నా దారి తీరు -106 –
గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )
”పయస్ ”హెడ్ మాస్టర్ గా పేరొందినవారు అవనిగడ్డకు చెందిన శ్రీ ఏం వి .కృష్ణారావు గారు .అతి సౌమ్యులు ,పవిత్రలు ధార్మిక విషయాలలో నిష్ణాతులు .ఉయ్యూరు లో మాతో పాటు పని చేసిన లెక్కలమేస్టర్ ,తర్వాత హెడ్మాస్టర్ అయినశ్రీ అన్నే ఉమా మహేశ్వరరావు గారికి మేనమామ .కృష్ణారావుగారు పంచెకట్టు చొక్కా ఉత్తరీయం నవ్వు ముఖం తో చూడగానే రెండు చేతులు జోడించాలనిపిస్తుంది . స్నేహం సౌశీల్యం ఆదర్శం ఆయన సొత్తు అతి నిరాడంబరులు నెమ్మదిగా స్పష్టం గా మాట్లాడేవారు .ఏం ఎల్సీ ఎన్నికలలో కొల్లూరి కోటేశ్వర రావు గారికి నేనూ ఆయన శ్రీ ఆర్ ఎస్ కె మూర్తి శ్రీ గౌతమేశ్వరరావు గారు కలిసి ప్రచారం చేసినప్పుడు పరిచయమయ్యారు తర్వాత కాటూరు హెచ్ ఏం గా మరింత చేరువై వారి అభిమానినయ్యాను .ఆర్ ఎస్ ఎస్ లో సుశిక్షితులైన కార్యకర్త .మంచి బౌద్ధిక్ అంటే సంఘ సమావేశాలలో బుద్ధిని వికసింప జేసే ప్రసంగాలను చేసేవారిని బౌద్ధిక్ అంటారు .ఎన్నో విషయాలు లోతుగా చర్చించేవారు . శ్రీ గౌతమేశ్వరరావుగారు కాటూరులో సోషల్ మాస్టారుగా నాతోపని చేసి ప్రమోషన్ పై రెడ్డిగూడెం హెడ్ మాస్టర్ అయ్యారు .నిబద్ధత ఉన్న ఆర్ ఎస్ ఎస్ వ్యక్తి . అలాగే కపిల కాశీపతిగారు కైకలూరు ప్రాంతం లో ప్రసిద్ధులు . శ్రీ మారెళ్ల సుబ్బారావు గారు ఆకునూరు హెడ్ మాస్టర్ .పంచ చొక్కా పై పై కోటు వేసేవారు.పిలక ఉండేది .నాకు బాగా పరిచయం .మంచి ఉపన్యాసకులు .అనలిటికల్ బ్రెయిన్ ఆయనది లోతులను తరచి మాట్లాడేవారు .
మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల శ్రీరామ మూర్తిగారి తండ్రిగారు చతుర్వేదుల సదా శివ మూర్తిగారు అతిపవిత్ర జీవి .తాడంకి వల్లూరు హెడ్ మాస్టర్ చేసి శ్రీ కాకాని వెంకటరత్నం గారి అభ్యర్థనపై ఆకునూరు హెడ్ మాస్టర్ గా చేశారు డిసిప్లిన్ కు మంచి విద్యా శిక్షణకు జిల్లాలోనే పేరెన్నిక గన్న హెడ్ మాస్టర్ . ఎవ్వరినీ లెక్క చేసేవారుకాదు .అందరికి హడలు .మనిషి భారీ పర్సనాలిటికాదు సరిసమానంగా తెల్లటి పంచ చొక్కా ఉత్తరీయం మెడలోనుంచి ముందువైపుకు దోపి ,ముఖాన పెద్ద బొట్టు తో పిలక తో ఉండేవారు . ఇంగ్లీష్ , లెక్కలలో ఆయన వద్ద చదివిన వారు తప్పటం అనేది ఉండేదికాదు .బడితెలవంటి వాళ్ళు కూడా కుక్కిన పేనుల్లాగా తల వొంచి వినయంగా ఉండేవారు .నాకు బాగా పరిచయం .ఆకునూరు నుంచి పడమట వెళ్లి అక్కడే రిటైరయ్యారు .రిటైరయ్యాక ఆయన్ను లెక్కల ట్యూషన్ చెప్పమని బ్రతిమాలితే ఇంటి దగ్గరే ట్యూషన్ లెక్కలు ఇంగ్లీష్ బోధించారు యాభై మందికి తక్కువ ఉండేవారుకాదెప్పుడూ . ఒక ఇన్ స్టి ట్యూషన్ లాగా నడిపారు అలాగే కపిలేశ్వర పురం లో హెచ్ ఏం అయినా శ్రీ ఉమా రామ లింగమూర్తి గారికి జిల్లాలో పెద్దపేరు .