మధ్య యుగాల వైద్య విధానం -1

మధ్య యుగాల వైద్య విధానం -1

గ్రీకు ,రోమన్ సామ్రాజ్య హవా  ఒక వెయ్యేళ్ళు అంటే క్రీ పూ. 1500 నుంచి క్రీ.  శ . 400 వరకు సాగింది  గ్రీకుల” హిపోక్రటీస్”  ,రోమన్ల” క్లాడియస్ గాలేన్”లు అప్పుడు గొప్ప వైద్యులు  ఈ రెండిటి పతనం తర్వాత 5 వ శతాబ్ది ప్రారంభ0 నుంచి మరొక వెయ్యేళ్ళ కాలాన్ని  మధ్యయుగాల అన్నారు .మధ్యయుగాలలో మొదటి వైద్యుని వైద్య పిత అని రెండవ ఆయనను వైద్య యువరాజు అన్నారు ..ఇద్దరు గొప్ప వైద్య గ్రంధాలు రాశారు ఏవ్ మధ్యయుగాలకు ఆదర్శమైనాయి ఈజిప్టు ఇండియా ,చైనా  వైద్య గ్రంథాలెన్నో అనువాదం పొందాయి .కుటుంబ స్త్రీలే చిన్న చిన్న జబ్బులు నయం చేసేవారు .వీరికి పరంపరాగతంగా వచ్చిన వైద్య విజ్ఞానం తోడ్పడింది ..పక్షవాతం వస్తే సూర్యాస్తమయం తర్వాత మీద వద్ద చిన్న గాయం పెట్టి రక్తాన్ని బయటికి పంపి  మూడుసార్లు నీటితో పుక్కిళింపజేసి మంత్రాలు చదివి నయం చేసేవారని 900 లో రాయబడిన ఆంగ్లో సాక్సన్  రెమిడీస్ అనే పుస్తకం లో ఉంది . అంటే వైద్యం లో మందు ,మతం కలిపి ఉండేవన్నమాట ..డామియన్ ,కాస్మస్ వైద్య దేవతలయ్యారు వాళ్ళు సైలీషియా కు చెందిన సోదరులు మన అశ్వినీ దేవతలులాగా .వాళ్ళు అద్భుతాలు చేస్తారని ఒక నల్లవాడికాలు ను తీసి గాయం తో దెబ్బతిన్న తెల్లవాడి లాలికి అమర్చిన అద్భుత శక్తి వాంతులని నమ్మేవారు ..భారత దేశం లో ఆయుర్వేదం అప్పుడు బాగా ప్రాచుర్యం లో ఉండేది శాస్త్ర చికిత్సలు దిగ్విజయంగా చెయ్య గలిగే వారు . 1793  లో ఇద్దరు  ఆంగ్ల సర్జన్లు ఇలాంటి ఆపరేషన్ ను చూసి బ్రిటిష్ దేశానికి ఆ విధానమంతా రాసి పంపించి అలా చేయమని తెలియ జేశారట ..కౌస్జీ అనే ఆయన ఇంగ్లిష్ ఆర్మీ కి వైద్యుడుగా ఉండేవాడు .ఈయన్ను భారత రాజు బందీ చేసి మోసం నేరం మీద ఒక చెయ్యి ,ముక్కు కోయించాడు  . భారతీయ శస్త్ర వైద్యులు అతని ముఖ చర్మాన్ని తీసి ముక్కుకు అమర్చి సరిచేశారు .ఇంగ్లిష్ సర్జన్లు ఈ అమోఘ గ్రాఫ్టింగ్ విధానాన్ని ముక్కున వేలేసుకొని చూసి బోల్డు ఆశ్చర్య పోయి ,ఆ విధానాన్ని పూస గుచ్చినట్లుగారాసి బ్రిటన్ రాజుకు పంపి అక్కడ అమలు చేయమని చెప్పారట  .భారతీయ వైద్యం లో వైద్యులు రోగికి సంబంధిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రమాణం చేసేవారు .చరక సంహిత వైద్య గ్రంధం లో మర్యాద ,మంచితనం తెలివి తేటలు ,వ్యక్తిత్వ్వం  వైద్యం లో నేర్పు ఉన్నవాడే గొప్ప వైద్యుడు అని ఉంది .ఏ మొక్కా వృధా కాదు .ప్రతిదానిలో వైద్య గుణాలున్నాయని తెలుసుకొని వనమూలికలు మందులలో వాడేవారు ..
  చైనాలో హాన్ డైనాస్టీక్రీ.పూ. 200 నుంచి  క్రీ శ200 వరకు ఎన్నో వైద్య గ్రంధాలు రచింప బడ్డాయి .చైనా వైద్యులు ”చి ” వాళ్ళభాషలో ”క్వి ”అనేది వైటల్ ఎనర్జీగా నమ్మేవారు .అలాగే శరీరం లోని ”యిన్ ”మరియు ”యాంగ్ ”లు సమ తుల్యం లో ఉండాలని చెప్పేవారు .ఈ రెండు మన చుట్టూ ఉంటాయని ,కానీ అవి కాంతి -చీకటి లాగా  చలి-వేడి లాగా శీతాకాలం -వేసవికాలం లాగ పరస్పర వ్యతిరేకంగా శక్తి వంతంగా ఉంటాయని భావించేవాళ్లు ..కనుక డాక్టర్లు పేషేంట్ లను ఈ రెండిని ఎలా బాలన్స్ గా ఉంచుకొని ఆరోగ్యం కాపాడుకోవాలో చెప్పేవారు ..క్రీ పూ. 400 లోరాయబడిన  ”ఎల్లో ఎంపరర్ మాన్యువల్ ”లో వీటి గురించి ఉంది ..శరీరం వెలుపల యాంగ్ ఉంటుంది .లోపల యిన్ ఉంటుంది ..కాలేయం గుండె ,ప్లీహం (స్ప్లీన్ ),ఊపిరి తిత్తులు ,మూత్ర పిండాలు యిన్ కు చెందినవి .మిగిలిన అయిదు ఖాళీ భాగాలు ,గాల్ బ్లాడర్ ,,ఉదరం ,లోపలి ప్రేవులు వగైరా యాంగ్ వి .స్ప్రింగ్ లో వచ్చే వ్యాధులకు కారణం యిన్ అధీనం లో ఉన్నవాటివల్లా ఆటం లో జబ్బులు యాంగ్ ప్రభావ భాగాల్లో వస్తాయి .ఆకు పంక్చర్ వైద్యం తో ఈ రోగాలు నివారిస్తారు .
