గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 )

సంస్కృత ,హిందీలలో పిహెచ్ డి,ఎమిరితాస్ ప్రొఫెసర్ సత్యదేవ చౌదరి 1921 మే 21 పుట్టాడు 30 పుస్తకాలు రాశాడు .ముఖ్యమైనవి భారతీయ కావ్య శాస్త్ర ,సంక్షిప్త మహాభారత ,రుగ్వేదీయ సంవాద సూక్త .న్యు ఢిల్లీ వాణీ న్యాయ స సంస్థ డైరెక్టర్ .,జర్మని యూని వర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ .పంజాబ్ ,యుపి ప్రభుత్వ పురస్కార గ్రహీత .ఢిల్లీ సంస్కృత, హిందీ అకాడెమీ ,ప్రెసిడెంట్ అవార్డ్ గ్రహీత .

237-దేవతాత్మా  హిమాలయ కర్త –అశోక్ కుమార్ దర్బాల్ (1943)

14-4-1943 గడ్వాల్ లో పుట్టిన అశోక్ కుమార్ దర్బాల్ సంస్కృత ,హిందీ పిహెచ్ డి,సాహిత్య రత్న .సంస్కృత ప్రొఫెసర్ .దేవతాత్మా హిమాలయః ,దుక్షతే హా ధరిత్రి ,దయాద్యం ,దుదుక్ష ,అథా ఇతి వగైరా 7 రాశాడు .

238-కీర్తి విలాసం కర్త –సదా నంద దర్బాల్ –(1877-19 50  )

పాండిచ్చేరిలో 1877 లో ఉత్తరాఖండ్ లో పుట్టిన సదాన౦ద దర్బాల్ తమిళ సంస్కృత పండితుడు .నారాయణీయం మహాకావ్యం ,కీర్తి విలాసం ,దివ్య చరితం ,రాసవి లాసంరాశాడు .సిద్ధకవి. 1950 లో మరణించాడు .

239-ఉత్తర ప్రశస్తి కర్త – హరి శాస్త్రిదధీచి  (1893-1970 ) )

18-4-1893 జైపూర్ లో పుట్టిన దధీచి హరిశాస్త్రి వేద ,తంత్ర ,సాహిత్యాచార్యుడు .సంస్కృత లెక్చరర్ .గురుపరంపర –లక్ష్మీరాం స్వామి ,చంద్ర దత్త ఓజా ,పండిట్ బిహారీలాల్ శాస్త్రి .శిష్యపరంపర –విజయకుమార్ ,రాజ కుమార్ .12 పుస్తకాలు రాశాడు .ముఖ్యమైనవి –ఉదార ప్రశస్తి ,వాణీ లహరి ,లలితా సహస్ర కావ్యం ,77 వ ఏట 1970 లో మరణం .సంస్కృత భారతి పత్రిక సంపాదకుడు .ఆశుకవి ,కవి భూషణ బిరుదులు .ఆయుర్వేద భూషణ బిరుదు ఆయుర్వేద అనుషేలన్ సమితి ,జైపూర్ నుండి అందుకున్నాడు .ఆమ్నాయ దురంధరుడు ,సాహిత్య మహా మహోపాధ్యాయ బిరుదులకు సార్ధకత చేకూర్చిన విద్వత్కవి పండితుడు .

24 0-మాధవ స్వాతంత్రం కర్త – నా౦గల్య గోపీనాద్ దధీచి (19వ శతాబ్దం )

సాహిత్య ,న్యాయ ,మీమాంస ఆచార్యుడు .జైపూర్ నాన్గాల్య లో19 శతాబ్ది లో పుట్టాడు .జైపూర్ సంస్కృత కాలేజి లెక్చరర్ .29 గ్రంధాలు రాశాడు –వాటిలో ఆనంద నందన కావ్యం,మాధవ స్వాతంత్రం ,తర్కారికా ,సంతోష పంచాశికా ,కృష్ణరాయ సప్త శతి ఉన్నాయి