చామన ఛాయ గోచీ పోసి పంచె కట్టు ,కోటు ,ఉత్తరీయం మెడలో మడిచి స్ఫురద్రూపంగా ఉండేవారు . సంప్రదాయం సౌశీల్యానికి పెట్టిందిపేరు . జిల్లాలో ఆయన పెద్ద దిక్కు . సలహా సంప్రదింపులకు ఆయన వద్దకే వెళ్లేవారు .ఆయన మేనల్లుడూ అల్లుడూఅయిన శ్రీ రామ గోపాలం గారు కూడా హెడ్మాస్టర్ . కపిలేశ్వరపురం లో చేసి గన్నవరం లో రిటైర్ అయ్యారు .నేను సైన్స్ మాస్టర్ గా గన్నవరం లో [అని చేసిన పది పది హేను రోజుల్లో నన్ను జాయిన్ చేసుకొని రిలీవ్ చేసింది ఆయనే .మూతి మీద చిన్న మొరిక ఉండేది .పొట్టిగా నే ఉండేవారు పంచెపై చేతుల గ్లాస్కో బనీను వేసేవారు .ఇది తమాషాగా ఉండేది .సైన్స్ టీచర్ గా పెద్ద పేరు
శ్రీ పుచ్చా శివయ్యగారు గ్రాండ్ ఓల్డ్ హెడ్ మాస్టర్ .కపిలేశ్వర పురవాసి . లెక్కలు ఇంగ్లీష్ లలో ధరో నాలెడ్జ్ ఉన్నవారు . క్రమశిక్షణకు మారుపేరు . రిటైరయ్యాక ఉయ్యూరు లో శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజీ ని శ్రీ అన్నే హనుమంతరావు గారితో కలిసి స్థాపించారు .మానాన్నగారు రిటరయ్యాక ఇక్కడే తెలుగు పండిట్ గా చేశారు ఆదిరాజు పున్నయ్యగారుకూడా ..మాతమ్ముడు కూడా కొద్దీ కాలం చేశాడు . . శివయ్యగారితో అప్పుడే పరిచయం .
ఉయ్యూరులో నేను ఎస్ ఎస్ ఎల్ సి చదివినప్పటి హెడ్మాస్టర్ శ్రీ కామినేని రాధాకృష్ణ మూర్తిగారు పెడసనగల్లు వాసి .సూటూ బూటూ టై తో ఉండేవారు .బాల్డ్ హెడ్ .ఆయన్ను ”దసరా బుల్లోడు ”అనేవారు ..ఇంగ్లీష్ ఆల్జీబ్రా చెప్పారు .అర్ధంకాక నోట్స్ ఇవ్వక పొతే కాటూరు వెళ్లి హెడ్మాస్టార్ గా ఉన్న శ్రీ సీత0 రాజు కామేశ్వరరావు గారి దగ్గరకు వెళ్లి వారమ్మాయి నోట్స్ అడిగి తీసుకొని రాసుకొని తిరిగి ఇచ్చేవాడిని అందుకే మార్కులు ఆ రెండు సబ్జెక్ట్ లలో తక్కువ వచ్చేవి . .రాధాకృష్ణమూర్తిగారిని నాగిరెడ్డి అనిస్టుడెంట్ స్కూల్ లోనే కొట్టాడు కారణం తెలియదు . కానీ ఆతర్వాత ఆ రెడ్డికి నడుం పట్టేసి వంకరగా జీవితాన్తమ్ నడిచేవాడు యాకమూరు వాసి . కామేశ్వరరావు గారు మేము టెన్త్ లో ఉండగా లెక్కలు చెప్పేవారు ఆయన పాఠం చెబితే అక్కడికక్కడే రావాల్సిందే ఒక్క స్టెప్ కూడా వదలకుండా బోర్డు మీద రాసేవారు . కనుక యావరేజ్ వాడికి గొప్ప అవకాశం .ఆయన ఉయ్యూరులో మా బజార్లోనే కాపురముండేవారు మా నాన్న గారి శిష్యుడనని చెప్పేవారు నేను వారి శిష్యుడను .ఇంటివద్ద వక్కపొడి తయారు చేసి అమ్మేవారు .పంచ చొక్కా తో ఉండేవారు చాలా మర్యాదస్తులు .వారమ్మాయి నా క్లాస్ మేట్ .” గురువుగారబ్బాయ్ ”అనే నన్ను పిలిచేవారు .పొట్లాలు నిలువుగా ఉండి అడుగునా పైనా మూత లుగా చిన్న అట్టముక్కలుండేవి . చుట్టూ గ్లేజ్ కాగితం అతికించి ఉండేది .
