వైకింగ్ శకం -2
హాఫ్ డాన్ రంగర్సన్ సైన్యాన్ని 876 లో నార్త్ అంబీరియా కు తీసుకు వెళ్లి అక్కడి ఆంగ్లో సాక్సన్ రాజులు అతన్ని దానికి రాజుగా ప్రకటిస్తే ఉండిపోయాడు .ఆతర్వాత రెండేళ్లకు గుత్రుమ్ నాయకత్వాన డేనిష్ సైన్యం ఆల్ఫ్రెడ్ నాయకత్వం లోని ఇంగిలీషు సైన్యాన్ని దోచుకొ0టే తరిమేస్తే సోమర్సెట్ లెవెల్స్ కు పారిపోగా మళ్ళీ బలం కూర్చుకుని ఎడింగ్టన్ యుద్ధంలో విజయం సాధించి 880 లో ఆల్ఫ్రెడ్ తో సంధి చేసుకొని మెర్సియాను విభజించి ఈస్ట్ ఆంగ్లికా అనబడే ప్రాంతాన్ని పొంది వైకింగుల సంప్ర దాయాలు పాటించేట్లు చేసుకున్నాడు . 889 లో ఈస్ట్ ఆంగ్లికా కు డేనిష్ రాజయిన క్రిస్టియానిటీ పుచ్చుకొని ఏదెలా స్టన్ గా పేరు మార్చుకున్న గోత్రుమ్ చనిపోయడు. 892 లో పెద్ద సైన్యం తో డేనిష్ నౌకలు 300 తో కెంట్ పై దాడిచేసి ఆల్ఫ్రెడ్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి చెల్లాచెదరు చేశాయి 899 లో ఆంగ్లో సాక్సన్ రాజు ఇంగ్లాన్డ్ గొప్పపాలకుడు ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ చనిపోగా ,మరుసటియేడు గన్ బోరన్ ఉల్ఫ్ సన్ గ్రీన్లాండ్ వశం చేసుకున్నాడు 907 లో కీవ్ కు చెందిన ఓలెగ్ .అనే రస్ నాయకుడు కాన్ స్టాన్టి నొపిల్ పై దాడికి సి ద్ధ మవగా .అక్కడి రాజు సంధి తో రస్ లకు వ్యాపారానుమతినిచ్చారు . 911 లో ఫ్రాన్స్ రాజు చార్లెస్ ది సింపుల్ రూ పట్టణం తోబాటు పరిసర ప్రాంతాలన్నీ రోల్లో అనే వైకింగ్ నాయకుడికి కు ఇచ్చేశాడు ఈ ప్రాంతమే నార్మ0డి .స్నేబ్ జార్న్ అనే వాడు కొంతమందితోకలిసి ఐస్ లాండ్ నుంచి గ్రీన్ ల్యాండ్ కు అన్వేషణకు వెళ్లి అక్కడ వింటర్ గడిపారు .. 936 లో డెన్మార్క్ రాజుగా గోరం ది ఓల్డ్ గుర్తింపు పొందాడు . లో యెదిలిస్తాన్ పెద్ద సైన్యం తో వైకింగులను ఓడించాడు 947 లో ఎరిక్ బ్లడ్ ఎక్స్ కాంబ్రియా యుద్ధం లో చనిపోగా ఇంగ్లాన్డ్ రాజు ఎడ్గార్ నార్స్ రాజ్యాన్ని రద్దు చేసి నార్త్ అంబార్లాన్డ్ కు అప్పగించాడు 958 లో గోరోం ది ఓల్డ్ కొడుకు హరాల్డ్ బ్లూ టూత్ డెన్మార్క్ రాజై డేనిష్ తెగలనన్నిటినీ ఏకం చేసి సువిశాల రాజ్యాన్ని గొప్పగా పాలించాడు ఇతన్ని పేరే మనసెల్ ఫోన్ లోని బ్లూ టూత్ పరికరం. 975 లో ఇంగ్లాండ్ రాజు ఎడ్గార్ చనిపోతే ఎడ్వర్డ్ రాజయ్యాడు 978 లో ఏథేల్ రెడ్ రెండు సార్లు ఇంగ్లాన్డ్ రాజయి పాలించాడు . 980 -2 లో వైకింగ్ లు ఇంగ్లాండ్ పట్టణాలపై విరుచుకు పడ్డారు .అదే సమయం లో ఎరిక్ ది రెడ్ ఐస్ లాండ్ నుండి పడమరకు గ్రీన్ లాండ్ వైపుకు అన్వేషణ జరిపాడు ఉత్తర అమెరికాలో కాలు పెట్టిన మొదటి వైకింగ్ గా గుర్తింపు పొందాడు ఆ ప్రాంతమే లాబ్రడార్ . 