కేసీఆర్ సభలు 

కేసీఆర్ సభలు

ఈ మధ్య హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ”పేరిట జరిగిన సభలు కేసి ఆర్ సభలై ముక్కున వేలేసుకొనేట్లు చేశాయి . ఎవరు అధికారం లో ఉన్నా ,తానూ అధికారం లో ఉన్నా ,లేకపోయినా తెలుగు అంటే ,తెలుగు సంస్కృతీ అంటే  వీరాభిమానం అంకిత భావం తో మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఎన్నో తెలుగు సభలు రాష్ట్రం లో దేశం లో మలేసియా వంటి విదేశాలలో ఘనంగా నిర్వహించారు . ఆయనను ఆహ్వానించకుండా జరిపిన తెలుగు సభలు సభలు అని జరిపిన  సభలు తెలుగు సభలు అనిపించుకు౦టాయా ?శ్రీ మండలి ఆధ్వర్యం లో కృష్ణా జిల్లా రచయితల సంఘం మూడు ప్రపంచ సభలను నభూతో గా నిర్వహించింది .దేనిలోనూ ప్రాంతీయ దురభిమానం ఉన్నట్లు ఎవరూ అనలేదు .పైపెచ్చు అందరికీ,అన్ని ప్రాంతాలకీ  సమాన గౌరవం ఇచ్చినట్లు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు .సమయ పాలనా, వైవిధ్యంలతో ఆ సభలు వన్నె కెక్కాయి .రిఫరెన్స్ గ్రంథాలన్నట్లుగా  ఆ సభల్లో ఆవిష్కరింపబడిన  పుస్తకాలు అత్యంత నాణ్యమైనవి అని అందరూ ప్రశంసించారు .ఈ సభల వెనుక శ్రీ బుద్ధ ప్రసాద్ బుద్ధి చాతుర్యం ఉంటె ,స్థిర సంకల్పం తో రాత్రిం బవళ్ళు కష్టించి  ఎవరికీ ఎక్కడా విసుగు అనిపించకుండా కార్యక్రమాలను తీర్చి దిద్దిన ఘనత కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్య దర్శులైన శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా జి వి పూర్ణచంద్ గార్లది .ఈ జంట ను ఆహ్వానించని సభలు తెలుగు సభలా ?

   రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన  ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులైన శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారిని ,శ్రీ చలపాక ప్రకాష్ గారినీ పిలవని సభలు ప్రాంతీయ సభలే కాదా ? మనకు అవమానం జరిగిందని వీరు బాధపడలేదా ?తెలంగాణా వారికి ప్రతినిధి  రుసుము ౩౦౦ రూపాలు ,ఆంధ్రా వారికైతే 500రూపాయలు పెట్టటం లో తెలుగు వారిలో  వివక్షత చూపటం కాదా ?గడువు తేదీకి ముందు రోజు వియవాడలో సామల వారు మీటింగ్ పెట్టటం దేనికి సంకేతమో ?అన్నిటినీ కడిగి పారేసే ఆయన దృష్టికి ఇవన్నీ కనపడలేదా ? వీటన్నిటికీ మించి సాటి తెలుగు ముఖ్య మంత్రిని ఏదో ఎవరో ఎక్కడో తప్పు చేశారని ఆహ్వానించకపోవటం తెలుగు అన్న గుండెపై గుద్దటం కాదా ? ప్రాంతం విడిపోయినంతమాత్రాన భాషా గౌరవం మారుతుందా ? మద్రాసీలు అని పించుకునే తెలుగు వారికి ఆత్మ గౌరవం కలిగించిన శ్రీ నందమూరి పేరు ఎత్తకపోవటం ఏం తెలియ జేస్తుంది ?

     ఇవన్నీ సరే వదిలేద్దాం –మొదటి ప్రపంచ మహాసభల ఆలోచన చేసి ఆచరణలో అద్వితీయంగా నిర్వహించిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారిని స్మరించకపోవటం తెలుగు సభలకు కీర్తియా ?

ఇదికాక ప్రతి ఏడాది తెలుగు సభలు జరుపుతాననటం విడ్డూరం కాదా? అలా చేస్తే అవే కవి సమ్మేళనాలు ,అవే భువన విజయాలు ,వారే పాత్ర దారులు ,కప్పిన వారికే శాలువాలు కప్పటాలు అవవా ?వైవిధ్యం ,చలన శీలత లేకుంటే సభలు  రాణిస్తాయా?ప్రతిభ గుర్తించి గౌరవించి ,జీవన భ్రుతి లేనివారికి కల్పించటం లో సభలు సార్ధకం అవుతాయి .విశాల దృక్పధం లో జరిగే సభలు మరింత విశాల భావాలకు ఆలవాలౌతాయి .ఇదే సంకుచిత దృష్టిలో ఎన్ని సభలు పెట్టినా వచ్చేది మిగిలేది సంకుచిత తత్వమే .

 మన ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదని ,,తనకు ఆహ్వానం వచ్చినా వెళ్ళని శ్రీ గరికపాటిని,తాను తెలంగాణా తెలుగు  గ్రంథాలెన్ని రాసినా  గుర్తి౦చనందుకు పత్రికా ముఖంగా ధైర్యంగా బాధ వ్యక్తం చేసిన శ్రీ జొన్న విత్తుల వారినీ అభినందిస్తునాను .ఇవన్నీ మనకెందుకు ,మనల్ని పిలిచారు ,వెళ్లి శాలువా కప్పుకొందాం అని వెళ్ళిన వారినీ మనసార అభినందిస్తున్నాను .వారు సంకుచిత పరిధి దాటి ఉంటారన్న నమ్మకం తో .

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-17- ఉయ్యూరు   

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.