ఉయ్యూరులో పని చేసిన శ్రీ కె ఎస్ ప్రకాశరావు గారికి మంచిపేరు. అలాగే రాళ్లబండి సత్యనారాయణ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు .పంచెపై కోటు .భారీ పర్సనాలిటీ . ఎవరినీ లెక్క చేసేరకంకాదు .శ్రీ ఎస్ కె వెంకటేశ్వర్లుగారు నల్లగా ఆజానుబాహువుగా పంచెకట్టుతో ”సెల్ఫిష్ జయంట్ ”గా ఉండేవారు .ఆయన సంతకం ”జిలేబి చుట్ట”లా ఉండేది . స్కూల్ లోనే హెడ్ మాస్టర్ రూమ్ లో ఒకప్రక్క ఉండేవారు .వైష్ణవులు .బ్రాహ్మణమాస్టార్ల ఇంటికి ప్రతి రోజు నాకో సూరి రామశేషయ్య గారికో అటెండర్ తో చిన్న చీటీ పంపేవారు ‘అందులో ”ప్లీజ్ ఆరెంజ్ మీల్స్ టు డే ”అని ఉండేది .అలానే చేసేవాళ్ళం .మందిని బాదుకోవటం సరదా .ఎక్కడ పని చేసినా స్పెషల్ ఫీ ఫండ్స్ ”హూష్ కాకి ” నాకేసేవారని జిల్లాలో పెద్దపేరు . ఉయ్యూరులోనూ లేపేశారు .ఎవరికీ తెలిసేదికాదు .ఆయన ఉన్నప్పుడే బ్రహ్మనంద రెడ్డి డిటెన్షన్ సిస్టం రద్దు చేశాడు .తర్వాత ఈ పాసులను బ్రహ్మానంద రెడ్డి పాస్ అనేవారు
చెయ్యెత్తి మొక్కాల్సిన మరో హెడ్ మాస్టర్ శ్రీ ఏ బలరామ మూర్తి గారు .ఆయన శారీరక మానసిక ష్వచ్చత కు ఆయన అతి తెల్లని పంచ చొక్కాలు సాక్షి .జిల్లాలోనే తిరుగు లేని వారు ఆయన డ్రాఫ్ట్ రాస్తే తిరుగు లేదు టీచింగ్ లో డిసిప్లిన్ లో ఆయనకు సాటి ఎవరూ లేరు .ఇంటివద్ద మానసిక రోగి అయినా భారయకు అన్నీవండి పెట్టి బడికి వచ్చేవారట .హేట్సాల్ఫ్ అనిపిస్తుంది . సమయపాలన ఆయన విధి . స్టాఫ్ మీటింగ్ అంటే అయిదేఅయిదు నిమిషాలు చెప్పాల్సింది పాయిట్స్ గా రాసుకొని వచ్చి చెప్పేసి ఇలా చేయాలి . అంటారు అంతే సుగ్రీవజ్జనే .ఉయ్యుయూరులో కొద్ది కాలమే ఉన్నారు అప్పుడు వారివద్ద పని చేసే అదృష్టం నాకు దక్కింది .
