కేరళ పాణిని-రాజరాజ వర్మ -3
ఉపాధ్యాయుడు -పరిశోధకుడు
రాజ వంశ సంబంధాలు రాజరాజ వర్మను సంపన్నుడిని చేయలేదుకానీ అవసరాలు తీరాయి .మేనమామ సహాయం ఎలానూ ఉండనే ఉంది .స్వంతకాళ్ళ మీద నిలబడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లో చేరాలనుకొన్నాడు కానీ రాజ వంశాస్తులు ప్రభుత్వ ఉద్యోగం చేయటం ఆచారం కాదు.దీన్ని లక్ష్య పెట్టలేదు .తిరువనంతపురం లో సంస్కృత పాఠశాల పెట్టాలని ప్రభుత్వం భావించింది .దీనికి సమర్ధుడు వర్మ అని తెలిసినా ,చిన్నవాడు అని భావించారు .కానీ 1890లో రాజరాజ వరమనే ప్రధానోపాధ్యాయునిగా ప్రభుత్వం నియమించింది .సిలబస్ కానీ ,పాఠ్యపుస్తక ప్రచురణ కాని లేదు .వీటి నన్నిటిని తన ప్రతిభతో రూపొందించి ,మార్గ నిర్దేశనం చేసి పాఠశాల నిర్వహి౦చి గాడిలో పెట్టాడు .విద్యాలయం స్థాయీ ప్రమాణం పెంచాడు .బ్రాహ్మణేతరులకు కూడా ఇక్కడ చదువుకొనే అవకాశం కల్పింఛి మార్గ దర్శి అయ్యాడు .తిరువనంతపురం లోనే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు .సంస్కృతం ఎం ఎ కు అప్లికేషన్ పెట్టుకొన్నాడు .గుర్రపుస్వారీ ,చదరంగం ,పేకాట యధా విధిగా సాగటం వలన చదువు కుంటుపడింది .లఘు సిద్ధాంత వ్యాసం రాయాలి దానికోసం.అందుకు ‘’నారాయణ భట్టు -కృతులు ‘’అంశాన్ని ఎంపిక చేసుకొన్నాడు .ఇందులో సాయం చేసే ప్రజ్ఞకల పండితులేవరూ లేరు కనుక స్వయంగా అన్నీ వర్మ చూసుకొన్నాడు .ఇండియన్ యాన్టిక్వేరి వంటి పత్రికలన్నీ తిరగేసి నోట్స్ రాసుకొన్నాడు .1891లో పరేక్షరాసి విశ్వ విద్యాలయం లో ప్రధమ స్థానం సంపాదించినా ,సెకండ్ క్లాస్ లో పాసయ్యాడు .ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ రావటం అతి దుర్లభంగా ఉండేది .ముఖ్య పరీక్షాధికారి శేష గిరి శాస్త్రి కి వర్మ రాసిన సమాధానాలు విశేషంగా నచ్చి ,ఆ జవాబుపత్రాలను భద్రపరచావలసినదిగాఅధికార్లను ఆదేశించాడు .గ్రీకు భాష నుంచి సంస్కృతం గ్రహించిన 12పదాలు రాయమని ప్రశ్న ఉంటె వర్మ 30పదాలురాసి అవాక్కయ్యేట్లు చేశాడు .అనువాదానికి ఇచ్చిన మిల్టన్ కవి ఆంగ్ల పద్యాన్ని సంస్కృతం లో చక్కని కవిత్వంగా అనువదించాడు వర్మ .సంస్కృతం లో ప్రావీ ణ్యతకు ఇచ్చే ‘’రాస్ బంగారుపతకం ‘’,మునిస్వామి శెట్టి పతకాలను రాజరాజ వర్మ పొందాడు .
