీ .’’వరద మనకు అయిదు సంపుటాల ఆత్మ కద రాసిన లియోనార్డ్ ఉల్ఫ్ లాంటి వాడు ‘’.
‘’ వరద సత్యాన్వేషి .అతని కారెక్టర్ స్కెచెస్ స్ట్రాచీ చిత్రించిన ‘’ఎమినేంట్ విక్టోరియన్స్ ‘’.ను గుర్తుకు తెస్తాయి ‘’అన్నాడు గోపాల చక్రవర్తి .’’వరద చేసింది సాహితీ క్షీర సాగర మధనం .బిట్వీన్ ది లైన్స్ లో గొప్ప చరిత్ర ఉంది.అక్షర స్పేస్ షిప్ లో ప్రయాణించి గతకాల అనుభూతులను అందించాడు ‘’అన్నాడు పురాణం .వరద ,తండ్రీ ఇద్దరూ రాడికల్ హ్యూమనిస్ట్ లే.ఎం యెన్ రాయ్ అనుచరులే .ఇద్దరికీ పద్యమే ఇష్టం .అందులోనే రాశారు .వచనకవిత్వం పై సదభిప్రాయం లేని వాళ్ళే .అయినా అందరికీ దగ్గరయ్యారు .వరద కాలం ఒక సాహిత్య వరద గోదారి .చదివి తెలుసుకొని ఆనందించా ల్సినవి ఎన్నో ఉన్నాయి .నేను చేసింది అతి సూక్షం పరిచయం మాత్రమే.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-2-17 –ఉయ్యూరు

