మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78
78-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం ,నిర్మాత దర్శకుడు ,కవి సింహం –మహారధి -2
మహారధి గురించి కొడుకు చిట్టిబాబు అనే వరప్రసాద్ చెప్పిన విషయాలు
నా శవం ఐస్‌ పెట్టెలో పెట్టొద్దని లెటర్‌ రాశాడు
మహారథి… దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు…
బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి వచ్చారు…
ఎంతో పోరాటం చేసి సినీ రచయితగా నిలిచారు…
రణభేరి, బందిపోటు, పెత్తందార్లు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు.. వంటి అనేక చిత్రాలకు పదునైన లయబద్ధమైన మాటలు రచించి కొత్త పంథాను సృష్టించారు..
క్రమశిక్షణ, నిజాయితీ, నిక్కచ్చితనం వల్ల సినీ పెద్దలకు దూరమయ్యారు..
తను కలలు కన్న అల్లూరి సీతారామరాజు కోసం అడవులకు వెళ్లారు…
ఆదర్శ జీవితాన్ని గడిపారు.. పిల్లలకు అదే నేర్పారు..
నాన్న కృష్ణాజిల్లా పసుమర్రులో పుట్టారు. నాయనమ్మ పుణ్యవతి. తాతయ్య సత్యనారాయణ పసుమర్రు మునసబు. ఆయనకు రైస్‌ మిల్లులు ఉండేవి. నాన్నగారికి ఒక అక్క ధనలక్ష్మి, ఇద్దరు చెల్లెళ్లు.. జయప్రద, రామలక్ష్మి. తాతగారి రెండో భార్యకు ధనలక్ష్మి, మూడో భార్యకు నాన్నగారు, ఇద్దరు చెల్లెళ్లు పుట్టారు. ఆ రోజుల్లో వారసుడి కోసం తపించేవారు. లేకలేక పుట్టడంతో నాన్న ఎంతో అపురూపంగా పన్నెండు మంది దాసీల మధ్య పెరిగారు. పుట్టినప్పుడే జ్యోతిష్కుడు, ‘పిల్లాడు మహావిద్యావంతుడు అవుతాడు, కాని 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నదంతా హరించుకుపోతుంది’ అని చెప్పిన జాతకం నిజమైంది. నాన్నకు 12 సంవత్సరాలు వచ్చేసరికి తాతగారికి ఉన్న 300 ఎకరాల భూమి 16 ఎకరాల కు వచ్చేసింది. ‘పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మకు’ అని వాళ్ల నాయనమ్మ చెప్పిన మాటతో 16 ఎకరాలు అమ్మేసి, ఆ డబ్బుతో నిజామాబాద్‌ ధర్మారంలో వ్యవసాయం చేసి, అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి, సన్యాసం తీసుకుని వింధ్య పర్వతాలకు వెళ్లిపోయారట. నాన్న ఏమయ్యారో తెలియక మా నాయనమ్మ దిగులుపడిపోయిందట. అక్కడ స్వామీజీలు నాన్నతో, ‘నీకు సన్యాసి యోగం లేదు, తల్లి మనసు కష్టపెట్టకు, అమ్మ దగ్గరకు వెళ్లిపో’ అనటంతో వెనక్కు వచ్చి, కాకరాల సీతారామయ్యగారి అమ్మాయి కమలను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారట.
ఎవరు చెప్పినా వినలేదు…
నాన్నగారికి మేం నలుగురు సంతానం. సత్య కిశోర్‌ (సి. ఏ), ఉషారాణి (బి.ఏ.), వరప్రసాద్‌ (చిట్టిబాబు, నేను, బి. కాం.), రాజేంద్ర అనారోగ్యం కారణ ంగా మధ్యలోనే చదువు ఆపేసి, వ్యాపారం లోకి దిగారు. మా అందరి కంటె ముందు ఒక అమ్మాయి పుట్టింది. పేరు క్రాంతి. ఆ ప్రసవం అయ్యాక అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే రామలక్ష్మి అత్త పెంచింది. నాన్నకు జ్యోతిష్యం బాగా తెలుసు. ఆవిడకు సంతాన యోగం లేదని నాన్న చెప్పారు. అత్తయ్య ఆ బిడ్డను తనకు దత్తతు ఇవ్వమని అడిగితే, ‘శ్రావణ శుక్రవారం పుట్టిన బిడ్డను దత్తతు ఇవ్వద్దు’ అని చెప్పినా వినకుండా, అమ్మకు కూడా చెప్పకుండా అత్తయ్యకు దత్తతు ఇచ్చారు.

సొంతవారే అవమానించారు…
నాన్నగారి చెల్లెళ్లకు ఐశ్వర్యం వచ్చాక నాన్నను చాలాసార్లు అవమానించారు. ఒకసారి సినిమా హాలు దగ్గర క్రాంతి (దత్తు వెళ్లిన అక్క) నాన్న పలకరిస్తే అవమానించింది. క్రాంతి అక్క పెళ్లి పత్రికలో ‘అభినందనలతో అనే చోట మన పేర్లు వేయమనండి’ అని అమ్మ చెప్పటంతో అత్తయ్యను అడిగారట నాన్న. ఇదంతా ఆస్తికోసం చేస్తున్నారంటూ నాన్నను నిందిస్తూ, నిష్ఠూరంగా మాట్లాడారట. అయినా నాన్న ప్రేమనే చూపారు. నాన్న బోళా శంకరుడు. ప్రశంసిస్తే పొంగిపోతారు.

క్రమశిక్షణ తప్పితే…
నాన్నగారి వివాహం అయ్యాక హైదరాబాద్‌ డెక్కన్‌ రేడియోలో అనౌన్సర్‌గా చేరారు. ఆ తరవాత కృష్ణా పత్రిక, తెలుగుదేశం పత్రికలకు పనిచేశారు. అప్పట్లో బాదర్‌ పేరు మీద రాసేవారు. రజాకార్‌ ఉద్యమంలో హిట్‌ లిస్ట్‌లో ఉండేవారు. కొన్నాళ్ల తరవాత అక్కడ నుంచి చెన్నై వచ్చేశారు. అప్పటికే శతకాలు రాశారు, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ‘వెల్త్‌ లాస్ట్‌ నథింగ్‌ లాస్ట్, హెల్త్‌ లాస్ట్‌ సంథింగ్‌ లాస్ట్, క్యారెక్టర్‌ లాస్ట్‌ ఎవ్రీథింగ్‌ లాస్ట్‌’ అని రాసిన బోర్డును ఇంటి గుమ్మం పైన పెట్టి, బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ప్రతిరోజూ తప్పనిసరిగా చదవమనే వారు. నియమాలు పాటించకపోతే గోడ కుర్చీలు, బెల్ట్‌ దెబ్బలు. మా స్కూల్‌కి రైల్వే గేట్‌ దాటి వెళ్లాలి. ఒకరోజు గేట్‌ ఎక్కి దూకి వెళ్లడం ట్యూషన్‌ మాస్టర్‌ చూసి, నాన్నకు చెప్పారు. నాకు ఆ రోజు బడిత పూజ. జీవితంలో మళ్లీ ఆ పని చేయలేదు.

మాట తీసుకున్నారు..
మా ముగ్గురు అన్నదమ్ముల దగ్గర, ‘మేం కట్నానికి అమ్ముడు పోము’ అని మాట తీసుకున్నారు. నా వివాహం పెళ్లి చూపులు లేకుండా జరిగింది. నాన్నగారే వెళ్లి చూసి నిశ్చయం చేశారు. అమ్మాయితో, ‘మా అబ్బాయి చూడడు, వాడు కోరుకున్నట్లుగా ఉన్నావు నువ్వు, ఒక్క పైసా కట్నం, బంగారం ఏమీ వద్దు. నీ బట్టల సూట్‌కేసుతో మా ఇంట్లో అడుగు పెట్టు’ అన్నారు నాన్న. నాన్న చూసి వచ్చాక, ‘వృద్ధాప్యం వచ్చాక కూడా గ్లామర్‌ ఉండేలాంటి అమ్మాయిని చూశాను’ అని చమత్కరించారు. నా భార్య ఉషాలత వాళ్లది అతి సామాన్య కుటుంబం.

పోరాడారు..
చెన్నై చేరిన కొత్తల్లో డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసులో పనిచేశారు. రచయితగా ప్రవేశించటానికి పెద్ద పోరాటమే చేసి, గెలుపు సాధించారు. ‘బందిపోటు’ చిత్రంతో రచయితగా ప్రవేశం చేసి, సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలా ఒక లయలో డైలాగులు రాసి అంతవరకు ఉన్న ఒరవడి మార్చారు. ఈ విషయంలో ఒక జర్నలిస్టు నాన్నను విమర్శించారు. నాన్న కోపంగా, ‘నేను రైటర్‌ని, అవసరమైతే ఫైటర్‌ని కూడా అవుతాను, జాగ్రత్త’ అని వార్నింగ్‌ ఇచ్చారు. సీతారామరాజు లైఫ్‌ యాంబిషన్‌. ఆ సినిమా కోసం పరిశ్రమలోని పెద్దవాళ్లు విరోధులయ్యారు. అమ్మతో, ‘ఈ సినిమాను దీక్షతో ఒక యజ్ఞంలాగ, తపస్సులాగ చేయాలి. దీని వల్ల కీర్తి వస్తుంది. చాలా సినిమాలు తగ్గిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడతాం. ఏం చేయమంటావు?’ అని అడిగితే, ‘మీకు ఎటు విశ్వాసం ఉంటే అటే వెళ్లండి’ అని అమ్మ ఇచ్చిన మాటతో తెల్లవారు జాము. మూడు గంటలకు నాన్న చింతపల్లి అడవులకు వెళ్లిపోయారు. ఏకాగ్రతతో అనుకున్నది సాధించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రివ్యూ పెద్దల సమక్షంలో జరిగింది. దానికి పి. పుల్లయ్య గారు కూడా వచ్చారు. సినిమా పూర్తిగా చూసి, నాన్నను కౌగిలించుకుని, ‘సినిమా చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆనందంగా కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తన తపస్సు ఫలించినందుకు నాన్న పరమానందించారు. ‘నా పేరు నిలబడే సినిమాలే రాస్తాను. అదే నా కలం బలం’ అని ఎన్నో కథలు తిరస్కరిం చారు. ఫైవ్‌స్టార్‌ హోటల్, ప్లాట్‌ఫారమ్‌… రెండిటినీ సమానంగా చూసేవారు. నిజాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని ఓపెన్‌గా ఖండించడంతో విరోధులు పెరిగారు. నాన్నను అందరూ మీసాలాయన అనేవారు.

సామాన్య జీవితం…
చాలా సాధారణంగా ఉండేవారు. మంచి డ్రెస్‌ వేసుకోమని అమ్మ చెబితే, ‘ఈ బట్టలు చూసి నన్ను మహారథి కాదంటారా’ అంటూ చిరిగిన వాటితోనే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. కారు, రిక్షా, ఆటో, బస్‌.. అన్ని ప్రయాణ సాధనాలలోనూ ప్రయాణించేవారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ గా భావించి, కంచంలో పెట్టినది తినేసేవారు. ఇంట్లో అందరికీ ఎవరి కంచం వారిది. ఒకసారి అన్నయ్యకు అల్యూమినియం ప్లేట్‌లో అన్నం పెట్టింది అమ్మ. ‘ఇందులో నేను తినను’ అని అన్నయ్య పేచీ పెట్టాడు. ఆ విషయం నాయనమ్మ నాన్నకు చెప్పింది. నాన్న ఆ రోజున చాలా కోపంగా, అంట్లు తోముకునే బూడిద పెట్టే పళ్లెం కడిగించి, అందులో వారం రోజుల పాటు అన్నం పెట్టమని చెప్పారు. అన్నయ్య తినలేకపోయాడు. ‘అన్నానికి విలువ ఇవ్వాలి. కంచానికి కాదు’ అని మందలించారు. ఒకసారి స్కూల్‌లో నేను పెన్‌ దొంగతనం చేశాను. ఎప్పట్లాగే మా నాయనమ్మ నాన్నకు విషయం చెప్పింది. నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటే, ‘చిట్టి పెద్ద అబద్ధాలకోరు’ అని అందరికీ వినపడేలా మూడు సార్లు అనిపించారు. అంతే ఇంకెన్నడూ ఎవ్వరి వస్తువూ ముట్టుకోలేదు. క్యారెక్టర్‌ బిల్డింగ్‌లో మైండ్‌ గేమ్‌ ఆడారని పెద్దయ్యాక తెలిసింది. ఆ బీజాలు మాలో నాటుకుపోయాయి. అందువల్ల కొంత కోల్పోతున్నాం. అందుకని రోజూ నాన్న ఫొటో చూస్తూ, ‘నాన్నా! మీరు మాకు మంచి చేశారో చెడు చేశారో తెలియట్లే్లదు’ అంటుంటాను.

ఈ పేరు ఇలా వచ్చింది…
వరంగల్‌ని త్రిపురనేని వంశీకులు పరిపాలించిన కాలంలో, మహారథి అనే ఒక రాజు పేరున నాణెం ముద్రించారు. అందుకని ఆ పేరు పెట్టుకోమని స్నేహితులు చెప్పటంతో నాన్న మహారథిగా మారారు. నాన్నగారి అసలు పేరు బాలగంగాధరరావు.

అలా జరిగిపోయింది…
2011 డిసెంబరు 9 వ తేదీ నాన్నగారి సహస్ర చంద్రదర్శనం కార్యక్రమం అయ్యింది. ‘పిల్లవాడికి ఆశీర్వాదం ఇస్తాను, తీసుకురా’ అన్నారు. నేను హాస్పిటల్‌లో ఉన్నాను. డిసెంబరు 21న డిశ్చార్జ్‌ అయ్యాను. 2011, డిసెంబరు 23న నాన్న కన్నుమూశారు. ‘మూడు రోజుల తరవాత దహనం అవుతుంది. కాని నా శవం ఐస్‌ పెట్టెలో పెట్టొద్దు’ అని రాసిన ఒక లెటర్‌ నాన్న దిండు కింద కనిపించింది. ఆయన అన్నట్లుగానే మూడు రోజుల దాకా వాహనం రాలేదు. ఆశ్చర్యంగా మూడు రోజులూ వాసన రాలేదు. అలా నాన్న తన జాతకం కూడా చెప్పారు.

  • సంభాషణ: వైజయంతి పురాణపండ

శ్రీ. అల్లూరి సీతారామరాజు చిత్రం యొక్క ప్రసిద్ధ స్క్రిప్ట్/స్క్రీన్ ప్లే/డైలాగ్‌ల కోసం శ్రీ మహారధి త్రిపురనేని గారి అభ్యర్థన మేరకు శ్రీరంగం శ్రీనివాసరావు (SRI SRI) అల్లూరి సీతారామరాజు “తెలుగువీర లేవరా”లో ఒక పాటను రాశారు.
“తెలుగు వీర లేవరా” పాట యొక్క మొదటి సంస్కరణను శ్రీ మహారధి తిరస్కరించారు, తాను శ్రీ శ్రీ గారి నుండి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. శ్రీశ్రీ గారు రాసిన రెండవ వెర్షన్ ఉత్తమ సాహిత్యానికి జాతీయ అవార్డును గెలుచుకుంది ఒక్క డైలాగ్‌ సినిమాకి వెన్నెముకలా నిలిచే సందర్భాలు చాలా తక్కువ. సినిమా పేరు చెప్పగానే అందులోని డైలాగులు కంఠతాగా చెబుతారంటే అదంతా సంభాషణ రచయిత చాతుర్యమే!
‘‘ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావన్నై, హృదయాల జ్వాలనై.. నా జాతి జనులు పాడుకొనే సమర గీతాన్నై..’’ ఇలా చిరుగాలిలా మొదలై, తుపానులా మారి, సునామీలా విరుచుకుపడిపోయిన డైలాగ్‌ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోనిదని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఆ అక్షరాల్లో ఆయువై.. పదాల్లో ప్రాణమై నిలిచిన సంభాషణ చాతుర్యం రచయిత త్రిపురనేని మహారథిది. ఆ సినిమాలో అల్లూరి బాణం కన్నా.. ఈ మాటలే సూటిగా గుచ్చుకొన్నాయ్‌. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల హృదయ స్పందనను అమాంతం పెంచేశాయ్‌. కృష్ణ అభినయం.. అల్లూరి పోరాటం.. తెలుగువీర లేవరా.. అంటూ భావోద్వేగంగా సాగిన శ్రీశ్రీ గీతం.. వీటికి మహారథి మాటలు తోడయ్యాయి. స్వచ్ఛమైన తెలుగు సంభాషణలు అందించిన త్రిపురనేని మహారథి డిసెంబర్‌ 23, 2011న తెలుగు సినీ జగత్తుని విడచి వెళ్లిపోయారు.
త్రిపురనేని పూర్తిపేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఏప్రిల్‌ 20, 1930న కృష్ణా జిల్లా పసుమర్రులో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచీ అక్షరాలపై మమకారం పెంచుకొన్నారు. రామాయణ, మహాభారతాలను చిన్నప్పుడే చదివేశారు. బాధర్‌ అనేది ఆయన కలంపేరు. ఆపేరుతో పత్రికలకు పద్యాలు, గేయాలు పంపించేవారు. కొంతకాలం వ్యవసాయం చేశారు. హైదరాబాద్‌లో గుమస్తాగా పనిచేశారు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం వచ్చింది. అది కూడా ఎక్కువ కాలం నడవలేదు. ‘మీజాన్‌’ అనే పత్రికలో ఉప సంపాదకుడిగా కొన్నాళ్లు పనిచేశారు. తెలంగాణ భూపోరాటంలో చురుగ్గా పాల్గాన్నారు. ఈయన పేరు పోలీసు రికార్డులకు కూడా ఎక్కింది. ‘పాలేరు’ అనే సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా పనిచేశారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తరువాత ఆయన మనసు దర్శకత్వంపై మళ్లింది. దాంతో మద్రాసు రైలెక్కేశారు. ‘ఎమ్మేల్యే’ సినిమాకి కేబి తిలక్‌ దగ్గర సహాయకుడిగా చేశారు. కె.ఎస్‌.ప్రకాశరావు, వి.మధుసూదనరావుల సినిమాలకీ పనిచేశారు. మాటల రచయితగా ఆయన ప్రయాణం అనువాద చిత్రంతో మొదలైంది. ‘శివగంగ సీమై’ చిత్రాన్ని ‘యోధాను యోధులు’గా తెలుగులో అనువదించారు. దానికి మహారథి మాటలు రాశారు. ‘బందిపోటు’ తొలి తెలుగు చిత్రం. ‘సతీ అరుంధతి’, ‘కంచుకోట’, ‘పెత్తందారు’ ఇవన్నీ ఆయనకు రచయితగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సుస్థిరం చేశాయి. దాదాపు 150 సినిమాలకు సంభాషణలు అందించారు.
ఎన్టీఆర్, కృష్ణలతో మహారథికి మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌ కలల ప్రాజెక్టుని.. కృష్ణ చేపట్టారు. అదే ‘అల్లూరి సీతారామరాజు’. ఈ చిత్రానికి మహారథి సంభాషణలు అందించారు. ఆ సినిమాతో మహారథికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమా కోసం ఆయన సంభాషణలన్నీ అడవిలోనే రాశారు. ‘‘తెల్లవారుజామున చలిలో వణికిపోతున్నా ఓ తపస్సులా భావించి.. సంభాషణలు రాశాను. అలా రాస్తున్నప్పుడు నన్ను నేను మరచిపోయాను. కానీ ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాను..’’ అని చేప్పేవారు. ఆయనకు రయితగా చివరి చిత్రం ‘శాంతిసందేశం’. నిర్మాతగా ‘రైతు భారతం’, ‘దేశమంటే మనుషులోయ్‌’, ‘మంచిని పెంచాలి’, ‘భోగిమంటలు’ సినిమాలు తీశారు. సాహిత్యంపై మమకారంతో చాలా పుస్తకాలు రాశారు. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి చూపించారు. 1977లో బోధన్‌ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2005లో ‘త్రిలింగ ప్రజా పార్టీ’ స్థాపించారు.
ఒక్క డైలాగ్‌ సినిమాకి వెన్నెముకలా నిలిచే సందర్భాలు చాలా తక్కువ. సినిమా పేరు చెప్పగానే అందులోని డైలాగులు కంఠతాగా చెబుతారంటే అదంతా సంభాషణ రచయిత చాతుర్యమే!
‘‘ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావన్నై, హృదయాల జ్వాలనై.. నా జాతి జనులు పాడుకొనే సమర గీతాన్నై..’’ ఇలా చిరుగాలిలా మొదలై, తుపానులా మారి, సునామీలా విరుచుకుపడిపోయిన డైలాగ్‌ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోనిదని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఆ అక్షరాల్లో ఆయువై.. పదాల్లో ప్రాణమై నిలిచిన సంభాషణ చాతుర్యం రచయిత త్రిపురనేని మహారథిది. ఆ సినిమాలో అల్లూరి బాణం కన్నా.. ఈ మాటలే సూటిగా గుచ్చుకొన్నాయ్‌. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల హృదయ స్పందనను అమాంతం పెంచేశాయ్‌. కృష్ణ అభినయం.. అల్లూరి పోరాటం.. తెలుగువీర లేవరా.. అంటూ భావోద్వేగంగా సాగిన శ్రీశ్రీ గీతం.. వీటికి మహారథి మాటలు తోడయ్యాయి. స్వచ్ఛమైన తెలుగు సంభాషణలు అందించిన త్రిపురనేని మహారథి డిసెంబర్‌ 23, 2011న తెలుగు సినీ జగత్తుని విడచి వెళ్లిపోయారు.
త్రిపురనేని పూర్తిపేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఏప్రిల్‌ 20, 1930న కృష్ణా జిల్లా పసుమర్రులో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచీ అక్షరాలపై మమకారం పెంచుకొన్నారు. రామాయణ, మహాభారతాలను చిన్నప్పుడే చదివేశారు. బాధర్‌ అనేది ఆయన కలంపేరు. ఆపేరుతో పత్రికలకు పద్యాలు, గేయాలు పంపించేవారు. కొంతకాలం వ్యవసాయం చేశారు. హైదరాబాద్‌లో గుమస్తాగా పనిచేశారు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం వచ్చింది. అది కూడా ఎక్కువ కాలం నడవలేదు. ‘మీజాన్‌’ అనే పత్రికలో ఉప సంపాదకుడిగా కొన్నాళ్లు పనిచేశారు. తెలంగాణ భూపోరాటంలో చురుగ్గా పాల్గాన్నారు. ఈయన పేరు పోలీసు రికార్డులకు కూడా ఎక్కింది. ‘పాలేరు’ అనే సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా పనిచేశారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తరువాత ఆయన మనసు దర్శకత్వంపై మళ్లింది. దాంతో మద్రాసు రైలెక్కేశారు. ‘ఎమ్మేల్యే’ సినిమాకి కేబి తిలక్‌ దగ్గర సహాయకుడిగా చేశారు. కె.ఎస్‌.ప్రకాశరావు, వి.మధుసూదనరావుల సినిమాలకీ పనిచేశారు. మాటల రచయితగా ఆయన ప్రయాణం అనువాద చిత్రంతో మొదలైంది. ‘శివగంగ సీమై’ చిత్రాన్ని ‘యోధాను యోధులు’గా తెలుగులో అనువదించారు. దానికి మహారథి మాటలు రాశారు. ‘బందిపోటు’ తొలి తెలుగు చిత్రం. ‘సతీ అరుంధతి’, ‘కంచుకోట’, ‘పెత్తందారు’ ఇవన్నీ ఆయనకు రచయితగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సుస్థిరం చేశాయి. దాదాపు 150 సినిమాలకు సంభాషణలు అందించారు.
ఎన్టీఆర్, కృష్ణలతో మహారథికి మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌ కలల ప్రాజెక్టుని.. కృష్ణ చేపట్టారు. అదే ‘అల్లూరి సీతారామరాజు’. ఈ చిత్రానికి మహారథి సంభాషణలు అందించారు. ఆ సినిమాతో మహారథికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమా కోసం ఆయన సంభాషణలన్నీ అడవిలోనే రాశారు. ‘‘తెల్లవారుజామున చలిలో వణికిపోతున్నా ఓ తపస్సులా భావించి.. సంభాషణలు రాశాను. అలా రాస్తున్నప్పుడు నన్ను నేను మరచిపోయాను. కానీ ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాను..’’ అని చేప్పేవారు. ఆయనకు రయితగా చివరి చిత్రం ‘శాంతిసందేశం’. నిర్మాతగా ‘రైతు భారతం’, ‘దేశమంటే మనుషులోయ్‌’, ‘మంచిని పెంచాలి’, ‘భోగిమంటలు’ సినిమాలు తీశారు. సాహిత్యంపై మమకారంతో చాలా పుస్తకాలు రాశారు. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి చూపించారు. 1977లో బోధన్‌ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2005లో ‘త్రిలింగ ప్రజా పార్టీ’ స్థాపించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78

78-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం-మహారధి

త్రిపురనేని మహారథి సినీ మాటల రచయిత. అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటల రచయితగా మంచి గుర్తింపు పొందాడు

బాల్యం
ఇతని అసలు పేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఇతడు ఏప్రిల్ 20, 1930 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు పుణ్యవతి, సత్యనారాయణలు. ఇతడు బాల్యం నుంచీ అక్షరాలపై మమకారం పెంచుకొన్నాడు. రామాయణ, మహాభారతాలను చిన్నప్పుడే చదివేశాడు. బాధర్‌ అనేది ఇతని కలంపేరు. ఆ పేరుతో పత్రికలకు పద్యాలు, గేయాలు పంపించేవాడు. తండ్రి మరణంతో ఆయన చదువు ఎక్కువ కాలం సాగలేదు. ఆస్తులన్నీ హారతి కర్పూంలా కరిగిపోవడంతో కుటుంబ బాధ్యతను మోయాల్సివచ్చింది. యువకుడిగా ఉన్నప్పుడే ‘క్విట్‌ ఇండియా’ అంటూ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సమరనాదం వినిపించాడు[2].

ఉద్యోగం
ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఇతడు కొంతకాలం వ్యవసాయం చేశాడు. హైదరాబాద్‌లో గుమస్తాగా పనిచేశాడు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం వచ్చింది. అది కూడా ఎక్కువ కాలం నడవలేదు. ‘మీజాన్‌’ అనే పత్రికలో ఉప సంపాదకుడిగా కొన్నాళ్లు పనిచేశాడు. తెలంగాణ భూపోరాటంలో చురుగ్గా పాల్గాన్నాడు. ఈయన పేరు పోలీసు రికార్డులకు కూడా ఎక్కింది. ‘పాలేరు’ అనే సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా పనిచేశాడు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది[2].

సినిమా రంగం
ఆ తరువాత ఇతని మనసు దర్శకత్వంపై మళ్లి మద్రాసుకు వెళ్ళాడు. ‘ఎం.ఎల్.ఏ.’ సినిమాకి కె.బి. తిలక్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. కె.ఎస్. ప్రకాశరావు, వి.మధుసూదనరావుల సినిమాలకీ పనిచేశాడు. మాటల రచయితగా ఇతని ప్రయాణం అనువాద చిత్రంతో మొదలైంది. ‘శివగంగ సీమై’ చిత్రాన్ని ‘యోధాన యోధులు’గా తెలుగులో అనువదించారు. దానికి మహారథి మాటలు రాశాడు. ‘బందిపోటు’ ఇతని తొలి డైరెక్టు తెలుగు చిత్రం. ‘సతీ అరుంధతి’, ‘కంచుకోట’, ‘పెత్తందారు’ ఇవన్నీ ఇతనికి రచయితగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సుస్థిరం చేశాయి. దాదాపు 150 సినిమాలకు సంభాషణలు అందించాడు. నిర్మాతగా ‘రైతుభారతం’, ‘దేశమంటే మనుషులోయ్’, ‘మంచిని పెంచాలి’, ‘భోగిమంటలు’ సినిమాలు తీశాడు[2].

రాజకీయరంగం
ఇతడు రాజకీయాలపై కూడా ఆసక్తి చూపించాడు. 1977లో బోధన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2005లో ‘త్రిలింగ ప్రజా పార్టీ’ స్థాపించాడు[2].

సినిమాల జాబితా
· యోధాన యోధులు (1961)

· ఏకైక వీరుడు (1962)

· బందిపోటు (1963)

· కంచుకోట (1967)

· రణభేరి (1968)

· సతీ అరుంధతి (1968)

· అఖండుడు (1970)

· కిలాడి బుల్లోడు (1971)

· గౌరి (1974)

· అల్లూరి సీతారామరాజు (1974)

· కంచు కాగడా (1984)

· శాంతి సందేశం (2008)

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77

77-తొలి సినీ గయ్యాళి అత్త- తాడంకి శేషమాంబ

తాడంకి శేషమాంబ (1908-1968) తొలి తరం తెలుగు సినిమా నటి. గయ్యాళి అత్త పాత్రలకు ప్రసిద్ధి చెందినది.

తెనాలిలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శేషమాంబకు పదకొండవ యేటనే వివాహం జరిగింది. వృద్ధుడైన ఆమె భర్త తాడంకి వెంకయ్య కూతురు పుట్టిన తర్వాత మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పూడగడవని పరిస్థితిని గమనించిన ప్రముఖ లాయర్ నండూరు శేషాచార్యులు, ప్రముఖ డాక్టర్ గోవిందరాజులు సుబ్బారావులు ఈమెను ప్రోత్సహించి, నటనలో శిక్షణ ఇప్పించి, రంగస్థల ప్రవేశం చేయించారు.

తన తొలినాటకం కన్యాశుల్కంలో మధురవాణిగా శేషమాంబ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి అలరించడంతో, నాటకరంగంలో స్థిరపడి కుటుంబ నిర్వహణకు ఇబ్బందులు తీరిపోయాయి. పాండవోద్యగవిజాయాలు నాటకంలో కర్ణుడి పాత్ర, ఖిల్జీ రాజ్య పతనంలో కమలారాణి పాత్రలు శేషమాంబకు పేరుతెచ్చి పెట్టాయి.

1939లో వాహినీ పతాకంపై వందేమాతరం సినిమా నిర్మాణంలో ఉన్న దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డికి అందులో గయ్యాళి అత్త పాత్రను పోషించడానికి సరైన నటి దొరకలేదు. ఆ అన్వేషణలో ఉన్న ఆయన మిత్రుల ద్వారా శేషమాంబ గురించి విని ఆమెను పరీక్షించడానికి సముద్రాల, ఎ.కె.శేఖర్ లను తెనాలి పంపాడు. వాళ్ళు శేషమాంబతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకొని మద్రాసు తిరిగివెళ్ళారు. అలా సినిమా రంగానికి పరిచయమైంది శేషమాంబ. నిజ జీవితంలో అత్త ఆడబిడ్డల అదమాయింపులు, ఆరళ్ళు చాలాకాలం అనుభవించిన శేషమాంబ తన అనుభవసారాన్ని రంగరించి గయ్యాళి అత్త పాత్రను తనదైన శైలిలో అద్భుతంగా పోషించింది.[1]

శేషమాంబ 14-11-1958 తేదీన తెనాలిలోనే మరణించింది.[2] ఈమె కూతురు స్వరాజ్యలక్ష్మి కూడా నటే.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -76

మనమరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -76

76-సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క ,యాతమేసి తోడినాఏరు ఎండదు ,పుణ్యభూమి నా దేశం నమో నమామి ,సీతాలు సింగారం పాటల ఫేం-జానపదులజాబిలి- జాలాది

  జాలాదిగా ప్రసిద్ధుడైన జాలాది రాజారావు(ఆగస్టు 91932 – అక్టోబరు 142011) (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.[1].

బాల్యం

1932ఆగస్టు 9 న కృష్ణాజిల్లాగుడివాడ మండలం దొండపాడులో జన్మించారు. నల్లగా ఉండటంతో వివక్షను ఎదుర్కొన్నానని చెప్పేవారు.

రచనా వ్యాసంగం

ఈయన పలు సాంఘిక నాటకాలు రచించాడు. 1000 దాకా కవితలు రాశారు. కనులు తెరిస్తే ఉయ్యాల … కనులు మూస్తే మొయ్యాల అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన కవి.

మరణం

2011అక్టోబరు 14 న విశాఖపట్నం లోని తన స్వగృహంలో అస్వస్థతతో మరణించారు[2].

సినిమా పాటలు[మార్చు]

·         పల్లెసీమ (1977) – సూరట్టుకు జారతాదీ సిటుక్కు సిటుక్కు వానచుక్కా

·         దేవుడే గెలిచాడు – ఈ కాలం పది కాలాలు బతకాలనీ

·         ప్రాణం ఖరీదు (1978) – యాతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.