”హాఫ్ కార్ట్ ” అనే బట్టతలఆయన పేరు బి కామేశ్వరరావు సోషల్ మేష్టారు తరవాత హెడ్ అయ్యారు అలాగే శ్రీనివాసరావు గారనే ఆయన రా గ్రాడ్యుయేట్ గా ఉయ్యురు లో సైన్స్ టీచర్ తర్వాత హెడ్ అయ్యారు .వారు నేనుహెడ్ అయ్యాక మళ్ళీ పరిచయమయ్యారు ఉయ్యూరు లో హెడ్ అయిన శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు తమాషా గా ఉండే బుల్లి మూతితో మినీ ఎస్వీ రంగారావు గా అనిపించేవారు మంచి సైన్స్ ఇంగ్లీష్ టీచర్ .ఇక్కడే రిటైరయ్యారు ఆయన పాలనను” అక్బర్ పాలన” అనేవాడిని . స్కూల్ లో కొత్త బిల్డింగ్ లు నీటి సరఫరా గ్రౌండ్ మెరక టిఫిన్ షెడ్ మొదలైనవి కెసిపి సహకారం తో ఏర్పడ్డాయి .అయన ఇద్దరు కూతుళ్లు మానికొండలో నా స్టూడెంట్స్
చై ర్మన్ పిన్నమనేనిగారి కుడిభుజం రుద్రపాక హెడ్మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు గారు మంచి వాలీబాల్, బాడ్మింటన్ ప్లేయర్ .టీచర్స్ బదిలీల్లో పిన్నమనేనిని ముఖ్య సలహాదారు ఒకసారి నాకు ముప్పాళ్లనుంచి పామర్రు రావటానికి తోడ్పడ్డారు .సరదాగా మాట్లాడే నేర్పు విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి యుక్తులు హై పర్సెంటేజ్ సాధించే నేర్పు ఓర్పు ఉన్నవారు నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు తర్వాత పునాదిపాడు వచ్చారు . వారబ్బాయిల్లో ఒకరు ఉయ్యురు కాలేజీ తెలుగు లెక్చరర్ ,రెండవనాయన కె సిపి ఉద్యోగి తరుచు ఉయ్యురు వచ్చేవారు .ఈ ఇద్దరు వెంకటేశ్వరరావు గార్లు వామభావ పక్షపాతులు .శ్రీ పి .శ్రీరామ మూర్తిగారి అనుచరులు . అసలు శ్రీరామమూర్తిగారే హెడ్ మాస్టర్ గా గొల్లపల్లి లో పనిచేసి టీచర్స్ తరఫున ఏం ఎల్ సిగా పోటీ చేసి గెలిచారు .మంచి పర్సనాలిటీ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు .మేమందరం కొల్లూరి గారి మనుషులం అయినా నాతో మూర్తిగారు చాలా ఆప్యాయంగా ఉండేవారు .ఒకటి రెండుసార్లు సరసభారతి సమావేశాలకు ఉయ్యురు వచ్చారు . అరుదైన వ్యక్తిత్వం వారిది .కానీ గిల్డ్ తరఫున పని చేసి మేము రెండుసార్లు కొల్లూరి ని గెలిపించి ఆయన్ని ఓడించాం .లెఫ్ట్ భావాలున్న శ్రీ పి .జనార్దనా రావు గారు శ్రీ నెక్కలపూడి కోటేశ్వరరావు గారు మంచి హెడ్మాస్టర్లుగా ప్రసిద్ధులు . అంగలూరు హెడ్ మాస్టారు శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు అందరికీ ఆదర్శ ప్రాయులు .ఆంగ్ల బోధనలో నిష్ణాతులు రూల్స్ లో నిధి .అలాగే మంగళాపురం హెడ్ మాస్టర్ గా చేసి రిటైరైన శ్రీ జోశ్యులుగారు జిల్లా లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా స్కౌట్స్ ట్రెయినింగ్ లో మేటి