986 లో ఎరిక్ సుమారు వెయ్యి మందితో గ్రీన్ లాండ్ వెళ్లిగ్రీన్ లాండ్ నార్వే మధ్య 2 వేలాదిమైళ్ళు చుట్టూ తిరిగి ఉత్తర అమెరికా అన్వేషణ చేశాడు ఇతని సాహసాలన్నీ ”ది సాగా ఆఫ్ ఎరిక్ ది రెడ్ ”లో వివరంగా ఉన్నాయి . 986 లో డెన్మార్క్ కు బ్లూటూత్ కొడుకు శ్వీన్ ఫోర్క్ బియర్డ్ రాజయ్యాడు 988 లో రోరిక్ వారసుడైన వ్లాదిమీర్ ది గ్రేట్ రస్ నాయకుడి పాత పాగాన్ దేవతలను ధ్వంస0మ్ చేసి డ్నీపర్ నదిలో విసిరేసి క్రైస్తవంపుచ్చుకుని తానూ తన అనుచరులతో సహా క్రైస్తవులయ్యారు . వైకింగులు ఉత్తర ఇంగ్లాన్డ్ పై దాడి చేశారు 991 లో నార్మాండి ఇంగ్లాన్డ్ ల మధ్య శాంతి ఒడంబడిక జరిగి ఇంగ్లాన్డ్ లో శరణార్థులుగా నార్మన్ లో ఉండిపోయారు . 995 నుంచి నార్వే రాజుగా ఉన్న ఒలాగ్ మనవడితోసహా93 నౌ కలతో మాల్దాన్ యుద్ధం లో ఇంగ్లాన్డ్ సైన్యాన్ని ఓడించి ఏదెలా రెడ్ నుంచి 10 వేల పౌండ్ల వెండిని పొందాడు . 994 లో వొలాఫ్ మళ్ళీ ఇంగ్లాన్డ్ వచ్చి శాంతి ఒడంబడిక చేసుకొని నార్వే వెళ్ళాడు 997-1000 లో డేనిష్ ఆర్మీ నిరంతరం గా ఇంగ్లాన్డ్ పై దాడి చేస్తూనే ఉంది శ్వీన్ ఫోర్క్ బెడ్ తో చేసిన పోరాటం లో వొలాఫ్ చంపబడ్డాడు .ఈ లోగా ఐస్ లాండ్ లో థోరుగూరి తనవాళ్ళందర్నీ క్రైస్తవులుగా మార్చాడు 1001 లో డెయిష్ యుద్ధ నౌకలు పడమటి సస్సెక్స్ పై దాడి చేసి 24 వేల పౌండ్ల డబ్బు పోందిందింది మరుసటి ఏడు సెయింట్ బ్రేస్ డే మాసకర్ జరిగి ఇంగ్లాండ్లో డే నుల సర్వ నాశనం జరిగి ఫోర్క్ బెడ్ సోదరి గున్నిహిల్డ్ తో సహా అందరూ చంపబడ్డారు మరోయేడాదికి శ్వీన్ ఫోర్క్ బెడ్ అనే డెన్మార్క్ రాజు ఇంగ్లాన్డ్ పై దాడిచేశాడు ఇంగ్లాన్డ్ లో అప్పుడు తీవ్రకరువు ఏర్పడింది డేనిష్ ఆర్మీ డెన్మార్క్ కు తిరిగి వెళ్లి పోయింది 1006 లో శ్వీన్ మళ్ళీ ఇంగ్లాన్డ్ వచ్చి 36 వేల పౌ0మ్ డ్లు పట్టుకు పోయాడు . 1009 -12 మధ్య ఢోర్కెల్ ది టాల్ తమ్ముడు హెమ్మింగ్ లు పెద్ద వైకింగ్ సైన్యం తో ఇంగ్లాన్డ్ పై పడగా ఏదెలా రెడ్ అతనికి 48 వేల పౌన్లు ఇచ్చిమంచి చేసుకున్నాడు లండన్ ను శ్వీన్ సైన్యపు దాడి నుంచి రక్షిస్తానని ఎధేర్డ్ తో ఒప్పందానికి వచ్చి తనవారిని గాలికొదిలేశారు . 1010లో డార్ఫిన్ కారల్స్ ఫెని గ్రీన్ లాండ్ నుంచి ఉత్తర అమెరికాకు మూడవ యాత్రమూడేళ్లు చేసి మిగిలిన కొద్దిమందితో గ్రీన్ లాండ్ తిరిగివచ్చాడు .1013లో శ్వీన్ ఫోర్క్ బెడ్ శక్తి యుక్తులన్నీ సమీకరించి ఇంగ్లాన్డ్ పై పడగా ,ఏధిల్ రెడ్ కొడుకులు ఎడ్వార్డ్ ,ఆల్ఫ్రెడ్ ల తో సహా నార్మాండీకి ప్రవాసానికి పారిపోయాడు .క్రిస్మస్ రోజున శ్వీన్ ఇంగ్లాన్డ్ కు మొదటి వైకింగ్ రాజుగా పట్టాభి షిక్తుడు అయ్యాడు ఇలా ఇంగ్లాన్డ్ లోనూ వైకింగ్ సామ్రాజ్యం ఏర్పడింది శ్వీన్ ఫోర్క్ బెడ్ రాజుగా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—