·         సీతామాలక్ష్మి (1978) -సీతాలు సింగారం … మాలచ్చి బంగారం – (ఉత్తమ పాట పురస్కారం)

·         కోతల రాయుడు (1979)

·         పునాదిరాళ్ళు (1979)

·         మా ఊరి దేవత (1979)

·         తూర్పు వెళ్ళే రైలు (1979) – సందపొద్దు అందాలున్నా చిన్నదీ

·         అత్తగారి పెత్తనం (1981)

·         బిల్లా రంగా (1982)

అల్లుడు గారు(1990)కొండ మీద

·         మేజర్ చంద్రకాంత్ (1993) – పుణ్యభూమి నా దేశం నమో నమామి

జనం మది దోచిన జాలాది

తన పూర్వ గీత రచయితల బాణీలోనే సాగుతూ, తనదైన ముద్రను వేశారు ప్రముఖ పాటల రచయిత జాలాది రాజారావు. రాశి కన్నా వాసి మిన్న అన్న తీరున జాలాది పాటలు మురిపించాయి. వందలాది చిత్రాల్లో ఆయన పాట తన ఉనికిని చాటుకుంది. జానపదం పలికించగలరు, సాహిత్యం కురిపించగలరు, చైతన్య గీతాలనూ జ్వలింప చేయగలరు. ఏది చేసినా అందులో జాలాది బాణీ ప్రస్ఫుటంగా కనిపించేది. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆయన రాసిన కవితల వల్లే చిత్రసీమకు జాలాది సాహితీవిలువలు తెలిశాయి. ఆయన బాణీలో ఏదో మహత్తు ఉందని పసికట్టినవారు జాలాదికి అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. ‘పల్లెసీమ’ అనే చిత్రంలో “సూరట్టుకు జారుతాది చిటుక్కు చిటుక్కు…” అనే పాటతో జాలాది చిత్రప్రయాణం మొదలయింది. చివరి దాకా తనదైన బాణీ పలికిస్తూ జాలాది కలం సాగింది.

కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించిన జాలాది రాజారావు బాల్యం నుంచీ వివక్షకు గురయ్యారు. దాంతో ఆయన కవితల్లో సదా పేదవాడి ఆకలిమంట ప్రధానాంశంగా ఉండేది. ఇక ఆయన రాసిన నాటకాల్లోనూ జాలాది అదే తీరున సాగారు. కొంతకాలం ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేశారు. ఆ సమయంలో పలు ప్రాంతాలు తిరగడం వల్ల ఆ యా ప్రదేశాల్లోని యాసను పట్టేసి, తన పాటల్లోకి నెట్టేసి రంజింప చేశారు. దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాతలు బలరామరెడ్డి, పరంధామ రెడ్డి ప్రోత్సాహంతో మరో రచయిత మోదుకూరి జాన్సన్ సహకారంతో ‘పల్లెసీమ’కు పాట రాసే అవకాశం సంపాదించారు జాలాది. తొలి పాటలోనే అలతి అలతి పదాలతో జాలాది కలం చేసిన అల్లరి జనం మదిని గిల్లింది. విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడే గెలిచాడు’లోని “ఈ కాలం పది కాలాలు నిలవాలనీ…” అనే పాట, క్రాంతికుమార్ నిర్మించిన ‘ప్రాణం ఖరీదు’లో “యాతమేసి తోడినా ఏరు ఎండదు…” పాట జాలాది ప్రతిభను మరింతగావెలిగించాయి. పలువురు దర్శకులు ఆయన బాణీని మెచ్చి అవకాశాలు కల్పించారు.

ఇక మోహన్ బాబు తాను నిర్మించిన అనేక చిత్రాలలో జాలాది పాటకు ప్రత్యేకంగా పట్టాభిషేకం చేశారు. యన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన ‘మేజర్ చంద్రకాంత్’లో జాలాది కలం పలికించిన “పుణ్యభూమి నాదేశం… నమోనమామీ…” పాట ఇప్పటికీ తెలుగునేలపై మారుమోగుతూనే ఉంది. మరో విశేషమేమంటే, యన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’లో మరపురాని పాట రాసిన జాలాది, తరువాత ఆయన నటవారసుడు బాలకృష్ణ నటించిన ‘సుల్తాన్’లోనూ “ఆకాశం గుండెల్లో…” అంటూ సాగే పాటలోనూ దేశభక్తిని నింపారు. ఇక నందమూరి మూడోతరం హీరో జూనియర్ యన్టీఆర్ ‘సుబ్బు’లోనూ “ఐ లవ్ మై ఇండియా…” అంటూ దేశభక్తినే ఒలికించారు. ఇలా నందమూరి నటవంశంలో మూడు తరాల హీరోలకు దేశభక్తి గీతాలు రాసే అవకాశం జాలాదికి లభించడం విశేషం.

జాలాది పాటకు అనేక అవార్డులూ రివార్డులూ లభించి, తమ ఉనికిని మరింతగా చాటుకున్నాయి. చివరిదాకా జనాన్ని మెప్పించేలా పాటలు రాస్తూనే జాలాది పయనించారు. ప్రతి జాతీయ పర్వదినాన జాలాది పాట వినిపిస్తూ తెలుగువారి మదిలో దేశభక్తిని రగులుకొల్పుతూనే ఉంటుంది.

 జానపద జాబిలి జాలాది

·          జాలాది అంటే జానపదమే గుర్తుకు వస్తుంది. ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు… పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు’… ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’.. ఇలా ఎన్నో… ఎన్నెన్నో జానపదాలు ఆయన కలం నుంచి జాలువారాయి… జానపదమే కాకుండా పుణ్యభూమి నాదేశం నమోనమామీ… ధన్యభూమి నాదేశం సదా స్మరామి… అంటూ దేశభక్తిని చూపి ధన్యజీవి అయ్యారు మన జాలాది. ఆయనది ఆదర్శ జీవితం. తండ్రితరం నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న సంప్రదాయం వారిది. ఇమ్మానియల్‌ (జాలాది నారాయణ చౌదరి), అమతమ్మ దంపతులకు ఐదో సంతానంగా జాలాది రాజారావు జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్షకు గురై ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకే ఆయన కలం నుంచి జాషువా శైలి తొంగిచూస్తుంటుంది. జాలాది తన పాటల ద్వారా సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడారు. ఆగస్టు 9న ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 

·         బాల్యం, విద్యాభ్యాసం

·         కృష్ణా జిల్లా గుడివాడ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం చేశారు. ఇక్కడ ఆయనకు కులం అడ్డుగోడైంది, పాఠశాలలోకి రానివ్వకుండా బయట కూర్చొని ఇసుకలో అక్షరాలు దిద్దమనేవారు. ఇలా ఇబ్బందులతోనే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. అప్పటికే ఆయన చిన్నచిన్న కవితలు రాయడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయులు పండగలు, విశిష్టమైన రోజుల్లో మంచి పాట రాయరా రాజా అని అడిగేవారట. 

·         డ్రాయింగ్‌ మాస్టారుగా..

·         విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం రాయివలసలో డ్రాయింగ్‌ మాస్టారుగా ఉద్యోగంలో చేరారు. అందరిచే రాయివలస మాస్టారుగా మన్ననలు పొందారు. ఇలా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఉద్యోగం చేస్తూనే వయోజన విద్య, నాటకాలు, నాటికలు రచనలు నిర్వహణ చేసేవారు. 1968లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

·         మరఫురాని పాటలు

·         సినీరంగంలో ప్రవేశించిన ఆయన మరఫురాని పాటలను అందించారు. ప్రాణం ఖరీదు సినిమాలో ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు… పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు’ పాటలో మనిషి జీవితంలో తారసపడే జీవిత సత్యాలు దొరుకుతాయి. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా… పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా… బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో… గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో… అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే… సీము నెత్తురు పారే తూము ఒక్కటే… కూతనేర్చి నోల్ల కులం కోకిలంటరా… ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా… ఈ పాటలు ఈ నాటికీ జనం హదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’ పాట బతుకు చిత్రాన్ని చూపిస్తోంది. పుణ్యభూమి నాదేశం నమో నమామి.. ధన్యభూమి నాదేశం సదా స్మరామి పాట జాతీయ దినాల్లో ఏవేదికమీదైనా వినిపిస్తోంది.

·         నేను రచయితని…

·         నేను కవిని కాను రచయితని మాత్రమేనని చాలా వేదికల్లో జాలాది స్పష్టం చేశారు. వాస్తవాలకు దూరంగా ఊహాజనితంగా కవి రచనలు ఉంటాయి. రచయిత రాసినవి వాస్తవాలకు జీవితాలకు దగ్గరగా ఉంటాయన్నది ఆయన వాదన. ఈయన వాదంలో వాస్తవమున్నది. ఇందుకు ఆయన పాటలే ఉదాహరణగా నిలుస్తాయి. ఈయన సుమారు 280 సినిమాలకు 1200 పాటలు పాటలు రాశారు. ఎన్‌టీఆర్, మోహన్‌బాబు సినిమాలకు ఎక్కువ పనిచేశారు. చాలా పాటలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఉత్తమ పాటల రచయితగా ప్రశంసలు పొందారు. 

·         నచ్చిన కవులు

·         శ్రీశ్రీ రచనలంటే చాలా ఇష్టమంటారు ఆయన. కొసరాజువంటి కవుల్ని ఆయన ఆరాదించేవారు. అయితే వీరి ప్రభావం లేకుండా తనదైన శైలిలో రచనలు చేశారు. 

·         రచనలు

·         జాలాది పలు కవితలు, నాటికలు, బుర్రకథలు రాశారు. అమర జీవి, తండ్రి సమాధి, కారుమేఘాలు, గాజుపలకలు, విశ్వమోహిని, వంటి పలు రచనలు చేశారు. 

·         తుది మజిలి

·         జీవీఎంసీ 42వ వార్డు శాంతినగర్‌లో ఉన్న కుమారుడు శ్రీనివాసరావు వద్ద చివరి మజిలీ గడిచింది. 2011 అక్టోబర్‌ 14న తుదిశ్వాస విడిచారు. అప్పటినుంచి జాలాది చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాకారులను గౌరవిస్తూ కళారంగానికి సేవచేస్తున్నారు. 

·         నేడు జయంత్యుత్సవాలు

·         కళాభారతి ఆడిటోరియంలో జాలాది జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినీ నటుడు శరత్‌బాబు, పాటల రచయిత చంద్రబోస్‌కు ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి జాలాది రాజారావు కుమార్తె జాలాది విజయ ఒక ప్రకటనలో తెలిపారు.

·          

·         జాలాది ట్రస్ట్  తెలియ ఏసిన సమాచారం

మా నాన్న జాలాది… -డా।।జాలాది విజయ

సనాతన సాంప్రదాయంలో బుడి బుడి నడకలు నడచి, తనకంటూ ఓ మేలిమి ముద్రను రూపుదిద్దుకొని, ఆధునికతతో జానపద శైలిని వంటబట్టించుకొని సత్యసారాన్ని జీవిత సారాన్ని తన కలం నిండా నింపుకొని పాటపాటకూ ప్రత్యేకతలను దిద్దుతూ, అమ్మ కొంగును కంటి కొలిక్కివద్దకు పంపించి రెండే రెండు పదాల అర్థాలతో ‘కళ్ళు తెరిస్తే ఉయ్యాల…కళ్ళు మూస్తే మొయ్యాలం’టూ జగమెరిగిన నిజానిజాలను రంగరించి ఈ సమాజాన్ని మేల్కొల్పిన జానపదబ్రహ్మ ‘జాలాది’. మా నాన్నగారి ఆసలు పేరు జాలాది రాజారావు. జాలాది కలం పేరుగా సినీ చరిత్రలో ప్రసిద్ధి కెక్కినారు. మా నాన్నకు తెలిసిన ప్రేమ రెండు రకాలు. ఒకటి మాతృప్రేమ. రెండు దేశభక్తి. అమ్మను, మమ్మల్ని మాతృప్రేమతో చూసుకునేవారు. ఇక రెండోది తన పాటలనిండా దేశభక్తిని, సామాన్యుని యధార్థ సంఘటనల గాథలను ఇనుమడింపజేసేవారు. నాటి స్వాతంత్రదిన కాలం నుండి గుర్తు చేసుకుంటే మానాన్న బ్రిటీషు తెల్లదొరల గుట్టులను రట్టు చేసే చిన్న చీటీలను మన నాయకులకు రహస్యంగా అందించేవారు. ఒకసారి పట్టుబడి జైలుశిక్షను కూడా అనుభవించారు. ఆయనలో మాకు ఒక స్వతంత్ర సమరయోధుడు కనిపించేవారు. ఆ జ్ఞాపకాలను మరువకే మా నాన్నగారు మేజర్‍ చంద్రకాంత్‍ అనే సినిమాలో ‘పుణ్యభూమి నాదేశం నమోనమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి’ అనే ఎనిమిది నిమిషాల పాటను ఈ జాతికి అంకితం చేశారు. జాతీయ పురస్కార హోదా కలిగిన ఆ పాట…పురస్కారానికి నోచుకోకపోవటం మా కుటుంబానికి తీరనిలోటుగా మిగిలిపోయింది- ఎందరో రాజకీయ నాయకుల కుతంత్రాల వల్ల. ఆ పాట జనాల నోళ్ళలో ఘనకీర్తిని పొందింది గాని మా నాన్న మనసును గాయపర్చింది. తెల్లోడి తెలివితేటలకు కళ్ళెం బిగించిన నల్లోడి మేధస్సును ఉన్నత శిఖరాలకు ఆవిష్కరించిన ఘనత జాలాదికే దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు మెగాస్టార్‍ చిరంజీవి అని పిలిచే మహానాయకుని చేత తొలి చిందులు తొక్కించిన తొలిపాట జాలాదిది కావడం (యాతమేసి తోడినా ఏరు ఎండదు..పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు-పునాదిరాళ్ళు) మరో విశేషం.

కొందరు సినీ ప్రముఖులకు జాలాది పాట కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. డైలాగ్‍కింగ్‍ మోహన్‍బాబుకు కుంతీపుత్రుడులో-లేలే బాబా నిద్దుర లేవయ్యా, రౌడీగారి పెళ్ళాంలో కుంతికుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం, అసెంబ్లీ రౌడీలో కొండమీద చుక్కపోతూ, దాని వణుకు చూస్తే ఉలికిపాటు, బ్రహ్మలో చిక్కు చిక్కు బండి, దాని దూకుడెక్కువండి అనే పాటలను అందించారు.

మురళీమోహన్‍ గారికి వారాలబ్బాయి సినిమాలో 6 పాటలు అందించారు. కాకిచేత జీవిత సత్యాన్ని ఒంటరితనంలో వున్న ఏకాకితనాన్ని గుర్తుచేస్తూ సమాజ బంధాన్ని కలిపారు. ఎర్రమందారంలో ‘యాలో యాలో ఉయ్యాల’ అంటూ జన్మబంధాన్ని తెలియజేశారు. జీవుడు తొమ్మిది మార్గాల ద్వారా బయటకు వెళతాడని మానవజన్మ రహస్యం మనిషికున్న నవరంధ్రాలేనని ఆ జీవి మరణానంతరం ఏ రూపంలో ఏ గుమ్మంలో నుండి బయటకి వెళుతుందో ఎవరూ కనిపెట్టలేరనే జన్మరహస్యాన్ని బట్టబయలు జేసిన మహాజ్ఞాని జాలాది. మనిషేమో చిన్నది, గుమ్మాలు తొమ్మిది, ఏ దారి పోయేవురా జీవా ఏ దారి పోయేవురా’ అనే పాటలోని విశ్లేషణతో మానాన్న సైకాలజీ మాకు జీవితాన్ని నేర్పింది. మూడు తరాల వారసత్వ సినీ హీరోలకు పాటలను అందించిన ఘనత జాలాదికే దక్కుతుంది. సినిమా దిగ్గజం నందమూరి తారకరామారావు గారికి ‘పుణ్యభూమి నా దేశం’ (మేజర్‍ చంద్రకాంత్‍), రెండవతరమైన మేటి హీరోలు కృష్ణ, కృష్ణంరాజులకు, బాలకృష్ణ (సుల్తాన్‍లో) ‘జనగణమన జనయిత్రి నా భరతభూమి’ పాటలను అందించారు. మూడవ తరమైన జూనియర్‍ ఎన్టీఆర్‍కి ‘ఐ లవ్‍మై ఇండియా’ (సుబ్బు) అనే పాటను అందించారు. ఈ మూడు పాటలు కూడా నందమూరి వంశంలో దేనిని తెలియజేస్తున్నాయో మీకు అర్థమయ్యే వుంటుంది. మొదట స్వాతంత్య్రం సంపాదించుకోవాలి. తరువాత స్వతంత్రం సంపాదించుకున్న దేశాన్ని రోజూ దినచర్యగా పూజించాలి. ఆ తరువాత నా దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఆ నాయకులతో ఈ సమాజానికి గొప్ప పిలుపునిచ్చిన దేశాభిమాని, మాతృభూమిపుత్ర, దేశ శ్రేయోభిలాషిగా జాలాదిని కీర్తించడంలో ఏమాత్రం సందేహించనక్కర లేదు. మా నాన్నగారు డ్రాయింగ్‍ మాస్టారుగా ఎందరినో తీర్చిదిద్దారు. ఇంకా తన బాధ్యత సరిపోలేదని ఈ దేశానికంతటికీ తన సందేశాన్ని, తన బాధను, తన వ్యధను, తన సత్యశోధనను ప్రతిఒక్కరికి అందజేయాలని సినీరంగ ప్రవేశం చేసి భరతజాతి గర్వించదగ్గ పాటలను సినీ కళామతల్లికి అందించారు. అవార్డుల రివార్డుల ఘన సత్కారాలతో కీర్తిని పొందినా ఏదో తెలియని లోటు తనను వెంటాడుతున్నదని కలాన్ని కొద్దికాలం పాటు ఆపివేశారు. మరలా మీరు పాటలు రాయాలి అని మోహన్‍బాబు గారు వచ్చి చెప్పినా మా నాన్నగారు రాయనన్నారు. ఎందుకని ప్రశ్నించిన మోహన్‍బాబు గారికి ఎదురు సమాధానం చెప్పకుండా…సంస్కృతి వికృతించింది. జాగృతి అరవిరుస్తుందనుకున్నా గాని జాతికున్న సంప్రదాయం ఆరవ ఆంగ్లభాషతో అరకొర కొనసాగుతుంటే నా కలం తెలుగుతల్లి మెడలో వేసే పూలమాల… దీనిని అజాతి పాలు చేయలేనని అర్థం పర్థం లేని పాటలు నేను రాయలేనని చెప్పి, పంపించారు. అప్పుడు నాకనిపించింది. సొమ్ముకోసం సోకు గానీ, నీతి కాదని. సోకేసుకుని సొమ్ము చేసుకునేవాళ్ళు కుప్పల్లా పెరిగిపోతుంటే తన దేశ ధనం, అభిమతం దెబ్బతింటుందని కలాన్ని పక్కనపెట్టిన కల్మషం లేని భారతీయుడ్ని తొలిసారిగా చూసినట్లనిపించింది. తదుపరి వందేమాతరం శ్రీనివాస్‍ గారువచ్చి చిన్నపిల్లాడి మనస్తత్వం కలగలిపిన ఓ తపస్వి..చిన్న సందేశాన్ని ‘కిట్టు’తో ఈ సమాజానికి పరిచయం చేయాలనుకుంటున్నాం. మీ పాట నా నోట..ఈ మాట పదికాలాలు బ్రతికుండాలని బ్రతిమలాడితే కలాన్ని మరలా కదిలించారు మానాన్న. రచయితే కాదు కవి కూడా. కాకులమ్మ, విశ్వమోహిని అనే కావ్యాలను కూడా రాసిన కవి మా నాన్న-జాలాది.

జాలాది గురించి ఎంత చెప్పినా తక్కువే..నాన్న కూతురినై పుట్టినందుకు నాకు గర్వంగా వుంది.

ఎడారిలో వెన్నెల తీరుతెన్నులు

ఇసుక తిన్నెలపై పరుస్తుంది

సినీలాకాశంలో వేల తారలు

వెలుగు దివ్వెలను చిమ్మినా

జాలాది జాబిల్లి ముందు చిన్నబోవునే తప్ప మిన్న అవ్వవు.

జానపదుల మాంత్రికుడు –జాలాది

ఆయన తండ్రి జాలాది ఇమ్మానియేల్ కృష్ణా జిల్లా బోర్డుసభ్యునిగా ఉండేవారు. స్వాతంత్రంలో పాల్గొని జైలుకు వెళ్ళేవారు. ఆయన అడుగుజాడల్లో రాజారావు నడిచారు.13 ఏళ్ళలోనే మారువేషాలు వేసి అజ్ఞాతంలో ఉన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తదితర జాతీయ నాయకులకు కొరియర్‌గా పనిచేసేవారు.

పుట్టినప్పుడే ఆయన తల్లి అనారోగ్యంపాలు కావడంతో తోబుట్టువుల హేళన చేసేవారు. అదే ఆయనకు జీవితానికి పాఠం నేర్పిందని ఓసారి వెల్లడించారు.

తొలుత ఆయన కృష్ణాజిల్లాలో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేశారు. కానీ అక్కడ రాజకీయాలు తట్టుకోలేక 1968లో ఉద్యోగం మానేశారు. స్నేహితుల ప్రోద్బలంతో మదరాసు వచ్చి జానపద సాహిత్యాన్ని పరీక్షించుకున్నారు. మొట్టమొదటిసారిగా ‘పల్లెసీమ’లో పాట రాశారు. జానపదులు పలువురిని ఆకర్షించింది. ఆయన మూడవ కుమార్తె జాలాది పాటలపై పిహెచ్‌డి కూడా చేశారు.

తూర్పు వెళ్ళే రైలు, ప్రాణం ఖరీదు, కోతలరాయుడు, మేజర్‌ చంద్రకాంత్‌, పెదబాబు వంటి చిత్రాలకు ఆయన పాటలను ‘యాతమేసి తోడినా ఏరు ఎండదు..’ ‘రెండు చిటికల వేళ్లు కలిస్తే కళ్యాణం.. రెండు కాలి బొటన వేళ్లు కలిస్తే నిర్యాణం..’ ‘పుణ్యభూమి నాదేశం నమోనమామి..’ అంటూ ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు.

గ్రామ మూలాల్లో మరుగనపడిన జానపదులను వెలికి తెచ్చిన ఘనుడు జాలాది. ఇంటిపేరుతో సినీ పరిశ్రమలో స్థిరపడిన ఆయన ఎంతోమంది హీరోలకు పాటలు రాశారు. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మేజర్‌ చంద్రకాంత్‌లోనే ‘సుఖీభవ.. సుమంగళి..’ పాట కూడా ఎంతో ఆకట్టుకుంది.

సూరట్టుకు జారుతాది సితుక్కు సితుక్కు వానసుక్క.. అంటూ జానపదాన్ని జాలువార్చిన.. సినిమాల్లో తొలినాళ్లలో జానపద జాలాది అనే పిలిచేవారు.

ప్రముఖుల సంతాపం
1932లో జన్మించిన జాలాది, పదమూడేళ్ళలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారనీ, ఆ భావాలు ఆయన జీవితాన్నిమార్చాయని సినీ గీతరచయిత సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.జీవిత సత్యం బోధించిన పాటల సూరీడు జాలాది .

కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన ప్రపంచ రచయితల  రెండవ సమావేశం లో జాలాది అద్భుత ప్రసంగం తన పాటల గానం తో  ఉర్రూత లూగించాడు .ఆయనే ఆ సమావేశాలకు హైలైట్ గా నిలిచాడు .నేను చాలా ముగ్దుడనయ్యాను .అంతకుముందు గుడివాడలో ఒక నటుని జయంతి సమా వేశం లో జాలాది ,కైకాల సత్యనారాయణ గార్లు ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్పుడు చూశాను జాలాది తో నేనూ ,ఉయ్యూరు సాహితీ మండలి ప్రముఖులు శ్రీ గూడపాటి కోటేశ్వరరావు పరిచయం చేసుకొని మాట్లాడాం .ఆయన్ను మా సాహితీ మండలి కి ఆహ్వానించి ఫోన్ నంబర్ తీసుకొన్నాను .ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడాను .ఆయన చనిపోయాక బెజవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జాలాది విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసి ,శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారితో ఆవిష్కరణ చేయించిన సభకు హాజరయ్యాను .

పల్లె సీమ సినిమాలో  జాలాది రాసిన ‘’సూరట్టుకు జారతాది ‘’పాట నాకు మహా ఇష్టం .ప్రాణం ఖరీదులో ‘యాతమేసి తోదినాఎరు ఎండదు ‘’కూడా బాగా కదిలించేపాట గా ఇష్టం

Posted in సినిమా | Tagged | Leave a comment

జరాత్ కవిత్వ కోట –నానాలాల్ -1

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -1

‘’నానాలాల్ ‘’అనే పుస్తకాన్ని యు.ఎమ్ మనియార్ రచిస్తేతెలుగులోకి డా.అక్కిరాజు రమాపతి రావు గారు అనువాదం చేయగా  సాహిత్య అకాడెమి 1979లో ముద్రించింది .వెల-రెండున్నర రూపాయలు  .

 తండ్రీ కొడుకులు

1905లో ప్రముఖ మేధావి ,సుప్రసిద్ధ నవలారచయిత గోవర్ధన్ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన గుజరాతీ సాహిత్య పరిషత్ సమావేశం లో ప్రముఖ కవి’’ కాంత్’’ అనే మణి శంకర భట్ నానాలాల్ ను ‘’ఉదిత కవితా పూర్ణ శశి ‘’అని కీర్తించాడు .ముందు హెచ్చరికలు లేకుండా నానాలాల్ ఆధునిక గుజరాతీ కోట నిర్మించుకొన్నాడు ఇరవై ఏళ్ళ లోపే .అప్పటినుంచి అవిశ్రాంత కవితా రచన చేసి దూసుకుపోయాడు .తండ్రి ప్రముఖకవి దలపతి రాం .తండ్రి రాసిన ‘’బపానీ పిప్పర్ ‘’కవిత సంప్రదాయ గుజరాతీ కవిత్వాన్ని విస్మయ పరచింది .దీర్ఘకాలం కవిత్వం లో జీవించి తండ్రి 1898లో మరణించాడు .ఆయన మృతి వార్త ప్రముఖ సాహిత్య పత్రిక ‘’జ్ఞానసుధ ‘’లో పట్టభద్ర స్థాయిలో ఉన్న కొడుకు నానాలాల్ రాసిన ‘’వసంతోత్సవ్ ‘’కవితతో పాటే ప్రచురి౦ప బడటం ఆశ్చర్యకరం .తండ్రిలాగానే కొడుకు కూడా 50 ఏళ్ళు కవిత్వాన్ని సుసంపన్నం చేశాడు .ఇలాంటి తలిదండ్రులు అరుదుగా ఉంటారు .1845లో తండ్రి కవిత బపాని పిప్పర్ మైలురాయి అయితే ,1895లో కొడుకురాసిన వసంతోత్సవ్ కవిత నవకవితా మార్గదర్శకమైంది .

  16-3-1877న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో శుక్రవారం నానాలాల్ పుట్టాడు .1848నుంచే తండ్రి అక్కడ ఉంటున్నాడు .స్కాట్ దేశీయుడు ఏకే ఫోర్బ్స్  ఆహ్వానం పై ఆయన అక్కడికి వచ్చి స్థిరపడ్డాడు .దొరకు ‘’రాస మల్ ‘’విషయ సేకరణలో సాయం చేయమంటే  వచ్చాడు .దలపత్ రాం గుజరాత్ దేశ భాషాసభ అనే గుజరాత్ విద్యా సభలో ఉద్యోగి .ఆయన ఆర్జించిన కీర్తి ప్రతిష్టలు వగైరాల వలన ఇంటిపేరు’’ తర్ వేది’’ అంటే త్రివేది విస్మృతిలోకి జారిపోయి కవిగా మాత్రమె లోకానికి పరిచయమయ్యాడు .కవి అనేదే తండ్రికీ కొడుకుకూ ఇంటి పేరు ఐపోయింది .ఇద్దరూ క్రియాపూర్ణ కవులే .

  1893లో 16వ ఏట మెట్రిక్ పాసై ,గురువు కాశీ రాం దవే ప్రోత్సాహంతో కవిత్వ సాహిత్యాలపట్ల మక్కువ పెంచుకొన్నాడు .బొంబాయి అహమ్మదాబాద్ ,పూనా లలో కాలేజీలలో చదివి 1901లో బాంబే యూని వర్సిటి నుంచి ఎం ఏ డిగ్రీ పొందాడు .ఈయన 50వ పుట్టినరోజున ఈ యూనివర్సిటి నానాలాల్ ను ‘’విశిష్ట విద్యార్ధి ‘’గా గుర్తించి గౌరవించింది .ఆ సందర్భం లో ఆయన ‘’బొంబాయి  యూని వర్సిటి ఉంది కనుకనే నానాలాల్ ఉన్నాడు’’అని వినయంగా చెప్పాడు ..చరిత్ర తత్వ శాస్త్రం ఇంగ్లీష్ లిటరేచర్ అభిమాన విషయాలుగా చదువుతున్నా కవితార్చన చేస్తూనే ఉన్నాడు .భారతీయ సంస్థానాధిపతులకు ఏర్పాటైన స్కాట్ కాలేజి లో ప్రిన్సిపాల్ అయి ,తర్వాత గుజరాత్ లోని రాజకుమార్ కళాశాలలో13ఏళ్ళు ఉద్యోగించాడు  మధ్యకాలంలో సివిల్ జడ్జిగా ,రాజకోట్ సంస్థాన దివాన్ గా పనిచేశాడు .

 1918లో సౌరాష్ట్ర విద్యాశాఖాధికారి అయ్యాడు .గాంధీ పేరుఅప్పుడే మారు మోగుతోంది. ఆయనపై ‘’ ,గుజరత్న తపస్వి ‘’కవిత రాశాడు .పెద్ద ఉద్యోగం, మంచి జీతం,పలుకుబడి  ఉన్న ఈ పదవి కి రాజీనామా చేసి 1920లో  అహ్మదాబాద్ లోఉంటూ ,1946 జనవరి 9 న చనిపోయే వరకు పాతికేళ్ళు అవిశ్రాంత కవితా రచన చేస్తూ కుటుంబాన్ని పోషించాడు .’’బూటు లేసులు కూడా కొనలేని రాబడిని కూడా కవిత్వం తో నేను పొందలేదు ‘’అని విచారించిన వర్డ్స్ వర్త్ కవిలాగా కాకుండా ,ఆర్ధికంగా ఏమాత్రం ఇబ్బంది పడలేదు నానాలాల్ .తండ్రి కవితామార్గాన్ని అనుసరించి ఋణం తీర్చుకొన్నాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75

74,75-మాధవ పెద్ది ,పిఠాపురం

74-దాదాపుఅన్ని భారతీయ భాషా గాయకుడు,వివాహ భోజనంబు ,భళిభళి దేవా ఫేం- మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
జీవిత విశేష
సత్యం 1922, మార్చి 11 న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య, సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట) ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు, రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మాధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలో ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.

75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.

ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల స్మృత్యర్ధం తెలుగు సినీ రంగములో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు, మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించాడు[1

గాయకునిగా[మార్చు]
సంవత్సర

చిత్రం

పాట

రిమార్కులు

1954

Bangaru Papa

Thadhimi Thakadhimi

Cast: S. V. Ranga Rao

1957

Maya Bazaar

Vivaha Bhojanambu
Bhali Bhali Bhali Deva

Cast: S. V. Ranga Rao
Sang for Himself

Thodi Kodallu

Nee Shoku Choodakunda

1959

Illarikam

Bhale Chancele

1960

Sri Venkateswara Mahatyam

Vegaraara Prabho

1961

Jagadeka Veeruni Katha

1962

Kula Gothralu

Ayyayyo Jebulo Dabbulu Poyene

Ramana Reddy

1963

Lakshadhikari

Oho Andamaina Chinnadana Bangaru Vannedana

1966

Shri Krishna Pandaviyam

Bhala Bhala Naa Bandi Parugu Teese Bandi

1975

Balipeetam

Yesukundam Buddoda Yesukundamu

· Yashoda Krishna (1975)

· Tata Manavadu (1972)

· Sampoorna Ramayanam (1971)

· Rahasyam (1967)

· Palnati Yudham (1966)

· Antastulu (1965)

· Babruvahana (1964)

· Bobbili Yudham (1964)

· Dr. Chakravarthy (1964)

· Devatha (1964)

· Ramudu Bheemudu (1964)

· Velugu Needalu (1964)

· Narthanasala (1963)

· Tirupathamma Katha (1963)

· Sri Krishnarjuna Yudham (1963)

· Chaduvukunna Ammayilu (1963)

· Mahamantri Timmarasu (1962)

· Dakshayagnam (1962)

· Iddaru Mitrulu (1961)

· Sabash Raja (1961)

· Sahasra Siracheda Apoorva Chinthamani (1960)

· Jayabheri (1959)

· Krishna Leelalu (1959)

· Appu Chesi Pappu Koodu (1958)

· Mangalya Balam (1958)

· Bhagya Rekha (1957)

· Dongallo Dora (1957)

· Panduranga Mahatyam (1957)

· Sarangadhara (1957)

· Jayam Manade (1956)

· Penki Pellam (1956)

· Kanyasulkam (1955)

· Pitchi Pullaiah (1953)

· Palletooru (1952)

· Malliswari (1951)

· Navvite Navaratnalu (1951)

· Shavukaru (1950)

· Laila Majnu (1949)

· Ramadasu (1946)

రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది

దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు….
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది

ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ……
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది

పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది
పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది
పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది
వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది

ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది
ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది
ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుంది
ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది

ఆయనే కబీర్ పాత్రలో 1946 లో వచ్చిన ‘ రామదాసు ‘ తమిళ-హిందీ ద్విభాషా చిత్రంతో నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి గాయకుడిగా స్థిరపడి సుమారు మూడు దశాబ్దాలు తెలుగు ప్రేక్షక శ్రోతలను అలరించిన మాధవపెద్ది సత్యం. ఆయన నటుడిగా స్థిరపడిపోతే మనం గర్వంగా చెప్పుకోగలిగే మంచి గాయకుడిని కోల్పోయేవాళ్ళమేమో ! ఆది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. పాత్ర స్వభావాన్ని, పాత్రధారుని సంభాషణా చాతుర్యాన్ని అంత చక్కగా స్వంతం చేసుకుని పాడే గాయకుడు బహుశాః మాధవపెద్ది సత్యం గారొక్కరేనేమో!

డా .ఆరవల్లి జగన్నాధ స్వామి మాటలలలో –

పాటల ‘పెద్ది’… మాధవపెద్ది

‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’ పాట చాలు ఆయన గాత్రమాధుర్యాన్ని, గంభీరతను చెప్పడానికి. అన్నం ఉడికిందో లేదో చెప్పడనికి అంతా పట్టిచూడనక్కర్లేదంటారు కదా? అలానే భోజనం గీతం చాలదూ!

మాధవపెద్ది సత్యనారాయణ అనే సత్యం రంగస్థల అనుభవంతో సినిమా నటుడుకాబోయి నేపథ్య గాయకుడయ్యారు. అయినా నటించారు. నటనపై ఆసక్తితో బొంబాయి చేరుకుని నిర్మాత వై.వి.రావు సంస్థలో నెలజీతంపై పనిచేస్తూ,రామదాసు తదితర చిత్రాలలో నటించారు. కొంతకాలనాకి మనసు మారింది. సొంతూరు గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు వచ్చి నాటక ప్రదర్శనలు ఇవ్వాలనుకున్నారు. పన్నెండో ఏట నుంచే రంగస్థలంతో పరిచయం ఉన్న ఆయన చిన్నికృష్ణుడు,వికర్ణుడు లాంటి వేషాలతో ఆరంభించి ప్రధాన పాత్రలూ పోషించారు. మంచి రూపం, నటన, వాచకం తన సొంతం కనుక రంగస్థలమే ఉత్తమమనుకున్నారు.అయితే వేషాల మాట ఎలా ఉన్నానీ గొంతు బాగుంటుంది..బాగాపాడతావు…మద్రాసు వచ్చేయ్.. సినిమాల్లో పాడుకోవచ్చు అని అప్పుడే పరిచయమైన సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బరామన్ సలహా చెప్పారు.తాను సంగీత దర్శకత్వం వహించిన ’లైలామజ్ను‘ (1949)లో అవకాశం కూడా ఇచ్చారు. మనుచుగాతా ఖుదా తోడై‘ అనే పాటను ఘంటసాల, ఫిఠాపురం నాగేశ్వరరావులతో కలసి పాడారు. విజయ ప్రొడక్షన్స్ వారు ఆ మరుసటి ఏడాది తీసినషావుకారు` చిత్రంలోలో పిచ్చన్నతాత వేషం వేయించడంతో పాటు ఆ పాత్రకు తత్వాలు పాడించారు. గాయకనట రెండు పాత్రలలో పేరు సంపాదించారు.

ధ్వన్యనుకరణ

సత్యంగారికి చిన్నప్పడే ధ్వన్యనుకరణను సాధనం చేశారు. ఎస్వీ రంగారావులా పాడడానికి అదే ఉపకరించిందని చెప్పేవారు.అలనాటి అగ్రనటులు నందమూరి, అ అక్కినేనిలకు ఘంటసాలలా,ఎస్వీఆర్ కు మాధవపెద్ది స్థిరపడిపోయారు. మాయాబజార్లో ఘటోత్కచుడి పాత్ర పద్యానికి ముందు వచ్చే ఎంతమద మెంతకావరమెంత పొగరు మాటలు మాధవపెద్దివే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. సత్యం!నా పలుకులు నేను కూడా అలా పలకలేనయ్యాఅని ఎస్వీఆర్ అనడంలోనే ఆ గాత్రం గొప్పదనం తెలుస్తుంది.1957నాటి వివాహ భోజనం పాటను వయస్సు మళ్లిన తరువతా అదే గాంభీర్యంతో ఆలపించడం ఆయన ప్రత్యేకత.ఎస్వీ రంగారావుకు పాటలు, పద్యాలు పాడినట్లే, రేలంగి, రమణా రెడ్డిలకూ నప్పించారు. నాలుగు దక్షిణాది భాషల్లో, హిందీలోనూ పాడారు.

వేలాది పాటలు పాడిన ఎంతటి గాయనీ గాయకులకైనా ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఏ చిన్న అపస్వరమైనా వినిపించడానికి అవకాశం ఉంది కానీ,సత్యం గారికి మాత్రం ఎక్కడా ఎప్పడూ అలాంటిది జరగలేదుఅని గానగంధర్వ బిరుదాంకితుడు (దివంగత) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవారు.

తప్పిపోయిన `దర్శకత్వం

నేపథ్యగాయకుడిగా స్థిరపడిన తరువాత సంగీత దర్శకత్వంపై ఆయనకు ఆసక్తి కలిగింది. అవకాశం వచ్చినట్లే వచ్చి జారిపోయింది. నిజం చెబితే నమ్మరుఅన చిత్రానికి నాలుగు పాటలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సాగలేదు.దాంతో ఇక ఆ ప్రయత్నంచేయలేదన్నారనిరావి కొండలరావు చెప్పేవారు. అయితే తన కోరికను అన్నగారి అబ్బాయి సురేష్ లో చూసుకున్నారు. ’నేనెలాగూ సంగీత దర్శకుడిని కాలేకపోయాను.నువ్వు తప్పక మంచి సంగీత దర్శకుడివి కావాలిఅనే వారట.బాబాయ్ ప్రోత్సాహమే నన్ను సంగీత దర్శకుడిని చేసింది‘ అంటారు మాధవపెద్ది సురేష్. ప్రసిధ్ద గాయని ఎస్.జానకీ ఆయన అభిమానిగా చెబుతారు. రాజమహేంద్రవరంలో సత్యం గారి వివాహ వేడుకలో ఆమె పాడినప్పుడు అభినందించి ప్రోత్సహించారట.ఆమె గాయని అయిన తరువాత ’కోడెకారు చిన్నవాడా` లాంటి పాటలు కలసి పాడారు.

గాయకత్రయం

తెలుగు సినిమా పరిశ్రమలో ఘంటసాల, మాధవపెద్ది, ఫిఠాపురం గాయకత్రయంగా ప్రఖ్యాతులు. ప్రత్యేకించి పౌరాణిక చిత్రాలలో ఘంటసాల, మాధవపెద్ది గాత్రాల నుంచి వెలువడిన పద్యాలు అజరామరం.ముగ్గురు కలసి అనేక పాటలు పాడారు. ఘంటసాలతో కలిసి పాడిన మా ఊళ్లో ఒక పడుచుందిలాంటి పాటలను సంగీత విభావరుల్లో పాడేవారు. ఘంటసాల కన్నుమూతతో ఆ పాటలను పిఠాపురంతో కలసి కచేరీలలో పాడేవారు. మాధవపెద్ది ఘంటసాల అంటే అమిత గౌరవాభిమానాలు. ఆయన సంగీత దర్శకత్వంలో అనేక పాటలు పాడారు. మహానుభావుడు. అంత గొప్పగాయకుడైనా మా కోసమే కొన్ని పాటలు కేటాయించేవారుఅని మాధవపెద్ది గుర్తుచేసుకునేవారు. వాస్తవానికి ఘంటసాల కంటే మాధవపెద్ది ఎనిమిది నెలలు పెద్దయినా ఆయనకు ఇచ్చిన గౌరవం అది. సినీ నేపథ్య గానంలో తనకంటూ ఒక శైలి సృష్టించుకున్న ఆయన 2000 డిసెంబర్ 18న సెలవంటూ వెళ్లిపోయారు

మాధవపెద్ది.jpg
75-మాఊళ్ళో ఒక పడుచుంది ,మాయాసంసారం తమ్ముడు ,అయ్యయ్యో జేబులో డబ్బులు

అప్పడనే తిప్ప డండీపులిమామ్గోరూ –పాటల ఫేం,ఆంధ్రా రఫీ జనతాసి౦గర్,గాన గ౦ధర్వ -పిఠాపురం నాగేశ్వరావు

పిఠాపురం నాగేశ్వరరావు (మే 5, 1930 – మార్చి 5, 1996) ప్రముఖ సినీ సంగీత దర్శకులు.

తెలుగు సినీ జగత్తులో మాధవపెద్ది – పిఠాపురం లను జంట గాయకులు అంటారు. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాధం – అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు పాతర్లగడ్డ, కానీ, ‘చిత్తూరు’ నాగయ్య లాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు

బాల్యం
పిఠాపురం నాగేశ్వరరావు అసలు పేరు పాతర్లగడ్డ నాగేశ్వరరావు. పిఠాపురం నుంచి వచ్చాడనో ఏమో, అందరూ పిఠాపురం నాగేశ్వరరావు అనేవారుగాని, అసలు ఇంటిపేరు కలిపేవారుకారు. పిఠాపురంలో ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి.వరకు చదువుకున్నారు. ఇతనికి రంగస్థలంపై మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి, ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ధి బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలంతో, తండ్రి ప్రోత్సాహంతో 1944 నుంచి నవ్యకళాసమితి వారి నాటకాలైన శ్రీకృష్ణతులాభారం, బాలనాగమ్మ, కృష్ణార్జునయుద్ధం, దేవదాసు, ఏకలవ్య, లోభి, చింతామణి, రంగూన్‌రౌడీ వంటి నాటకాలలో అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, సుబ్బిసెట్టి పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పు పొందారు. విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకోని తన అదృష్టన్ని పరీక్షించుకున్నారు[1].

సినీ జీవితం
1946 లో విడుదలైన మంగళసూత్రం అనే సినిమాలో తొలిసారిగా పాడి, సినిరంగంలో కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్ఠాత్మక సినిమా చంద్రలేఖలో పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు. అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన “మా ఊళ్ళో ఒక పడుచుంది” (అవేకళ్ళు) పాట, మాధవపెద్దిగారితో కలిసిపాడిన ” అయ్యయో! జేబులోడబ్బులుపొయనే ” (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయోక్తికాదు. ఆయన చివరిసారిగా “చల్లని రామయ్య – చక్కని సీతమ్మ” అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమాకోసం పాడారు. 1996 మార్చి 5 న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠాపురం.

పాడిన పాటలు
పిఠాపురం తెలుగు లోనెగాక, తమిళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడారు. అందులో ఆయన పాడిన కొన్ని హుషారైన పాటలు:

· రాజు వెడలె సభకు (మాయలమారి – 1951)

· పెళ్ళి చేసి చూపిస్తాం మేమేపెళ్లి పెద్దలనిపిస్తాం (పెళ్లి చేసి చూడు – 1952)

· ఏం చేస్తే అది ఘనకార్యం మనమేం చేస్తే అది ఘనకార్యం (చంద్రహారం-1954)

· పట్నమెల్లగలవా ఓ భామా (పెద్దమనుషులు – 1954)

· నిసగమపా లోకం మోసం పమగరిసా (జయసింహ-1956)

· రా, మాతోటి గెలిచే (సువర్ణసుందరి – 1957)

· మందుకాని మందు (ఇంటిగుట్టు – 1958)

· తడికో తడికో (అత్తా ఒకింటి కోడలే – 1958)

· మాయాసంసారం తమ్ముడూ (ఉమాసుందరి-1956)

· పదవే పోదాము గౌరీ (శ్రీ వెంకటేశ్వర మహత్యం-1960)

· అయ్యయో! జేబులోడబ్బులుపొయనే (కులగోత్రాలు – 1962)

· డివ్వీ డివ్వీ డివ్వట్టం నువ్వంటేనే నాకిష్టం (దాగుడుమూతలు-1964)

· పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా (పరమానందయ్య శిష్యుల కథ-1966)

· సోడా సోడా ఆంధ్రా సోడా! (లక్ష్మీనివాసం – 1967)

· అబ్బబ్బచలి (భలే రంగడు-1969)

· మా ఊళ్ళో ఒక పడుచుంది (అవేకళ్ళు)

· అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు (బాలనాగమ్మ)

బిరుదులు ]
· ఆంధ్రా రఫీ

· జనతా సింగర్

· గానగంధర్వ

· తెలుగు వెలుగులో

పుట్టిన ఊరు నే ఇంటి పేరుగా మార్చుకున్న పిఠాపురం (పాతర్లగడ్డ} నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది – పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. తెలుగు సినీ స్వర్ణ యుగంలో హాస్య పాత్రధారులకూ హాయిని గొల్పే పాటలను రచయితలు రాసేవారు, దర్శకులు చిత్రీకరించే వారు. మరి వారి హావభావాలకు తగ్గట్టుగా పాటలు పాడే గాయనీ గాయకులూ ఎంతోమంది అలనాడు చిత్రసీమలో ఉన్నారు. ఆ కోవలే హాస్య గీతాల గాయనీ గాయకులుగా మాధవపెద్ది – పిఠాపురం పేరు తెచ్చుకున్నారు. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో నటన పట్ల ఆకర్షితులైనా, స్టేజ్ మీద పాడలేని వారికి నేపథ్యం గానం అందించే అలవాటు యుక్తవయసులోనే ఆయనకు అబ్బింది. అదే ఆ తర్వాత ఆయనకు జీవనోపాధిగా మారిపోయింది. 1946లో ‘మంగళసూత్రం’ సినిమాతో ఆయన నేపథ్య గాయకునిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పదహారేళ్ళ ప్రాయంలోనే ‘చంద్రలేఖ’ చిత్రంలో పాట పాడే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వివిధ భాషలలో వేలాది పాటలను పిఠాపురం పాడారు. ఘంటసాలతో కలిసి ‘అవేకళ్ళు’ చిత్రంలో పాడిన ‘మా ఊళ్ళో ఒక పడుచుకుంది’, మాధవపెద్ది తో కలిసి ‘కులగోత్రాలు’ కోసం పాడిన ‘అయ్యయ్యో… జేబులో డబ్బులు పోయెనే’ ఇంకా ‘వెంకటేశ్వర మహత్యం’ చిత్రం లో ‘పదవే పోదాము గౌరీ పరమేశ్వరుని చూడ..’ వంటి పాటలు పిఠాపురానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. వీరు మంచి రంగస్థల నటుడు కూడా. చివరగా 1978లో ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఓ పాట పాడారు. పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5న కన్నుమూశారు. అయితే తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం ఆయన సంగీత ప్రియుల గుండెల్లో చిరంజీవి!

“విజయనగరం పనిమీద వెళ్ళినప్పుడు తప్పకుండా సుశీలమ్మ నాన్నగార్ని కలిసేవారు పిఠాపురం. సుశీలమ్మ టాలెంట్ ను గమనించి పెండ్యాలకు చెప్పేరు. పెండ్యాల నాకు ఆ అమ్మాయి తెలుసు పాడిద్దాం అని చెప్పి సుశీలమ్మకు కన్నతల్లి సినిమాలో పాడించాడు. ఆ తరువాత జరిగింది చరిత్రే. అందుకే ఈరోజుకీ సుశీలమ్మ పిఠాపురం కుటుంబం అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటుంది.

అలాగే ఉమాసుందరి సినిమాలో మాష్టారితో పాడిన పాట “నమ్మకురా ఇల్లాలు పిల్లలు” పాటకి మాష్టారు ముగ్ధులైపోయారు. ఎంతగానో పిఠాపురంను అభినందించారు.”

· సశేషం

· మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73

73-ఏరువాకా సాగాలోయ్ ‘’,నందామయా గురుడ,సరదా సరదా సిగరెట్టూ ఫేం-జానపద కవి సార్వ భౌముడు ,అష్టావధాని నేత్రావధాని  , –కొసరాజు

కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి (సెప్టెంబరు 31905 – అక్టోబరు 271986) సుప్రసిద్ధ కవిరచయిత.

జీవిత సంగ్రహ

1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలుజముకుల కథలుబుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు.

తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యంహాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలిఅది రాఘవయ్య చౌదరిగారు రాయాలి – అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.

బాల్యం[

“మా సొంత వూరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు. అంచేత, నేను నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివాను అని చెప్పాడు కొసరాజు ఒక ఇంటర్వ్యూలో . నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరుపాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.లాగాఆయన చిన్నతనంలోనే డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు. ఐతేఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం – రాఘవయ్య లోనూ ప్రవహించిఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణంఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారముతర్కవితర్కాలుతెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.

కొడముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాప్యులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాప్యులర్‌. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం – ఏ మాత్రం అడ్డురాలేదు.

తొలి రోజులు[

నరసింహం పంతులు వ్రాసిన రామాయణము నాటకములో పాత్రలు ధరించి నాటక రంగానికి పరిచయమయ్యాడు. పిదప కొంత కాలము ‘రైతు పత్రిక’ కు జర్నలిష్టుగా ఉన్నాడు. ఆ సమయములోనే ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు, నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గార్లతో పరిచయం ఏర్పడింది.

సినిమా జీవితం

“చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళవేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన నన్నూ కూచోబెట్టారు. వధూవరుల మీద నేను రాసిన పద్యాలు చదివితే, ‘ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!’ అని చెళ్లపిళ్ల వారు నన్ను ప్రశంసించారు, ఆశీర్వదించారు’” అని కొసరాజు చెప్పేవాడు. ఆయన ఇంకో విశేషం చెప్పేవాడు. జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు. అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.

ఆ పుస్తకం చదివి, అందరూ ‘మనకెందుకులే’ అని వెనుకంజ వేశారుట – భయపడి. ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం ‘నేను రాస్తాను’ అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే ‘ఆహా’ అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు. సాహితీపోషకులైన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మంసముద్రాల రాఘవాచార్య లతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది.

అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఒక ఊపు ఊపుతున్న కొసరాజుచేత, రామబ్రహ్మం సినిమాలకు రాయించడం మొదలుపెట్టాడు. తాపీ ధర్మారావుత్రిపురనేని గోపీచంద్‌ మాటలు రాస్తే విశ్వనాథ కవిరాజు హాస్య సన్నివేశాలు రాశారు. సముద్రాల, తాపీ, కొసరాజు పాటలు రాశారు. ‘రైతుబిడ్డ’ తర్వాత నేను స్వస్థలం వెళ్లిపోయి వ్యసాయంతోపాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ కూచున్నాను. మళ్లీ పదమూడేళ్ల తర్వాత డి.వి. నరసరాజుగారి సూచనతో కె.వి. రెడ్డిగారు ‘పెద్దమనుషులు’ సినిమాకి పిలిచారు. అప్పటుంచి ‘సినిమాకవి’నే అయిపోయాను’ అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారాయన.

రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతుబిడ్డ (1939) అనే చిత్రములో నటించాడు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి. ఎ. సుబ్బారావు, కె. వి. రెడ్డి వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు. 1954లో విడుదలైన ‘పెద్ద మనుషులు’ చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రెక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి ‘రాజు పేద’ చిత్రములోని ‘జేబులో బొమ్మ జే జేలబొమ్మ’ బహుళ ప్రాచుర్యం చెందింది. రోజులు మారాయి (వహీదా రెహ్మాన్ నాట్యముతో)లో ‘ఏరువాక సాగారో’, ‘ఇల్లరికములో ఉన్న మజా’ (), ‘అయయో జేబులో డబ్బులు పోయెనే’ (), ‘ముద్దబంతి పూలు బెట్టి’ () మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయముగా మిగిలిపోయాయి. అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా…, సరిగంచు చీరగట్టి… శివగోవింద గోవింద, డబ్బులోనే ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు… ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు వ్రాశాడు.

పాటల జాబితా[

శైలి

కొసరాజుగారు ఫెళ్లుమని నవ్వితే, ఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి వుండేది. నిత్యం రైతువేషమే. తెల్లటి ఖద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజుగారు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనక, అలాంటి వరసల్లోనే పాటలు రాసి, తన వరసలోనే పాడితే, కొందరు సంగీతదర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దడం కూడా వుండేది.

ఈయన సిగరెట్టు మీద రాసిన సరదా సరదా సిగరెట్టు అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దాన్లో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్‌ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన జోక్ వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.

అలాగే పేకాట గురించిన పాట అయయో చేతులొ డబ్బులు పోయెనేఅయయో జేబులు ఖాళీ ఆయెనే అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్‌.

ఇలాటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం.

ఈ కోవలోదే మరో పాట చవటాయను నేను వట్ఠి చవటాయను నేను అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.

మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.

కవి[

రాఘవయ్య ‘గండికోట యుద్ధము’ అను ద్విపద కావ్యము, ‘కడగండ్లు’ అను పద్యసంకలనం వ్రాశాడు. ‘కొసరాజు విసుర్లు’,’కొండవీటి చూపు’, ‘నవభారతం’, ‘భానుగీత’ ఇతని ఇతర రచనలు.

విశేషాలు

·         ‘పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు అని స్వయంగా ప్రకటించుకున్నాడు.

·         జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.

·         1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ సినిమా లో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు

·         యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.

·         తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి సంస్కృతము కొరకు చలపట్టునొక్కండుహిందియనుచు గంతులిడు నొకండుతెలుగు కొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె…‘ అన్నారు

బిరుదులు, పురస్కారాలు

·         ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాఘవయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.

·         తెలుగు ప్రజానీకం ‘కవి రత్న’ ‘జానపద కవి సార్వభౌమ’ మున్నగు బిరుదులు ఇచ్చింది.

కొసరాజు రాఘవయ్య 1986 అక్టోబరు 27 రాత్రి పది గంటలకు మరణించాడు.

కొసరాజు పాట నిత్య ఏరువాక

అచ్చ తెలుగులోని అందాలుజానపదుల భాషలోని సొగసులుపల్లెటూరి భాషలోని చమత్కారాలువిరుపులు రాఘవయ్య పాటలలో జాలువారుతాయి. మూడున్నర దశాబ్దాల కాలం ఆయన రాసిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచాయి.

సినీ రంగంలో ‘కొసరాజు’గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా పాటల రచయిత స్వర్గీయ కొసరాజు రాఘవయ్య చౌదరి గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా (ప్రస్తుతం కర్లపాలెం మండలం) చింతాయపాలెం గ్రామంలో సుబ్బయ్య, లక్ష్మమ్మ పుణ్య దంపతులకు 1905, జూనలో మాతామహుల ఇంట జన్మించారు. వీరి స్వగ్రామం అప్పికట్ల. ఆ గ్రామంలో నాలుగో తరగతి వరకు మాత్రమే చిన్న వీధి బడి ఉండేది. ఆ వీధి బడిలో నాల్గవ తరగతిలో ఉత్తీర్ణుడై, చేసేదేమీ లేక తిరిగి నాల్గవ తరగతిలోనే చేరాడు. రాఘవయ్య చిన్న వయస్సులోనే సాహిత్యాన్ని వంటపట్టించుకున్నాడు. తన తల్లి మేనమామగారైన వెంకటప్పయ్య గొప్ప పండితులు. ఆ వంశంలో ఉన్న సాహితీ రక్తం రాఘవయ్యగారిలోను ప్రవహించి ఆయన రచనా వ్యాసంగానికి గట్టి పునాది వేసింది. వీధి బడిలో ఉండగానే ఆయన ‘బాల రామాయణం’, ‘ఆంధ్రనామ సంగ్రహం’ వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివి ఆ సారాంశాన్ని అర్థం చేసుకున్నాడు. అదే గ్రామంలో నివసిస్తున్న పండితుడు, విమర్శకుడు అయిన కొండముది నరసింహం ప్రోత్సాహంతో ఆయన భజన పద్ధతిలో రాసిన రామాయణం ప్రదర్శనలో కొసరాజు రాముడి పాత్ర ధరించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కొసరాజు కంఠం చాలా శ్రావ్యంగా ఉన్నందున, నరసింహం ఆయనకు మాటా, పాటా నేర్పాడు. పొలాలగట్ల మీద కొసరాజును కూర్చోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పడమే కాకుండా, సాహిత్య సభలకూ తిప్పాడు. ఈ సాహిత్య సాంగత్యం మూలంగా తన 12వ ఏటనే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించి, బాలకవిగా బిరుదు పొంది, ఆనాటి ‘రైతు’ పత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. ఆయనకు స్కూలు, కళాశాల చదువులు లేక పోయినా, అవి ఉద్యోగానికి ఏమాత్రం అడ్డం రాలేదు. తెలుగు సాహిత్యం, పురాణాలు, కావ్యాలపై పట్టు సాధించి, తనకు వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి వద్ద అచ్చ తెలుగు నుడికారం, తర్కవితర్కాలు, తెలుగు భాష సౌందర్యం తెలుసుకున్నాడు. నరసింహం పంతులు, రామస్వామి చౌదరిల సాంగత్యంతో తన భాషా పటిమకు మెరుగులు పెట్టాడు. అదే సమయంలో రైతు బిడ్డగా తమ పొలం పనులలో నిమగ్నమై జానపదుల తెలుగులోని సొగసులు, చమత్కారాలు తెలుసుకున్నాడు.

                  1950లో జమీన్‌ రైతు ఉద్యమం మొదలైన తరువాత కొసరాజు రైతును సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలు రాసి సభల్లో పాడి రైతుల మన్ననలు పొందాడు. అదే సమయంలో ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకాన్ని రాసి ఆ పుస్తకానికి పీఠిక రాయమని ఎందరో సాహితీ వేత్తలను, రాజకీయ వేత్తలను అర్థించినా, బహుశా జమీందార్లకు భయపడి ఎవరూ ముందుకు రాలేదట. చివరకు ప్రముఖ పత్రికాధిపతులైన కాశీనాథుని నాగేశ్వరరావు ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశారు. అచ్చయిన తరువాత ఆ పుస్తకం అందరి ప్రశంసలు పొందటమే కాకుండా ఆయనకు ‘కవిరత్న’ అనే బిరుదును సాధించిపెట్టింది.

                  సాహితీ పోషకులు, కళా ప్రియులు ఆనాటి గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకుని, వారు అందించిన ఆర్థిక సహాయంతో కమ్మవారి చరిత్ర రాయటానికి తమిళనాట అనేక వూళ్ళు తిరిగి ఎంతో సమాచారాన్ని సేకరించారు. కొసరాజు గారు యక్షగానాలు, వీధి బాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు భజన గీతాలు, పగటి వేషగాళ్ళ పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు మొదలైన రచనలెన్నో చేశారు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా కొసరాజుకి సినిమా రంగానికి చెందిన గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యుల గార్లతో ఏర్పడిన పరిచయం ఆయన చిత్రసీమలో అడుగుబెట్టటానికి కారణమైంది. అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని ఒక ఊపు ఊపుతున్న కొసరాజు చేత రామబ్రహ్మం సినిమాలకు పాటలు రాయించసాగారు. తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్‌ మాటలు రాయగా కొసరాజు పాటలు రాశారు. కొసరాజు తొలుత 1939లో కథానాయకునిగా రైతుబిడ్డ అనే చిత్రంలో నటించాడు. రైతు బిడ్డ చిత్రం విజయవంతం కాక నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది. రైతుబిడ్డ చిత్రం తరువాత కొసరాజు తన స్వస్థలం వెళ్ళిపోయి వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు. మళ్ళీ పదమూడేళ్ళ తరువాత డి.వి.నరసరాజు సూచనతో, ప్రముఖ నిర్మాత కె.వి.రెడ్డి వీరిని తాను నిర్మించబోయే పెద్ద మనుషులు చిత్రానికి పాటలు రాయటానికి మద్రాసు పిలిపించారు. 1954లో విడుదలైన పెద్దమనుషులు చిత్రానికి కొసరాజు రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

                  తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేక శైలిగా వుండేది. ఆ రోజుల్లో చాలా చిత్రాలు కొసరాజు ముద్రను బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మేళవించిన పాట ఒకటైనా తమ సినిమాలో వుండాలని ఎందరో దర్శకులు కోరుకునేవారట. అది రాఘవయ్య చౌదరిగారే రాయాలి అని ఆనాటి సినిమా వారికి ఒక సూత్రం వుండేదట. ఆ సూత్రానికి తగినట్లుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళ భరితం చేశారు. జానపద గీతాలలోని లాలిత్యాన్ని, ఆ పొగరూ, వగరూ ఏ మాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది. రోజులు మారాయి చిత్రంలో ఆయన రాసిన ఏరువాకా సాగాలో రన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరునులే అన్నా, చిన్నన్నా అంటూ వ్యవసాయ దారులకు ఉత్సాహం నింపుతూ, వారికి ధైర్యం నూరిపోసిన పాట ప్రతివూరిలోను మార్మోగి రాఘవయ్య పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసింది.

                  అచ్చ తెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెటూరి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారుతాయి. మూడున్నర దశాబ్దాల కాలం ఆయన రాసిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచాయి. తెల్లటి ఖద్దరు బట్టలతో నిజమైన రైతు బిడ్డ సౌమ్య భాషణతో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనుక అలాంటి వరసల్లోనే పాటలురాసి తన వరసలోనే పాడితే, కొందరు సంగీత దర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దేవారట, మొత్తం మీద తన పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తి చూపించాడు. కొసరాజు సినీ గీతాలేకాక ‘గండికోట యుద్ధము’ అనే ద్విపద కావ్యం, ‘కడగండ్లు’ అనుపద్య సంకలనం రాశాడు. ‘గండికోట యుద్ధము’ అనే ద్విపదకావ్యంలో ఆ కోటను 300 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యపు సామంతులుగా పరిపాలించిన పెమ్మసాని వారి వంశాన్ని, వారి ఔదార్యాన్ని, వీరత్వాన్ని, పెమ్మసాని వారికి సాయపడిన ఇతర 65 కమ్మవంశాలను ప్రస్తావించారు. కొసరాజు రాఘవయ్య చౌదరి అనేక అవార్డులు, రివార్డులు బహుమతులు అందుకున్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం అత్యంత గౌరవ పురస్కారమైన రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని వీరు తెలుగు సినిమాకు చేసిన సేవలకు 1984లో ప్రదానం చేసింది. ఈయనను తెలుగు ప్రజానీకం ‘జానపద కవి సార్వభౌమ’ ‘కవిరత్న’ అనే బిరుదులతో సత్కరించింది.

                  సుమారు మూడున్నర దశాబ్దాలు తమ మధురమైన, వీనులకింపైన పాటలతో తెలుగు సినీ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించి దేదీప్య మానంగా వెలిగిన దీపం 1987 సంవత్సరం అక్టోబర్‌ నెల 27వ తేదీ రాత్రి ఆరిపోయి యావత తెలుగు ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. వారు చిరస్మరణీయులు.

జానపద కవిసార్వభౌముడు…కొసరాజు!

June 23, 2021

జూన్ 23న కొసరాజు రాఘవయ్య జయంతి)
తెలుగు చిత్రసీమలో అంతకు ముందు ఎందరు జానపద బాణీ పలికిస్తూ పాటలు అల్లారో కానీ, కొసరాజు రాఘవయ్య చౌదరి కలం ఝళిపించిన తరువాత జానపద బాణీ అంటే ఇదే అన్నారు సాహితీప్రియులు. మన భాషలోని కనుమరుగైన పదాలు, కరిగిపోయిన మాటలు పట్టుకు వచ్చి మరీ జానపదాన్ని జనానికి పరిచయం చేశారు కొసరాజు. అందుకే జనం ఆయనను ‘జానపద కవిసార్వభౌమ’ అని కీర్తించారు. కొందరు ‘కవిరత్న’ అనీ శ్లాఘించారు. కొసరాజు అనగానే జానపద పాటలే రాశారని అనుకుంటారు కానీ, ఆయన కలం నుండి జాలువారిన పాటలెన్నో తెలుగువారిని పరవశింప చేశాయి.