241- రామ కదా కల్ప లత మహా కావ్య  కర్త –నిత్యానంద శాస్త్రి దధీచి (18 8 9 -19 61 )

18 8 9 రాజస్థాన్ జోద్ పూర్ లో జన్మించిన నిత్యానంద శాస్త్రి దధీచి 20 వ శతాబ్దపు ప్రముఖ కవి .రామ కదా కల్పలతమహా  కావ్యం ,శ్రీదదీచి చరిత ,శ్రీరామ చరితాబ్ది రత్నం ,శ్రీ హనుమద్దూతం ,లఘు చందోలంకార దర్పణం మున్నగు నవి రాశాడు .19 61 లో 72 వ ఏట చనిపోయాడు .వ్యాకరణ ,కావ్య ,సాహిత్య ,ఛందో ,హిందీ చిత్రకవిత్వాలలో అసమాన ప్రవీణుడు

24 2- ఆధునిక సాహిత్యేతిహాసం కర్త –రాం కుమార్ దధీచి (1959 )

7-9-1959 రాజస్తాన్ సికార్ లో పుట్టిన రాం కుమార్ దధీచి అజ్మీర్ సంస్కృత కాలేజి ప్రోఫెసార్ ,ప్రిన్సిపాల్ .ఆధునిక  సంస్కృతేతి హాసం ,ప్రాచీన భారతస్య సాహిత్య సంస్కృతీ కాశ్చేతి హాస ,అలంకార శాస్త్రేతిహాస ,కావ్యాలంకార సూత్రకి వ్యాఖ్యాయ మొదలైనవి రచించాడు

243- రస రత్న ప్రదీపిక కర్త –రామచంద్ర నారాయణ దండేకర్  (19 09 )

రామ చంద్ర నారాయణ దండేకర్ 17-3-1909 మహారాష్ట్ర సతారాలో పుట్టాడు .సంస్కృత ఎం ఏ ,ఎన్శేంట్ ఇండియన్ కల్చర్ లో పిహెచ్ డి.ఇండాలజిస్ట్ స్కాలర్ ,నేషనల్ రిసెర్చ్ రోఫేసర్ .30 పుస్తకాలు రాశాడు .వేదిక్ మైధలాజికల్ త్రాక్త్స్ ,5 భాగాల వేదిక్ బిబ్లియాగ్రఫీ ,2 భాగాల శ్రౌత కోశం ,జ్ఞాన దీపిక ,రసరత్న ప్రదీపికలు ముఖ్యమైనవి .పద్మభూషణ పురస్కారం 1962 లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం నుండి వాచస్పతి బిరుదు ,బెనారస్ హిందూ యూని వర్సిటినుండి గౌరవ డాక్టరేట్ ,శంకరదేవ ,విశ్వభారతి అవార్డ్ లు రాష్ట్ర భూషణ ,లోకమాన్య తిలక్ సమ్మాన్ పురస్కారాలు అందుకున్న మహా విద్యా వేత్త పండితుడు కవి .

245-జైన ధర్మ మీమాంస కర్త –లాల్ సత్యభక్త దర్బారీ (.20 వశతాబ్దం )

లాల్ సత్య భక్త దర్బారీ జైన కవి .గణేష్ ప్రసాద్ వర్ణి శిష్యుడు .జైన దర్శన ,జైన ధర్మ మీమాంస రాశాడు .సత్య దర్శన పత్రిక  స్థాపించాడు .

