సరసభారతి రెండు గ్రంథాల ఆవిష్కరణ
సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసి ,సరసభారతి ముద్రిస్తున్న రెండు అమూల్య గ్రంధాల ఆవిష్కరణ సభ గుంటూరు జిల్లా రేపల్లె లో 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది . దీనితోపాటు ప్రసిద్ధులైన 10 మంది కవులచే కవి సమ్మేళనం కూడా నిర్వహింపబడుతుంది . విశిష్టమైన అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహిత్య సంగీత ప్రియులందరికీ ఆహ్వానం . పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
ఆవిష్కరింపబడే గ్రంధాలు
1-ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు
తమ సృజనాత్మక ప్రతిభతో ప్రపంచ ప్రగతిని మార్చి మలుపు త్రిప్పి ,ఆధునిక ప్రపంచానికి దారులు వేసిన వేదాంతం తత్వశాస్త్రం ,కవిత్వం ,నాటకం నవల సంగీతం నాట్యం సినిమా ,శిల్పం చిత్రకళ మొదలైన వాటిలో లబ్ధ ప్రతిష్టు లైన 91 మంది మహానుభావుల జీవిత చిత్రణ .
అంకితం – స్టాటిస్టిక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతులైన గణిత శాస్త్ర వేత్త కీ శే . డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య (అమెరికా )గారికి
ప్రాయోజకులు -సరసభారతి ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )
— (పరుచూరి వారికి బావగారు ,సోదరి )
2- గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 -మూడవ భాగం
460 మంది సంస్కృత కవుల జీవితాలు ,కవిత్వం పై వెలువడుతున్నఅపూర్వ గ్రంధం
అంకితం – దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి ,శ్రీమతి డా సులోచన(అమెరికా ) దంపతులకు
ప్రాయోజకులు – విద్యాసంపన్నులు వితరణ శీలి దేశభక్తి పరాయణులు
ప్రొఫెసర్ యల్లాప్రగడ రామమోహన రావు గారు(అమెరికా )
(మూర్తిగారి వారి బావమరిది ,సులోచనగారి అన్నగారు )
ముందుమాటలు -అవధాన సరస్వతి డా శ్రీ పాపపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు
మనవి -మూడవ గీర్వాణం లో స్థానం పొందిన గీర్వాణకవులు 1-డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 2- డా శ్రీ గబ్బిట జయమాణిక్య శాస్త్రి 3- డా శ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి 4- డా శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి 5- శ్రీపరాశరం భావనారాయణా చార్యులు 6-డా శ్రీ వెంపటి కుటుంబ శాస్స్త్రి 7-డా శ్రీమతి అయ్యగారి ప్రభావతీదేవి 8-డా శ్రీ ఇనగంటి ఉమారావు 9-డా శ్రీ కె హయగ్రీవ శర్మ మొదలైన వారిని తప్పక ఈ కార్యక్రమం లో పాల్గొని వేదికను సుసంపన్నం చేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాను
” వేదిక ”తో సహా అన్ని వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం నవంబర్ రెండవ వారం లో అందజేస్తాం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-17 -ఉయ్యూరు