తెలుగునేలపై విశేషంగా వినిపించే బ్రహ్మంగారి తత్త్వాలలోని “నందామయా గురుడ నందామయా…”, ” మకుటం గ్రహించి, పాటను కట్టి ‘పెద్దమనుషులు’లో పరమానందం పంచారు. “జేబులో బొమ్మా జేజేల బొమ్మా…” అంటూ ‘రాజు-పేద’ కోసం కొసరాజు పదాలు చిలికించారు. ఇక కొసరాజు పేరు తలవగానే అందరి తలపుల్లో మొదటగా మెదిలే పాట ఏదంటే ‘రోజులు మారాయి’లోని “ఏరువాకా సాగారో…రన్నో చిన్నన్నా…” పాటనే. ఈ పాట ఈ నాటికీ తెలుగువారిని పులకింప చేస్తూనే ఉండడం విశేషం. “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే…” అని అలుపును మరపించినా, “టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ…” అంటూ వినోదం పంచినా కవిరత్నకే చెల్లింది. “అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటీ… బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా…” అంటూ చిందేయించినా, “నిలువవే వాలు కనులదానా…” అంటూ వయారి హంసనడకల చిన్నదాని వెంట పడి పాటందుకున్నా కొసరాజు కలం బలం ఏ పాటిదో తెలిసిపోతుంది. “అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే…” అంటూ పేకాట పాటలోనూ పలు సెటైర్స్ వేసిన తీరు చూస్తే కొసరాజు బాణీ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక “మామ మామా మామా… ఏమే భామా భామా…” అంటూ ‘మంచిమనసులు’ను విజయతీరం చేర్చడంలోనూ కొసరాజు రచన భలేగా పనిచేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జానపద బాణీల్లో భలేగా పసందు చేసిన పాటలెన్నో ఉన్నాయి.

ఎప్పుడూ జానపద గీతాలే కాదు, “ఏ నిమిషానికి ఏమి జరుగునో…” అంటూ కన్నీరు పెట్టించినా, “కలవారి స్వార్థమూ నిరుపేద దుఃఖము…”అంటూ ఆవేదన కలిగించినా, “జయమ్ము నిశ్చయమ్మురా…భయమ్ము లేదురా…”అంటూ ప్రబోధం పలికించినా వాటిలోనూ కొసరాజు బాణీ కనిపిస్తుంది . ఏది ఏమైనా కడదాకా జనానికి జానపదంలోని రుచిని చూపిస్తూ సాగిన ఘనత కొసరాజు సొంతమయింది. ఆయన నిర్మాతగానూ మారి యన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో కవిరత్నా మూవీస్ పతాకంపై ‘విశ్వరూపం’ తెరకెక్కించారు. 1984లో కొసరాజుకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ఇక జానపదం పేరు వినిపించినంత కాలం కొసరాజు పేరు కూడా మన చెవులకు సోకుతూనే ఉంటుంది. అందుకే ఆయన ‘జానపద కవిసార్వభౌముడు’గా జనం మదిలో నిలిచారు.

👉అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు.

పేరు కొసరాజుతెలుగంటే పెద్దమోజు అని స్వయంగా ప్రకటించుకున్నాడు.

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.

1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ సినిమా లో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు

యక్షగానాలువీధిభాగవతాలుహరికథలుజముకుల కథలుబుర్రకథలుభజనగీతాలుపగటివేషగాళ్ళ పాటలురజకుల పాటలుపాములోళ్ళపాటలుగంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.

తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి సంస్కృతము కొరకు చలపట్టునొక్కండుహిందియనుచు గంతులిడు నొకండుతెలుగు కొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె…‘ అన్నారు

తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం.

ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యంహాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలిఅది రాఘవయ్య చౌదరిగారు రాయాలి – అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు.

జానపదగీతాల్లోని లాలిత్యాన్నిఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో… అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ… అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.

కొసరాజుగారు ఫెళ్లుమని నవ్వితేఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి వుండేది. నిత్యం రైతువేషమే. తెల్లటి ఖద్దరునల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజుగారు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనకఅలాంటి వరసల్లోనే పాటలు రాసితన వరసలోనే పాడితేకొందరు సంగీతదర్శకులు ఆ వరసల్నే తీసుకునిమెరుగులు దిద్దడం కూడా వుండేది.

ఈయన సిగరెట్టు మీద రాసిన సరదా సరదా సిగరెట్టు” అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దాన్లో పొగతాగితే ఊపిరితిత్తుల కేన్సర్‌ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒకపాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వటంసినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చెయ్యటంమీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన జోక్ వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.

అలాగే పేకాట గురించిన పాట అయయో చేతులొ డబ్బులు పోయెనేఅయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణహాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చుమళ్ళీ ఆడి గెల్వవచ్చుఇంకా పెట్టుబడెవడిచ్చుఇల్లు కుదువబెట్టవచ్చుఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహందానికి అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్‌.

ఇలాటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడిదూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం.

ఈ కోవలోదే మరో పాట చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికిదేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించానువరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడానుచవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.

మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్నిదురలవాట్లని చమత్కారంఅవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగి

కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై,

ఏడుదీవుల రాజ్యమేలేనయా!

గుళ్ళు మ్రింగేవాళ్ళు, నోళ్ళు గొట్టే వాళ్ళు..

ఊళ్ళో చలామణీ అవుతారయా!

ఆ ఆ లు రానట్టు అన్నయ్యలందరికి…

అధికార యోగమ్ము పడుతుందయా!

కుక్కతోక పట్టి గోదావరీదితే..

కోటిపల్లి కాడ తేలేరయా!

స్వారాజ్య యుధ్ధాన జయభేరి మ్రోగించిన,

శాంతమూర్తులు అంతరించారయా,

స్వాతంత్ర్య గౌరవం సంతలో తెగనమ్ము…

స్వార్థమూర్తులు అవతరించారయా!

గొర్రెల్ని తినువాడు గోవింద గొట్తాడు,

బర్రెల్ని తినువాడు వస్తాడయా!

పగలె చుక్కలు మింట మొలిపింతునంటాడు!

నగుబాట్లు పడి తోక ముడిచేనయా.

అప్పు చేసిన వాడు పప్పుకూడు తిని…

ఆనందమయుడౌతు తిరిగేనయా!

అర్దమిచ్చిన వాడు ఆకులలములు మేసి

అన్నానికాపన్నుడౌతాడయా!

నందామయ గురుడ నందామయ,

ఆనందదేవికి నందామయ!

1954 లో రాష్ట్రపతి ఉత్తమ చిత్రం గా ఎన్నికైన కె.వి.రెడ్డి గారి…పెద్ద మనుషులు….మూవీ లోని ఈ పాట….

ఆ రోజుల్లో…తెలుగు నాట….ప్రతినోట…నాట్యమాడిందంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు విన్నా ఆ పాట నిత్య నూతనంగా అలరిస్తుంది!

అప్పుడెప్పుడో….1939 లో రిలీజ్ అయిన గూడవల్లి రామబ్రహ్మం గారి రైతు బిడ్డ….మూవీలో….అద్భుతమైన రైతు పోరాటం…..గీతాలు వ్రాసి…

అందులో ఓ మంచి పాత్ర కూడా వేసిన ఆయన…..సినిమా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని….అద్భుత విజయాన్ని అందుకున్నా….

ఎందుకో మళ్ళీ సొంత ఊరెళ్ళిపోయి…వ్యవసాయం చేసుకుంటూ….పత్రికలలో…సాహిత్య వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉండిపోయాడు….

మళ్ళీ 13 ఏళ్ళ తరువాత….కె.వి.రెడ్డి గారే పిలిపించి…పెద్ద మనుషులుతో….సినీ గీత రచయితగా మార్చేశారు.

ఆ తరువాత….ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసేసుకున్నాడు.

హాస్య, వ్యంగ్య, రాజకీయ , జానపద గీతాలను…..ఆయన వ్రాస్తే….అప్పట్లో….ఆ కిక్కే వేరబ్బా….ఆన్నట్లుండేది!

ఆయనే… కొసరాజు రాఘవయ్య చౌదరి గారు.

*************

సినిమాలో అన్ని పాటలూ రికార్డ్ చేసేసినా సరే….ఇంకా ఏదో వెలితి కనిపిస్తుంటది. అప్పుడు…కొసరాజు గారే గుర్తొస్తారు…ఏ దర్శకుడికైనా!

ఓ హాస్య గీతమో…వ్యంగ్య గీతమో…జానపదమో పెట్టేస్తారు. ఆశ్చర్యంగా అదే పెద్ద హిట్టౌతుంది సినిమాకు!

1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు.

సొంత వూరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు.

అంచేత నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివారు కొసరాజు గారు!

నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు!

ఐతే, ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం – రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది.

ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.

కొండముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది.

నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి.

అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు.

అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు.

సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాపులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాపులర్!

పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం – ఏ మాత్రం అడ్డురాలేదు!

ఏ డిగ్ర్రీలూ లేవు…ఏ జర్నలిజం కోర్సులూ లేవు!

**************

“చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన కూచోబెట్టారు కోసరాజు గారిని.

వధూవరుల మీద రాజు గారు రాసిన పద్యాలు చదివితే, ‘ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!’ అని చెళ్లపిళ్ల వారు ప్రశంసించారు, ఆశీర్వదించారు!

జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు.

అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు గారు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.

ఆ పుస్తకం చదివి, అందరూ ‘మనకెందుకులే’ అని వెనుకంజ వేశారుట – భయపడి.

ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం ‘నేను రాస్తాను’ అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది.

రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే ‘ఆహా’ అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు.

**************

కొసరి వ్రాయి చుకునే వారు దర్శకులు…నిర్మాతలు…..కొసరాజు గారిదగ్గర గీతాలు. మరి వారి కొసరాజు బ్రాండ్ అలాంటిది!

హాస్యం తొణికిసలాడాలన్నా…

వ్యగ్యం తొంగిచూడాలన్నా…

జానపద రీతులు…అలరించాలన్నా….

ఒక్క కొసరాజు వారి మాటే….పాటగా మారాలి!

అదీ అప్పుడాయన పరిస్థితి.

కొస రాజు కాదు….కొసరు రాజు….అని కూడా అనేవారాయనను! ఆయన రచన ఒక్కటైనా లేకపోతే….సంపూర్ణత్వం రాదు!

రైతుపైన అభిమానము చూపని రాజులుండనేల?

నిద్ర మేల్కొనర తమ్ముడా..గాఢ నిద్ర మేల్కొనరా తమ్ముడా,…

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా…

ఇల్లరికంలో ఉన్న మజా….

జేబులో బొమ్మ జేజేల బొమ్మ,

అయ్యయ్యో చేతిలొ డబ్బులు పోయెనే,

ముద్దబంతి పూలు పెట్టి..మొగిలిరేకులు..

సరిగంచు చీర జట్టి, కొమ్మంచు రైక తొడిగి….

సరదా సరదా సిగిరెట్టు..ఉది దొరల్ తాగు భల్ సిగిరెట్టు…

టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ…

ఆడుతు పాడుతు..పని చేస్తుంటే…

మూక్కు చూడు ముక్కందం చూడు…

శివశివ మూర్తివి గణనాథ..నువ్వు శివుని కుమారుడవు గణనాథ….

శ్రీరామ…ఓరామ.. నీ నామమెంతో రుచిరా

ఆ శైలి ఒక్క కొసరాజు కే సొంతం.

ఎందుకంటే….ఆయన చిన్నప్పటి నుండే…ఓ సంస్కృతి చూస్తూ పెరిగారు.

హరికథలు, బుర్రకథలు,

జముకుల కథలు, రజకుల పాటలు,

పాములోళ్ళ పాటలు,భజన గీతాలు,

పగటివేషగాళ్ళ పాటలు,

గంగిరెద్దు వారి గీతాలు….

ఇవన్నీ గమనించడమే కాదు….జీర్ణించుకున్నారు…తన పాటలో అవసరానికి ఆవిష్కరించారు….తనదైన ప్రత్యేక శైలిలో.

అజరామరం గా నిలిచాయి ఆ పాటలు.

మూడున్నర దశాబ్ధాల పాటు….షుమారు 200 చిత్రాలలో 1000 కి పైగా గీతాలు వ్రాశారాయన.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము కొసరాజు రాఘవయ్య గారికి

రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.

తెలుగు ప్రజానీకం… ‘కవి రత్న’ ‘జానపద కవి సార్వభౌమ’.. బిరుదులు ఇచ్చింది.

సినిమాకు మాటలు వ్రాసే వారందరూ పాటలు రాయలేకపోవచ్చు.

కానీ పాటలు వ్రాసేవారు…మాటలు వ్రాయగలరు.

కానీ కొసరాజు గారు ఆ ప్రయత్నం చేయలేదు. ఎవ్వరూ అడగలేదేమో మరి!

సంస్కృతాంధ్రాలు చదివినా…

అవధానాలు చేసినా…

జానపద వాజ్మయాన్ని జీర్ణం చేసుకున్నా….

కించిత్తు కూడా గర్వం అనేది ఎరుగరు కొసరాజు గారు.

సదా చిరునవ్వు ముఖమే! కడు సౌమ్యుడాయన. విరగబడి నవ్వుతారు, నవ్విస్తారు….నవ్వు ఇస్తారు.

81 ఏళ్ళ వయస్సులో…27 అక్టోబర్ 1986 న….కొసరాజు గారు కీర్తిశేషులయ్యారు.

ఈ రోజు 23 జూన్ 1905….వారి జయంతి అంటున్నారు. కానీ సెప్టెంబర్ 3 వారి జయంతిగా కూడా బిన్నాభిప్రాయాలున్నా….చిరస్మరణీయులైన కొసరాజు గారిని ఎప్పుడైనా తలుచుకోవచ్చు తెలుగు వారు.

స్వంతవూరు అప్పైకట్లలో జమ్మలమడక సీనయ్య పంతులు అక్షరాభ్యాసం చేయగా వీధి బడిలో చదివ ,గ్రామకరణం

కొండముది నరసింహం పంతులు గారివడ్డ ఆంద్ర సంస్కృత గ్రంధాలు చదివి పాండిత్యం కొంత సాధించి ,పినతండ్రి త్రిపురనేని రామస్వాం చౌదరి గారి దగ్గర కవిత్వం రాయటం నేర్చారు .పద్య విద్యలో ఆరితేరి అష్టావధానా నేత్రావధాన ,ఆశుకవిత్వాలలో దిట్ట అనిపించారు

బాలకవి గా గుర్తింపు పొందారు 1922లో త్రిపురనేని వారి’’రైతు ‘’పత్రికలో పని చేసి ప్రభావితులయ్యారు .త్రిపురనేని ‘’కొండవీడు ‘’నవల రాస్తే కొసరాజు కొండవీటి వైభవం ‘’కావ్యం రాశారు ఆయన శంబుక వధ నాటకం రాస్తే ,ఈయన ‘’శంబుకర్షి ‘’శతకం రాశారు .1927,28లలో గుంటూరు జిల్లా బోర్డు ఎన్నికలలో ప్రచారాలకు బుర్రకధలు రాసి ,ప్రచారానికి బుర్రకదను మొదటి సారిగా ఉపయోగించే ప్రక్రియకు నాంది పలికారు .1982-83తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారానికీ బుర్రకధలు రాశారు .1930లో గూడవల్లి ,సముద్రాలతో కలిసి ‘’కమ్మవారి చరిత్ర ‘’పరిశోధనకోసం మద్రాస్ వెళ్ళారు దీనిఖర్చు జాగర్లమూడి కుప్పు స్వామి భరించారు ప్రోత్సాహం ఉన్నావా వారిది ,పర్యవేక్షణ త్రిపురనేని .ఈ పరిశోధనలో గండికోట ప్రభువులు పెమ్మసాని వారిచారిత్రతో బాగా ప్రభావితులయ్యారు .గూడవల్లి ‘’గండికోట పతనం’’నాటకం రాస్తే ,సముద్రాల ‘’గండికోట ‘’పద్యకావ్యం రాస్తే ,కొసరాజు ‘’గండికోట యుద్ధం ‘’మంజరీ ద్వ్పదకావ్యం రాశారు .తర్వాతీముగ్గురు సినిమా రంగం లో చేరారు .

  1932 లో మద్రాస్ ప్రధాని బోల్లిని మునుస్వామి నాయుడు ప్రోత్సాహంతో కొసరాజు తిరుత్తని జమీన్ రైతు సంఘ ప్రచారం లో పాల్గొన్నారు ‘’కడగండ్లు ‘’గేయాలు రాసి తానె పాడారు .1938 లో గూడవల్లి గారి రైతుబిడ్డ సినిమా కు పాటలు రాసి ,పాడి రైతు పాత్ర పోషించారు .1940లో

అపవాదు సినిమా పాటలు రాసి ,ఆంధ్రోద్యమాన్ని వ్యతిరేకించిన వారిని తూర్పార బట్టారు .ప్రజామిత్ర ,సమదర్శిని ,ఢంకాపత్రికలలో

ఈయన రచనలు పడేవి

 సుమారు మూడు వేల సినీ పాటలు రాశారు కొసరాజు .హాస్య గీత రచనల రారాజు కొసరాజు అనిపించారు .సినీ పాటలతో పాటు

మిత్రనీతి,భాను గెట వీరశేఖర శతకం ,సినిమా డైరెక్టర్ ,రాష్ట్ర గీతికలు ,రాఘవయ్య శతకం కూడా రాశారు .ఈ శతకం లో ‘’రైతు జన విదేయ

రాఘవయ్య ‘’మకుటం తో 1500 ఆటపడులు రాశారు .తెలుగు పలుకుబడులు నుడికారాలకు సామెతలకు ఇది నిధి .

 చాలా సంస్థలు కొసరాజును బిరుడులిచ్చి సత్కరించాయి చల్లపల్లి రాజా సన్మానించారు ప్రొద్దుటూరు లో నందమూరి తారకరామారావు గారి చేతులమీదుగా ‘’కనకాభి షేకం’’జరిగింది .ఆంద్ర విశ్వవిద్యాలయం’’కళాప్రపూర్ణ తో ,రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య స్మారక

పురస్కారం తో సత్కరించాయి .కవిరత్న ,జానపద బ్రహ్మ ,ప్రజాకవి జానపద కవి సార్వభౌమ బిరుదులూ పొందారు .తనను

‘’సహజ కవిత్వ ప్రసార దుర్వహుడను ‘’అని కొసరాజు చెప్పుకొన్నారు .

  1986లో అక్టోబర్ 27న ‘’గురు బ్రహ్మ ‘’సినిమాకు ఉర్రూతలూపే బుర్రకధ రాసి ,,ఇంటికి వచ్చిప్రశాంతంగా తుది సహవా విడిచారు కొసరాజు రాఘవయ్య చౌదరి  .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72

72-తొలి ప్రేక్షక సంఘం స్థాపకుడు నటుడు ,నట శిక్షకుడు,దర్శకుడు ,రేడియో ఆర్టిస్ట్ ,సీతాపతి సంసారం,అగ్నిహోత్రావధానులు ఫేం –విన్నకోట రామన్న పంతులు

విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి.

జీవిత విశేషాలు
ఇతడు 1920, ఏప్రిల్ 13న విజయవాడలో వేంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విజయవాడ లోని గాంధీజీ మునిసిపల్ హైస్కూలు, కాకినాడలోని ఎఫ్.ఎ.సి.ఆర్.కాలేజి, విజయనగరంలోని మహారాణి కాలేజి, పూనాలోని లా కాలేజీలలో గడిచింది. ఇతడు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తరువాత, వృత్తిరీత్యా న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగిస్తూనే మరోప్రక్క నటుడిగా నాటకాల్లో పాత్రలు ధరిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డాడు. ఇతడు నటనకు, ఆహార్యానికి సంబంధించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. వాటి మీద నటశిక్షణ, రూపశిల్పం, నాటక ప్రయోగం, రంగస్థల శాస్త్రం, వాచికాభినయం, మేకప్, మూకాభినయం, రససిద్ధాంతం, అంగికాభినయం,లైటింగ్, రంగస్థల నిర్మాణం, సాత్వికాభినయం మొదలైన పుస్తకాలు కూడా రచించాడు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ప్రేక్షక సంఘం నటరాజ కళామండలిని స్థాపించాడు. నాట్య సంఘం కార్యదర్శిగా, రాఘవకళా కేంద్రం కార్యదర్శిగా సేవలను అందించాడు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ మొదలైన వారికి నటనలో శిక్షణను ఇచ్చాడు. తెలుగు రంగస్థల, సినిమా నటుడు విన్నకోట విజయరాం ఇతని కుమారుడు. టెలివిజన్ నటుడు, సినిమా నటుడు ప్రదీప్ ఇతని మనుమడు[1].

నాటకరంగ౦
ఇతడు 1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు, కొప్పరపు సుబ్బారావు, డి.వి.నరసరాజు, కె.వి.ఎస్‌.శర్మ, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవాడు. ఇందులో అగ్నిహోత్రావధాన్లు పాత్రను రామన్నపంతులు గొప్పగా పోషించేవాడు. రాఘవ కళాకేంద్రం ప్రదర్శించిన విశ్వం పెళ్ళి, ఇనుప తెరలు మొదలైన నాటకాల్లో రామన్నపంతులు విలక్షణమైన పాత్రలను ధరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తరువాత డి.వి.నరసరాజు రచించిన “నాటకం” అనే నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి తన కీర్తిని పెంచుకున్నాడు. ఈ నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీల్లో రచన, ప్రదర్శనలకు బహుమతులు లభించాయి. ఇవే కాకుండా వరవిక్రయం, పెద్దమనుషులు, ఈనాడు, ఆసామి, శ్రీరంగనీతులు మొదలైన నాటకాలలో కూడా పాత్రలు ధరించాడు. రామన్నపంతులు ఉత్తమ దర్శకుడిగా అనేక నాటకాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో ఎన్.జి.వో., నాటకం, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు ముఖ్యమైనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి మరణించేవరకూ అనేక నాటకాలలో పాత్రపోషణ చేసేవాడు. సీతాపతి సంసారం ధారావాహిక నాటకంలో సీతాపతి పాత్ర ఇతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది.

సినిమా రంగం
ఇతడు తెలుగు సినీరంగంలో ప్రవేశించి బి.యన్.రెడ్డి గారి బంగారు పాప (1954) చిత్రంలో మొదటిసారిగా జమిందారు పాత్రను పోషించాడు. తర్వాత వినోదా సంస్థ నిర్మించిన కన్యాశుల్కం (1955) చిత్రంలో కూడా అగ్నిహోత్రావధాన్లు పాత్రను పోషించి తన నటనకు ప్రశంసలందుకున్నాడు. బాపూరమణలు ఇతడిని పిలిచి తమ తొలిచిత్రం సాక్షి (1967) లో తడిగుడ్డతో గొంతులు కోసే ప్రతినాయకుడు మునసబు పాత్రను ధరింపజేశారు.

ప్రముఖ హాస్యరస చక్రవర్తి జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా ఇతని నాటకాల కంపెనీలో నటించాడు.[2] జంధ్యాల సినీ దర్శకునిగా మారిన పిదప తన తొలిచిత్రం ముద్ద మందారం (1981) లో కథకు కీలకమైన పాత్రను పంతులు చేత వేయించాడు.

చిత్రసమాహారం
· బంగారు పాప (1954) – జమీందారు

· కన్యాశుల్కం (1955) – అగ్నిహోత్రావధాన్లు

· దొంగరాముడు (1955)

· వరుడు కావాలి (1957)

· బాటసారి (1961) – జమీందారు

· శ్రీకృష్ణ కుచేల (1961)

· చదువుకున్న అమ్మాయిలు (1963)

· రామదాసు (1964)

· ఇల్లాలు (1965)

· శ్రీమతి (1966)

· సాక్షి (1967) – మునసబు

· బంగారు పిచిక (1968) – సన్యాసిరాజు

· స్నేహం (1977)

· ముద్ద మందారం (1981)

· మల్లెపందిరి (1982)

· ముగ్గురమ్మాయిల మొగుడు (1983)

మరణం
రామన్న పంతులు 1982, డిసెంబర్ 19న మరణించాడు[1]

–నటనకు కంచుకోట విన్నకోట

“విన్నకోట” అన్నమాట విని చాలా కాలమైంది. విన్నకోట అనే ఇంటిపేరుకు విశిష్టమైన పేరు తీసుకువచ్చినవారు విన్నకోట రామన్నపంతులు. వారు కన్నుమూసి కూడా చాలా ఏళ్ళు (1982) కావస్తోంది. వారు కన్నుతెరచి (1920)ఇప్పటికి వందేళ్లు పూర్తయింది. ఇది విన్నకోటవారి శతజయంతి సంవత్సరం. ఆ మహనీయుడ్ని తలచుకోవడం ఎంతో అవసరం. మహాకవి గురజాడ అప్పారావు రాసిన ” కన్యాశుల్కం” నాటకంలో రామన్నపంతులు పోషించిన పాత్రలు చిరంజీవిగా ఎప్పటికీ ఉంటాయి. మరో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు రచించిన “వరవిక్రయం” నాటకం ద్వారానూ విన్నకోటవారు తెలుగునాట సుప్రసిద్ధులు.

బహుముఖీనుడు

నటుడు, దర్శకుడు,న్యాయనిర్ణేత, రేడియో కళాకారుడుగా కళారంగంలో చిరయశస్సును ఆర్జించారు. విజయవాడలోనే జన్మించారు, ఐక్కడ విన్నకోటవారి వీధి కూడా ఉంది. న్యాయవాదిగా ధర్మమార్గంలో ఆర్జించిన సంపదను నాటకరంగ అభివృద్ధికి సద్వినియోగం చేసిన దానశీలి, త్యాగశీలి. గొప్ప మేధావి. నటనారంగానికి సంబంధించిన అనేక అంగాలు, రంగాలపై పరిశోధన చేసి, ఆ జ్ఞానాన్ని పదిమందికి పంచిపెట్టి, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దిన ఆచార్యతుల్యులు. నటశిక్షణ, రూపం, ఆంగిక, వాచిక, సాత్విక,మూకాభినయం, ఆహార్యం,రంగస్థల నిర్మాణం, రససిద్ధాంతం, నాటక ప్రయోగం, లైటింగ్ మొదలైన అనేక అంశాలపై అద్భుతమైన పుస్తకాలు రచించి లోకానికి అందించారు.వీటిపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి, ఎందరినో ప్రభావితం చేశారు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయశర్మ వంటివారు విన్నకోటవారి దగ్గర సుశిక్షితులై, లబ్ధప్రతిష్ఠులయ్యారు.

కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు

వీరి కుమారుడు విజయరాం నటుడుగా అన్ని తెరలపై అందరికీ పరిచయమైనవారే. ముద్దమందారం ఫేమ్ గా చెప్పుకునే నటుడు ప్రదీప్ వీరి మనుమడు. గురజాడవారి “కన్యాశుల్కం” నాటకంలో అగ్నిహోత్రావధానుల పాత్రపోషణలో విన్నకోటవారికి మించినవారు ఇంతవరకూ ఎవ్వరూ లేరు. ఆయనే అగ్నిహోత్రావధానులేమో అనుకునేవారు.ఆ పాత్రకు అంతటి జీవం పోశారు. డివినరసరాజు రాసిన “నాటకం”అనే నాటకంలో ముఖ్యభూమిక పోషించి ఎంతో కీర్తిని గడించారు. ఎన్ జి ఓ, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు మొదలైనవి వీరి దర్శకత్వంలో పేరుతెచ్చుకున్న నాటకాలు. సినిమా రంగంలో వీరి నటనా ప్రతిభను బాగా వాడుకున్నవారు బి ఎన్ రెడ్డి, బాపు అనిచెప్పాలి. బంగారుపాపలో వేసిన జమిందార్ పాత్ర చాలా ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. తడిగుడ్డతో గొంతులు కోసే మునసబు పాత్రలో వీరి విన్యాసం చూసి తీరాల్సిందే. వీరిని ఆ పాత్రలో చూసిన వారందరికీ మొన్నటి దాకా పల్లెల్లో హడావిడి చేసిన కొందరు మునసబులు తప్పక గుర్తుకువచ్చి తీరుతారు.

జంధ్యాలతో అనుబంధం

సాక్షి సినిమాలో బాపురమణలు ఆ పాత్రను మలచిన తీరు కూడా అద్భుతం. జంధ్యాల కూడా విన్నకోటవారితో తన సినిమాల్లో నటింపచేసి, గురుఋణం తీర్చుకున్నారు. వీరితో ముద్దమందారంలో కీలక పాత్ర వేయించారు. దర్శకుడిగా జంధ్యాలకు ఇదే మొట్టమొదటి సినిమా కూడా. జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా నటించింది విన్నకోటవారి కంపెనీలోనే కావడం విశేషం. రామన్నపంతులుకు ఆకాశవాణితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. వారి తుది శ్వాస వరకూ అనేక నాటకాలకు పాత్రపోషణ చేసి అలరించారు. సీతాపతి సంసారం ధారావాహికంగా వచ్చింది,ఇందులో లీడ్ రోల్ వీరిదే. ఇది కూడా ఎంతో మంచిపేరు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పరచారు.దాని పేరు “నటరాజ కళామండలి”.

ఉద్దండులతో సావాసం

ప్రసిద్ధ రాఘవ కళాకేంద్రం కార్యదర్శిగా వీరు పోషించిన పాత్ర ఎనలేనిది. ఈ సంస్థ ప్రదర్శించిన ఇనుపతెరలు, విశ్వంపెళ్లి మొదలైన నాటకాల్లో నటుడుగానూ విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విన్నకోటవారి ప్రతిభ విలక్షణం. తెలుగునాటక రంగానికి ఊపిరిలూదినవారిలో విన్నకోట వారి స్థానం గణనీయం, స్తవనీయం. కొప్పరపు సుబ్బారావు, డివి నరసరాజు, నిర్మలమ్మ, సుంకర కనకారావు,కెవిఎస్ శర్మ మొదలైన ఉద్దండులతో వీరి సావాసం అపురూపం. కన్యాశుల్కం నాటక విజయంలో వీరందరి పాత్ర మరువలేనిది. విన్నకోటవారు సుమారు పదహారుకు పైగా సినిమాల్లో నటించారు. విద్యావంతుడైన విలక్షణమూర్తి విన్నకోట రామన్నపంతులును ఎన్నటికీ మరువలేం. ఇటువంటి వారి జీవితాలే కళారంగాలకు స్ఫూర్తిదీప్తులు.

నటనకు పెట్టని కోట విన్నకోట –శ్రీ పాండురంగ –ఆకాశవాణి మాజీసంచాలకులు

రంగస్థల, సినిమా నటులు విన్నకోట రామన్న పంతులుగారి (1920-2020) శత జయంతి సంవత్సరం సందర్భంగా…

కళాకారుల కుటుంబంలో వందేళ్ళు (13-4-1920) క్రితం పట్టిన విన్నకోట రామన్న పంతులు ఈనాటి కళాకారునికి ఆదర్శప్రాయుడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే, బందరు నాటకరంగంలో జరిగిన నాటక ప్రదర్శనలు చూసి ప్రభావితులయ్యారు.
దరిమిలా, విజయవాడలో న్యాయవాది వృత్తి చేపట్టిన తరువాత కూడా నాటకరంగాన్ని విస్మరించలేదు. మంచి నాటకాలు రావాలనీ, వాటిని ప్రదర్శించాలని, తగిన పాత్రలను తృప్తిగా పోషించాలని తహ తహ లాడేవారు. న్యాయవాదిగా జీవితాన్ని సాగిస్తూనే, మరొక పక్క నటుడుగా నాటకాల్లో నటిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డారు. విజయవాడలో కొప్పరపు సుబ్బారావు గారు స్థాపించిన రాఘవ కళాకేంద్రంలో చేరి అనేక నాటకాలను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యమైనది D.V నరసరాజుగారు రాసిన “నాటకం” అనే నాటకం. దీంట్లో వీరి నటనకుగాను ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీలలో బహుమతి లభించింది.
వీరి జీవితంలో “కన్యాశుల్కం” నాటకం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేది ఇందులో ‘అగ్నిహోత్రావధానులుగా వీరి నటన నభూతో నభవిష్యతి”.

వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిదకొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే. తాంబోలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి”
ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నా ఆయన విశ్వరూపం మనముందు సాక్షాత్కరిస్తుంది. ఈ పాత్రని నాటకంలోనూ సినిమాలోను కూడా రామన్నగారు పోషించడం విశేషం. ఈయనకి ప్రత్యాయన్మాయం ఎవరూ లేరన్న విషయం అందరికి తెలుసు. నాటకాలతో బాటు సినిమాల్లో కూడా వైవిధ్య భరితమయిన పాత్రలు పోషించారు. వీటిల్లో ముఖ్యమైనవి “కన్యాశుల్కం” “బంగారుపాప” “దొంగరాముడు” “బాటసారి” “ఇల్లాలు”.
రామన్న పంతులు గారికి రేడియో అంటే ఇష్టం. రేడియోలో అనేక నాటకాల్లో ముఖ్యపాత్రలు ధరించారు. ముఖ్యంగా “సీతాపతి సంసారం” అనే గొలుసు నాటికలో సీతాపతి పాత్ర మర్చిపోలేని జ్ఞాపకం. అలాగే మంచి నడవడిక, వ్యక్తిత్వం, గర్వం ఇసుమంతలేని, మహామనిషి, తనకన్నా చిన్నవాళ్ళు దర్శకత్వం చేసిన రేడియో నాటకాల్లో ఇష్టపడి నటించేవారు. ఆయన కన్నా అన్ని విధాల చిన్నవాళ్ళమైనా రేడియో మిత్రులతో ఆప్యాయంగా వుండేవారు.

జంధ్యాలతో అనుబంధం
సాక్షి సినిమాలో బాపురమణలు ఆ పాత్రను మలచిన తీరు కూడా అద్భుతం. జంధ్యాల కూడా విన్నకోటవారితో తన సినిమాల్లో నటింపచేసి, గురుఋణం తీర్చుకున్నారు. వీరితో ముద్దమందారంలో కీలక పాత్ర వేయించారు. దర్శకుడిగా జంధ్యాలకు ఇదే మొట్టమొదటి సినిమా కూడా. జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా నటించింది విన్నకోటవారి కంపెనీలోనే కావడం విశేషం. రామన్నపంతులుకు ఆకాశవాణితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. వారి తుది శ్వాస వరకూ అనేక నాటకాలకు పాత్రపోషణ చేసి అలరించారు.

ఆయన శిష్యులలో చెప్పుకోదగ్గవారు జంధ్యాల, వీరభద్రరావు విజయరాం, ప్రదీప్. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన “ముద్దమందారం” ఆయన నటించిన సినిమా ఆఖరిది. దీంట్లో మూడు తరాలకు చెందిన ఆయన కుటుంబసభ్యులు పాల్గొనడం విశేషం. 1982లో వారి 62వ యేట విన్నకోట కన్నుమూసారు.
ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రనాటక కళాపరిషత్తు విజయవాడలో నిర్వహించిన ‘నాటక విద్యాలయం’లో నాటక నిర్వహణ, నటన, ప్రయోగం, మొదలయిన విషయాల మీద ఆధ్యాపకుడిగా నియమింపబడ్డారు. “నట శిక్షణ’ గురించి ఎన్నో పుస్తకాలు రాసారు.
ఈనాటి తరానికి ఆయన నటజీవితం ఒక స్ఫూర్తి. ఇటువంటి మహనీయుల అనుభవాలే నాటక రంగానికి దిక్సూచి.

శ్రీ బెల్లం కొండ నాగేధ్వరరావు

పువ్వు పుట్టుకతోనే తన పరిమళాన్ని వెదజల్లుతుంది కొందరు కళాకారులు అంతే ప్రధమ ప్రదర్శననుండి చివరి ప్రదర్శనవరకు వారి కళాప్రతిభ చూపించి ప్రేక్షకుల మనసును రంజింపజేస్తారు.ఆదే కోవకు చెందినవారు విన్నకోట రామన్న పంతులుగారు.

వీరు విజయవాడలో 1920/ఏప్రియల్ /13 వతేదిన వేంకట కృష్ణయ్య, అన్నపూర్ణమ్మగార్లకు జన్మించారు. అక్కడే గాంధీ మునిసిపల్ పాఠశాలలోనూ,కాకినాడలో ఎఫ్.ఏ.సి.ఆర్.కాలేజి,విజయనగరం మహరాణి కాలేజిలోనూ,పూనాలో న్యాయవాది పట్టాపుచ్చుకుని న్యాయవాదిగా వృత్తి కొనసాగాస్తూనే మరోపక్క నాటకాల్లో నటిస్తూ కళాసేవలు అందించేవారు.వీరు నటనకు,ఆహార్యానికి సంభంధించిన ఎన్నో మెలకువలు తనఉపన్యాసంలో పలుమార్లు వివరించేవారు. నటశిక్షణ, రూపశిల్పం,నాటక ప్రయోగం,రంగస్ధల శాస్త్రం,వాచికాభినయం ,మేకఫ్, మూకాభినయం,రససిధ్ధాంతం,ఆంగికాభినయం,లైటింగ్,రంగస్ధల నిర్మాణం,స్వాతికాభినయం మెదలైన విషయాలపై పుస్తకాలుకూడా రాసారు.తెలుగునేలపై మొదటి ప్రేక్షకులసంఘం’నటరాజ కళామండలి’ స్ధాపించారు.నాట్యసంఘం,మరియు రాఘవ కళాకేంద్రం కార్యదర్శగా సేవలు అందించారు.

1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు,కొప్పరపు సుబ్బారావు,డి.వి.సుబ్బారావు,కే.వి.ఎస్.శర్మ,నిర్మలమ్మ మోదలగు వారితోకలసి’కన్యాశుల్కం’నాటకాన్ని విజయవంతంగా పలుమార్లు ప్రదర్శించారు.అందులో అగ్నిహాత్రావధానులు పాత్రను వీరు గొప్పగా పోషించేవారు.ఇంకా ‘విశ్వం పెళ్ళి’-‘ఇనుప తెరలు’ మొదలగు నాటకాల్లో విలక్షణమైన పాత్రలు వీరు ధరించేవారు.అనంతరం డి.వి.నరసరాజు గారు రచించి ‘నాటకం’ అనే నాటకంలో ఒక మూఖ్యపాత్రను పోషిస్తూ నాటకరంగంలో మంచి నటుడిగా మరింత గుర్తింపు పొందారు.ఈనాటకానికి ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో అనేక బహుమతులు లభించేవి.వీరు ఉత్తమ దర్శకుడిగా’ అనేక నాటకాలలో బహుమతులు అందుకున్నారు. ‘వరవిక్రయం’-‘పెద్దమనుషులు’-‘ఈనాడు’-‘ఆసామి’-‘శ్రీరంగనీతులు’ ‘ఎన్.జి.వో,నాటకం,లేపాక్షి,సంభవామి యుగేయుగే, దశమగ్రహాలు, సీతాపతి సంసారం వంటి పలు నాటకాలు వీరి నటనకు వన్నెతెచ్చాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రారంభంనుండి వీరు మరణించేదాక అనేక నాటకాలు వినిపించేవారు.

జంధ్యాల,మురళీమోహన్,సుత్తివీరభద్రరావు,సుబ్బరాయశర్మ గార్లకు నటశిక్షణ ఇచ్చారు.తెలుగు రంగస్ధల,సినిమా నటుడు విన్నకోట విజయరాం గారు వీరికుమారుడే,టెలివిజన్,సినిమా నటుడు ప్రదీప్ వీరి మనమడే!

సినిమారంగంలోవీరు ప్రవేసించి తొలిసారిగా బి.యన్ రెడ్డి గారి ‘బంగారుపాప'(1954) ‘కన్యాశుల్కం'(1955) ‘దొంగరాముడు'(1955) ‘వరుడు కావాలి'(1957)’బాటసారి'(1961)’శ్రీకృష్ణ కుచేల'(1961) ‘చదువుకున్న అమ్మాయిలు'(1963)’రామదాసు'(1964) ‘ఇల్లాలు’ (1965) ‘శ్రీమతి'(1966) ‘సాక్షి'(1967)’ బంగారు పిచ్చుక'(1968) ‘స్నేహం'(1977)’ముద్దమందారం'(1981)’మల్లెల పందిరి'(1982) ‘ముగ్గురమ్మాయిల మొగుడు'(1983)(వీరి మరణానంతరం విడుదల జరిగింది) వంటి పలు చిత్రాలలో నటించారు.

తన అరవై రోండో ఏట 1982/ డిసెంబర్ /21 న కళామతల్లి పదసేవకై బ్రహ్మలోకం తరలి వెళ్ళారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71

71-‘’నరుడా ఏమి నీ కోరిక ‘’డైలాగ్ ఫేం,దశాబ్ది సినీ హాస్య మహారాణి –గిరిజ

గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.

గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందింది.

నేపధ్యము

1950 – 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యులు చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావు సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు రేలంగితో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. అన్నపూర్ణగుడిగంటలుఅప్పుచేసి పప్పుకూడుజగదేకవీరుని కథఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), ఎన్. టి. రామారావు (మంచి మనసుకు మంచిరోజులు), జగ్గయ్య (అత్తా ఒకింటి కోడలే), శివాజీగణేశన్ (మనోహర), హరనాథ్ (మా ఇంటి మహాలక్ష్మి), చలం (కులదైవం), జె. వి. రమణమూర్తి (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.

వివాహము, వ్యక్తిగత జీవితము[

గిరిజకు 17 యేళ్ళ వయసులో తల్లి మరణించింది. ఈమె వివాహము సి. సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో జరిగింది. వివాహం తర్వాత గిరిజ సన్యాసిరాజును నిర్మాతను చేయడానికి ప్రయత్నించింది. గిరిజ భర్త సన్యాసిరాజు, విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్, చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవటంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. మద్రాసు రెండంతస్థుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది. రేలంగి మరణించిన తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి. సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దెగదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, ‘భీష్మ‘ సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.

ఈమె కూతురు శ్రీరంగదాసరి నారాయణరావు నిర్మించిన మేఘసందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. ఆ తరువాత సలీమాగా అనేక మలయాళం సినిమాలలో నటించి మంచినటిగా పేరు తెచ్చుకున్నది.

నటించిన సినిమాలు

1.   నవ్వితే నవరత్నాలు (1951)

2.   పాతాళభైరవి (1951) (పాతాళభైరవి గా)

3.   ధర్మదేవత (1952) (వాసంతిగా)

4.   భలేరాముడు (1956)

5.   భలే అమ్మాయిలు (1957)

6.   దొంగల్లో దొర (1957)

7.   ముందడుగు (1958)

8.   రాజనందిని (1958)

9.   అప్పుచేసి పప్పుకూడు (1959)

10. మనోరమ (1959)

11. రాజా మలయసింహ (1959)

12. రేచుక్క పగటిచుక్క (1959)

13. ఇల్లరికం (1959) (కనకదుర్గ గా)

14. దైవబలం (1959)

15. పెళ్ళికానుక (1960)

16. భట్టి విక్రమార్క (1960)

17. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)

18. బాగ్దాద్ గజదొంగ (1960)

19. ఋణానుబంధం (1960)

20. కులదైవం (1960)

21. ఇంటికి దీపం ఇల్లాలే (1961)

22. జగదేకవీరుని కథ (1961)

23. భార్యాభర్తలు (1961) (అక్కినేని మాజీ ప్రేయసిగా)

24. వెలుగునీడలు (1961)

25. సిరిసంపదలు (1962)

26. ఆరాధన (1962)

27. పరువు ప్రతిష్ఠ (1963)

28. బందిపోటు (1963)

29. ఈడు జోడు (1963)

రాముడు-భీముడు (1964)

30. కలవారి కోడలు (1964)

31. ప్రేమించి చూడు (1965)

32. మంగమ్మ శపథం (1965)

33. నవరాత్రి (1966)

34. ఆస్తిపరులు (1966)

35. రహస్యం (1967)

36. ఆడదాని అదృష్టం (1974)

మా అమ్మపై ఇన్ని పుకార్లా-గిరిజ కుమార్తె సలీమా

నరుడా ఏమి నీ కోరిక’ డైలాగ్‌ ఆమెదే. సరదా సరదా సిగిరెట్టు ఇది దొరల్‌ తాగు బలె సిగిరెట్టు’ అని రేలంగి సరదా పడితే కంపుకొట్టు ఈ సిగిరెట్టు కాల్చకోయి నా పై ఒట్టు’ అని కసురుకుంది ఆమే. ఆరాధన’ సినిమాలో అక్కినేనినిసావిత్రిని తీవ్ర ఇక్కట్లకు తోసింది ఆమె కపటత్వమే. లవకుశలో రాముడి వేషం కట్టిన ఎన్టీఆర్‌కు సీతమ్మ వేషం కట్టిన అంజలీ పై మనసు విరిగిపోవడానికి కారణమైన రజకుని భార్య వేషం ఆమెదే. గిరిజ బ్లాక్‌ అండ్‌ వైట్‌ జమానాలో తెలుగు వారి కామెడీ స్టార్‌. రేలంగికి సరిజోడి. సెకండ్‌ హీరోయిన్‌గాక్యారెక్టర్‌ ఆర్టిస్టుగాకమెడియన్‌గా గిరిజ స్టార్‌డమ్‌ను చూసింది. వెలుగు నీడలు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆత్మబంధువు’, ‘నమ్మినబంటు’, ‘కులగోత్రాలు’, ‘ప్రేమించి చూడు’, ‘భార్యాభర్తలు’… ఎన్నో సినిమాలు ఆమె నటనకు ఆనవాలుగా నిలిచి ఉన్నాయి.

వెండితెరపై ఒక వెలుగు వెలిగిన గిరిజ ఆ తర్వాత ఏమైందో ఎవరికీ వివరాలు తెలియదు. సోషల్‌ మీడియా వాడుకలోకి వచ్చాక గిరిజపై ఆధారాలు లేని కథనాలు ఎన్నో అప్‌లోడ్‌ అవుతున్నాయి. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ నటి గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి సాక్షి’ చేసిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇది. తెలుగువారికి దాదాపుగా తెలియని గిరిజ కుమార్తెనటి సలీమా మొదటిసారిగా చెన్నై నుంచి ఇలా సాక్షి ద్వారా తెలుగు పాఠకులతో మాట్లాడారు. ఆ వివరాలు.
గిరిజ మరణించినట్టు పేపర్లలో వార్త వచ్చిందా?
సలీమా: నాకు గుర్తు లేదు. ఎవరూ రాసినట్టు లేదు. ఇండస్ట్రీవాళ్లు కూడా ఎవరూ వచ్చి చూడలేదు. అమ్మ చనిపోయిన రోజు అంతిమ సంస్కారాలు ముగిశాక – నాకు టైమ్‌ కూడా బాగా గుర్తు– రాత్రి 8.45కు శోభన్‌బాబు ఫోన్‌ చేశారు. నేను శోభన్‌బాబుని… అమ్మ చనిపోయినట్టు తెలిసింది… బాధపడకు… తెలుగు పరిశ్రమ ఎప్పుడూ నీకు తోడు ఉంటుంది.. ఏ కష్టం వచ్చినా రా అన్నారు. ఆయనొక్కరు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య గారు వచ్చి వెళ్లారు. అంతే. మీ అమ్మ చాలా దీనావస్థలో మమరణించారనినిరుపేద స్థితిలో మరణించారని ఇక్కడ వార్తలున్నాయి.

సలీమా: అది తెలుగు జర్నలిస్టుల ఊహాశక్తి అనుకుంటున్నాను. మా అమ్మ చనిపోయే సమయంలో టి.నగర్‌లోని మందిర అపార్ట్‌మెంట్స్‌లో మేం ఉన్నాం. అది నేను కొన్న నా సొంత ఫ్లాట్‌. ఆ అపార్ట్‌మెంట్స్‌లోనే దర్శకుడు కె.మురళీమోహనరావు, రాజ్‌ కోటీలలోని రాజ్, హీరోయిన్‌ రంజిత ఉండేవాళ్లు. మీరు వాళ్లను కూడా అడిగి కన్ఫర్మ్‌ చేసుకోవచ్చు.

 మీ అమ్మమ్మ నటి తిలకం మీ అమ్మ మద్రాసు వచ్చిన మూడేళ్లకే మరణించడం వల్ల మీ అమ్మకు సరైన దిశానిర్దేశం లేకుండా పోయిందని ఇక్కడ ప్రచారం.
సలీమా: ఎవరు ఇవన్నీ రాస్తున్నది? మా అమ్మమ్మ తిలకం ఫిబ్రవరి 24, 1995న మరణించారు. ఆమె చనిపోయిన ఆర్నెల్లకు అమ్మ పోయింది. మా నాన్న మమ్మల్ని వదిలిపోయాక మా అమ్మమ్మ, అమ్మ, నేను ఒక గూటి పక్షులుగా పెరిగాం. మా అమ్మమ్మ లేకపోతే మా అమ్మ, నేను ఏమయ్యేవారమో చెప్పలేము. మా అమ్మమ్మకు చిన్న వయసులోనే పెళ్లవడం వల్ల అమ్మ, అమ్మమ్మ అక్కాచెల్లెళ్లలా ఉండేవారు. ఇద్దరూ ఒకే సమయంలో చనిపోయారు.

మీ నాన్న సన్యాసిరాజుగారి వివరాలు చెబుతారా?
సలీమా: నాకు ఆయన గురించి ఎటువంటి ఆసక్తి లేదండీ.

మీకు గుర్తున్నవి?
సలీమా: నాకు గుర్తున్నంత మటుకు ఆయన మా అమ్మను బాగా హింసించేవాడు. నేను చాలా చిన్నపిల్లను. కాని అంత చిన్నవయసులో కూడా మా అమ్మ సఫరింగ్‌ తెలిసేది. మా అమ్మకు ఆయనను ఎవరు పరిచయం చేశారో తెలియదు. కాని తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారు. ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి మా అమ్మదే. ఆయనకు పెద్ద గ్యాంగ్‌ ఉండేది. మా అమ్మకు ఉన్న నీలిరంగు అంబాసిడర్‌ కారులో వాళ్లతో అర్ధరాత్రి వరకు తిరిగి, తాగి వచ్చేవాడు. మరుసటిరోజు కారు డ్రైవర్‌ వచ్చి ఆయన కారులో వాంతి చేసుకుంటున్నాడని గోల పెట్టేవాడు. ఒకసారి ఆయన ఏ వస్తువుతోటో మా అమ్మను తల మీద మోదితే పద్నాలుగు కుట్లు పడ్డాయి. నేనొకసారి పరిగెత్తుకుంటూ ‘డాడీ’ అని వెళితే కాలితో తన్నాడు. దొర్లి కింద పడ్డాను. ఆ తర్వాత ఆయన వైపు వెళ్లింది లేదు. ఆయన మంచి భర్త కాదు. మంచి తండ్రి కాదు. ‘నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చాలా బాగుండేదాన్ని. వివాహంలో స్త్రీకి సరైన పురుషుడు దొరక్కపోతే ఆమె జీవితం సగం దెబ్బ తిన్నట్టే’ అని మా అమ్మ అనేది.

మీ నాన్న రెండు సినిమాలు తీశారు కదా.
సలీమా: అవును. రెంటిలోనూ ఎన్టీఆరే హీరో. ఒకటి ‘భలే మాస్టారు’. రెండు ‘పవిత్ర హృదయాలు’. అందులో ఒక్కరూపాయి కూడా నాన్నది లేదు. అన్నీ అమ్మవే. చాలా గ్యారంటీ సైన్‌లూ అవీ అమ్మే చేసింది. సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అప్పుల బాధ పెరిగింది. ఒకరోజు పొద్దున నాన్న ఇప్పుడే వస్తానని వెళ్లి మళ్లీ కనిపించలేదు. మా ముఖం ఎప్పటికీ చూడలేదు. అమ్మమ్మ, అమ్మ, నేను… స్ట్రగుల్‌ అయ్యాం వాస్తవమే కాని పత్రికలు సానుభూతి కథనాలు రాసే స్థాయి కాదు.

 మీ పేరు సలీమా అని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. మీరు మతం మారారా?
సలీమా: లేదండీ. మా అమ్మ కలకత్తా కాళేశ్వరి దేవి భక్తురాలు. అక్కడకు వెళ్లి మొక్కుకుని వచ్చాక నేను పుట్టానని ఇంట్లో కాళమ్మ అని పిలిచేవారు. కాని ఆ తర్వాత అమ్మకు మౌంట్‌రోడ్‌లో ఉండే దర్గాపై గురి కుదిరింది. ఆ దర్గా ఇప్పటికీ ఉంది. రోడ్డు వైడెనింగ్‌లో ఆ దర్గాను తొలగించాలని ప్రయత్నించినవారు రక్తం కక్కుకు చచ్చారని కథనాలు ఉన్నాయి. అంత పవర్‌ఫుల్‌. ఆ దర్గావారు నాకు ఇచ్చిన పేరు సలీమా. నా అధికారిక పేరు, రికార్డ్స్‌లో ఉన్న పేరు సలీమాయే. కాని నాకు మత పట్టింపు లేదు. గుళ్లకు, చర్చిలకు, దర్గాలకు వెళతాను.

మీరు ఏం చదివారు?
సలీమా: ఇంటీరియర్‌ డెకరేషన్‌లో డిప్లమా చేశాను. కాని ఆ రంగంవైపు వెళ్లలేదు. అమ్మ ఇన్‌ఫ్లూయెన్స్‌ నా మీద ఉంది. చిన్నప్పుడే అమ్మ చీరలు కట్టడానికి ట్రై చేసేదాన్ని (నవ్వు).  నాకు టీనేజ్‌ రాగానే మోడలింగ్‌వైపు అవకాశాలు వచ్చాయి. అప్పట్లో టెక్స్‌టైల్‌ యాడ్స్‌ ఫేమస్‌. సుమంగళి టెక్స్‌టైల్స్, మహరాణి టెక్స్‌టైల్స్‌.. ఇలా దాదాపు 150 యాడ్స్‌ చేశాను. అక్కినేని నాగేశ్వరరావు కోరితే ‘మేఘసందేశం’ క్లయిమాక్స్‌లో ఆయన కూతురిగా యాక్ట్‌ చేశాను. ఆ సమయంలోనే అనుకోకుండా ఒక మలయాళ సినిమా మేనేజర్‌ నన్ను చూసి మలయాళంలో యాక్ట్‌ చేస్తారా అన్నారు. సరే అన్నాను. అలా టి.చంద్రకుమార్‌ దర్శకత్వంలో ‘నిజన్‌ పిరన్నా నట్టిల్‌’ (1985)లో నటించాను. మోహన్‌లాల్‌ హీరో. అయితే దానివల్ల గుర్తింపు రాలేదు. నటి కాంచనమ్మ రికమండేషన్‌తో ప్రఖ్యాత దర్శకుడు హరిహరన్‌ దర్శకత్వంలో ‘నఖక్షతంగళ్‌’ (1986)లో నటించాను. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇప్పటికీ నన్ను ఆ సినిమా హీరోయిన్‌గా అక్కడ గుర్తిస్తారు.

 మరి హీరోయిన్‌గా ఎందుకు కొనసాగలేకపోయారు?
సలీమా: మలయాళంలో నాలుగేళ్లలో 7 సినిమాలలో నటించాను. ‘సంసారం ఒక చదరంగం’ కన్నడ వర్షెన్‌లో కల్పన రోల్‌ నేనే వేశాను. కాని ఆ తర్వాత నేను చెన్నైలో రియల్‌ ఎస్టేట్‌ వైపు వెళ్లిపోయాను. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మలయాళం, తమిళ సినిమాలలో యాక్ట్‌ చేస్తున్నాను. మొన్న అంజలీ నటించిన ‘లీసా’లో చాలా మంచి రోల్‌ చేశాను. తెలుగులో అది రిలీజైంది.

మీరు మలయాళంలో చేస్తున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రాలేదా?
సలీమా: తెలుగు పరిశ్రమతో మాకు పెద్దగా కాంటాక్ట్‌ లేకపోవడం వల్ల ఏమీ రాలేదు.

 గిరిజగారికి ఫీల్డ్‌లో ఎవరు ఫ్రెండ్స్‌ ఉండేవారు?
సలీమా: సావిత్రిగారు మంచి ఫ్రెండ్‌. ఏ మాత్రం ఖాళీ ఉన్నా మా ఇంటికి వచ్చేవారు. ఆమెకు మా అమ్మమ్మ వంటలు ఇష్టం. నా తొలి బేబీ సైకిల్‌ ఆమే కొనిపెట్టారు. అమ్మమ్మ అప్పుడప్పుడు రేలంగి గారింటికి తీసుకువెళ్లేది. వాళ్ల భార్య శ్రీదేవమ్మ, కొడుకు బాబుగారు, కోడలు కుమారి గారు వీరు తెలుసు. అమ్మమ్మ చాలాసార్లు నాగేశ్వరరావు గారి గురించి చెప్పేది. సెట్‌లో కనపడితే మేకప్‌ కుర్చీలో కూర్చోబెట్టి ‘గుడివాడ తిలకమ్మ గుడిలోకి వచ్చింది’ అని పాడుతూ గిర్రున తిప్పేవారట. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో ఆయన చాలా అభిమానంగా ఉండేవారు. ఇక ఇండస్ట్రీ ఫంక్షన్స్‌ అంటే చిరంజీవి గారి పెళ్లికి అమ్మతో కలిసి వెళ్లిన జ్ఞాపకం ఉంది.

 గిరిజగారు ఎప్పడైనా తన నట జీవిత విశేషాలు చెప్పేవారా?
సలీమా: పెద్దగా లేదు. ఆమె తన వివాహ రోజులను, సినిమా రోజులను మర్చిపోయి జీవించాలి అన్నట్టుగా ఆమెను నేను చూసుకున్నాను. కాని అప్పడప్పుడు ఆమె నటించిన పాట ‘కాశీకి పోయాను రామా హరే’ పాడి ఆట పట్టించేదాన్ని. నిజం చెప్పాలంటే ఆమె పాటల్లో నాకు నాగేశ్వరరావుతో కలిసి నటించిన ‘హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి’ చాలా ఇష్టం.

సాక్షి: రేలంగి గారు గిరిజగారు చాలా సన్నిహితంగా ఉండేవారని… కాని గిరిజ గారు ఆయనతో అనుబంధం తిరస్కరించారనీ…
సలీమా: దాని గురించి నాకు తెలియదు. నా చిన్నప్పుడు అదంతా జరిగిందేమో తెలియదు.

మీరు సింగిల్‌గా ఉండటానికి మీ తల్లిగారి విఫల వివాహ ప్రభావం కారణమా?
సలీమా: అలా ఏం లేదు. జీవితంలో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెళ్లి చేసుకోబుద్ధి కాలేదు. నేను మగ ద్వేషిని కాను. నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పటికైతే పెళ్లి చేసుకోలేదు. మునుముందు చేసుకుంటానేమో తెలియదు. నాకు డాన్స్‌ వచ్చు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. డ్రైవింగ్‌ చాలా ఇష్టం. జీవితం నాకు నచ్చినట్టుగా ఉంది.

 తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
సలీమా: నేను గిరిజమ్మ కూతురుని. మా అమ్మ ఎన్నో తెలుగు సినిమాలు చేసింది. తెలుగు ఇండస్ట్రీ మీద నాకు హక్కు ఉంది. మా అమ్మ అక్కినేనితో పని చేసింది. వారబ్బాయి నాగార్జున ఫీల్డ్‌లో ఉన్నారు. ఎన్‌.టి.ఆర్‌తో పని చేసింది. వారబ్బాయి బాలకృష్ణ ఉన్నారు. వీరందరూ నాకూ ఇక్కడ స్థానం కల్పించాలని కోరిక. మంచి అవకాశాలు వస్తే హైదరాబాద్‌ షిఫ్ట్‌ అవ్వాలని ఉంది. నేను జీవితంలో చాలా రంగాల్లో పని చేశాను. కాని మేకప్‌ వేసుకొని కెమెరా ముందు నిలిచినప్పుడు పొందే ఆనందం మరెక్కడా పొందలేదు. ఒక నటి కూతురికి అనువంశికంగా వచ్చే సంపదా, ఆస్తి అదేనేమో.
ఖదీర్‌

రావి కొండలరావు మాటలలో –

రావీ కొందిలరావు కొందరు హీరోయిన్లుగా ప్రవేశించి, వోస్యనటులవుతారు. కొందరువాోస్యనటులుగా

వచ్చి హీరోయిన్లవుతారు. ‘ఇందులో తొలి మాట ప్రకారం చూస్తే ఒక గిరిజ కనిపిస్తుంది.
కస్తూరి శివరావు తానే నిర్మాతగా దర్శకుడిగా తీసిన ‘పరమానందయ్య శిష్కులు”
(1950)లో గిరిజని నాయికగా పరిచయం చేశాడు శివరావు. అందులో అక్కినేని
నాయక పాత్రధారి. గిరిజ తల్లి దాసరి తిలకం. నాటి
నాటకాల్లోనూ, సినిమాల్లోనూ నటించారామె. “
యస్‌.విరంగారావు ప్రవరుడిగా, తిలకం
, వరూథినిగా నటించిన “వరూధిని”
స తిలకం తొలిచిత్రం కావచ్చు.
1 అంతకు ముందు చిన్నచిన్న
వేషాలు వేసినట్టు తెలుస్తున్నా!
1946లో ‘వరూధిని’ విడుదలై  దెబ్బతిన్నది  ‘పరమానందయ్య శిష్యులు’లో గిరిజ అందంగానే కనిపించింది. బాగానే వశీ
వుందనిపించినా, అక్కినేని పక్కన నటించినా, చకచకా పాత్రలు రాలేదు.
ఒకటి రెండు సినిమాల్లో సాదా పాత్రలు ధరించిన తర్వాత, హాస్యనటుల
ప్రక్కన నటించి, ‘హాస్యనటి’గా మారిపోయింది. ఈ మార్చుకి కొన్నేళ్ళు
పట్టినా, తర్వాత ఆ హాస్య పాత్రలు ఆమెను స్థిరపరిచాయి. హాస్య
నటులందరి పక్కనా ఆమె నటించినా, రేలంగితో ఎక్కువగా నటించజంతో
అదో జంటగా నిలబడి పోయింది – ‘రేలంగిరిజంట’గా అప్పుచేసి
పప్పుకూడు, భార్యాభర్తలు, కులగోత్రాలు, రాముడు భీముడు,
జగదేకవీరునికథ, పెళ్లికానుక మొదలైన సినిమాలు గిరిజని చక్కని
హాస్యనటిగా గుర్తు చేస్తాయి.
1961లో ‘పెండ్లి పిలుపు’ షూటింగు. అందులో ఆమె రేలంగి పక్కనే.
పల్లెటూరి పాత్ర. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడే పాత్ర, ఆరుద్రగారు
రచయిత. పూసపాటి కృష్ణంరాజు (క్రీశ) అప్పుడు సినిమాల్లో
వుండేవాడు. తక్కువ కథలు రాసినా మంచివి రాశాడు. రాసినవన్నీ   ఉత్తరాంధ్ర భాషలోనే రాశాడు. అంచేత ఆరుద్రగారు అతన్ని ఆ కంపెనీలో
పెట్టి గిరిజ సంభాషణలు, సంబడం చూడమన్నారు. ఆ గిరిజ
బాత్‌రూమ్‌లోకి వెళ్లి, షవర్‌ తిప్పితే భళ్లున నీళ్ళొస్తాయి. “ఓలమ్మ వాన,
వాన పడిపోతంది” అని పరుగెత్తుతుంది. కృష్ణంరాజు వూరుకోలేదు. డైలాగు
సరిదిద్దడానికి (ప్రయత్నించాడు.
“ఓలమ్మవోన, వోనడిపోతంది” అని
చెప్పాలన్నాడు. అవి డబ్బింగ్‌లో
సర్దుకో వచ్చులే అన్నరోజులు కావు.
అక్కడికక్కడే రికార్డింగు. “వోనేంటి
వోన! వోనడిపోతంది – అంటే అర్ధం
కాదు. మరీ అంత యాసలోకి వెళితే,
అక్కడి వాళ్లకి అర్ధం కావచ్చునేమో
గాని, తక్కిన ప్రాంతాల వాళ్లకి
అసలు అర్లం కాదు. అంచేత వాన
అనీ, పడిపోతంది అనీ అంటాను”
అని గిరిజ వాదించారు. “ఆమె చెప్పింది కరక్టే – మరీ ఇంటీరియర్‌ భాష  వొద్దులెండి ” అని నిర్మాత
డి.బి.నారాయణ గిరిజనే సమర్థించారు.
గిరిజ సంతోషించింది కాని కృష్ణంరాజు
సంతోషించలేదు. “భాషని ఖూనీ
చేస్తున్నారే” అని బాధ పడిపోయాడు.
షాట్‌ అయిపోయిన తర్వాత “అక్షరాల్లో
తేడా వున్నా, యాసలో తేడా రాదు.
యాస గనక సరిగ్గా వస్తే ఏ అక్షరం
పడినా ఇబ్బంది వుండదు” అని గిరిజ
అంది. కృష్ణంరాజు ఒప్పుకున్నాడు.
“మంచి స్టడీ వున్న ఆర్టిస్టు” అని
ఆరుద్రగారు సర్టిఫికేట్‌ ఇచ్చారు. గిరిజ
సంభాషణలు శుభ్రంగా వినిపిస్తాయి. ఏ అక్షరమూ పొల్టు పోదు. ఎక్స్‌ప్రెషన్‌
వుంటుంది. మంచి కళ్ళు గనుక, కళ్లు కూడా ఆమెతో పాటు నటించి,
సహకరించి, పకపకమనిపిస్తాయి.
అప్పటి నటీమణులకు మంచి సంప్రదాయాలు, అలవాట్లూ వుండేవి,
పండగా పబ్బం వస్తే ఇంటి నుంచి గారెలో, బూరెలో పెద్ద “హేత్రలలో
తెచ్చి, చిన్నా పెద్దా అందరికీ ఇచ్చేవారు. ఆ ఆప్యాయతాభిమానానురాగాల  అలాంటివి. సూర్యకాంతం, గిరిజ, షావుకారు జానకి, కృష్ణ పమూరి సెట్టుకి
వస్తే “ఏదో తెచ్చి వుంటారు – ఇస్తారు” అని ఎదురుచూసే వారు అంతా.
గిరిజకి తేనాంపేటలో పెద్దమేడ వుండేది, మేడమీద ఏర్‌కండిషన్‌ గదులు.  పెద్ద కారుండేది. ఎంతో దర్జాగా హీరోయిన్‌ స్థాయిలో కనిపించిన గిరిజ
ఎందుకో ఎలాగో రానురాను చితికి పోయింది. క్‌ మేడ, ఆ కారూ అవన్నీ
ఏమైపోయినాయో తెలీదు. మనిషి బక్కచిక్కిపోయి, పాలిపోయింది.
సినిమాలు తగ్గిపోయాయి. ఓ సినిమాలో గుడిసెలో వుండే ఒక బీద పాత్రకి
ఆవె పర్పనాలిటీ సరిపోతుందని
ఇచ్చారు. మూడు రోజులు షూటింగ్‌
చేశారు. తర్వాత ఆమెను మార్చి ఆ పాత్ర
| ఇంకొకరికి ఇచ్చారు! కారణం – ఆ
“| పాత్రకి పూర్వకథ వుందిట. ఆ కథలో
ఆవె బాగా ఐళ్వర్యవంతురాలు.
|| రానురాను ఆన్తిపాన్తులు పోయి,
చెడిపోయి. పేదది
అయిపోతుంది. “పేదకి పర్సనాలిటీ
సరిపోతుంది గాని, ముందు దృశ్యాల
మాటేమిటి?” అని దర్శకుడు, నిర్మాత
చర్చలు చేసి ఆమె పారితోషికం కొంత
చెల్లించి, ఆమెను మార్చేశారు. అటు తర్వాత ఆమె మరీ దౌర్భాగ్యస్థితి
అనుభవించింది. ఎక్కడి హాస్య పాత్రలు, ఎక్కడ గిరిజ? అంతటి దీనావస్ ‘సినిమా వారికి ఇది శాపం’ అని సర్ది చెప్పుకున్నా –
జరిగి (తిరగేస్తే గిరిజ)న స్థితి తలచుకుని,
చివరిదశ తలచుకుంటే ఆ గాధ పెద్దబాధే!
ఒక ఊపు వూపి, జనాన్ని తెగనవ్వించిన జంట,
రేలంగిరిజంట. ఆయా పాత్రల్లో గిరిజలేని రేలంగినీ,
రేలంగి లేని గిరిజనీ ఊహించుకోలేం. 
 సినిమా లన్నీ హాస్యంతో ని౦పేసిన గిరిజ జీవితం చివరి రోజుల్లో కష్టాలకడలి లో మునిగిపోవటం బాధ కలిగిస్తుంది కులదైవం వెలుగు నీడలు ,

జగదేక వీరునికద ,ఆరాధన సినిమాలలో గిరిజ చిరస్మరణీయమైన నటన ప్రదర్శించింది .

  సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -15-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కోటి లింగ శతకం

కోటి లింగ శతకం

కోటిలింగ శతకాన్ని శ్రీ సత్యవోలు అప్పారావు గారు రచించగా 1912లోరాజమండ్రి లోని  మనోరమా ,బ్రౌన్ ఇండష్ట్రియల్ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల-మూడు అణాలు .ఈశతకం రాజమండ్రి లోని  ‘’మానవ సేవా ‘’పత్రికలో మొదట ప్రచురించబడింది .పత్రిక సంపాదకులు శ్రీ నాళం కృష్ణారావు గారు ,శ్రీసత్యవోలు అప్పారావు గార్లు .ఈ పత్రిక సంవత్సర చందా 3రూపాయలే .అభిమానులు 5రూపాయలు ,పోషకులు 10రూపాయలు ,రాజపోషకులు వారి వదాన్యత బట్టి చేరవచ్చు .ఈ పత్రిక ప్రచురణలు –కబీరు, బంగాళాదుంప ,అగ్గిపెట్టెల పరిశ్రమ ,లోకపావన శతకం ,కోటిలింగ శతకం ,స్త్రీలకు మనం చేసే పంచ మహాపాతకాలు ,వీరమతి నాటకం ,కవికొండల వెంకటరావు గారు రాసిన ‘’భారతీయ సందేశం’’ భాణ0,భక్తీ తరంగిణి ,.ఇవన్నీ చాలా తక్కువ ధరలకే అందిస్తున్నట్లు ఈ శతకం లో రాశారు .

  కోటిలింగ శతకం సీసపద్యాల శతకం .’’కుటిల జనభంగసత్సంగ కోటిలింగ’’మకుటం .’’శ్రీల చెలంగు నీ క్షితి జీవరాసులసతతంబు గాపాడు సామి ఎవరో ‘’అని మొదలుపెట్టి మొదటి పద్యాన్ని –కలిసిమెలసి యుండు నరులకు గష్ఠంబు లుండ కున్నే –కుటిల జనభంగ సత్సంగ కోటిలింగ ‘’అని ముగించారుకవి .అన్ని పదార్ధాలు సమకూర్చి జీవులను కృపామతి చూసే పంట కాపు ,అంధకారాన్ని పోగొట్టే చందమామ ,మనసులో జ్ఞాతేజం కూర్చే ప్రభాకరుడు శాంతాది గుణాలిచ్చే సంప్రదాత,ఉన్నవాడు లేడను కొన్నవాడు మానసోద్యానంలో విహరిన్చేవాడు అని రెండో పద్యం .ధర్మ సత్య శౌచాలు లేకుండా ఎన్ని తపాలు జపాలు చేసినా ప్రయోజనం లేదనీ ,దేహం అస్థిరం అని తెలుసుకోవాలని ,స్నానాలు ఉపవాసాలు చేస్తే మోక్షం రాదు నీటిలో ఉండే చేపలు మోక్షం పొందుతాయా అన్నాడు   .సాధువుల వద్ద కుటిలాత్ముల ఆటలు సాగవు ,నడవడి సరిగ్గా లేకపోతె ప్రక్కవారిని మోసం చేస్తారు,పరమపావనులైనా పడతి కనిపిస్తే మదనార్తి పొందుతారు ,తుంటరి వారి వెంట  వెళ్ళరాదు.పలుగాకితో ఉండే పండితుడు కోతిచేతిలో పువ్వు ,పాము నోట్లోకప్ప ,చలిచీమల మధ్య పాము ,పాదరసంలో ఈదులాడే బంగారం అని జాగ్రత్తలు చెప్పాడు . అంతాఒక్కటే అనుకొంటే సహనం ,బీదల్ని ఆదరిస్తే పిసినిగొట్టుతనం ,విద్యా బుద్ధులు నేర్పిస్తే గర్వం ,మరులు చిక్కబెడితే  ,మన్మధుడు పారిపోతారు పతిలేని భామ అడవి కాసిన వెన్నెల ,ఆడవారిని చులకన చేస్తే నష్ట పోతారు ,కార్యసాధకుడు ఏది లేకపోయినా బాధపడడు ,దూరదేశం వెళ్ళటానికి సందేహించడు .

  మకరందాన్ని చిమ్మే మల్లెపువ్వును గొంగళి పురుగు కొరికినట్లు క్రోమ్మావి పండ్లను చిన్నచీమలుకొరికినట్లు ,కమలాల మకరందాన్ని  తేనే టీగలు ఇష్ట మోచ్చినట్లు  జుర్రినట్లు ‘’పరమ పావనులగు వారి పజ్జ జేరి సద్గుణంబుల గ్రహియింప జాలని దుర్జనులు ‘’అన్నాడు .విత్తమార్జించే వేళ మావాడని బంధువులు మూగుతారు,భాగ్యం ఉంటె పరమపావనుడు అని పొగుడుతారు ,లేమికలిగితే దగ్గరకు కూడా రారు పలకరించరు.భాగ్య వంతులమని గొప్పలు చెబుతారుకానీ పిల్లికి బిచ్చం పెట్టరు .కాషాయం రుద్రాక్ష మాలలు ధరిస్తే మనసులోని చెడు తొలగిపోదు .బాల్యం లోఆటలపై ,యవ్వనం లో తరుణులపై కౌమారం లో కడగండ్లు ,.బ్రతికి ఉన్నప్పుడు బ్రహ్మ౦ గురించి ఆలోచించరు ,దారిద్ర్య దేవతను తరమాలంటే చేతి పనులు నేర్వాలి .బ్రహ్మా౦డమంతా  ప్రజ్వరిల్లుతూ మానస వీధిలో ఉండేది ,అణురూపంపొంది అనవరతం చావు పుట్టుక లేక జరిగేది ,పుత్ర మిత్రాదుల రూపంలో దేహం లో తిరిగేది ఆదిమధ్యాంత శూన్యమైనది అయిన పరమాత్మ నిత్యం అని బోధ చేశాడు .చివరగా 100వ పద్యం లో –

‘’కస్తూరికార్ణవ గర్భ వీచిమ తల్లి కడుపార నెవ్వాని గన్నతల్లి –దీన జనంబుల సీమ మానససీమ లెవ్వడు ఫలియింప గ జేయు కాపు పంట

విద్యార్ధి వత్సల వెత దీర్చి ఎవ్వాడు పరితుష్టి నొందించు పాడి మొదవు –ఆర్తజనంబుల ననిశంబు నెవ్వాడు కరుణమై కాపాడు కల్ప శాఖి

యతడు వెలుగొందు రామరావనగ బుధులు –కరము నొగడగ గొ౦గు బంగారమౌచు

వానికిది పూలహారమై వరలుగాక –కుటిల జనభంగసత్సంగ కోటి లింగ’’

 ఆ రామారావు ఎవరో చెప్పలేదు .కోటిలింగం శతకమే కానీ ఏ లింగాన్నీ పేర్కొనలేదు .శతకమంతా మానవ విలువలగురించి చెప్పాడు కవి .కవిత్వం ఉరకలు వేసింది .మనసును తాకే పద్యాలే ఇవిచదివిఆచరిస్తె మానవత్వం వికసించి జగతి గొప్ప అభి వృద్ధి చెందుతుంది .ఈశాతకమూ ఈకవిపేరు మన వాళ్ళు ఎవరూ ఎక్కడా ముచ్చటించిన దాఖలాలు లేవు .నాళం కృష్ణారావు గారి గురించి లోకానికి బాగా తెలుసు .ఈ శతకం ,ఈ కవినీ పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70

70-శాస్త్రీయ సంగీత సుస్వరాల లీలాహేల సంగీత దర్శకురాలు  -పద్మ భూషణ్  కలైమామణి-పి.లీల

పొరయత్తు లీల (మే 191934 – అక్టోబరు 312005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళమలయాళతెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశమాయాబజారుపాండవవనవాసంరాజమకుటంగుండమ్మకథచిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1]

లీల మే 191934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణంతో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మలయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మన దేశం.

జన్మించింది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నైనా, సంగీతం మీద పి. లీలకున్న అభిరుచి కారణంగా సంగీతం నేర్పించాలనే తలంపుతో పి. లీల తండ్రి మద్రాసులో మకాం పెట్టారు. ఆది నుంచి తెలుగువారి ప్రోత్సాహం పొందడం వల్ల తెలుగువారన్నా, తెలుగు భాష అన్నా లీలకు చాల ఇష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ తన తొమ్మిదో ఏడాదే సంగీతకచేరి చేసారు పి.లీల. ఆంధ్రమహిళా సభలో తొలిసారి సంగీత కచేరి చేసిన ఆమెకున తెలుగు భాషమీద అభిమానం. ప్రేమ పెరిగింది. ‘భక్త తులసీదాసు’ చిత్రంకి బృందగానంలో ఒకరిగా పాడారు. తరువాత ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపురసుందరీ….. అనే పాటను ఘంటసాల ప్రోత్సాహంతో పాడారు. అప్పటికి తెలుగు మాట్లాడడం, అర్ధం చేసుకోవడం లీలకు తెలియదు. అందుకే మలయాళంలో ఆ పాట రాసుకుని పాడారట. తెలుగు భాష రాకుండా తెలుగు పాటలు పాడితే బాగుండదని తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారి వల్లనే గాయనిగా తనకు ప్రముఖ స్థానం లభించిందని పి. లీల అనేవారు. ఆకాశవాణిలో కూడా పాటలు పాడుతున్న పి.లీలను చూసి తొలుత ‘కంకణం’ తమిళ చిత్రంలో పాడించారు. ఈ చిత్రంలో పాడటానికి ముందుగానే కొలంబియా గ్రామఫోన్‌ కంపెనీ సరస్వతి స్టోర్స్‌ పి. లీల పాడిన ప్రయివేటు గీతాలను రికార్డులుగా విడుదల చేసారు. సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బరామన్‌ సంగీతం సమకూర్చే తమిళ చిత్రాలకు పాటలు పాడుతూ, ఆయన వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లీల.

ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపుర సుందరి… పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్‌ ప్రారంభం అయింది. కీలుగుర్రంలో దిక్కు తెలియదేమి సేతు, గుణసుందరికథలో ‘ఓ మాతా రావా, మొర వినవా…’ ‘ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా …,’ కల్పకమ తల్లివై ఘనత వెలిసిన గౌరి…, ‘ఏ ఊరు ఏలినావో…’ శ్రీతులసీ ప్రియ తులసీ పాటలను, ‘పాతాళభైరవి’ చిత్రంలో ‘తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమె హాయి. కలవరమాయె మదిలో, నా మదిలో, ఎంత ఘాటు ప్రేమయో…, ‘పెళ్ళిచేసి చూడు’లో ‘మనసా నేనెవరో, నీకు తెలుసా…’ ఏడుకొండలవాడా వెంకటరమణా, ఎవరో…ఎవరో, చంద్రహారంలో ‘దయ గనవే తల్లిd…’ కృప గనవా నా మొర వినవా…’ ఏ సాధువులు ఎందు హింసలు బడకుండ… అని సాగే పద్యం, ‘మిస్సమ్మ’లో ‘తెలుసుకొనవె చెల్లిd…’ ‘కరుణించు మేరిమాతా…’ ‘రావోయి చందమామా…’ ‘ఏమిటో ఈ మాయా…’ ‘మాయాబజార్‌’లో ‘నీవేనా నను తలచినది..’ ‘చూపులు కలసిన శుభవేళా…’ ‘విన్నావ యశోదమ్మా..’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, నీ కోసమే నే జీవించునది… పెళ్ళి నాటి ప్రమాణాలులో ‘వెన్నెలలోనే వేడి ఏలకో..’ నీతోనే లోకము, నీతోనే స్వర్గము, లాలి మా పాపాయి ఆనందలాలీ…’ ‘అప్పుచేసి పప్పుకూడు’లో ‘రామనామ శరణం, భద్రాద్రిరామ శరణం’, ‘ఎచట నుండి వీచినో ఈ చల్లని గాలి’, ‘సుందరాంగులను చూసిన వేళల…,’ ‘ఆనందం పరమానందం..’ ‘చేయి చేయి కలుపరావె హాయి హాయిగా…,’ గుండమ్మకథలో ‘వేషము మార్చెను…’ ముద్దుబిడ్డలో జయమంగళ గౌరీదేవీ… ‘పాండవ వనవాసం’లో దేవా దీనబాంధవా… వంటి పాటలు సోలో గీతాలుగాను, యుగళగీతాలుగాను పాడారు లీలగా. తెలుగు చిత్రరంగంలో నిలదొక్కుకోడానికి, తెలుగు గాయని కాబోలు అని అనిపించుకోడానికి ఘంటసాల ప్రధాన కారకులైతే, సి.ఆర్‌, సుబ్బరామన్‌, ఓగిరాల రామచంద్రరావు, విజయా కృష్ణమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్‌ వేణు, టి.వి.రాజు, ఎస్‌.రాజేశ్వరావు, పెండ్యాల ఇలా పలువురు సంగీత దర్శకులు, విజయా సంస్థ , నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహం మరుపురానిదనేవారు పి.లీల.

తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

లీలపాడిన పాటల్లో అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం, ఏమిటో ఈ మాయా…, లవకుశలో సుశీలతో కలిసి పాడిన పాటలు ఎంతో హాయినిస్తాయి.

సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.

సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, మెలొడీకి, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి వాయిద్యాల హోరు పెరిగి పోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని స్థితి కారణంగా జమునారాణి, ఎ.పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.

 • SIతన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీల 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

తెలుగు సినిమారంగం

ఈమె 1949 నుండి 1984 వరకు అనేక తెలుగు సినిమాలో పాటలు పాడింది. చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీతాన్ని సమకూర్చింది[2].

పి.లీల తెలుగు చిత్రాలలో పాడిన సినిమ పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయనిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
1మనదేశంబాలత్రిపురసుందరీఘంటసాల1949
2కీలుగుర్రందిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మిఘంటసాలతాపీ ధర్మారావు నాయుడు1949
3కీలుగుర్రంనిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబోఘంటసాలతాపీ ధర్మారావు నాయుడు1949
4గుణసుందరి కథఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
5గుణసుందరి కథఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
6గుణసుందరి కథకల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతినిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
7గుణసుందరి కథచిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటేకస్తూరి శివరావుఓగిరాల రామచంద్రరావుపింగళి1949
8గుణసుందరి కథశ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవేఓగిరాల రామచంద్రరావుపింగళి1949
9లైలా మజ్నుఅందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపుకె.జమునారాణిసి.ఆర్.సుబ్బరామన్సముద్రాల సీనియర్1949
10శ్రీ లక్ష్మమ్మ కథఇది నా విధికృతమా గతిమాలిన జన్మ యిల బాధలకేనాసి.ఆర్.సుబ్బరామన్1950
11శ్రీ లక్ష్మమ్మ కథచిన్నారి బంగారు చిలకవే నా తల్లి చిగురుమావులలోనబృందంసి.ఆర్.సుబ్బరామన్1950
12శ్రీ లక్ష్మమ్మ కథజీవితమే వృధాయౌనో సుఖించే ఆశలు మాసెనోబృందంసి.ఆర్.సుబ్బరామన్1950
13అగ్నిపరీక్షవసంత రుతువే హాయి మురిపించి మించెనోయిగాలిపెంచలకె.జి. శర్మ1951
14పాతాళ భైరవిఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటుఘంటసాలఘంటసాలపింగళి1951
15పాతాళ భైరవికలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలేఘంటసాలఘంటసాలపింగళి1951
16పాతాళ భైరవితీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంతబృందంఘంటసాలపింగళి1951
17పాతాళ భైరవిహయిగా మనకింక స్వేచ్ఛగాఘంటసాలఘంటసాలపింగళి1951
18సర్వాధికారిఅందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలుసుసర్ల దక్షిణామూర్తి1951
19చిన్నమ్మ కథకనుపించినావు రావో రాకున్న విడువనోయీవేలూరు కృష్ణమూర్తి1952
20పెళ్ళి చేసి చూడుఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరాఘంటసాలఘంటసాలపింగళి1952
21పెళ్ళి చేసి చూడుఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవుఘంటసాలపింగళి1952
22పెళ్ళి చేసి చూడుప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా యుగపిఠాపురం,
రామకృష్ణ
ఘంటసాలపింగళి1952
23పెళ్ళి చేసి చూడుమనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసాఘంటసాలపింగళి1952
24మిస్సమ్మఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
25మిస్సమ్మకరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాతఎస్.రాజేశ్వరరావుపింగళి1955
26మిస్సమ్మతెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
27మిస్సమ్మరాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసాసి.కృష్ణవేణిఎస్.రాజేశ్వరరావుపింగళి1955
28మిస్సమ్మరావోయి చందమామ మా వింత గాథ వినుమాఎ.ఎం.రాజాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
29చరణదాసిఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరముఎస్.రాజేశ్వరరావు1956
30చింతామణితగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునాఅద్దేపల్లి రామారావు,
టి.వి.రాజు
1956
31చిరంజీవులుఅల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవిఘంటసాల బృందంఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
32చిరంజీవులుఎందాక ఎందాక ఎందాక అందాక అందాకఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
33చిరంజీవులుఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననేఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
34చిరంజీవులుకనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైనఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
35చిరంజీవులుచికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసుఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
36చిరంజీవులుతెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరాఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
37భలే రాముడుఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేలఎస్. రాజేశ్వరరావుసదాశివబ్రహ్మం1956
38హరిశ్చంద్రఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మసుసర్ల దక్షిణామూర్తిజంపన1956
39దొంగల్లో దొరవిన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాలఘంటసాలఎం.ఎస్.రాజునారపరెడ్డి1957
40మాయాబజార్చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరముఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
41మాయాబజార్దయచేయండి దయచేయండిఘంటసాల,
పి.సుశీల
ఘంటసాలపింగళి1957
42మాయాబజార్నీకోసమె నే జీవించునదిఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
43మాయాబజార్నీవేనా నను తలచినదిఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
44మాయాబజార్లాహిరి లాహిరి లాహిరిలోఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
45మాయాబజార్విన్నావటమ్మా ఓ యశోదమ్మాపి.సుశీల,
స్వర్ణలత
ఘంటసాలపింగళి1957
46వినాయక చవితిఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరాఘంటసాలసముద్రాల సీనియర్1957
47వినాయక చవితితనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతోఘంటసాలసముద్రాల సీనియర్1957
48వినాయక చవితిరాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరాఎం.ఎస్.రామారావు బృందంఘంటసాలసముద్రాల సీనియర్1957
49సతీ అనసూయఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతాఘంటసాలసముద్రాల జూనియర్1957
50సారంగధరజయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారిఘంటసాలసముద్రాల సీనియర్1957
51అప్పుచేసి పప్పుకూడుఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పైఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1959
52పెళ్ళి సందడిఅప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడాఘంటసాలసముద్రాల జూనియర్1959
53సతీ సుకన్యఅందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనేఘంటసాలశ్రీరామచంద్1959
54భక్త రఘునాథ్హేశివశంకరా నమ్మినవారి కావగలేవా మమ్మిటుచేయుట న్యాయమాఘంటసాలసముద్రాల సీనియర్1960
55మహాకవి కాళిదాసురసికరాజమణిరాజిత సభలో యశము గాంచెదవే సోదరిరత్నంపెండ్యాలపింగళి1960
56శాంతి నివాసంకలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపేఘంటసాలసముద్రాల జూనియర్1960
57శాంతి నివాసంసెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోనఎ.పి.కోమల బృందంఘంటసాలసముద్రాల జూనియర్1960
58జగదేకవీరుని కథజలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలాపసుశీల బృందంపెండ్యాలపింగళి1960
59ఋష్యశృంగఆనందమీనాడే పరమానంద మీనాడేటి.వి.రాజుసముద్రాల జూనియర్1961
60సీతారామ కళ్యాణంఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేరఘంటసాలగాలిపెంచలసముద్రాల సీనియర్1961
61శ్రీకృష్ణ కుచేలనీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైనఘంటసాలఘంటసాలపాలగుమ్మి పద్మరాజు1961
62గుండమ్మ కథవేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెనుఘంటసాలఘంటసాలపింగళి1962
63మహామంత్రి తిమ్మరుసుజయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగాఘంటసాలపెండ్యాలపింగళి1962
64ఆప్తమిత్రులుపవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగఎ.పి.కోమలఘంటసాలసముద్రాల జూనియర్1963
65రాణీ సంయుక్తఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలాఘంటసాలఎం.రంగారావుఆరుద్ర1963
66లవకుశజగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడేఘంటసాల, పి.సుశీల, వైదేహి, పద్మామల్లిక్ఘంటసాలసముద్రాల సీనియర్1963
67లవకుశరామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
68లవకుశరామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
69లవకుశలేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలోపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
70లవకుశవినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
71లవకుశశ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
72సోమవార వ్రత మహాత్మ్యంఅడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడిమాస్టర్ వేణునార్ల చిరంజీవి1963
73పతివ్రతరావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణాఎం.రంగారావుఅనిసెట్టి1964
74పతివ్రతనీ చెలికనవో నీ చెలి గనవా చలించవామాధవపెద్దిఎం.రంగారావుఅనిసెట్టి1964
75పతివ్రతలేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తిబృందంఎం.రంగారావుఅనిసెట్టి1964
76పతివ్రతసా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవోపి.బి.శ్రీనివాస్ఎం.రంగారావుఅనిసెట్టి1964
77బభ్రువాహనఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరాపామర్తిసముద్రాల సీనియర్1964
78రహస్యంశ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళాఘంటసాలమల్లాది1967
79శ్రీకృష్ణ మహిమకృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనాఎ.పి.కోమలఘంటసాలఅనిసెట్టి1967
80శ్రీకృష్ణావతారంవిన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలుబృందంటి.వి.రాజుసి.నా.రె.1967
81తారాశశాంకమునీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పసపి.సుశీలటి.వి.రాజుసముద్రాల సీనియర్1969
82మా ఇలవేల్పుగౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరిజిక్కిజి.కె.వెంకటేష్సి.నా.రె.1971

మరణం

లీల అక్టోబర్ 31 2005 న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వల్ల పరిస్థితి విషమించింది.[3]

ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింద

 మధుర గాయని లీల –విశాలాంధ్ర

సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 50 యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే అనిచెప్పకతప్పదు. అలా పాతతరంనాటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్టచేసి నేటికి పాడుకునేలా చేయగలిగిన గాయనీమణుల్లో పి.లీల ఒకరు.

దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషచిత్రాల్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. అలాగే బెంగాలీ, సింహాళ చిత్రాలలో కూడా పాటలు పాడారు. కేవలం సినీపాటలే కాదు భక్తిగీతా లను సైతం అద్బుతంగా ఆలపించారు. భారతదేశం గర్వించదగ్గ సంగీతసరస్వతులు ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి, ఎం.ఎల్‌. వసంతకుమారి, డి.కె. పట్టామ్మాళ్‌ వంటి వారి సమకాలీకురాలు కావడం ఆమెకు సంగీతంపై మక్కువకు కారణంకావచ్చునేమో. కేరళ, పాలక్కడ్‌ లోని చిట్టూర్‌లో 1934 సంవత్సరంలో పుట్టారు పొరయాతు లీల.లీలతో పాటు ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. తల్లితండ్రులు సంగీతప్రియులు కావడంతో లీలకు స్వతహాగానే సంగీతంపై మక్కువ ఏర్పడటం గమనించి ఆమెకు కర్నాటక సంగీతం నేర్పించారు తల్లిదండ్రులు. ఆమె గొంతు కొద్దిగా లావుగా ధ్వనించేదని విమర్శించినా అదే పాటకు నిండుదనం తెచ్చిందని చెప్పాలి. అద్భుతమైన గాత్రం ఆమెకు ఓ వరం. ఎందరో ప్రముఖ విద్వాంసుల వద్ద సంగీతాన్ని అభ్యసించారు. మరింత సాధనకోసం, సంగీతం కోసం మద్రాసు చేరింది లీల కుటుంబం. మద్రాసులో ప్రముఖ సంగీత విద్వాంసుల సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా సంగీతంలో మరింతగా రాణించి పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించారు.

ఈ సందర్భంలో కొలంబియా రికార్డింగ్‌ కంపెనీవారు తాము విడుదల చేసే పాటలకు పాటలు పాడే గాయనీ కోసం వెతుకుతుండగా లీలగారి గురించి తెలిసి ఆమెను గాయనిగా ఎంచుకున్నారు. అది ఆమె సినీరంగ ప్రవేశానికి మార్గమయిందని చెప్పొచ్చు. అయితే ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో పట్టులేని కారణంగా కీర్తనలను మళయాళంలో రాసుకుని సాధనచేసి పాడేవారట. ఆ తర్వాత ట్యూటర్‌ను నియమించుకుని భాషపై పట్టును సాధించారు. గాయనీగాయకులకు ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం భాషపై పట్టు సాధించడం. ఇది నేటితరం గాయనీ గాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.1948 సంవత్సరంలో తొలిసారిగా తమిళంలో పాడిన పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమాలో హీరోయిన్‌కు అన్నిపాటలు ఆవిడే పాడారు. అలా తమిళంలో పాడుతూ, 1949 సంవత్సరం తెలుగులో పాడే అద్భుత అవకాశం వచ్చింది. నాగయ్యగారు నటించిన మనదేశం చిత్రంలో ఘంటసాలమాస్టారి సంగీతదర్శకత్వంలో పి.లీలను తొలిసారిగా తెలుగువారికి గాయనిగా పరిచయం చేస్తూ అందులో పాటలు పాడించారు. ఆ చిత్రం ద్వారానే ఆంధ్రుల ఆరాధ్యనటుడు స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. పరిచయమయ్యారు. ఆ యేడాది విడుదలైన మనదేశం, కీలుగుర్రం, గుణ సుందరికథ చిత్రాల్లో ఆమె పాటలు పాడగా ఆ మూడు చిత్రాలు కూడా అద్భుత విజయం సాధించి ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టడమే కాదు తెలుగులో గాయనిగా స్థిరపడ్డారు. అంతేకాదు వాహిని, విజయా సంస్థలు నిర్మించే చిత్రాల ఆస్థానగాయనిగా పేరుపడ్డారావిడ. ఆ తర్వాత మిస్సమ్మ, షావుకారు, పాతాళభైరవి, సువర్ణ సుందరి, పెళ్ళినాటి ప్రమాణాలు, శాంతినివాసం, చిరంజీవులు, బాలనాగమ్మ, మాయాబజార్‌, జగదేకవీరునికథ, పెళ్ళిచేసిచూడు, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు సంపూర్ణరామాయణం, బభ్రువాహన, తిరుపతమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, దక్షయజ్ఞం, శ్రీసీతారామకళ్యాణం, దీపావళి, శ్రీ వేంకటేశ్వరమహాత్మ్యం, పెళ్ళి సందడి, పాండురంగ మహాత్మ్యం, సారంగధర, భలేరాముడు, జయం మనదే, పరమానందయ్య శిష్యులకథ, నవ్వితే నవరత్నాలు, పల్లెటూరు, అనార్కలి వంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడారు. సుశీల, జిక్కి, వంటి గాయనీమణులతో కూడా కలిసి ఎన్నో చక్కని గీతాలను కూడా ఆలపించారు. కేవలం సినీ గీతాలే కాకుండా ప్రైవేటుగా భక్తిగీతాలు, శ్లోకాలు, పద్యాలు కూడా పాడారు. లవకుశ చిత్రంలో ఆమె పాడిన పాటలు నేటికీ సినీప్రియులు పాడుకుంటూనే ఉంటారు. భావప్రధానంగా, రాగయుక్తగా పాడటం ఆమెకే చెల్లు. ఉత్తమగాయనిగా ఆంధ్ర, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్నారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ఆమె పాడిన పాటల్లో గుణసుందరికథలో ‘శ్రీ తులసి జయతులసి జయమునియ్యవే..’, బ్రతుకుతెరువు చిత్రంలో ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.’ జయసింహ చిత్రంలో ‘ఈనాటి ఈరేయి కలకాదోరు నిజమోరు,’ మిస్సమ్మ చిత్రంలో ‘కరుణించుమేరిమాత,’ ‘తెలుసుకొనవే యువతి’, ‘యేమిటో ఈ మాయ, చల్లనిరాజా వెన్నెల రాజా’, వంటి పాటలు, చిరంజీవులు చిత్రంలో ‘తెల్లవారగ వచ్చే తెలియక నాస్వామి మళ్ళీ పరుండేవు లేరా’, మాయాబజార్‌ చిత్రంలో ‘చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ,’ ‘విన్నావా యశోదమ్మ’, జగదేకవీరుని కథలో ‘నను దయగనవా నా మొరవినవా..’, లవకుశ చిత్రంలోసుశీలగారితో ‘రామకథను వినరయ్య,’ ఊరకే కన్నీరు నింప,’, ‘వినుడు వినుడు రామాయణగాథ, ‘ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ’ వంటి పాటలు కలిసి పాడారు. పాండవవనవాసం చిత్రంలో ‘దేవా దీనబాంధవా’, రహస్యం చిత్రంలో ‘శ్రీలలిత శివజ్యోతి సర్వకామద’ గీతాలాలపించారు. హుషారు, విషాదం, భక్తి ఇలా అన్నిరకాల పాటలు పాడారు. ‘చిన్నారిపాపలు’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. దక్షిణభారతదేశంలో అద్భుత పాటలకు ప్రాణప్రతిష్ట చేసిన గాయనీ మణుల్లో ప్రముఖురాలిగా సినీ ప్రియులచే అభిమానించబడిన పి.లీల 2005 అక్టోబరులో చెన్నైలో మరణించారు. ఆమె మరణించినా ఆమె పాడిన పాటలు సినీ ప్రియుల మదిలో సజీవమై ఉన్నంతకాలం ఆమె పాటలరూపంలో బ్రతికే ఉంటారు.

