సరసభారతి 185వ కార్యక్రమం గా శ్రీ కోట గురు వరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదాన కార్యక్రమం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
‘’అక్షరం లోక రక్షకం ‘’
సరస భారతి 185 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం ,మరియు ఉయ్యూరు దగ్గర కనకవల్లి గ్రామం లో జన్మించి ,విశాఖ పట్నం కార్యస్థానంగా బహు సాహిత్య సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన సంఘ సంస్కర్త బహు గ్రంథ కర్త ‘’కవిగారు’’గా ప్రసిద్ధి చెందిన బ్రహ్మశ్రీ మారేపల్లి రామ చంద్ర శాస్త్రి (1874-1951)గారిని వారి 74వ వర్ధంతి సందర్భంగా ఈ తరానికి పరిచయం చేసే కార్యక్రమం శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో సాయంత్రం 6-30 గం .లకు జరుగుతుంది.
సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు
సరస భారతి 185వ కార్యక్రమంగా, శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-24 గురువారం మా గురు వరేణ్యులు శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం నిర్వహిస్తున్నాము .
.. 2024 మార్చి లో లో పదవతరగతి పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦ శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-24 గురువారం మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC ,ఒక BC ,ఒక విదార్ధిని కి అంద జేయబడుతుంది .
కనకవల్లి గ్రామం లో ఉంటూ ఈ సంవత్సరం మార్చి పదవతరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభ గల విద్యార్ధి విద్యార్ధిని లకు ‘’కవిగారు ‘’పేరిట స్మారక నగదు పురస్కారం ,మరియు కనకవల్లి గ్రామ వాసులు , అనుభవమున్న పెద్దలకు ‘’కవిగారు’’పేరిట స్మారక పురస్కారం సరసభారతి అంద జేస్తుంది .
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం జరుగుతుంది .
సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
సభాధ్యక్షులు,కవిగారు బ్రహ్మశ్రీ మారేపల్లి వారి పరిచయం –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .
కార్యక్రమ వివరం
శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ శ్రీ కవిగారు బ్రహ్మశ్రీ మారేపల్లి శ్రీ రామ చంద్రశాస్త్రి గార్ల చిత్ర పటాలకు పుష్పమాలాలంకరణం
1- శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన – శ్రీ కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –
ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం హైస్కూల్ లో చదివి 2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 542/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి , ఇంటర్ చదువుతున్న –
చిర౦జీవి జొన్నవిత్తుల క్రాంతి నాథ్ కు రూ-10,116 (పది వేల నూట పదహారు రూపాయలు )
2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
ఉయ్యూరు ఫ్లోరా హైస్కూల్ లోచదివి 2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 577/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ చదువుతున్న
కుమారి లంకా నాగ వెంకట అమృత వర్షిణి – కు రూ-10,116 (పది వేలనూట పదహారు రూపాయలు )
3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన
కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి
ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం హై స్కూ ల్ లో చదివి ,2024పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 567/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ చదువుతున్న
చిరంజీవి డి.కౌశల్ కు – రూ -3000- (మూడు వేల రూపాయలు )
4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం -BC విద్యార్ధినికి
ఉయ్యూరు ఫ్లోరా హైస్కూల్ లో చదివి ,2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 589/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఇంటర్ చదువుతున్న
కుమారి షేక్ రోఖియా కు- రూ -3000- (మూడు వేల రూపాయలు -)
-సరస భారతి ప్రత్యేక బహుమతులు
1-ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లొ చదివి 2024పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో588/600 మార్కులు సాధించి,ఇంటర్ చదువుతున్న s.c.విద్యార్ధిని
కుమారి తుమ్మల అఖిల కు రూ -3000- (మూడు వేల రూపాయలు) – శ్రీ గబ్బిట రామనాధ బాబు అందజేస్తున్నారు .
2- ఉయ్యూరు ఫ్లోరా హైస్కూల్ లో చదివి ,2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో593/600 మార్కులు సాధించి,ఇంటర్ చదువుతున్న s.c.విద్యార్ధిని
కుమారి కొమ్ము హాసిని కి రూ-3000 (మూడు వేల రూపాయలు ) శ్రీ గబ్బిట రామనాధ బాబు అందజేస్తున్నారు
3-ఉయ్యూరు అమరవాణి హై స్కూల్ లో చదివి ,2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో570/600 మార్కులు సాధించి,ఇంటర్ చదువుతున్నB.C.విద్యార్ధిని
కుమారి కె.దుర్గా మాధవి కి రూ- (3000)మూడు వేల రూపాయలు
4- ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం హై స్కూ ల్ లో చదివి ,2024పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 576/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ చదువుతున్నB.C.విద్యార్ధి
చిరంజీవి –రెహ్మాన్ ఖాన్ కు రూ-3000(మూడు వేల రూపాయలు )
కవిగారు బ్రహ్మశ్రీ మారేపల్లి రామ చంద్ర శాస్త్రి గారి స్మారక నగదు పురస్కార ప్రదానం
కవిగారు జన్మించిన కనకవల్లి గ్రామం లో జన్మించి పెనమకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదివి ,2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలోఅత్యుత్తమ మార్కులు సాధించి ఉత్తీర్ణు లైన విద్యార్ధినులకు సరసభారతి అందిస్తున్న కవిగారు బ్రహ్మశ్రీ మారేపల్లి రామ చంద్ర శాస్త్రి గారి స్మారక నగదు పురస్కార ప్రదానం
1-కుమారి వి. డి.ఎస్.నాగేశ్వరి -478/600 కు రూ-3000(మూడు వేల రూపాయలు )
2-కుమారి వై.హేమశ్రీ -431/600 కు రూ-3000 (మూడు వేల రూపాయలు )
సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సన్మానం
1- శ్రీ తాటి బండ్ల చంద్ర శేఖర శర్మ –రిటైర్డ్ సైన్స్ టీచర్
2- శ్రీ చింతలపాటి రామ కృష్ణ –రిటైర్ద్ సైన్స్ టీచర్
కవిగారు బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి స్మారక సాహితీ పురస్కార ప్రదానం
శ్రీ అయాచితుల త్రినాథ శర్మ –రిటైర్ద్ టీచర్ –కనకవల్లి
ఉపాధ్యాయ దినోత్సవ మరియు , శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
19-8-24 –ఉయ్యూరు.