246-సంస్కృత సాహిత్య మంజూష కర్త –దేవ కుమార్ దాస్ –(194 7 )

 వెస్ట్ బెంగాల్  మిడ్నపూర్ లో 15-9–1947పుట్టిన దేవ కుమార్ దాస్  ఘటాల్ రాష్ట్రీయ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .11 పుస్తకాలు రాశాడు –సంస్కృత వైచిత్ర్య  ,నైషద చరితే దర్శనం ,సంస్కృత సాహిత్య లోకః ,సంస్కృత సాహిత్య మంజూష .ఉత్తరరామ చరితానికి సంపాదకత్వం చేశాడు

247- యవన భారతీయ కర్త –ఇంద్రమణి దాస్ (1950 )

1950 ఫిబ్రవరి 1 బీహార్ లో పుట్టిన ఇంద్రమణి దాస్ జ్యోతిష ఆచార్యుడు .జమ్మూ కాంపస్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .యవన భారతీయ సిద్ధాంత జ్యోతిష యో స్తులనాత్మక మనుశీలనం అనే ఏకైక కృతి రాశాడు .

248- న్యాయ ప్రదీప కర్త –అచ్యుతానంద దాస్ (19 60 )

సంస్కృత ,పాళీ ఎం ఏ పిహెచ్ డిఅచ్యుతానంద దాశ్ శాస్త్రి డిగ్రీ హోల్డర్ .20-5-1960 ఒరిస్సా లో పుట్టాడు .సాగర్ హెచ్ ఎస్ గౌర్ యూని  వర్సిటి ప్రొఫెసర్ .రాసిన 19 పుస్తకాలు రాశాడు . న్యాయ ప్రదీప  రచించి ,వ్యుత్పత్తివాదం ,ఆత్మతత్వ వివేకం ఆత్మజ్ఞాన భక్తియోగంలను తన సంపాదకత్వం లో తెచ్చాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ .సంస్కృత విజ్ఞాన సర్వస్వ నిఘంటువుకు సహాయ  సంపాదకుడు .మంగోలియా ,పారిస్ సంస్కృత విద్యాలయాల చైర్ పర్సన్ .రిఫ్లెక్షన్స్ ఆన్ కారక రాశాడు .సరస్వతి వరద పుత్ర ,ఒరిస్సా సంస్కృత అకాడెమి అవార్డ్ అందుకున్నాడు మారిషస్ బోర్డ్ ఆఫ్ రైటర్స్ చైర్మన్ .

249-సీతాలస్రత్న కర్త –చంద్ర కేశవ్ దాస్(1955 )

ఎం ఏ పిహెచ్ డి చంద్ర కేశవ దాస్,  ఆచార్య,జర్మన్ ,ఫ్రెంచ్ భాషలలో డిప్లోమో హోల్డర్ .6-3-1955 కటక్ లో  జననం . పూరీ జగన్నాద సంస్కృత విశ్వ విద్యాలయ దర్శన శాఖాధ్యక్షుడు .40 గ్రంధాలు రాశాడు . సీతాలస్రత్న,నికాస ,రత్నం ,అంజలి ,విసర్గ అందులో విశేషమైనవి .వాణీ సాహిత్య సంసద్ సమ్మాన్ ,ఢిల్లీ సంస్కృత  అకాడెమి నుండి తంత్ర సరస్వతి అవార్డ్ ,శంకర పురస్కారం వగైరాలు పొందాడు .

250-అర్ణ యశస్యం కర్త –క్షిరోద్ చంద్ర దాష్ (1954 )

26-4-19 54 ఒరిస్సా కటక్ లో పుట్టిన క్షిరోద్ చంద్ర దాష్ ఎం ఏ పి హెచ్ డి.పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయ అసిస్టెంట్  ప్రొఫెసర్ .తారుణ్య శతకం ,చిలికా , అర్ణ యశస్యం,రమాకాంత కావ్యసంచయనం రాశాడు .ఒరిస్సా ,ఢిల్లీ సాహిత్య అకాడెమి పురస్కారాలతోపాటు అనువాద పురస్కారం ,జైమంత్ మిశ్రా అవార్డ్ లు అందుకున్నాడు .

 236-నుండి 250వరకు ఆధారం –Inventory of Sanskrit Scholors

 సశేషం  

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-18-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.