జగ్గయ్యపేట దగ్గర శ్రీ రెబ్బా సత్యనారాయణ గారికి మంచిపేరుంది .గన్నవరం ఆత్కూరు లలో శ్రీ ఆళ్ళ కోటేశ్వరరావు గారు ప్రసిద్ధులు .లేడీస్ లో శ్రీమతి పి .ప్రమీలారాణిగారు అరుదైన వ్యక్తి .గన్నవరం గర్ల్స్ స్కూల్ ను తీర్చి దిద్దారు .ఆమెను మేము హెచ ఏం అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ,కామన్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసాం . రెండితోనూ సమర్ధ వంతంగా పని చేసి రాణించారు .ఆమె చెల్లెలు సరోజినీ దేవిగారు నందిగామ లో పేరు పొందారు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి విజయ లక్ష్మిగారు కలుపుగోలు మనిషి
ఉయ్యురు లో హెడ్ గా పని చేసిన తాడంకి నేటివ్ శ్రీ కోడెబోయిన సూర్యనారాయణ గారు నీట్ గా చొక్కా నలక్కుండా చేతికి మట్టి అంటకుండా పని చేశారు లెక్కలమేస్టారుగా మంచిపేరు తెల్లని గ్లాస్కోపంచె అంతే తెల్లని చొక్కా ఉత్తరీయం చేతిలో గొడుగు నెత్తిపై అటునుంచి ఇటు తిరిగిన నాలుగే నాలుగు వెంట్రుక లు ఆయన ప్రత్యేకత . ఏం జరిగినా సంబంధ లేనట్లుండటం ఆయనకే చెల్లింది .ఆయన సమయం లో స్కూల్ లో హిందూ ముస్లిం స్టూడెంట్స్ కొట్లాట వస్తే బెదిరిపోతే నేనూ ,వల్లభనేని రామకృష్ణారావు గారు అన్నే పిచ్చిబాబు గారు మొదలైన టీచర్స్ పూనుకొని ఘర్షణ లేకుండాకాపాడాం . ఆయన్ను అందుకే ”ఉపాయం మేష్టారు ”అనేవారు
మంచి హెడ్మాస్టర్ లలో శ్రీ మంగళగిరి శాస్త్రిగారు ప్రసిద్ధి గొప్ప చెస్ బాడ్ మింటన్ వాలీబాల్ ప్లేయర్ .లెక్కలు ఇంగ్లీష్ టీచింగ్ లో సూపర్ . గిల్డ్ ప్రెసిడెంట్ ను చేసాం తాడంకి హైస్కూల్ కు వన్నె తెచ్చి అక్కడే రిటైరయ్యారు .ఎన్నో సెమినార్లు నిర్వహించారు ..శ్రీ అన్నే ఉమామహేశ్వరరావు శ్రీ ఘంటా కోటేశ్వరరావు లు ట్యూషన్ మాగ్నెట్స్ .హెడ్స్ గా బాగా రాణించారు ..పెనమకూరు వాసి శ్రీ సూరపనేని వెంకటేశ్వరరావు శ్రీ విల్సన్ గార్లు ,నా ఎస్ ఎస్ సి క్లాస్ మేట్ శ్రీమతి చందా నిర్మల ఆమె భర్త సామ్యుల్ గారు వత్సవాయి దగ్గర పోలం పల్లి లోను , గుడివాడ దగ్గర మోటూరు లో హెడ్స్ గా చేశారు . నా ” బెడ్ ”ట్రెయినింగ్ మేట్స్ హనుమంతరావు ఆండ్రు పాల్ బండిరామారావు చౌదరి , , శ్రీ పి ఆంజనేయశాస్త్రి ,లు హెడ్స్ గా ప్రసిద్ధులు శ్రీ కోకా మా ధవరావు గారు తాడంకి హెడ్మాస్టర్ ఎప్పుడూ ముక్కుపొడీపీలుస్తూ పంచెకు తుడుచుకొంటూ ఉండేవారు . మంచి టీచర్ కుసుమహరనాధ భక్తులు . భార్య కూడా సౌజన్య శీలి హెడ్ మిస్ట్రెస్ అయ్యారు .అలాగే శ్రీ వీరయ్య ,శ్రీ యెన్ అంజయ్య ,వి రఘురాములు ,శ్రీపే టేటి జగన్నాధరావు మొదలైనవారు నాకు సహా ప్రధానోపాధ్యాయలు .ఇప్పటిదాకా చెప్పబడిన వారంతా కృష్ణా జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులు .
ఇప్పుడు ప్రయివేట్ హై స్కూల్ హెడ్మాస్టర్ ల గురించి నాకు తెలిసింది తెలియ జేస్తా .గుడివాడ టౌన్ హై స్కూల్ వ్యవస్థాపక హెడ్ మాస్టర్ శ్రీ యి ఎస్ యెన్ వి మూర్తి గారనీజ్ఞాపకం కృష్ణా జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర పతి పురస్కార గ్రహీత . మూర్తీభవించిన స్వచ్ఛత . ఆయన ప్రత్యేకత . తర్వాత సోమంచి రామం గారికి ఈ పురస్కారం వచ్చింది .టౌన్ హై స్కూల్ కె చెందిన మరో హెచ్ ఏం శ్రీ యెన్ వెంకటేశ్వరరావు గారూ పొడుగ్గా పలచగా ఉండేవారు .సౌజన్య మూర్తి . గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నిర్మల గారుకూడా సమర్ధులని పేరుపొందారు . . మచిలీపట్నం లో శ్రీ చోడవరపు బింధుమాధవరావు గారు జిల్లాలోనే లెక్కలలో ప్రసిద్ధులు .లెక్కలపుస్తకాలు రాశారు . ఆయన తమ్ముడు శ్రీ సి హెచ్ వి రామా రావుగారు ఇంగ్లీష్ లెక్కలలో దిట్ట .మా నాన్న గారితో ఉంగుటూరు లోపనిచేసి తర్వాత పెనమకూరు హెచ్ ఏంగ కొంతకాలం పని చేసి మళ్ళీ గుడివాడ వైపువెళ్లారు నవ్వుముఖం నాకు బాగా పరిచయం . బెజవాడ లో హిందూహై స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహారావుగారు కామ న్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసి టెస్ట్ పరీక్ష పేపర్లు కూడా అమ్మేశారని రుజువైతే మేమ0దరం ఎదురు తిరిగి ఆయన చేతిలోంచి దాన్ని తప్పించి శ్రీ నూకల శ్రీ రామమూర్తిగారు డి యి వోగా ఉన్నప్పుడు ప్రమీలా రాణిగారికి ఇప్పించాం .తేలప్రోలురాజా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రసాదరావుగారు ఆంగ్ల బోధనలో ,ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించటం లో నిష్ణాతులు వివేకానంద్ స్కూల్ హెడ్ శ్రీ నర్సింహ మూర్తి గారిది ఆకర్షణీయ వ్యక్తిత్వం .వానపాముల హెడ్మాస్టర్ సామ్యుల్ గారు భార్య కూడా హెడ్స్ .
పెదముత్తేవి ఓరియంటల్ హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కోసూరి ఆదినారాయణ ”చాకు” .హెచ్ ఏం అసోసియేషన్ కు ఆయన్ని నేనే సెక్రెటరీని ప్రమీలారాణిగారిని అధ్యక్షురాలిని చేయటం లో నడుం కట్టాను ఇద్దరూ దానికి గొప్ప వైభవం తెచ్చారు .శ్రీ మద్దూరి విశ్వం శ్రీ వై వి రాజు శ్రీ రమణారావు శ్రీమతి బి సుగుణ కుమారి గార్లు హెడ్ మాష్టార్లుఅయి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు గా పదోన్నతి పొందారు .సుగుణగారి భర్త శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు సైన్స్ బోధనలో ప్రవీణులు అంగలూర్ హెచ్ ఏం అయ్యారు అందులో రాజు గారు నీతి నిజాయితీకి ఆభరణం . అలాగే వెలగలేరు హెడ్మాస్టర్ శ్రీ ప్రభాకరరావు గారు లెక్కల మేస్టారుగా మంచి పేరు ఉన్నవారు . భార్య కూడా హెడ్ మిస్ట్రెస్ . నా మోపిదేవి శిష్యురాలు బందరు మునిసిపల్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి భారతీ దేవిని మేంఅంతాకలిసి ప్రమీలా రాణిగారి తర్వాత హెచ్ ఏం అసోసియేషను ప్రెసిడెంట్ ను చేశాము . మస్తాన్ రావుగారు మాతోపాటు మోపిదేవిలో లెక్కల మేస్టారుగా పనిచేసి దివితాలూకా హెడ్మాస్టర్ అయ్యారు .స్వ ర్గీయ శ్రీ టి ఎల్ కాంతారావు గారిమామగారు పెనమకూరు హెడ్మాస్టర్ గా చేస్తూ చనిపోయారు . అక్కడే పని చేసిన శ్రీ వేములపల్లి కృష్ణ మూర్తిగారు లెక్కల టీచర్ గా సుప్రసిద్ధులు భారీపర్సనాలిటీ . ఇక్కడే శ్రీ విల్సన్ గారు చేశారు . తోట్లవల్లూరు హెడ్ మాస్టర్ పేరుజ్ఞాపకం లేదుకానీ సిగరెట్టూ గుప్పిటిలోపెట్టి పొగ పీల్చేవారు .తమాషాగా ఉండేది . శ్రీ చలపతిరావుగారు కపిలేశ్వరపురం ఎంకన్నవీడు ల్లో హెచ్ ఏం . శ్రీ నర్రా బాబూరావుగారు టీచర్ గా హెడ్ మాస్టర్ గా గుడివాడ చుట్టుప్రక్కల ప్రసిద్ధులు వాళ్ళబ్బాయి ఉయ్యూరులో నా శిష్యుడు తర్వాత అడ్డాడలో లెక్కలమేస్టర్ .ఇలా ఎందరో మహాను భావులైన ప్రధానోపాధ్యాయులు అందరికి వందనములు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్- షార్లెట్ -అమెరికా
—