  అవును పాటలలో చిరంజీవిగా నిలిచారు లీల

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14—2-22-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69

69-జయదేవుని అష్ట పదులకే కాక ‘’చల్లని రాజా ఓ చందమామ ‘’సినీగీతానికీ ఫేం ,సంగీత విద్వాంస దర్శకుడు ,తొలిఫ్రెంచ్ పురస్కార గ్రహీత –పద్మశ్రీ రఘునాద్ పాణి గ్రాహి

రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది

విశేషాలు

పద్మశ్రీపురస్కారం

ఇతడు 1935ఆగస్టు 10న ఒరిస్సాలోని రాయగడ జిల్లా గునుపూర్‌లో జన్మించాడు. ఇతడు తన తండ్రి నుండి సంగీతం నేర్చుకున్నాడు. గీతా గోవిందం ఆలాపనా విధానాన్ని కూడా తండ్రి నుండే పుణికిపుచ్చుకున్నాడు. ఫ్రెంచి ప్రభుత్వ సత్కారం పొందిన తొలి ఒడియా గాయకుడు ఇతడే[1]. 2010లో ఇతడిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇతడి భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి సంయుక్త పాణిగ్రాహి[1]. ఈమె 1997లో మరణించింది. ఇతడు తన భార్య పేరుతో సంయుక్త పాణిగ్రాహి ట్రస్టును ప్రారంభించి ఒడిస్సి నృత్య కారులకు ఎంతో చేయూతనిచ్చాడు. వారి ద్వారా ఒడిస్సీ నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చాడు.

సినిమా రంగ౦

ఇతడు 1950వ దశకం నుండి తెలుగుకన్నడఒరియా సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించాడు.

ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల వివరాలు[2]:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయనిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
1అమర సందేశంమానస లాలస సంగీతం మధుమయ జీవనఎ.ఎం.రాజాప్రసాదరావు, కేల్కర్1954
2సంఘంఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ఆర్.గోవర్ధనంతోలేటి1954
3సంతోషంనిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరునిఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తిసముద్రాల సీనియర్1955
4సంతోషంయువతి మోహన మూర్తి నీ ప్రియసఖి చెరగ రారాజిక్కిఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తిసముద్రాల సీనియర్1955
5ఇలవేల్పుఏనాడు కనలేదు ఈ వింత సుందరినిసుసర్ల దక్షిణామూర్తి1956
6ఇలవేల్పుచల్లని రాజా ఓ చందమామపి.సుశీలపి.లీలసుసర్ల దక్షిణామూర్తిశ్రీశ్రీ1956
7సంకల్పంతప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబుపిఠాపురం బృందంసుసర్ల దక్షిణామూర్తి1957
8సంకల్పంవెన్నెల తెలికాంతులలో చల్లగాలి దారులలోసుసర్ల దక్షిణామూర్తి1957
9గంగా గౌరీ సంవాదంభలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళిఎస్.జానకిఎం.ఎస్.రామారావు బృందంపెండ్యాలపరశురామ్1958
10జయభేరిమది శారదాదేవి మందిరమేఘంటసాలపి.బి.శ్రీనివాస్పెండ్యాలమల్లాది రామకృష్ణశాస్త్రి1959
11మైరావణమెల్ల మెల్లగా మేను తాకకోయీ చల్లగా చల్లగాఎస్.జానకిఎస్.రాజేశ్వరరావుఆరుద్ర1964

మరణ౦

ఇతడు తన 80వ యేట 2013ఆగస్టు 13వ తేదిన గుండెపోటుతో భువనేశ్వర్ లోని స్వగృహంలో మరణించాడు[1


జయభేరి సినిమాకి పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించాడు. పాటలు ప్రధానంగా మల్లాది రామకృష్ణశాస్త్రి రాయగా, ఒక్క పాటను మాత్రం శ్రీశ్రీ రాశాడు.[1] ప్రధాన పాత్రల వృత్తులు, ప్రవృత్తులు, కథ అంతా సంగీతం చుట్టూ తిరగడంతో సినిమాలో సంగీతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది. దీనివల్ల సినిమాలో 14 పాటలు, పద్యాలు ఉన్నాయి.[2]

·         రసికరాజ తగువారము కామా: రాజసభలో కథానాయకుడు తన ప్రతిభకు పరీక్షాఘట్టం ఏర్పడినప్పుడు పాడే సందర్భం ఈ పాటది.[3] రాజసన్మానానికి అర్హమైన స్థాయిలో పెండ్యాల స్వరపరచగా, ఘంటసాల ఆలపించాడు.[4][5] కానడ,[6] చక్రవాక రాగాలను మేళవించి రూపొందించిన విజయానంద చంద్రిక అనే రాగంలో దీన్ని స్వరపరిచాడు పెండ్యాల. కానడ-చక్రవాక రాగాలను కలిపి, రిషభ గాంధారాలు మూడు స్థాయిల్లో వచ్చేలా కొత్తగా రూపకల్పన చేసిన ఈ రాగానికి సినిమాలో సందర్భపరంగా మహారాజు పేరు మీదుగా విజయానంద చంద్రిక అన్న పేరు పెట్టారు. పాటలో స్వరప్రస్తారం అధిక భాగం సావేరి ఛాయల్లో సాగితే, 28 సెకన్ల పాట కొత్త రాగ లక్షణాలను బోధపరిచే ఆలాపన సాగుతుంది.[4] రసికరాజ తగువారము కామా పాటను ఘంటసాల పదిరోజుల సమయం తీసుకుని, వంద సార్లకు పైగా రిహార్సల్స్ చేసుకుని మరీ పాడాడు.[7] ప్రత్యేకించి మంద్రస్థాయిలో జంట స్వరాలను అత్యంత నిపుణంగా ఆలపించేందుకు ఇంత గట్టి సాధన చేశాడు. రాగస్వరూపం బోధపడేలా సాగాల్సిన ఆలాపన శాస్త్రీయ సంగీత సభల్లో గంట సేపు సాగితే, సినిమా అవసరం కోసం అరనిమిషానికి దాన్ని కుదిస్తూనే శ్రోతకు ఆ అనుభూతి అందించాల్సిన అత్యంత సంక్లిష్టమైన స్థితిని సంగీత దర్శకుడు పెండ్యాల, గాయకుడు ఘంటసాల సాధించడం విశేషం.[4]మది శారదాదేవి మందిరమే: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్రఘునాథ్ పాణిగ్రాహి ఈ పాటను ఆలపించారు. వీరిలో రఘునాథ్ పాణిగ్రాహి సినిమాలోనూ ఈ పాట పాడుతున్న వ్యక్తిగా కనిపించాడు.[2] మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ పాటను రాయగా, పెండ్యాల నాగేశ్వరరావు కళ్యాణి రాగంలో స్వరపరిచాడు. కృతి గాయనం ఘంటసాలతో, స్వరకల్పన పి.బి.శ్రీనివాస్‌తో, ముక్తాయింపు రఘునాథ్ పాణిగ్రాహితో·         ఇప్పించాడు పెండ్యాల

జయభేరి సినిమా సంగీతం విస్తృతంగా ప్రజాదరణ, ప్రత్యేకించి సంగీతాభిమానుల ఆదరణ పొందింది. ఈ సినిమా సంగీతం అత్యున్నత ప్రమాణాలను అందుకున్నదని విశ్లేషకుల ప్రశంసలు, సంగీతపరంగా “ఆల్ టైం హిట్” అన్న పేరు సంపాదించుకుంది.[9][2]

“రసికరాజ తగువారము కామా” పాట ఇటు పెండ్యాల సంగీత సారధ్యంలోనూ,[9] అటు ఘంటసాల ఆలపించిన పాటల్లోనూ అత్యుత్తమమైన పాటల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది.[10] దశాబ్దాల పాటు, వందలాది పాటలు పాడిన ఘంటసాల సినిమా కెరీర్‌లో, అందునా ప్రత్యేకించి పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాలతో పాడించుకున్న వందల పాటల్లో మరచిపోలేని రెండు పాటల్లో ఒకటిగా విశ్లేషకుడు విష్ణుభొట్ల లక్ష్మన్న పేర్కొన్నాడు.[6] “మది శారదా దేవి మందిరమే” పాట సినిమాలో విజయవంతమైన పాటల్లో ఒకటిగా నిలవడమే కాక కళ్యాణి రాగంలో వచ్చిన గొప్ప తెలుగు సినిమా పాటల్లో ఒకటిగానూ పేరు సంపాదించుకుంది.[4] “నందుని చరితము వినుమా” పాట 16 ఎం.ఎం. ప్రింట్ తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సమానత్వం, కులనిర్మూలన అంశాలపై ప్రచారం కోసం వినియోగించుకుంది.[5] ఇలా ప్రభుత్వం ప్రచారం కోసం సినిమా గీతాలను వాడుకోవడం ఈ పాటతోనే మొదలు.[2]

ప్రళయపయోధిజలే – బాలమురళి – పాణిగ్రాహి – లీల

ఘంటసాల గారు పాడిన “జయజగధీశ హరే” అనే జయదేవులవారి అష్టపది అందరికీ విదితమే. రఘునాధ పాణిగ్రాహి గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పాట “చల్లని రాజా ఓ చందమామ”. ఇవాళ జయదేవులవారి అష్టపది “జయజగధీశ హరే” మంగళంపల్లి వారి, పాణిగ్రాహి గారి, లీల గారి గళాల్లో విడివిడిగా ఆస్వాదిద్http://1.bp.blogspot.com/-xm95SI6h3JI/U0WGIhXePYI/AAAAAAAAEB0/kAlYHeEbDaI/s1600/panigrahi.jpg

‘చల్లని రాజా’ ఇక లేరు


భువనేశ్వర్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు తనయులు. గత కొద్దినెలలుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రఘునాథ్ భువనేశ్వర్‌లోని తన నివాసం వద్ద చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1934, ఆగస్టు 10న ఒడిశాలోలోని కోరాపుట్ జిల్లా గుణుపూర్‌లో జన్మించిన రఘునాథ్ చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో రాణించారు. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడి అభిమానులను అలరించారు. ‘ఇలవేల్పు’ చిత్రంలో తన 19వ ఏటనే రఘునాథ్ పాటలు పాడటం విశేషం. ఆ సినిమాలో  ఆయన పాడిన ‘చల్లని రాజా.. ఓ చందమామ..’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది.

  శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ సంస్కృత కవి జయదేవుడు రాసిన ‘గీత గోవిందం’ గీతాల ద్వారా అశేష భక్తజనవాహినిని తన గానామృతంలో ఓలలాడించారు. ఈ గీతాలు ఒడిస్సీ సంగీత చరిత్రకే తలమానిక ంగా నిలిచాయి. దేశవిదేశాల్లో రఘునాథ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘గీతా గోవింద్’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఈ సత్కారం పొందిన తొలి ఒడిశా గాయకుడు రఘునాథ్ కావడం గమనార్హం. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రఘునాథ్ భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్యకళాకారిణి సంజుక్త పాణిగ్రాహి. ఆమె 1997, ఆగస్టు 24న మరణించారు. శనివారం ఆమె వర్ధంతి. ఆ మరుసటి రోజే రఘునాథ్ మరణించడం విషాదం. మృదు స్వభావి, జంతు ప్రేమికుడైన రఘునాథ్.. తాను నివసిస్తున్న అశోక్‌నగర్‌లో వీధి కుక్కలను ఆదరించేవారు. శునకాలు జబ్బు పడినా గాయమైనా వాటిని ఆయన ప్రేమగా దగ్గరికి తీసుకుని సంరక్షించేవారు. రఘునాథ్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ ఎస్‌సీ జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు.

‘చల్లని రాజా’ ఇక లేరు


ఇల వేలుపు సినిమాలో రఘునాధ పాణి గ్రాహి  శ్రీ శ్రీ రాసిన ‘’చల్లని రాజా ఓ చందమామ ‘’పాడినపాట దాదాపు రెండు మూడు దశాబ్దాలు ప్రతి ఇంట్లోనూ మారు మోగింది ఆ చల్లని వెన్నెలను మనసారా నింపుకొని గళం  లో మధువు ల్లోలికెట్లు పాడాడు .సుసర్ల వారి సంగీతం అద్భుతం .విలన్ ఆ నటించే ఆర్ .నాగేశ్వరరావు ఇందులో సాఫ్ట్ కార్నర్ పాత్ర ఆశ్రమం లో ‘’నాన్నగారు గా గా నటించి బాగా మెప్పించాడు .లాగే జయభేరిలో ‘’రసిక రాజ ‘’పాటలో తనకిచ్చిన భాగాన్ని అద్భుతంగా నటిస్తూ గానం చేసి మెప్పించాడు పాణిగ్రాహి .ఆయన ‘’సంగీత రస పాణి గ్రాహి ‘’అనిపిస్తాడు .

‘’చల్లని రాజా ఓ చందమామ –నీ కధలన్నీ తెలిశాయి ఓ చందమామ –నా చందమామా

పరమేశుని జడలోన చామంతివి –నీలి మేఘాల నానేటి పూబంతివి –నిను సేవిన్చాగా దయచూడుమా

ఓ వెన్నెల నా వెన్నెల చందమామా

నిను చూసిన మనసెంతో వికసించుగా –తోలి కోరికలెన్నో చిగురిమ్చుగా –ఆశలూరించునే –చెలి కనిపించునే

చిరునవ్వుల వెన్నెల కురిపించునే

నను చూడవు పిలచిన మాటాడవు –చినదానాను అబలను ప్రియురాలను

నిన్నే కోరేనురా నన్న కరుణి౦చరా – ఈ వెన్నెల కన్నెతో విహరించరా.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -4(చివరిభాగం )

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -4(చివరిభాగం )

కవిత్వానికీ ,కాల్పనికసాహిత్యానికి మధ్య విభజన రేఖ బాగా తెలిసినవాడు బుద్ధ దేవ్ .నవలను సాహితీ మిశ్రమం అంది వర్జీనియా ఉల్ఫ్.ఇది బుద్ధ దేవ్ కు సరిగ్గా సరిపోతుంది .విశ్వజనీన సంఘటనాత్మక సమన్వయము తో నూతన సంప్రదాయాన్ని సృష్టించుకొన్నాడు .తన నవలను ‘’నవ్యోపన్యాస’’అన్నాడు .ఈతని నవలలు పటిష్టంగా   ఉంటాయి .సంఘటనతో పాటు మనో విశ్లేషణకు ప్రాధాన్యమిస్తాడు .18వ శతాబ్ది ఇంగ్లీష్ నవలనుంచి ఎన్నో సూక్ష్మాలు గ్రహించాడు .లేఖాత్మకం గా ,స్మృతి రేఖాత్మకంగాపాత్రల ఆ౦తరంగిక స్వభావాలను వ్యక్తం చేస్తూ  రాశాడు .నేచరలిజాన్ని నిరసించాడు .అతడి మానవమూర్తి సర్వ సాధారణ కళానైశిత్యమున్నవాడు .ఇతి వృత్తం కళాకారుని మూర్తి మత్వమే .అతనిది స్థానిక హద్దుల్ని దాటే ప్రాపంచిక దృష్టి .ఆడెన్ చెప్పినట్లు పరిపూర్ణ అస్తిత్వం మృత్యువు లోనే ఉంటుంది .మన్మధుని స్త్రీరూపావతారం అని అనటం అసంబద్ధ అతిశయోక్తి అంటాడు .సదానవల  తర్వాత ,హృదయాన్ని ఇచ్చిపుచ్చుకో నవల రాశాడు .ఇందులో వ్యంగ్యోక్తులు గుప్పించాడు .సూర్యముఖి, రూపాళీసఖి ,పరస్పర ,లాల్ మేఘ ,శోభనం గది వగైరాలన్నీ జీవన గాధలే .బిసార్ పిల్ ,వనశ్రీ లలో బయటి అంశాలను సవివరంగా రాశాడు .’’మొగాళ్ళు అలసినప్పుడు పెళ్లాడితే ,ఆడాళ్ళు కుతూహలం తో పెళ్లాడుతారు ‘’అంటాడు ఆస్కార్ వైల్డ్ లాగా .ఒకనవల నాటకంగా మలిచాడు .ఆయన గొప్పనవల 1949లో రాసిన ‘’తిథి రార్’’.మధ్యతరగతి జీవిత చిత్రణ ఉంది .ఇ.ఎం.ఫారేష్టర్ పధ్ధతి అనుసరించాడు .మనముందు ఒక పటిష్టమైన ఆకారం ఉందనే భ్రాంతి  మరువకూడదు  .దీని చుట్టూ కథ తిప్పాలి అనేది అతని భావన  .ఇందులో 18వ శతాబ్ది ఇంగ్లీష్ స్టైల్ ఉంది .ఇతనినవల చదువుతుంటే జేమ్స్ జాయిస్ నవల’’పోర్ట్రైట్ ఆఫ్ ఎ యాంగ్ మాన్ ‘’ గుర్తుకొస్తుంది .నాగరకతకు ,కళకు ఉన్న తేడాను స్పష్టంగా వ్యక్తీకరించాడు .అందుకే బెంగాలీసాహిత్యం లో మకుటం లేని నవలారాణి అయింది ఈనవల .

  బుద్ధ దేవ్ కథలూ ఇదే ప్రణాళికలో ఉంటాయి .చలిత్ భాషలో గ్రామీణ పాత్రలు మాట్లాడతాయి .నవలగా నాటకం గా భాసి౦చేట్లు కధలు రాశాడు .కధలన్నీ గొప్ప పేరు పొందినవే .అమరాతిన్జన్ కథ ఇంగ్లీష్ జర్మన్ భాషలలోకిఅనువాదం పొందింది .ఆనంద నిలయం, నువ్వు బాగున్నావా లు జర్మన్ లోకి అనువాదాలైనాయి .బాలకథలూ అత్యంత ఆదరణ పొందాయి .’’పిల్లల కోసం ఉత్తమ కథలు ‘’సంకలనం నిర్వచనానికే హై లైట్ అయింది .

 సహజ భావకవి కనుక  నాటకం పై మొదట్లో దృష్టిపోలేదు .అతని దృష్టిలో హృదయం పొందిన నాగరకతే అత్యంత విలువైనది .కాలేజిరోజుల్లో ‘’అమ్మాయి కోసం ‘’అనే ఏకాంకిక రాశాడు.మొదటి పౌరాణిక నాటకం ‘’రావణ ‘’.శుద్ధ వ్యావహారికం లో రాశాడు .ప్రదర్శనకు నోచుకోలేదు .అనేకరకం అనే నాటకం లో ఫిక్షన్ కు నాటకానికి ఉన్న బంధం తెగకొట్టి సాహిత్యం కేవలం వినోదం కోసమేకాదు అని తెలియజేశాడు.అతడి రేడియో నాటికలూ బాగా క్లిక్ అయ్యాయి .సృజనాత్మక ప్రక్రియలద్వారా బుద్ధ దేవ బోస్ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ,భారతీయసాహిత్య నిర్మాతలలో ఒకడుగా గుర్తింపు పొందాడు .

  ఆధారం –అలోక్ రంజన్ దాస్ గుప్త ఇంగ్లీష్ లో రాసిన దానికి డా ఆవంత్స సోమసుందర్ అనువాదం చేసిన –‘బుద్ధ దేవ బోస్ ‘’.  

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68

67,68-పుష్పవల్లి ,సూర్య ప్రభ సోదరీ మణులు

67- సంగు ఫేం,వెండి తెర పాలవెల్లి -పుష్పవల్లి

పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి.

విశేషాలు
ఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు కందాళ వెంకట పుష్పవల్లి తాయారు.[1] ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి సంపూర్ణరామాయణం సినిమాలో సీత వేషం వేసింది. తరువాత దశావతారములు సినిమాలో మోహిని, మాయ శశిరేఖ పాత్రలు ధరించింది[2]. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశం లభించింది. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో విరివిగా నటించింది. ఈమె చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ఆమె వేదాంతం రాఘవయ్యను వివాహం చేసుకుంది. పుష్పవల్లి జెమినీ గణేశన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పటికే జెమినీ గణేశన్‌కు పెళ్ళి అయింది. ఈమె కూడా ఈ పెళ్ళికి ముందు రంగాచారిని వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్ళి మూడునాళ్ల ముచ్చట అయ్యింది. జెమినీ గణేశన్‌కు ఈమెకు బాబ్జీ, భానురేఖ, రమ, రాధ, ధనలక్ష్మి అనే సంతానం కలిగారు. వీరిలో భానురేఖ రేఖ పేరుతో హిందీ సినిమా రంగంలో ఒక తారగా వెలుగునొందింది. పుష్పవల్లి జెమినీ గణేశన్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఈమె 1992 మే 11న మరణించింది.

కొన్ని వివాదాల గురించి రూపవాణి పత్రికకు పుష్పవల్లి వ్రాసిన ఒక లేఖను ఇక్కడ చూడవచ్చు

చిత్ర సమాహారం
· పెంపుడు కొడుకు

· వరవిక్రయం

· సంపూర్ణ రామాయణం (1936 సినిమా) – సీత

· దశావతారములు – మోహిని, మాయా శూర్పణఖ

· విశ్వమోహిని

· వింధ్యరాణి

· చూడామణి

· పాదుకా పట్టాభిషేకం

· చల్ మోహనరంగా

· మోహినీ భస్మాసుర – మోహిని

· మాలతీ మాధవం

· సత్యభామ (1942) – సత్యభామ

· బాలనాగమ్మ – సంగు

· సుడిగుండాలు

· తారాశశాంకం (1941)

పుష్పవల్లి అనగానే ఎవరన్నది వెంటనే బుర్రలో వెలగకపోవచ్చు. బాలీవుడ్ వెండితెర మీద ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ తల్లి- పుష్పవల్లి అని చెబితే తెలుస్తుందేమో. అలనాటి ఆ అందాల పాలవెల్లి పుష్పవల్లి పుట్టినరోజు ఈ రోజు (జనవరి 3).

“పెళ్లైన వాడు ప్రేమలో పడితే అది పెళ్లికి పరీక్షో… ప్రేమకు పరీక్షో! ఇది నిజం సావిత్రి, నా గతం నిజం, నా ప్రేమ నిజం,” అంటాడు జెమినీ గణేషన్, సావిత్రితో (మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో)“మనసులో నువ్వే ఉన్నావు అమ్మాడి. పెళ్లి నాకు కావాలనుకొని జరగలేదు, ప్రేమ నేను ఆపాలనుకున్నా కుదరలేదు. ఇంకో జన్మలో ఒకటౌతామని హామీ ఇస్తే నేను ఇప్పుడే సంతోషంగా చచ్చి… మళ్లీ పుడతా”నంటాడు జెమినీ. ‘మనలాంటి ప్రేమ అందరికీ దొరకదు…’ అని తెలుగులో చెబుతాడు రీల్ లో; రియల్ గా ఏ భాషలో ఏమిచెప్పాడో గానీ, సావిత్రిని 1952లో పెళ్లి చేసుకున్నాడు జెమిని. కానీ, అప్పటికే పుష్పవల్లితో రిలేషన్ లో ఉన్నాడు.ఎవరీ పుష్పవల్లి? జెమినీకి ఎప్పుడో పెళ్లయ్యిందని తెలిసి కూడా అతనితో ఎలా సహజీవనం చేసింది? సావిత్రితో పెళ్లయ్యాక జెమినితో పిల్లలు కూడా ఎలా కన్నది? ఎవరైనా పూనుకొని తీస్తే పుష్పవల్లి జీవితం కూడా ప్రేమ- తెగువ- త్యాగాల మయమే.
పుష్పవల్లిగా ప్రసిద్ధమైన కందాళ వెంకట పుష్పవల్లి తాయారు – తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. చదివింది ఐదవ తరగతి వరకే అయినా, చిన్న వయసు నుంచే అభినయం, నాట్యం, ఇంకా సినిమాల మీద ఇష్టం ఉండేది. తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి ‘సంపూర్ణరామాయణం’ సినిమాలో సీత వేషం వేసిందామె. తరువాత ‘దశావతారములు’ సినిమాలోమోహిని, మాయ శశిరేఖ పాత్రలు వేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు పెరిగాయి. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో విరివిగా నటించింది.

చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్యను సూర్యప్రభ వివాహం చేసుకుంది. జెమినీ గణేశన్ ను ప్రేమించడానికి ముందు పుష్పవల్లికి రంగాచారి అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అతనితో విడిపోయాక, జెమినీతో సహజీవనం చేసి, జెమినీ సావిత్రిని పెళ్లి చేసుకున్నాక కూడా పిల్లల్ని కన్నది. పిల్లల ఆలనాపాలనా జెమినీ పట్టించుకోకపోయినా, ఐదుగురు సంతానం బాబ్జీ, భానురేఖ (బాలీవుడ్ నిన్నటి తరాల హీరోయిన్ రేఖ), రమ, రాధ, ధనలక్ష్మిలను తీర్చిదిద్దింది. ప్రేమకోసం సినిమా కెరీర్ ని, పిల్లల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టిన ఆ అమృతవల్లి – పుష్పవల్లి 1992 మే 11న, తన 66 వ ఏట కన్నుమూసింది.
పుష్పవల్లి 9 సంవత్సరాల వయస్సులో చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె సంపూర్ణ రామాయణం (1936)లో సీత పాత్రను పోషించింది. పుష్పవల్లి మొదటి జీతం మూడు రోజుల షూట్ కోసం రూ. 300. ఆ సమయంలో ఆమె అగ్ర నటి. షూటింగుల వల్ల ఆమె ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేశారు.

రేఖ తల్లి 1940లో IV రంగాచారి అనే న్యాయవాదిని వివాహం చేసుకుంది. తరువాత వాళ్ళు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. పుష్పవల్లి 1947లో ‘మిస్ మాలిని’ సెట్స్‌లో జెమినీ గణేషన్‌ను కలిశారు. ఆ తర్వాత చక్రధారి (1948) సినిమాలో కూడా కనిపించారు. తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోకుండానే కలిసి ఉన్నారు. కొన్నేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు.

1995లో పుష్పవల్లి భాగస్వామి జెమినీ గణేశన్ ప్రముఖ నటి సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మహిళలకు విడాకులు అనుమతించబడని కారణంగా పుష్పవల్లి జెమినిని వివాహం చేసుకోలేకపోయింది. కానీ అదే ఆమెకు మంచిది అయ్యింది. ఎందుకంటే సావిత్రి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే కదా ! లేదంటే సావిత్రి పరిస్థితిలో పుష్పవల్లి ఉండేదేమో… ఆమె చివరి చిత్రం 1969లో వచ్చిన ‘బంగారు పంజరం’. ఈ చిత్రంలో పుష్పవల్లి చాలా చిన్న పాత్రలో నటించారు. పుష్పవల్లికి మొత్తం 5 మంది పిల్లలు… అందులో ఇద్దరు జెమిని కుమార్తెలు. ఆమెకు ఒక కుమారుడు బాబ్జీ, కుమార్తెలు రమ, ధనలక్ష్మి, రేఖ, రాధ. పుష్పవల్లి 1992లో మధుమేహం కారణంగా మద్రాసులో మరణించింది.

1967లో బి ఎన్ రెడ్డి గారి దర్శకత్వం లో వచ్చిన రంగులరాట్నం సినిమాలో కాకరాల కు అక్కగా పుష్పలత నెగటివ్ షేడ్ కారెక్టర్ పోషించింది

68-స్వతంత్రా వారి చిత్ర ఎంబ్లెమ్ -సూర్య ప్రభ

సూర్యప్రభ భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.సినిమా నటి పుష్పవల్లి ఈమెకుఅక్క . దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో శుభ సినిమా నటిగా రాణించింది

జీవిత విశేషాలు
ఆమె పెంటపాడులో 1930లో జన్మించింది. ఆమె తండ్రి కందాళ తాతాచారి. ఆమె అక్క పుష్పవల్లి సినిమా నటన వృత్తిగా స్వీకరిచడం సూర్యప్రభ జీవితంలో ముఖ్య పరిమాణం తీసుకొచ్చింది. చిన్నతనంలోనే అక్కతొ బాటు మద్రాసుకు వెళ్ళింది.

నటనలో సూర్యప్రభ మొదటి అనుభవం రంగస్థలం మీదే. 1944 వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ వారు “అనార్కలి” అనే నాటకాని ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆమె రాణి పాత్ర పోష్ంచింది.

ఆంధ్ర మహిళ సభలోనే ఆమె సామ్రాజ్యం వద్ద నాట్యం చేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకుంది.

ఆమె ప్రారంభంలో తమిళ సినిమాలో నటించింది. “మిస్ మాలిని” ఆమె మొదటి చిత్రం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ చిత్రంలో నటించారు[1]. తర్వాత చిత్రం “చక్రధారి”. తెలుగు సినిమాలో మొదటి సారి స్వతంత్రా వారి “ద్రోహి”లో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. కంపెనీ ఏంబ్లంగా నిలబడ్డది. ఆమె మొదటి చిత్రం ప్రతిభావారి “లక్ష్మమ్మ”. తిలోత్తమలోనూ, వినోదా ప్రొడక్షన్స్ వారి చిత్రంలోనూ, “మంగళ” లోనూ ఆమె నటించింది[2].

చిత్రసమాహారం
· మిస్ మాలిని(తమిళం) – 1947[4]

· చక్రధారి (తమిళం)[5]

· అపూర్వ సహోదరులు

· శ్రీ లక్ష్మమ్మ కథ

· లావణ్య (తమిళం)

· మంగళ – 1951

· తిలోత్తమ -1951

· స్త్రీ సాహసము – 1951

· రూపవతి -1951

· 1961లో సూర్య కళ రాజరాజేశ్వరి వారి ఉషా పరిణయం సినిమాలో ఉషకు చెలికత్తెగా నటించి ఉషా అనిరుద్ధుల వివాహానికి ముఖ్య కారకురాలైంది .

· దర్శకుడు కడారు నాగభూషణం .సంగీతం సాలూరు హనుమంతరావు .జమున ,కాంతారావు రంగారావు ముఖ్య పాత్రధారులు .పాటలన్నీ సూపర్ హిట్

సాహిత్యం సదాశివ బ్రహ్మం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66

మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66

66-దేవదాసు అనార్కలి సువర్ణసుందరి దర్శక ఫేం నృత్య,సినీ  దర్శకుడు ,భారత కళాప్రపూర్ణ,శకపురుష –వేదాంతం రాఘవయ్య

·          

వేదాంతం రాఘవయ్య  జూన్ 1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

తొలి జీవిత

వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో8-6- 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ, రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.

వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. ఎం.ఎ. డిగ్రీలను పొందారు.

రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. రైతుబిడ్డవిప్రనారాయ]’స్వర్గసీమవందేమాతరం సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య సూర్యప్రభ ప్రముఖ నటి పుష్పవల్లి సోదరి. సూర్యప్రభ కూడా నటే.

