గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39
17-పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ –పాల్ సిజేన్ (Paul cizanne)-(1838 -1906 )
ఆధునిక కళాపిత
19 వ శతాబ్దపు కళా కృషికి ,దీనికి విరుద్ధమైన 20 వ శతాబ్దపు భావ తీవ్రవాదుల కళ కు యుగ సంధి కి చెందిన పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రాన్స్ దేశపు చిత్రకారుడు పాల్ సిజేన్ .అన్వేషణాత్మకమైన ,పదే పదే వాడే బ్రష్ స్ట్రోక్స్ తో అత్యంత విశిష్ట లక్షణాలతో ,ప్రత్యేకత తో అతని కళాఖండాలు వెలిగిపోతాయి .వర్ణ తలాలను చిన్న బ్రష్ స్ట్రోక్ లతో సంక్లిష్ట చిత్రాలుగా తీర్చి దిద్దాడు .చిత్రి౦పబడే వాటి అంతరిక ప్రవృత్తిని బహిర్గతం చేయటం అతని చిత్రాల ప్రత్యేకత .19 వ శతాబ్ది ఇంప్రెషనిజం కు 20 వశతాబ్దిఅత్యాధునిక క్యూబిజం కు సిజేన్ వారధి . ప్రఖ్యాత చిత్రకారులు మాటిస్సే పికాసో లు ‘’సిజేన్ మా కళా పిత ‘’అని ఆరాధనా భావం తో కీర్తించారు .
బాల్య విద్యాభ్యాసాలు
పాల్ సిజేన్ 19-1-1838 న ఫ్రాన్స్ లోని ఎక్స్ యెన్ ప్రావిన్స్ లో సెయింట్ సావియర్ పట్టణం లో జన్మించాడు .ఫిబ్రవరి 22 న ఎగ్లైజ్ డిలా మేడేలిన్ లో ,అమ్మమ్మ మేనమామ లు గాడ్ పేరెంట్స్ గా బాప్టైజ్ అయ్యాడు .తర్వాత కేధలిక్ మతానికి పూర్తిగా అంకిత మయ్యాడు .తండ్రి సెయింట్ జేకారి గ్రామస్తుడు .బాంకింగ్ ఫర్మ్ వ్యవస్థాపక భాగస్వామి .ఇదే మన కళాకారుడిని జీవితాంతం ఆదుకున్నది .ఆనాటి సాటి కళాకారు లెవ్వరికి లేని ఆర్ధిక భద్రత,వారసత్వ సంపద దక్కింది సిజేన్ కు .
తల్లి ఆన్నె ఎలిజబెత్ ఆనరిన్ ఆబర్ట్ ఆకర్షణీయ ,చైతన్య స్పూర్తికల ,త్వరగా తప్పు కొనే స్వభావం కలది .తల్లిదగ్గర నుండే సిజేన్ జీవిత దృక్పధాన్ని,దృష్టి ని ఏర్పరచుకున్నాడు .చెల్లెళ్ళు మేరీ ,రోజ్ లతో కలిసి స్కూల్ కు వెళ్ళేవాడు .10 వ ఏట ఐక్స్ లో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ లో చేరాడు .1852లో బార్బాన్ కాలేజి లో చేరాడు .అక్కడే ప్రసిద్ధ రచయితలూ ఎమిలీ జోలా ,బాప్టిస్టిన్ బెయిలీ లతో గాఢ పరిచయమేర్పడింది. ఎక్కడ చూసినా ఈ ముగ్గురూ కలిసె కనిపించేవారు .ఈ ముగ్గురు మిత్రులను’’విడదీయ రాని త్రయం ‘’(ఇంసేపరబుల్ ట్రయో)అనేవారు.ఆరేళ్ళు ఆ కాలేజిలో చదివాడు చివర ఏడాది డే స్కాలర్ గా ఉన్నాడు .
కళ పై మక్కువ
18 5 7 లో ఐక్స్ లో ఉన్న ఫ్రీ మునిసిపల్ డ్రాయింగ్ స్కూల్ లో చేరాడు .స్పానిక్ ముని జోసెఫ్ గిల్బర్ట్ వద్ద డ్రాయింగ్ అభ్యసించాడు .తండ్రి సలహాపై 19 5 8 -61వరకు ఐక్స్ యూని వర్సిటి లా స్కూల్ లో డ్రాయింగ్ క్లాసులకు హాజరౌతూనే లా చదివాడు .
బాంకర్ అయిన తండ్రి మాటకు విరుద్ధంగా వారించినా ఆగకుండా ఐక్స్ వదిలేసి కళ పై విపరీతమైన వ్యామోహంతో1861 లో పారిస్ చేరాడు . అతనినినిర్ణయం తీసుకొనేట్లు బాగా ప్రభావితం చేసింది అప్పటికే పారిస్ లో స్థిరపడిన ఎమిలీ జోలాయే .తండ్రి కూడా కొడుకు కోరికను మన్నించి ఆర్ధిక సాయం చేసి ప్రోత్సహించాడు .తరువాత తండ్రి నుంచి భారీమొత్తం లో 4 లక్షల ఫ్రాంక్ లు వారసత్వ ధనం గా చేతికొచ్చింది .దీనితో చేసిన అప్పులన్నీ తీర్చి రుణ విముక్తుడయ్యాడు .
అర్కి టెక్చరల్ శైలి
పారిస్ లో కామిల్ పిసారియో అనే ఇంప్రెష నిస్ట్ ఆర్టిస్ట్ తో పరిచయాం కలిగింది సిజేన్ కు .1960 లో వారిద్దరి మధ్య గురు శిష్య సంబంధమేర్పడింది .ఈ యువ ఆర్టిస్ట్ పై పిసారో ప్రభావం బాగా పడింది .ఒక పుష్కర కాలం కలిసి లాండ్ స్కేపులు గీశారు .పెయింటింగ్ ఎక్స్ కర్షన్ లు చేశారు .క్రమ౦గా ఇద్దరు మమేకమయ్యారు .మడతలో సిజేన్ లాండ్ స్కేప్ లో బొమ్మ ఉండేది .తరువాత అనేక మంది కి చోటు కల్పించేవాడు .అతని ఒహ్హత్మకత సృజన అద్భుతమని పించేది .క్రమంగా రంగుల ప్రభావం తగ్గించి తేలిక గా చిత్రాలు గీశాడు .ఆతర్వాత శిల్పాకృత పెయింటింగ్స్ శైలి (ఆర్కి టేక్చరల్ స్టైల్ )కి రూప కల్పన చేశాడు.తాను లోకం లో చూసిన దానిని చిత్రం లోఅత్యద్భుత౦ గా చూపేవాడు .తేలిక రంగులతో ఫలితాలు రాబట్టాడు . “I want to make of impressionism something solid and lasting like the art in the museums”,[17] అని చెప్పేవాడు . his contention that he was recreating Poussin “after nature” underscored his desire to unite observation of nature with the permanence of classical composition..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-15 –ఉయ్యూరు
