మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు -1
కుటుంబ నేపధ్యం
శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు 25-10-1921న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దంతలూరు గ్రామం లో జన్మించారు .తలిదండ్రులు శ్రీ పుచ్చా చంద్ర మౌళి శాస్త్రి ,శ్రీమతి బాలా త్రిపుర సుందరి .అయిదుగురు సంతానం లో కడగొట్టు ఏకైక మగ పిల్లాడు .ఆయన వంశ పూర్వీకులందరూ వేద శాస్త్ర పారంగతులైన విద్యా వేత్తలైనందుకు శ్రీ వెంకటేశ్వర్లు గారు గర్వపడే వారు .పదేళ్ళ బాల్యం లోనే తల్లిని పోగొట్టుకున్నఅభాగ్యుడు . బి ఎస్ సి డిగ్రీ వరకు గుంటూరు లోనే చదివి,తరువాత బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో చేరి 1944లో ఎం. ఎస్. సి.డిగ్రీ ,1947 లో డి .ఎస్. సి .సాధింఛి ప్రొఫెసర్ అయ్యారు . . శ్రీమతి ఈమని సరస్వతి గారిని వివాహమాడి ఒక కుమార్తెకు నలుగురు కుమారులకు జన్మ నిచ్చారు .ఇద్దరు కుమారులు అమెరికాలో ప్రొఫెసర్లు.మిగిలిన ముగ్గురు అక్కడే కన్సల్టింగ్ ఫర్మ్ లకు అధినేతలు .
విద్య శాస్త్ర సేవలు
ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు బెనారస్ హిందూ యూని వర్సిటి లో స్వర్గీయ ఆర్. కె. అసుంది తో కలిసి రిసెర్చ్ చేసి 1947లో డి.ఎస్. సి .డిగ్రీ పొంది , రిఫెర్రేడ్ పేపర్లను డిగ్రీ లో నేచర్ పై రాసినది ,హాలోజెన్స్ ల ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాపై రాసినది కాక ,మరొక 9 తను ప్రత్యేకంగా వ్రాసిన వాటిని కలిపి మొత్తం 11 రిఫెర్రేడ్ పేపర్లు రాసి ప్రచురించారు .వీటిలో దాదాపు సగం ఆయన వ్యక్తిగతమైనవి గానే ఉన్నట్లు ,తరువాత జీవితం లో యూరప్ ,అమెరికా ,కెనడా లలో ప్రముఖ లాబరేటరీలలో పోస్ట్ –గ్రాడ్యుయేట్ అసోసియేట్ గా ఉన్నప్పుడు కూడా ఇలాగే కొనసాగించారు .యవ్వనం నుంచే ధైర్య సాహసాలతో తాను వినూత్న ,విశిష్ట ,సాహసోపేత కార్యాలను చేయగలననే ఆత్మస్థైర్యం ఉన్నవారు .దీనికి గొప్ప ఉదాహరణే ఆయన బెనారస్ లో డిగ్రీ పొందిన వెంటనే నీల్స్ బోర్ లాబరేటరి న్యూక్లియర్ ఫిజిక్స్ లో పనిచేయటానికి తీసుకొన్న సాహసోపేత నిర్ణయం .ఇక్కడ’’ లో రిజల్యూషన్ ప్రిజం స్పెక్ట్రోగ్రాఫ్’’ లను మాత్రమే ఉపయోగించి మాలిక్యులర్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన చేశారు .నిజంగా ఈ రెండిటికి సంబంధమేలేదు ,పోలికాలేదు ,ప్రయోగ సా౦కేతికతలో ,సైద్ధాంతిక పరంగా కూడాఇవి పూర్తిగా భిన్న స్వభావం కలవి కూడా .తర్వాత తన బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సర్వ సర్ధమైన అత్యంత నాణ్యమైన కెనడాలోని యెన్ .ఆర్ .సి .లో ఉన్న గెర్హార్డ్ హెర్జ్ బెర్గ్,చికాగో యూని వర్సిటి లోని రాబర్ట్ మల్లికేన్ ,డ్యూక్ యూని వర్సిటి లోని వాల్టర్ గార్డి కేంద్రాలను,ఇన్ఫ్రా రెడ్ స్పెక్ట్రో స్కోపి కి ఎం. ఐ. టి.లోని రిచార్డ్ లార్డ్ విద్యా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు . నోబెల్ బహుమతి గ్రహీతలైన ముగ్గురి పేరిట ఉన్న ఈ విద్యాలయాలలో విద్య కొనసాగించటం వలన వెంకటేశ్వర్లు గారికి ,వారిలోని పట్టుదల ,కృషి ,ముందుచూపు ,నిరంతర శ్రమ ప్రేరణగా నిలిచి జీవితాంతం ముందుకు నడిపించాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-17 –ఉయ్యూరు
పుచ్చావారి ఫోటో జత చేశాను చూడ0డి dr.puccha venkateshvarlu (1)

