దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -8
1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847)
త్యాగరాజ శిష్య పరంపర -6
61-ఎం.వెంకటరామ జోషి (1858-1924)
బొమ్మలాట ప్రదర్శన,చంద్రమతి వేషం లో ప్రసిద్ధుడు .నాట్యం ఫిడేల్ స్వరబత్,కంజీరా ,మృదంగం సితార్ ,వీణలలో దిట్ట .మంచి హరికథకుడు .పీతాంబర్, గారడీ ఆయుర్వేదం రసవాదం లలో ప్రవీణుడైన ఏక సంధగ్రాహి .శిష్యుడు నల్లూరి నారాయణ .
62-మువ్వలూరి సభాపతి
త్యాగయ్యగారి సమకాలికుడు .మానంబు చావడి శిష్యుడు భరత శాస్త్ర ప్రవీణుడు .ఇతనిభక్తి శృంగార పదాలను నేటి నట్టువరులు పాడుతున్నారు .వీటిని మన్నారు గుడి రాజగోపాల స్వామికి అ౦కిత మివ్వటం చేత ‘’రాజగోపాల ముద్ర ‘’ఉంటుంది .కొన్ని చరిత్ర నిరుపానాలు రాశాడు .సీతాకల్యాణం లో వానప్రస్థఘట్టం జాలి గొలుపుతుంది .
హరికథా ప్రవీణులు
63-సూత్రం నారాయణ శాస్త్రి (1849-1909)
గాన, తర్క శాస్త్ర ,హరికథ కోవిదుడు .సంస్కృతంలో ‘’ఘటికాచల మాహాత్మ్యం ‘’రాశాడు .హా థీ రాం బాబా ,మార్కండేయ, చంద్ర హాస హరికధలు రాసిన అష్టావధాని .
64-రాధా కృష్ణ శాస్త్రి (1858-1907
సంస్కృతపండితుడు ,కవి హరికధలు చాలారాసి వాటిలో గీర్వాణ ద్రావిడ ,మణిప్రవాళ భాషాకీర్తనలు జోడించాడు .దివాన్ శేష శాస్త్రి చే సన్మానితుడు.
65-గోవింద స్వామి భాగవతార్ (1861-1921)
తంజాపురి కృష్ణభాగవతార్ శిష్యుడై 18ఏళ్ళు కథలు నేర్చాడు .తెలుగు, అరవ,కన్నడ, మరాటీ భాషలలోని గీతాలు చేర్చి మిశ్రకథాగానం చేసేవాడు .పురాణహరికథలలో మేటి .వేంకటేశ మీనాక్షి కళ్యాణాలు, లవకుశ, గౌరీ చరిత్ర హరికథలు రాశాడు .గాయక ,ఫిడలర్ . ఉదయార్పురం ఆస్థానగాయకుడు .త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభించినవారిలో ప్రథముడు .శిష్యులు –మనుమడు ఆత్మనాద భాగవతార్, నారాయణ భాగవతార్ ,రామసామి కన్నయ్య నాయుడు .
వీరి తర్వాత త్యాగరాజస్వామి సమకాలిక దాక్షిణాత్య సంగీత తపస్సంపన్నుల గురించి తెలుసుకొందాం .
.ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
మీ- గబ్బిట-దుర్గాప్రసాద్ -3-1-20-ఉయ్యూరు
—

