మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-7
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -2
2-మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లో
డ్యూక్ యూని వర్సిటీలో ఉండగా వెంకటేశ్వర్లుగారు మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన ప్రారంభించారు .1953-54 కాలం లో రెండేళ్ళు ఆ పనిలోనే ఉన్నారు .ఆ సమయం లో వాయువుల మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి ప్రారంభ దశ లోనే ఉన్నది ఆ యూని వర్సిటి లో గార్డీ,ఆయన అనుచరులు మార్గ గాములుగా ఉన్నారు .వెంకటేశ్వర్లుగారు సహచరులు మిధైల్ ఆల్కహాల్ మైక్రో వేవ్ స్పెక్ట్రం ను అధ్యయనం చేశారు .మిధైల్ ఆల్కహాల్ కొద్దిగా అసౌస్టవ మాలిక్యూల్ గుప్తంగా అంతరిక భ్రమణాలు (హిండర్డ్ ఇంటర్నల్ రొటే షన్స్) కలిగి ఉంటుంది .అందులోని ప్రాధమిక కంపనాలు ( ఫండ మెంటల్ వైబ్రేషన్స్ హైడ్రాక్సిల్ గ్రూప్ )పురి(టార్సనల్ )తో మిధైల్ గ్రూప్ కు అనుబంధంగా ఉంటాయి .ఈ కదలిక నే హిండర్డ్ అంటే గుప్త భ్రమణాలు అంటారు .ఇవి మాలిక్యూల్ స్పెక్ట్రం యొక్క భ్రమణాలను క్లిష్ట తరం చేస్తాయి .వీటిపై ప్రాధమిక పరిశోధన ,విచారణలను డేన్నిసన్ ,అతని అనుచరులు చేశారు .1953 లో దీనిపై పరిశోధనా పత్రం రాసి ప్రచురించగానే వెంకటేశ్వర్లుగారు ఆయన సహచరులు మిధైల్ ఆల్కహాల్ మైక్రో వేవ్ స్పెక్ట్రం ను పరిశోధించారు .దీనిపై మొదట గా ఈ మాలిక్యూల్ యొక్క రోటేషనల్ స్పెక్ట్రం మొదటి ప్రాధమిక అధ్యయన విషయాలను రెండు పేపర్లుగా ప్రచురించారు .ఈ మాలిక్యూల్ యొక్క మైక్రోవేవ్ ,మిల్లి మీటర్ వేవ్ స్పెక్ట్రం లను మైక్రో వేవ్ ఆస్ట్రనాట్స్ దట్టమైన మాలిక్యులర్ క్లౌడ్స్ లో మైక్రో వేవ్ ఉద్గారం (ఎమిషన్ ) వలన గుర్తుపట్ట గలరు .అప్పటి నుంచి ఓరియన్ మాలిక్యులర్ క్లౌడ్స్ లో అనేక చోట్ల అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు .మైక్రో వేవ్ ఆస్ట్ర నామర్స్ కు ఈ మాలిక్యూల్ ను గుర్తించటానికి ఈ ఊహలు పరిశోధనాలయం లో గమనించిన విషయాలు బాగా తోడ్పడ్డాయి .అంతరిక్ష భౌతిక శాస్త్రం లో అత్యధిక ప్రాముఖ్యం కల ఈ మాలిక్యూల్ యొక్క మైక్రో వేవ్ స్పెక్ట్రం ను అధ్యయనం చేసిన మొట్ట మొదటి శాస్త్ర వేత్తలుగా శ్రీ వెంకటేశ్వర్లు గారి బృందం చరిత్ర ప్రసిద్ధులయ్యారు .
డ్యూక్ యూని వర్సిటి లో మిజు షీమా, వెంకటేశ్వర్లు గారు కలిసి గ్రూప్Vd,Td మాలిక్యూల్స్ లో మైక్రో వేవ్ శోషణ (అబ్సార్ప్షన్)పై అన్వేషణ చేశారు .వీటికి శాశ్వత డైపోల్ గమనం ఆధార స్థితి లో లేదని ,కనుక ఆ స్థితిలో మైక్రోవేవ్ శోషణ లేదని కనిపెట్టారు .ఈ శాస్త్ర ద్వయం ఈ మాలిక్యూల్స్ యొక్క ఉత్తేజిత క్షీణ కంపన స్థితిలో పూర్తిగా రోటేషనల్ అబ్సార్ప్షన్ కనపరుస్తాయని చెప్పారు ..ఇలాగే మిదేన్ మాలిక్యూల్ విషయం లో ఒజీర్ ,అయన అనుచరులు1973 లో పరిశోధించి చెప్పారు . ఇవన్నీ వెంకటేశ్వర్లుగారి అంతర్ దృష్టి (ఇంట్యూషన్ ),శాస్త్రీయ అవగాహనలకు ప్రతిబింబాలు .
1954 లో ఇండియా కు తిరిగి వచ్చిన .వెంకటేశ్వర్లు గారు వెంటనే ఆలీగర్ ముస్లిం యూని వర్సిటి ఫాకల్టీ లో చేరారు .చేరిన ఏడాదికే యూని వర్సిటి గ్రాంట్స్ కమీషన్ మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లాబరేటరి నిర్మించటానికి గ్రాంట్ మంజూరు చేసింది .అప్పటికి భారత దేశం సాంకేతిక ,పారిశ్రామిక అభి వృద్ధిలో కాలు మోపి నెమ్మదిగా అడుగులు కదుల్చుతోంది .మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్ నిర్మాణానికి కావలసిన విడిభాగాలన్నీ ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవాలి .ఆప్టికల్ ,ఇన్ఫ్రా రెడ్ పరికరాలు లాగా మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్లు మనకు కావలసినన్ని దొరకవు .విడిభాగాలు తెప్పించి సమకూర్చుకుని లాబరేటరి లో నిర్మించు కోవాల్సిందే .వీరు ఎక్కువ భాగం డ్యూక్ యూని వర్సిటీ నుంచి తెప్పించుకున్నారు .వేవ్ గైడ్ కంపో నెంట్స్ వంటికి ఇండియాలోనే సమకూర్చుకున్నారు .ఒక్క ఏడాదిలోనే భారత దేశం లో మొట్టమొదటి మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లాబ రేటరి సిద్ధం చేసే శారు .ఇండియాలో ఇది అపూర్వ కార్య సిద్ధి ,సాఫల్య విజయం గా చరిత్ర పుటల్లో నిలిచింది .వెంకటేశ్వర్లు గారి ముందు చూపు ,దీక్ష ,తపన ,పట్టుదలతోనే ఈ అపూర్వ సృష్టి జరిగింది .ఆలీగర్ ముస్లిం యూని వర్సిటి లో వెంకటేశ్వర్లు బృందం మిధైల్ ఆల్కహాల్ ,మిధైల్ ఎమైన్ వంటి ముఖ్య మైన మాలిక్యూల్స్ ల మైక్రో వేవ్ స్పెక్ట్రా లను అన్వేషింఛి ,విజయ వంతంగా ఆవిష్కరించారు .ఇది’’ వన్ మోర్ ఫెదర్ ఇన్ హిజ్ కాప్’’ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-17 –ఉయ్యూరు

