గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
138- సంస్కృత కీర్తనలు రాసిన అన్నమయ్య (1409-1503)
పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు 32 వేల సంకీర్తనలు రచించినా లభ్యమైనవి 12 వేలు మాత్రమే అందులో శృంగార భక్తి జ్ఞాన నీటి ధర్మ వైరాగ్యభావాలను చక్కని తెలుగుపదాల పోహళింపుతో రాసి సొగసు తెచ్చాడు .తిరుమల శ్రీ వెంకటేశ్వర పాద పద్మ భృంగమై అందులోని మకరందాన్ని గ్రోలి మనకు అందించిన సంకీర్తనాచార్యుడు . కులమతాలకు అతీతమైన భావ వ్యాప్తి చేసిన సంస్కారి . .”బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే” అని ఎలుగెత్తి చాటిన వేదోపనిషత్ వ్యాఖ్యాత ”.ఏ కులజుడైన నేమి ఎవ్వడైన నేమి”అని అందరూ ఒక్కరే నాన్న వసుధైక విహావం వ్యాప్తి చేసైనా పూర్ణ ప్రజ్నడు . పదకవితా సాహిత్యానికి పట్టాభిషేకం చేసి పదకవితా శారదను బంగారు పల్లకి లో ఊరేగించినవాడు అన్నమయ్య. కలకండ తెలుగుకు మరింత తియ్యదనాన్ని అందించినవాడు.సర్వ దారి సంవత్సర వైశాఖ శుద్ధ పొర్ణమి 22-5-1409న ఈ నాటి కడప జిల్లా లోని తాళ్ళపాక లో జన్మించి 95 వ ఏట,దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి 4-5-1503 న శ్రీ వెంకటేశ్వర పద సన్నిధికి చేరిన పుణ్యాత్ముడు .భార్య తిక్కమ్మ ”సుభద్రా కళ్యాణం ”రాసిన తొలి తెలుగు కవయిత్రి .కొడుకు పేద తిరుమలాచార్యుడు ,మనవడు చిన్నయ్య కూడా కవులే .కర్ణాటక సంగీత కూర్పుకు పాదకవితలతో ఒక సంచలనం సృష్టించినవాడు అన్నమయ్య. సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య సంస్కృతం లోనూ కీర్తనలు రాసి తన గీర్వాణ పాండిత్యాన్ని ప్రకటించాడు .సుమారు వంద సంస్కృత కీర్తనలు రాసినట్లు తెలుస్తోంది .అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం
1-పృథుల హేమ కౌపీనధర-ప్రథిత వతృమే బలం పాతు
సూపాసక్తః సుచి శ్శు లభః-కోప విదూరహ-కులా ధికః
పాపభంజకహ పరాత్పరోయం -గోపాలో మే గుణం పాతు
తరుణః చత్రీ దందా కమండలు-ధర పవిత్రీ దయా పరః
సురాణాం సంస్తుతి మనోహరః -స్థిర శ్శు ద్ధీర్మే ధృతిం పాతు
త్రివిక్రమః శ్రీ తీరు వెంకట గిరి -నివాసోయం నిరంతరం
ప్రవిమల మసృణ కబళ ప్రియోమే -దివా నిశాయాం థియమ్ పాతు ”
-వామన మూర్తి పై కీర్తనయుడి దీన్ని లతా మంగేష్కర్ పాడారు
2-భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింత ఏయం సదా –
కటి ఘటిత మేఖలా ఖచిత మని ఘంటికా -పాతాళ నినాదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజితేన తం -చేతుల నటనా సముజ్వల విలాసం
నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిపదం
తిరు వేంకటాచల స్థిత0 అనుపమమ్ హరిం -పరమ పురుషం గోపాలబాలం –
మరో కీర్తన చూద్దాం
3-దేవ దేవం భజే దివ్య ప్రభావం -రావణాసుర వైరి రవి పుంగవం
రాజవరం శేఖరం రవి కుల సుధాకరం -ఆజానుబాహు నీలాగ్రకాయం
రాజారి కోదండ దీక్షా గురు0 -రాజీవ నేత్రం రామచంద్రం ,రామం
నీల జీమూత సన్నిభ శరీరం -విశాలవక్షం నిబాల జలజ నాభం
కాలాహి నాగ హరమ్ ధర్మ సంస్థాపనం -గో లలనాధిపమ్ భోగి శయనం రామం
పంకజాసన వినుత పరమ నారాయణం -శంకరార్జిత జనక చాప దళనం
లంకా విశోషణం లలిత విభీషణం వెంకటేశం సాదు వినుత వినుతం రామం –
మరో ఆణిముత్యం –
4- మాధవ కేశవా మాధవ విష్ణో శ్రీధరా- పదనఖ0 చిన్తయామి యూయం
వామన గోవిందా వాసుదేవ ప్రద్యుమ్న -రామరామ కృష్ణ నారాయణాచ్యుత
దామోదరానిరుద్ధదైవ పుండరీకాక్ష -నామాత్రయాధీశ నమోనమో
పురుషోత్తమ పుండరీకాక్ష -దివ్య హరి సంకర్షణ అధోక్షజ
నరసింహ హృషీ కేశ నగధర త్రివిక్రమ – శరణాగత రక్ష జయ జయ సేవే
మహిత జనార్దనా మత్స్య కూర్మ వరాహా -సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి
విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభకరం -అహమిహ తవపద అనిశం భజామి
అంటూ విష్ణు అవతారాలను చక్కగా స్తుతించాడు అన్నమయ్య కీ ర్తనలో
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