   మధ్య యుగాలలో క్రైస్తవ ,మహమ్మదీయ మతాలు విద్య రంగం లో గణనీయ  సేవ చేశాయి ..మొనాస్టరీలు వైద్య గ్రంధాలను భద్రపరచాయి ”రోగి సేవ అన్నిటికంటే ప్రధానం ”అని బెనా డికేటైన్ మాంక్స్ చెప్పేవారు . మాంక్స్ కు చికిత్స మొనాస్టరీలలోనే చేసేవారు .శరీరం లో ప్రతిభాగం లో ఒక సెయింట్ ఉంటాడని అక్కడ జబ్బు రావటానికి కారణం మౌతాడని నమ్మేవారు .వెన్ను నొప్పి వస్తే సెయింట్ లారెన్స్ ను , ప్లేగు జబ్బుకు సెయింట్ సెబాస్టియన్ ను ప్రార్ధించేవారు .పంటినెప్పికి సెయింట్ అప్పొల్లోనియా  .ఈ పే ట్రన్ సెయింట్ ను మతం మార్చుకోనందుకు రాజు అన్ని పళ్ళను పీకించి హింసించాడట .బాల్యం లో బిడ్డల్ని కనేవాళ్ళు సెయింట్ మార్గ రెట్ ఆఫ్ యాంటి  యోక్  ను ,ప్రార్ధించేవారు .ఒకసారి ఒక దెయ్యం మార్గరెట్ ను మింగేస్తే ,ఆమె కడుపులోనే క్రాస్ చిహ్నాన్ని గీసిందని అదే తర్వాత క్రైస్తవ మత చిహ్నం క్రాస్ కు మూలమని    ఆ దెయ్యం కడుపు చీల్చుకుని  సెయింట్ మార్గ రేట్ బయటికి వచ్చిందని నమ్మేవారు
  1000-1300 కాలం లో  యూరప్ వాతావరణం బాగా ఉంది మంచిపంటలు ,పండటానికి కావలసినంత వర్షాలు ప్,అనుకూల ఉష్ణోగ్రత కలిగి ఉండేది .భూస్వాములు అధిక పంటలతో బలిసిపోయారు .సంపన్ను లైన వీరు చర్చి లలో బిషప్పులు  అబ్బట్ లయ్యారు .  తమ దగ్గరున్న ధనాన్ని అద్భుత కెదెడ్రల్ విద్యాలయ వైద్యాలయాల నిర్మాణం చేశారు . 1110 లో పారిస్   1158 లో బొలోనా,1167 లో ఆక్స్ ఫర్డ్ ,1209 లో కేం బ్రిడ్జి ,1222 లో పావుడా లలోయుని వర్సిటీలు నిర్మించి వైద్యానికి ప్రాముఖ్యమిచ్చారు మోదట్లో స్త్రీలకూ ప్రవేశార్హత ఉండేదికాదు .చర్చి వ్యతిరేకించేది . మగవారు వ్యతిరేకించేవారు కానీ క్రమంగా  వారు పోరాటాలల్తో స్థానం సాధించి చదివి డాక్టర్లు సర్జన్లు అయ్యారు . 1250 లో లండన్ లో కేథరిన్ అనే ఆమె మొదటి మహిళా సర్జన్ గా రికార్డ్ కు ఎక్కింది ,  ఆమె తండ్రి సోదరులుకూడా  సర్జన్ లే .. 1380 లో మాస్టర్ సర్జన్ లు సర్జరీతో ఆదా మెగా భేదం చూపాము అని ప్రమాణం చేయటం వచ్చింది .జర్మనీలో బింజెన్ లోని హైడ్ గార్డ్ అనే  1098-1179 కాలపు నన్ వైద్యం చేసి వైద్య గ్రంధాలు రాసింది .సాధారణ మొక్కలు మూలికలను ముందుగా ఎలా వాడవచ్చో వాటిలో రాసింది .. 1420 దాకా  బ్రిటన్ లోనూ ఆడవాళ్లు ముందుకు రాలేకపోయారు . ఇంగ్లాండ్ లోని ప్రముఖ డాక్టర్లు నాలుగవ శతాబ్ది జాన్ ఆఫ్ మారిఫీడ్ అభిప్రాయాన్ని సమర్ధిస్తూ పార్లమెంట్ కు ఒక పిటీషన్ సమర్పించి అందులో ”విద్యకు వైద్యానికి   ఆడవాళ్లు పనికి రారు వారికి సహజ తెలివి తేటలు వృత్తినైపుణ్యం లేవు .వీటితో పేషేంట్ లను బాధ పెట్టి చంపేస్తారు .మూర్ఖత్వం అజ్ఞానం వారిసొమ్ము కనుక వారిని ఉన్నత విద్యలకు అనుమతించవద్దు ”అన్నారు మృగ మహా రాజులైన వైద్యో నారాయణో హరులు -మహిళాహక్కు హరులు .
     సశేషం
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సైన్స్ and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.