మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-2
బోధన పరిశోధన
శాస్త్రీయ రంగం లో శ్రీ వెంకటేశ్వర్లు గారి అమూల్య సేవ1954 -1997 కాలం లో మూడు గొప్ప విద్యాకేంద్రాలు1- ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి 2-,కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , 3-అమెరికాలో హ౦ట్స్ విల్ లోఉన్న అలబామా అగ్రికల్చర్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ ల ఏర్పాటు తో విస్త్రుతమై ,విశ్వవ్యాప్తమై ,చిరస్మరణీయమైంది .ఈ మూడిటిలో 50 మందికి పైగా పి .హెచ్ .డి.లకు అత్యున్నత శిక్షణ నిచ్చారు .జీవితమంతా ఏదో ఒక వినూత్న ప్రయోగ ,పరిశోధన లతో గడిపిన ఆలోచనాపర మైన మేధస్సు ఆయనది .ఇదివరకు చేసిన ఆప్టికల్ ,ఇన్ఫ్రా రెడ్ ,మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పై పరిశోధనలతో పాటు పూర్తిగా నూతన రంగాలైన న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ,సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి ,లేజర్స్ ,లేజర్ ఇంఫ్యూజ్డ్ ఫ్లోరొసెన్స్ స్పెక్ట్రో స్కోపి ,అన్ కన్వర్షన్ స్టడీస్ ,ఇంటర్ ఫెరోమెట్రి ,ఆప్టికల్ ఫేజ్ కా౦జుగేషన్,హోలోగ్రాఫిక్ గ్రేటింగ్స్,నాన్ లీనియర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ ,మైక్రో స్పెరికల్ లేజర్స్ ,పౌడర్ లేజర్స్ మరియు ప్లానార్ వేవ్ గైడ్స్ లోను విస్తృత పరిశోధనలు జరిపిన నిత్యాన్వేషి శ్రీ వెంకటేశ్వర్లు .అన్ని సైంటిఫిక్ జర్నల్స్ లో ఆయన రాసిన 200 కు పైగా వ్యాసాలు ప్రచురితమై ,ఆయన కీర్తి ఖండాంతర వ్యాప్తి చెందింది .పైన పేర్కొనబడిన మూడు విద్యాకేంద్రాలలో ఆయన మార్గదర్శక మహత్తర సేవ ,తోడ్పాటు లను సంక్షిప్తంగా తెలుసుకొందాం .ఆయన ప్రతిభకు గుర్తుగా ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీలకు ఫెలో గా ఎన్నుకోబడ్డారు .రామన్ సెంటినరి అవార్డ్ అందుకున్నారు.అమెరికన్ ఫిజికల్ సొసైటీ ,ఆప్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా లలో ఆయన కు సభ్యత్వ మిచ్చి గౌరవించారు .
1- ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీ లో సేవ
విద్యారంగం లోమొట్ట మొదటి సారిగా శ్రీ వెంకటేశ్వర్లు గారు ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీ రీడర్ గా 1954 లో నియామకం పొందారు .ఒకప్పుడు ఇది ప్రొఫెసర్స్ ఆర్.శామ్యూల్ ,ఆర్. కె.అసుంది ఆధ్వర్యం లో స్పెక్ట్రో స్కోపిక్ రిసెర్చ్ కు ముఖ్య కేంద్రంగా విలసిల్లింది.రెండవ ప్రపంచ యుద్ధకాలం లో శామ్యూల్ జర్మనీకి ,అసుంది బెనారస్ కు వెళ్లి పోవటం తో లాబరేటరి దాదాపు మూత పడి,20 ఏళ్ళు పరికరాలన్నీ తాళాలు పడి నిరుపయోగ౦గా ఉండి పోయాయి .వెంకటేశ్వర్లు గారు ఇక్కడ చేరిన మరుక్షణం నుంచి కార్య రంగం లోకి దూకి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ డైయటామిక్ మాలిక్యూల్స్ పరిశోధన క్షేత్రం లో మహత్తర చైతన్యం తెచ్చారు .ప్రొఫెసర్లు శామ్యూల్ ,అసుంది లు 1930 కాలం లో ఉపయోగించిన లో రిజల్యూషన్ స్పెక్ట్రో గ్రాఫ్ లనే వాడుతూ ,విద్యార్ధులకు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ హాలోజెన్స్ పై మార్గ దర్శనం చేశారు .వెంకటేశ్వర్లుగారి బెనారస్ డిగ్రీ చదువు నుండి అత్యంత అభిమానమైన విషయం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ హాలోజెన్స్అని మనకు తెలుసు . దీనినే ఆయన కొనసాగించి జీవితం తుది ఘట్టం వరకు వదిలి పెట్టకపోవటం విశేషం .స్పెక్ట్రో స్కోపి లోపరిశోధనకోసం పరికరాన్ని కొనటానికి కావలసిన భారీ మొత్తం లో చాలాభాగం వెంకటేశ్వర్లు గారికి మొదటి సారిగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సంస్థ కానుకగా అందజేసింది. తాను ఇదివరకెన్నడూ పరిశోధించని కొత్త విభాగం లో ఆయన కొన్న మొట్టమొదటి పరికరం యెన్.ఎం. ఆర్. స్పెక్ట్రో మీటర్ .ఇండియాలో నే మొట్టమొదటి మైక్రో వేవ్ స్పెక్ట్రో మీటర్ ను విడి భాగాలన్నీ కూర్చి తయారు చేసి,ముగ్గురు పిహెచ్ డి విద్యార్ధులకు శిక్షణ నిచ్చారు పుచ్చావారు .ఇదేకాక వాక్యూం అల్ట్రా వయొలెట్ స్పెక్ట్రోస్కోపిని కూడా మొదటిసారిగా ప్రారంభించిన ఘనత శ్రీ వెంకటేశ్వర్లు గారిదే అని తెలిస్తే అవాక్కై పోతాం .ఆలిఘర్ యూని వర్సిటి లో 9 మంది విద్యార్దులకు ఇందులో శిక్షణ నివ్వగా ,అందులో ఏడుగురు ఇండియా ,అమెరికా ,కెనడా లలో ప్రొఫెసర్ లుగా రాణిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-17 –ఉయ్యూరు