సంస్కృత కళాశాల ఉద్యోగం
1894లో వర్మ సంస్కృత కళాశాల ప్రధాన ఆచార్యుడయ్యాడు .కళాశాల విస్త్రుతాభి వృద్ధికి శక్తినంతా ధారపోసి పనిచేశాడు .పాఠ్య ప్రణాళికలో సాహిత్యం ,ఆయుర్వేదం జ్యోతిషం లను చేర్చమని ప్రభుత్వానికి సూచన చేశాడు .జాతీయ కళలకు ,విజ్ఞాన శాస్త్రానికి వాజ్మయానికి ప్రాధాన్యత నివ్వటం ఆయన లక్ష్యం .ఖగోళశాస్త్రం బీజగణితం ,చరిత్ర, త్రికోణమితి పాఠ్య ప్రణాళికలో చేర్చిన క్రాంత దర్శి వర్మ .ఆల్జీబ్రా, ట్రిగనామెట్రి స్వయంగా బోధించేవాడు. వీటి ఆంగ్ల పాఠ్య గ్రంథాలను సంస్కృతం లోకి అనువాదం కూడా చేసిన నేర్పరి .ఆ కాలం లో ఆంగ్లేయులైన ఆచార్యుల ,వారి అనుయాయుల అభిప్రాయాలకే విలువ నిచ్చేవారు .కానీ రాజరాజ వర్మ అభిప్రాయాలు ఆతర్వాత ఇరవై అయిదేళ్లకు అమలుపర్చబడినాయని చరిత్ర చెబుతోంది .అంతటి విలువైన సూచనలు అభిప్రాయాలు ఆయన చెప్పాడన్నమాట .ఆంగ్లం ,సంస్కృతం లలో తనకున్న అపూర్వ ప్రజ్ఞను తన రచనల్లో నిక్షిప్తం చేసి తన సహాధ్యాయులైనఇద్దరు శాస్త్రులకు వాటిలో నిష్ణాతుల్ని చేశాడు .వీరిలో గణపతి శాస్త్రి కావ్య పరిష్కర్తగా ,పత్రికా సంపాదకుడుగా ప్రసిద్ధికెక్కాడు .విద్యారంగం లో తన స్థాన్నాని ఎలా పదిల పరచుకున్నదీ ,పై అధికారుల వేధింపులు ఎలా ఉండేవి అనే విషయాలను తన డైరీలో రాసుకొన్నాడు వర్మ .ఆరోజుల్లో మళయాళం వంటి ప్రాంతీయ భాషలను చులకనగా చూసేవారు వాటిలో ఏముంది నేర్చుకోవటానికి అని ప్రశ్నించేవారు .మళయాళ భాషకూ గొప్ప భవిష్యత్తు ఉందని వర్మ ఊహించాడు .అది మార్గ దర్శనం చేస్తుందనే సత్యాన్ని తనజీవితంలోనే తర్వాత కాలం లోచూశాడు
దేశభాషల అధ్యయన పర్యవేక్షకుడు
1896-1898మధ్యకాలం లో ఆయుర్వేద సంస్థాకారి బాధ్యతల్నీ ,కళాశాల ప్రధాన ఆచార్య అంటే ప్రిన్సిపాల్ బాధ్యతల్నీ ఒక్కరే నిర్వహించాలి అన్నదాన్ని ప్రభుత్వం తిరస్కరించి ,పురావస్తు శాఖాధికారి పదవి ఖాళీ అయితే ,ప్రిన్సిపాల్ ఒక్కరే దాన్నినిర్వహించగల సమర్ధుడు అనేదాన్నికూడా తోసిపుచ్చింది .అప్పటికే రాజరాజవర్మ కీర్తి దక్షిణ దేశమంతా విస్తృతంగా వ్యాపించింది .మహారాజా కాలేజిలో దేశభాషల అధ్యయన పర్యవేక్షకుడు గా వర్మ1899లో నియుక్తుడయ్యాడు . ఉన్నత విద్యలలో భారతీయ భాషలకు తగిన ప్రాతినిధ్యం లేదని గ్రహించాడు . పాఠ్యగ్రంథాలుకూడా నిర్డుష్టంగాలేవని తెలుసుకొన్నాడు .మేలురకాలైన పుస్తకాలు ఎంపిక చేసి ,కొత్తపుస్తకాలు రాయించి ,పాఠ్య ప్రణాళికలో సవరణలు చేయించాడు వర్మ .ఎఫ్ ఎ .బి.ఏ క్లాసులకు అనేక పాఠాలు తానె బోధించేవాడు .అవసరానికి తగిన ఛందో వ్యాకరణ,అలంకార గ్రంథాలు తానె రాశాడు .విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం లో లెక్చరర్లకు మార్గదర్శిగా ఉండేవాడు .ఆయన ప్రియతమ శిష్యులు పంచణ్ణన్,పీకే నారాయణ పిళ్లే లు తర్వాత సహాధ్యాపకులయ్యారు .
భారతీయ భాషోద్ధారకుడు
విశ్వ విద్యాలయాలలో ఇంగ్లీష్ మొదటిస్థానం దేశీయభాషలకు రెండవ స్థానం ఉండేది .దీనిపై విద్యార్ధులు ఆందోళన చేశారు .వర్మకాలం లో మలయాళానికి ప్రాముఖ్యత లభించింది .విద్యా వేత్తగా ,ప్రణాళికా రచయితగా, క్రాంత దర్శిగా అధ్యాపకుడిగా రాజరాజ వర్మ అందరికంటే ముందున్నాడు .మళయాళ భాషా బోధనలో ఉత్తమ ఉపాధ్యాయడని పించుకొన్నాడు .చివరి 25ఏళ్లకాలం లో అధికం గా మళయాళ రచనలే చేశాడు వర్మ .ఇంగ్లాండ్ హిస్టరీ, ధాకరే స్కాట్ల నవలలు ,స్కోపెన్ హార్ రచించిన ‘’విజ్డం ఆఫ్ లైఫ్ పుస్తకాలు ఆయన చదివినట్లు ఆయన డైరీలు చెబుతున్నాయి .’’కేరళపాణినీయం’’అనే వ్యాకరణ గ్రంథాన్ని రాయటానికి మహాకవి కుంజీ కుట్టు తంపురాన్ కు చూపించి అభిప్రాయం తీసుకొన్నాడు .అందుకే రాజరాజవర్మను ‘’ కేరళ పాణిని ‘’అన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-8-21-కాంప్ -మల్లం పేట (బాచుపల్లి )-హైదరాబాద్
వీక్షకులు
- 1,119,842 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