పని చేసిన సినిమాల

దర్శకత్వం వహించినవి

·         శాంతి (1952)

·         అన్నదాత (1952)

·         దేవదాసు (1953)

·         అనార్కలి (1955)

·         భలే అమ్మాయిలు (1957)

·         సువర్ణసుందరి (1957)

·         రహస్యం (1967)

నటించినవి

·         రైతుబిడ్డ (1939)

·         గరుడ గర్వభంగం (1943)

నృత్య దర్శకత్వం చేసినవి

·         పల్నాటి యుద్ధం (1947)

చిత్రానువాదం అందించినవి

·         అనార్కలి (1955)

·         సువర్ణసుందరి (195

నటరంజని : రాఘవ– కాకుళవరపు రమ> https://ci5.googleusercontent.com/proxy/5IuSHaE09BcSy5Z7oUpPFL3gUfJVDJdpJwnBAVIq92VPyfgEVmcok2DxBWLRPPWpB8rhE6BOt1BdNEO3DRUQGQENI3jniJwITvV2n1F2R6yot9ZoRjRA2w=s0-d-e1-ft#http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/images/pdflink.jpg
https://ci4.googleusercontent.com/proxy/ImcLYEmGmh3zlpae4Df7m_ktxgzrd4Cl720gmrH9SQwUNCEkPFm1-Iwqd50h92e4vPjwIIZxpScI7Lg5zeXIEVrRKhnKpaT4d9Idtj3ON1Gsj5cQjuLgtQnieJk9gP1lo3Db=s0-d-e1-ft#http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april2007/content/raghava.jpgసకల కళలకు సర్వవిద్యలకు పుట్టినిల్లు భారత దేశం. అందుకే “భారతి భరతాశ్రితా” అన్నారు. అంటే జ్ఞానాన్ని,విద్యలను ఆరాధించే దేశము భరతావని, అందువల్లనే ప్రపంచ దేశాలన్నింటికీ గురుపీఠమై నిలచింది. ఆసేతు నీలాచలం వ్యాపించి ఉన్న భారతీయ శాస్త్రీయ నృత్యాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఉంటాయి. ఈ సంప్రదాయ నృత్యాలలో ఏకత్వాన్ని తెలుగు నాడి జీవనాడి అయిన కూచిపూడి నాట్యాన్ని ప్రధానంగా చెప్పవచ్చు. వాచిక సాత్వికాభి నయాలు ప్రధానంగా కలాపాలు, యక్షగానాలు, నృత్య నాటికలు ఏకపాత్ర కేళికలుగా విభిన్న శాఖలతో ఖండాతరాలదాక వ్యాపించి యున్నది ఈ కళారూపం. అంధ్రప్రదేశ్ రాష్త్రంలోని కృష్ణా జిల్లాలోని కృష్ణా నదీ తీరాన ఉన్న కూచిపూడి గ్రామంలో పుట్టిన ఈ నాట్య కళ ఈ గ్రామం పేరుతోనే కూచిపూడి నాట్యంగా యావత్ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఉన్న కొన్ని కుటుంబాల వారికి కులవృత్తి ఈ నాట్యం. అలా ఉన్న వారిలో ప్రముఖంగా చేప్పదగిన వారు భాగవతుల, వేదాంతం, చింతా, వెంపటి, మహంకాళి, పసుమర్తి, ఏలేస్వరపు మొదలైన కుటుంబాల వారు. ఇటువంటి నాట్య సంప్రదాయ కుటుంబమైన వేదాంతం వారి వంశంలో పుట్తిన వారు వీరు.https://ci6.googleusercontent.com/proxy/VAxEPXE2xjlrza9Xy5tXRVZvMkDeEadctZKhoYt3QP-AokUlinnSidE11B88SL8q0Giie2KXAPg9hzFGWsFz-DzgOLmpu6ba7gzr-LIZGS89zxJEXugowFFQuUCS9pP2a-xx_z5gdrIU=s0-d-e1-ft#http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april2007/content/raghava_bhama.jpgరాఘవగా పిలవబడే వీరి అసలు పేరు వేదాంతం రాఘవయ్య. కీ.శే.వేదాంతం రత్తయ్య శర్న్మ , రాజ్య లక్ష్మి గార్ల ప్రధమ సంతానంగా కూచిపూడిలో పుట్టిన వీరి తాత గారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు, పెద తండ్రి భరత కళాప్రపూర్న వేదాంతం రాఘవయ్య గారు ప్రముఖ కూచిపూడి కళాకారులే కాక దేవదాసు, సువర్ణసుందరి,అనార్కలి,వంటి శతాధిక ఉత్తమ తెలుగు చలన చిత్రాలను నిర్మించిన చలనచిత్ర దర్శకులు. ఇలా వీరి వంశములోని వారందరూ కళామూర్తులు కావడంవల్ల వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ యెక్కువై చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తనవిద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగ శాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.ఏక పాత్ర కేళికలు (సొలొ డాన్సెస్)ప్రదర్శించడం కన్నా నృత్య నాటికలలో పలు నాయక, ప్రతి నాయిక పాత్రలు ధరించడం పైనే ఆసక్తి కలిగిన వీరు – సత్యభామ, కృష్ణ, మాధవి, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు,బాణాసురుడు, రావణాసురుడు, రాముడు, శివుడు, ఇంద్రుడు మన్మధుడు, భృగువు, చోళరాజు, ఆకాశరాజు, శిశుపాలుడు, అగ్నిజ్యొతమడు,గజాసురుడు, మహిషాసురుడు, మహావిష్ణువు, విశ్వామిత్రుడు, బలిచక్రవర్తి, తానీషా ఈ విధంగా ఎన్నో రూపానురూప (స్త్రీ వేషం వేయడం) నాయక ప్రతినాయక, సహాయక పాత్రలను – పద్మభూషణ్ డా. వెంపటి, పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ శోభానాయుడు, నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి, నాత్యాచార్య వేదాంతం రాధేశ్యాం, డా. ఉమారామారావు, డా.అరుణాభిక్షు, డా.అలేఖ్య వారిచే రూపొందించిన పలు యక్షగాన, నృత్యనాటికలో పాత్రలు ధరించారు అందుకు కారకులు, మార్గదర్శకులు, స్ఫూర్తి వారి తండ్రిగారేనని చెబుతూ వారి నాన్నగారు చేసిన సూచనలను మన ముందుంచుతున్నారు.- ఎవరన్నా వారి ప్రదనర్శనలోవచ్చి పాత్ర వేయమన్నప్పుడు ఆ పాత్రకు నీ అంగసౌష్టవం కనుముక్కు తీరు సరిపోతుందా, లేదా అని ఒక్కసారి ఆత్మ విమర్శచేసుకొవడం
-ధరించే పాత్ర యొక్క లక్షణాలు, సాహిత్యార్ధం తెలుసుకొని నృత్యదర్శకులు చెప్పిన దాన్ని సాకల్యంగా నేర్చుకొని సాధనచేయడం
– ప్రదర్శనకు ముందు రోజే నువ్వు ధరించే పాత్ర యొక్క ఆహార్యాన్ని అంతా ఒకలాగా ఉన్నాయో లెదో చూసుకోవడం
-రంగముపైకి వెళ్ళే ముందు నీ సొంత విషయాలు, కష్టాలు సుఖాలు అన్నీ ప్రక్కన పెట్టి నువ్వు ధరించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రంగముపైన అభినయించడం
ఇలా వారి తండ్రిగారు చేసిన పలు సూచనలను తూ.చా. తప్పక పాటిస్తూ కృతకృత్యుడౌతానన్నారు రాఘవతన పదిహేడౌవ యేటనుండే నాట్య బోధనను ప్రారంభించిన వీరు ఇరువైకి పైగా నృత్యాంశాలను రూపకల్పన చేసి వాటిని తన సోదరుడైన వేదాంతం వేంకటాచలపతి గారితో, మరియు తన శిష్యులతో ప్రదర్శింప చేసి ప్రేక్షకుల నాట్యకళాకారులే కాక సంగీత విద్వాంసులైన ‘సంగీతకళానిధి ‘ నేదునూరి గారు మొ. పెద్దల మన్ననలు పొందంటము వీరి నాట్య ప్రతిభకు వికపోపలం.https://ci3.googleusercontent.com/proxy/WymN-h61rlNf0C_Vkq9autvOvtOzLfNz_Gl0Pk8dktIpp5Um8FwOiY-SDy047sr-TklHhmvUBqaoF7rlH-PzHsVfKsyeKzGX70ULWxg8NL8_TfK6ToknXlSX9gyJhLDTbl6gQC8h1wnf-1E=s0-d-e1-ft#http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april2007/content/raghava_krishna.jpgసంప్రదాయ నృత్యాంశాలతోపాటు వినూత్న నృత్యాంశాలైన , సూర్యాష్టకం, కృష్ణతాండవం, సంధ్యాతాండవం, రావణస్తవం, మృత్యుంజయాష్టకం, శివలీలలు, మొదలైనవికాక వీరు స్వీయ రచన చేసిన తిల్లానాలు సంప్రదాయపు మూలం చెడకుండా వినూత్న పద్దతిలో జతులను, నటనను కూర్చి తన గంభీర కంఠ స్వరంతో సమర్ధవంతంగా నట్టువాంగం చేయగల సమర్ధులు వీరు.భారత ప్రభుత్వము వారి స్కాలర్షిప్ అవార్డు గ్రహీతలైన వీరు, లండన్ లో తన శిష్య బృందంతో కూచిపూడి నాట్య ప్రదర్శనలు గావించారు. ఇవేకాక నటనలోను ప్రావీణ్యము ఉన్న వీరు హైదరాబాదు దూరదర్సన వారు ప్రసారం చేసిన ‘తానీషా కూచిపూడి సందర్శనం’ అను సీరియల్ నందు – భాగవతినిగా, కృష్ణునిగా ‘సంధ్యా వేదిక’ అను ప్రత్యేక కార్యక్రమము నందు సూత్రధారునిగా నటించడమే కాకుండా కొన్ని టెలిఫిలింసికి డబ్బింగ్ కూడా చేప్పిన బహుముఖ ప్రజ్ఞాశాలురులు.తన తండ్రిగారైన వేదాంతం రత్తయ్యశర్మ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిన ‘భక్తప్రహ్లాద ‘ కూచిపూడి యక్షగానాన్ని, రసహృదయులు, కళాపోషకులైన ప్రవాస భారతీయుల ముందు ప్రదర్శనచేసి వారికి, ఆంధ్రకళా సారస్వత శాఖయైన కూచిపూడి వారి యక్షగానాన్ని, చూపించాలన్న తన తండ్రి గారి అంతిమ కోర్కెను తన సోదరుడైన వెంకటాచలపతితో తీర్చాలన్న సత్సంకంపల్పంతో ఉన్నారు.వీరి భార్య అయిన షర్మిపద్మజ గారుకూడా కూచిపూడి నాట్యకళాకారిణి కావడం విశేషం. ఈమె పద్మశ్రీ శోభానాయుడు గారి వద్ద చిన్నతనము నుంచి కూచిపూడినాట్యాన్ని అభ్యసించి అందులో ‘నాట్యవిశారదా డిగ్రీతో పాటు బంగారుపతకాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం వీరిరువురు హ్యూస్టన్ లోకూచిపూడి నాట్యప్రచారం గావిస్తున్నారు.వీరి ఆరునెలల ముద్దుల బాబు గుహన్.ఇలా వీరి తరతరాల వారు ఈనాట్యకళని నమ్ముకొని దానితోనె భుక్తిని, ముక్తిని పొందుతున్నారు. వారి బాటలోనే తన జీవనయానాన్ని సాగిస్తున్నారు. అందుకు కారణమైన తనకు జన్మనిచ్చిన తనతల్లితండ్రులకు , విద్యనిచ్చిన గురువులకు ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతునకు ఋణపడి వున్నానని సవిన యంగా వివరించారు, రాఘవNot only was an expert in the fields of acting and directing, the visionary artist a highly skilled and trained choreographer. Swargasweema, Yogi Vemana, Raitu Bidda, Vande Mataram, Vipranarayana, Tyagayya, are few of the movies in which he worked as a choreographer. Some of the other movies where he played the role of a director, are Anarkali, Prema Pasam, Nanna Kartavya, Shanti, chiranjeevulu,Vedantam Raghavaiah — the name triggers nostalgia of the Telugu films of fifties and sixties in the minds of all Telugu film lovers. His creative productions were a unique combination of both artistic excellence and commercial success. They emanated classicism whether they struck the chords of the emotions of the audiences by reflecting human values, bonds, sensitivity and relationships, or were movies which beleaguered them in myth, reverie, fancy or fantasy. But his roots as an artist, performer, and choreographer par excellence which lie in the art form of Kuchipudi are less known even to his admirers. These unique talents he possessed served as an essential backdrop for his success in the film industry – success, which is but the tip of an iceberg, when the multi dimensional personality of this genius is considered in totality. Golden Era for Kuchipudi Born on June 8, 1919 to Vedantam Ramayya and Annapurnamma, descendants of one of the legendary families of Kuchipudi in which art simply runs in the blood, Vedantam Raghavaiah, a flawless dancer, melodious singer and an expert in the tala system was highly admired. Genetically endowed with these talents, he polished them to perfection under some of the most distinguished masters of the time. At the tender age of five, Raghavaiah started his formal training under Chinta Venkataramayya and shone as one of his star students. With passion and devotion, Raghavaiah indulged himself completely in imbibing the technicalities of dance, music, tala and stage-presentation, simultaneously, absorbing all the nuances of laya under Vempati Venkatanarayana, a genius known as ‘Laya Brahma.’ Consequently, his debut performance at the tender age of seven, as Prahlada, was awarded with a gold medal by the British Government. This is considered by the artists of the time as the beginning of the ‘Swarna-adhayanam,’ or ‘Golden Era for Kuchipudi’ as this was the first accolade that was given to the art form by the then ruling government. He continued to enthrall in the roles of Lohitasya, Kusa, Lava and others and later became one of the outstanding ‘bhrukumsas’ (female impersonator) of his time by mastering the Kaisiki vritti. Being no ordinary singer, Raghavaiah would sing while performing, playing upon the ‘mukhya sancharas’ or the key-notes of every ragam of any daruvu and this made his performances scintillating. Raghavaiah made an ‘Usha kanya’ par excellence, and his matchless performances in the characters of Sita, Leelavathi, Chandramathi, Sasirekha, Mohini and Satyabhama are still remembered. Just when he was being branded as an excellent bhrukumsa, he took it up as a challenge and created waves by performing the key male roles like Harischandra, Hiranyakashyapa, Rama and Krishna. Man of the Era Raghavaiah was highly admired in the intellectual circles of art because of his powerful demonstrations of sloka abhinayas and pada abhinayas, elaborating upon their meanings and contrasting their presentations in dance and drama. He won the high appreciation of many scholars, like Adibhatla Narayanadas, the Harikatha Pitamaha, who gave Raghavaiah the title of ‘Sakapurusha’ or ‘Man of the Era’ and also awarded him with a gold medal. Filmography Talk of Raghavaiah’s talents spread far and wide by the mid thirties and it was the time when the Telugu film industry was slowly evolving; and, requiring technicians from specialized fields to contribute their expertise, the directors felt the dearth especially of a professional dancer who could cater to their needs. One such director came across Raghavaiah and this began a totally novel era in the history of Kuchipudi, as the dance form was first placed on the celluloid through the movie ‘Raithubidda’ (1939), in which Raghavaiah performed the traditional ‘Dasavatara Sabdam’. He also acted in a few movies like ‘Garudagarvabhangam’ (1943), ‘Mayalokam’ (1947), ‘Raksharekha’ (1949), ‘Anarkali’ (1955) and ‘Rahasyam’ (1967); and naturally, he was approached to choreograph dances for songs in films. Though there was no take off point for him as he was the pioneer of film dances, the transformation of the live performer on stage into a choreographer for films was very smooth because of his great acumen for dance and for art as a whole. Raghavaiah’s journey, as an exclusive dance director, began with the two films ‘Pantulamma’ and ‘Garudagarvabhangam’ (1943). ‘Sitaramajananam’ (1944) followed and ‘Swargaseema’ (1945) has a traditional Veedhi Bhagavatam of ‘Mohini Rukmangada’, and a padam ‘Manchidinamu nede’, which was impressively done in the traditional Kuchipudi style. He received high acclaim for ‘Thyagayya’ (1946), whose crowning glory is ‘Gopikakrishna’, in which he elicited brilliant performances from children below ten years of age, to depict the famous episode in which Thyagayya dedicates the Anandabhairavi ragam to Kuchipudi artists. ‘Yogi Vemana’ (1947), ‘Balaraju’ (1948), ‘Keelugurram’ (1949), ‘Laila Majnu’ (1949), ‘Swapnasundari’ (1950), ‘Sri Lakshmamma Katha’ (1950) preceded ‘Mayalamari’ (1951) which had the traditional ‘Dhanatha sabdam’ and also a Yakshagana. Whether it was classical Kuchipudi/Bharatanatyam or free style, whether they were private solos or complicated group dances, whether it was for extremely well-trained dancers or totally untrained actors, Raghavaiah showed an even competency in choreographing every dance. Raghavaiah’s creativity, zeal and enthusiasm did not permit him to be contented there, and soon he created a niche for himself as a film director. It is truly astounding that a regional dancer made a mark in the film industry as a dance director and went on to become a film director with a phenomenal success rate. Raghavaiah was a unique director in the sense that he was capable of making movies in a variety of genres. His folk films –’Sthreesahasam’ (1951), ‘Suvarna Sundari’ (1957), ‘Rajanandini’ (1958), ‘Balanagamma’ (1959), ‘Swarna Manjari’ (1962), ‘Rahasyam’ (1967) and ‘Saptha Swaralu’ (1969) — display his fanciful imagination and have many fantastic concepts, like mermaids or matsya kanyas, liliputs and flying trees, which were unimaginable at the time and Raghavaiah successfully depicted through superb technicalities. In his mythological film – ‘Sathi Sumati’ (1967) – his deep respect and reverence for the heritage is distinct. His capacity to whisk away the audience into a by-gone era by creating period historic films is to be admired – ‘Anarkali’ (1955) and ‘Sathi Sakkubai’ (1965) – so as his capability to have a strong impact on them through his films on social themes – ‘Santhi’ (1952), ‘Devadas’ (1953), ‘Chiranjeevulu’ (1956), ‘Bhale Ramudu’ (1956), ‘Bhale Ammayilu’ (1957), ‘Inti Guttu’ (1958), ‘Runaanubandham’ (1960) and ‘Maamaku tagga Alludu’ (1960). His ‘Devadas’ continues to occupy its position as one of the best Telugu pictures ever made and some of his folk films were remade in other languages too. It was in ‘Rahasyam’ that he depicted an out-and-out Kuchipudi Yakshaganam, ‘Girija Kalyanam’, which went on to become one of the most remembered ‘Kuchipudi’ pieces on celluloid of all times. His films were outstanding because of the story, music, strength of the characters, and the way he handled the child characters. Raghavaiah deserves high plaudits for having the fortitude in making female-oriented films in a male-dominated industry and seeing to it that they were commercially successful too. Flagbearer of Kuchipudi traditionFlagbearer of Kuchipudi tradition The one aspect of Raghavaiah that needs to be given special acclaim is that, despite being one of the best dance directors and directors of his times, he never abandoned his roots which were firmly planted in the art form of Kuchipudi, and those in the mainstream continued to feel his presence, influence and contribution. Before the legendary 1959 seminar, he organised extensive performances with an entire troupe to prove that Kuchipudi was a truly classical form. He was also a member of the First General Council of the APSNA in a committee that represented ‘dance’ and not ‘cinema’; and was the President for the National Festival organized by the APSNA in 1964. The Akademi honoured Raghavaiah with the prestigious and impressive title of ‘Bharatha Kala Prapurna’ for his invaluable and immeasurable contribution to the art form of Kuchipudi.

Raghavaiah had a thirst to drink art ‘to the last lees’ and always acknowledged that ‘three-fourths of the knowledge he had; he did because of Chinta Venkataramayya.” His career which spanned through four and a half decades was glorious. Cinema served as an appropriate stage to contain his huge artistic personality and he would be remembered in the history of cinema as much as in the history of Kuchipudi dance form, as Vedantam Raghavaiah was the strong bridge that connected the two in the first place. An eventful and fully packed life of Raghavaiah enhanced the glory of Kuchipudi dance form; but his sudden and untimely death in the year 1972, at the age of 52, was bereavement to Kuchipudi which cannot be compensated. No single human being can replace him nor provide his zeal, passion and guidance, as Benjamin Franklin says, ‘Every time an artist dies, part of the vision of the mankind passes with him.”
   రావి కొండలరావు గారి మాటలలలో – This is the birth centenary year of Kuchipudi exponent Vedantam Raghavaiah, better known in film circles as the director of the Telugu movie Devadasu, starring Akkineni Nageswara Rao and Savitri.To mark the milestone, a photo exhibition on the life of Vedantam Raghavaiah was organised by Lasyakalpa Foundation in association with the Department of Language and Culture, Government of Telangana, at Ravindra Bharati. Speaking on the occasion  Daggubati Purandeswari (a student of Kuchipudi and daughter of well-known actor N.T. Rama Rao) hailed the contribution of Vedantam Raghavaiah. She says, “The credit of performing the traditional Dashavatar dance in a Telugu film for the first time goes to him. He was given a gold medal by the British colonial rulers when he was very young.”Senior Telugu star Raavi Kondala Rao remembers how Raghavaiah started as an actor and dance master in Tollywood before taking up the job of assistant director. He learnt editing techniques too.  “Raghavaiah had phenomenal memory and would always come to the sets without the script. He knew every dialogue perfectly, and the acting required for all scenes. During shoots, he would act out most of the scenes himself to demonstrate to the actors how he wanted it done. Sometimes he would enact scenes in 10 different ways and ask the actors to choose the one that suited them best for the final shoot,” says Ravi Kondala. Vedantam Raghavaiah, who belonged to a traditional Kuchipudi dance-drama family in Andhra Pradesh, had directed over 30 Telugu, Tamil and Kannada films.Dr Tadepalli Sarma, member, Sangeet Natak Akademi, New Delhi, who himself hails from  Kuchipudi village and has been propagating the dance form by organising festivals all over the country, says “Raghavaiah was able to get most of the actors whom he directed to effectively utilise the expressive gestures of hand, eye, and face rooted in traditional Kuchipudi dance-drama. He was so creative that he was able to think about the Navarasas (nine emotions) portrayed in Kuchipudi dance dramas, while working with cinema.” Nowadays, Kuchipudi has been reduced to solo performances by dancers, seeking personal acclaim. Because of this, there are hardly any ‘dance-drama’ performances which were once the soul of Kuchipudi.Recently, while receiving the ANR National Award 2019 at Hyderabad, well-known Bollywood actress Rekha also spoke about Vedantam Raghavaiah, who was her uncle. It was her mother who took her to watch her first Telugu movie, Suvarna Sundari, directed by Raghavaiah.Celebrating Life, a book on Vedantam Raghavaiah compiled by Prof. Anuradha Jonnalagadda, is releasing on Sunday (December 22) at Ravindra Bharati. “One can clearly see the influence of ‘Kuchipudi Yakshagana’ music and dance in all films directed by him. The themes of most films at that time were mystical and mythological. After the 1970’s, the trend in Telugu movies started changing, and slowly, the beautiful elements of Kuchipudi dance-drama started vanishing,” says Anuradha  Vedantam Raghavaiah Complete Bio & CareerThe Golden era actor has been well known for his choreography and acting skills. His career touched the heights of success with his Telugu film Devdas, which was directed by him. The film soared new heights in the Telugu film and industry and made him popular by the name of Southern Devdas. In partnership with Samudrala Raghavcharya and D L Narayana, the director opened a company called Vinoda Pictures.  Not only was an expert in the fields of acting and directing, the visionary artist a highly skilled and trained choreographer. Swargasweema, Yogi Vemana, Raitu Bidda, Vande Mataram, Vipranarayana, Tyagayya, are few of the movies in which he worked as a choreographer. Some of the other movies where he played the role of a director, are Anarkali, Prema Pasam, Nanna Kartavya, Shanti, chiranjeevulu, etc. సశేషం సశేషంమీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -65

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -65

     65- పెళ్లి చేసి చూడు భీముడు ఫేం-మహంకాళి వెంకయ్య 

     (1917 - 1979), కూచిపూడి నాట్యాచార్యుడు[1], 1950, 60వ దశకములో తెలుగు సినిమా నటుడు. ఈయన 45 సంవత్సరాలపాటు నాటకరంగానికి, 32 యేళ్లు సినిమారంగానికి సేవచేశాడు. సుమారు 158 సినిమాలలో నటించాడు. ఈయన దక్షయజ్ఞం, భూకైలాస్, భక్త మార్కండేయ, చిరంజీవులు, సీతాకళ్యాణము, ఆరాధన వంటి సినిమాలలో నటించాడు.

జీవిత విశేషాలు
ఇతడు 1917లో కూచిపూడి గ్రామంలో మహంకాళి సుబ్బయ్య, పుణ్యవతి దంపతులకు జన్మించాడు. ఇతడు 9వ యేటనే మొఖానికి రంగు పూసుకున్నాడు. 17వ యేడు వచ్చేసరికి నాటకరంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. భాగవతుల కుమారస్వామి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు[2]. ఈయన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు చింతా వెంకటరామయ్య వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. తరువాత వేదాంతం రాఘవయ్య ట్రూపులో చేరి హిరణ్యకశిపుడు, కంసుడు వంటి పాత్రలను, డి.వి.సుబ్బారావు నాటకాలలో విశ్వామిత్రుడు వంటి విభిన్నమైన పాత్రలను ధరించి పేరుపొందాడు. ఆంధ్రరాష్ట్రంలోనే కాక కన్నడ, తమిళ రాష్ట్రాలలో కూడా అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. పౌరాణిక నాటకాలే కాక కాటమరాజు కథ, ఖిల్జీపతనం, బాలనాగమ్మ, ఛైర్మన్ మొదలైన నాటకాలలో నటించాడు. 1946లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన వింధ్యరాణి సినిమాలో ఒక చిన్న వేషం వేయడం ద్వారా సినిమారంగంలో ప్రవేశించాడు. మరణించేవరకు 158 చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించాడు[2].

నటించిన సినిమా
వింధ్యరాణి (1948)

     అదృష్టదీపుడు (1950)

     మాయా రంభ (1950)

     మల్లీశ్వరి (1951) - శ్రీకృష్ణదేవరాయల సేనాధిపతి రామలింగ నాయకుడు.

     టింగ్ రంగా (1952)

     పెళ్ళి చేసి చూడు (1952) - భీమన్న

     గుమాస్తా (1953) - జమీందారు

     జయసింహ (1955)

     చిరంజీవులు (1956)

     భక్త మార్కండేయ (1956)

     సొంత ఊరు (1956)

     కుటుంబ గౌరవం (1957)

     మాయాబజార్ (1957)

     ఇంటిగుట్టు (1958)

     భూకైలాస్ (1958)

     రాజనందిని (1958)

     ఆరాధన (1962)

     గులేబకావళి కథ (1962)

     దక్షయజ్ఞం

     పూజాఫలం (1964)

     సతీ సక్కుబాయి (1965)

మరణం[మార్చు]
ఇతడు తన 62వయేట కూచిపూడి గ్రామంలో 1979, జనవరి 27వ తేదీన మరణించాడు[2].

నాకు తెలిసినంతవరకూ మహంకాళి వెంకయ్య ,కుటుంబం బందరులో హోటల్ నడిపారు .నేను అక్కడ ఒక సారి భోజనం కూడా చేశాను .బ్రాహ్మణా విద్యార్ధులు అక్కడే తినేవారు శుచిగా రుచిగా హోమ్లీ గా ఉండేవి పదార్ధాలు .విశ్వనాధ సత్యనారాయణ గారు కూడా తన రచనలలో వెంకయ్య హోటల్ గురించి రాసినట్లు గుర్తు

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -3

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -3

మానవ జీవితం ప్రక్కనే అనంత జీవజాల ప్రపంచం సహ జీవనం చేస్తోంది .కాని ఇదిమాత్రం నిరాదరణకు గురైంది .దీన్ని హిల్స ,బాంగ్ అంటే కప్పలు,జొనాకి అంటే మిణుగురుపురుగులు  కవితల్లో చర్చించాడు బుద్ధ దేవ్.వీటిలో స్వయం సమృద్ధిగల సమైక్య జీవన విధానం తెలియజేశాడు –‘’కప్పలన్నీ కలిసి బృందగానం చేస్తే –దేనికీ భయం లేదు –కరువు కాటకాలు ఉండవు .-మేఘం కమ్మినట్లు పచ్చిక పరచుకొంటే –పొలాల్లో నీరు నిలువులోతు నిలుస్తుంది –మెత్తని శరీరాలతో –సన్నని వజ్రాల్లాంటి మెరిసే కన్నులతో –పైకి చూస్తూ ధ్యానమగ్నమై –వేద ఘోషలాగా వాటి గానం గాలిలో తేలుతుంది.-బెకబెక మంటూ దీక్షగా మూఢ విశ్వాసాన్ని ప్రచారం చేస్తుంది మండూకం ‘’.

  1948లో ‘’ద్రౌపది చీరలు ‘’అతని కవితలు ప్రచురితాలైనాయి .సాంప్రదాయ భాషా విధానం పక్కన పడేసి ఎజ్రాపౌండ్ చెప్పిన ఇమేజిస్ట్ మాని ఫెష్టో ను  పూర్తిగా అనుసరించాడు .ఈ దశ గడిచాక శీతేర్ ప్రార్ధన ,వసంతేర్ ఉత్తర కావ్యాలలో ఉన్న సందిగ్ధావస్థ ఆయన మానసిక స్థితే .-‘’తల్లి గర్భ కోశం కూడా చీకటే –కాలం అందుకే ఒకమేలి ముసుగు –అ౦గుష్టమాత్ర నిద్రామూర్తి నిశ్శబ్దంగా –ఒక్క దీపమైనా వెలగని అంధకారం లో –నీ లోపలి నామ రహిత శూన్యం లో –హే శిశూ !మళ్ళీచేతులు జోడించి ప్రార్ధించు కొత్తజన్మకోసం –వాసనలన్నీ సిద్ధంగా దాచుకో ‘’.అంత్యప్రాసలు అనుప్రాసలతో జీవం పోశాడు .

  క్రమంగా అవనీంద్ర నాధ టాగూర్ ,ఆనంద కుమారస్వామి ల మార్గం లో ఉపనిషత్తులపట్ల ఆధునిక దృక్పధాన్ని వివరించాడు .బహురూప వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు .కవితను అంతర్ముఖీనం చేశాడు .’’చల్లగా కోణార్క లోని –అప్సర చూపించే స్వర్గంలా –నల్లని చీకటిని చుట్టుకొని –ఆ అప్సరస వక్షోజాలు ఒక హస్తానికి లొంగి –చూపుల్ని చెదరగోట్టింది ‘’.ఫ్రీరేఫ లైట్స్ సంప్రదాయం తో మొదలెట్టి ,ఇంప్రెష నిష్ట భావాలదాకా వచ్చి అతని భావ ధార ఆగింది .ఇందులో సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ల సమ్మేళనం కనిపిస్తుంది –‘’నువ్వొక ఐ౦ద్ర జాలిక అవగుంఠ నానివి –నేనొక పరిపక్వత నొందని కవిని ‘’అంటాడు .

  1966లో తుప్పు పట్టిన బాకు మొనపాటలు  సంపుటి ప్రచురించాడు .తుప్పుపట్టిన బాకుమొనశారీరిక శక్తి హీనతకు ప్రతీక .దాని నగ్నమైన మొన కవితా సునిశిత్వానికి ప్రతీక.’’-స్నేహితులంతా మృత్యు వాత పడ్డారు –ప్రకృతి కాలగర్భం లో కలిసింది ‘’లలో ఏకాకి తనం కనిపిస్తుంది –‘’స్వరూపరహిత౦ గా వర్షారాత్రి –వెలివేయబడ్డ వనితలా –పేవ్ మెంట్ మీద దొర్లుతోంది –నెమ్మదిగా మనసంతా ఆక్రమిస్తోంది ‘’.

  అతని గద్య కధలు యాత్రోపాఖ్యానాలు లో జాతీయ అంతర్జాతీయ విధానాలు కలిసిపోయాయి –‘’మళ్ళీ అక్కా చెల్లెళ్ళు గట్టి నేలపై నిలబడ్డారు-ఆకలి మంటల్లో మండటానికి సిద్ధంగా ‘’.ఫ్రెంచ్ బాడ్లేర్ కవిత్వాన్ని వంగ దేశీయులకు పరిచయం చేసింది ఈయనే .దీనితో బెంగాలీ భాషకు కొత్త వారసత్వాన్ని అందించాడు .’’చార్లెస్ బాడ్లేర్-కవిత్వం ‘’  ను బుద్ధదేవ్ 1961లో ప్రచురించాడు .ఈ ఇద్దరూ అవిభాజ్యకవితా మూర్తులు అని అర్ధమవుతుంది .1970లో రైనర్ మేరియా రిల్కే కవితా వైభవం పుస్తకం రాసి ప్రచురించాడు .అందులో పవిత్రత ,ఆత్మా తీత స్థితి ని పట్టుకొన్నాడు .కొత్త నుడికారాన్ని సృష్టించుకొన్నాడు .దీన్ని అపభ్రంశ వంగభాష న్నారు గిట్టని వాళ్ళు .

  ‘’బుద్ధ దేవ్ బాసూర్ శ్రేష్ఠ కవితా ‘’పేరుతొ ఒక గ్రంథం1969లో వచ్చి,వెంటవెంటనే మూడు ప్రచురణలు పొందింది .ఇందులో ఆయన అనువాదాలూ చేరాయి .అంటే అనువాదకుడుగా సుస్థిర స్థానం పొందాడన్నమాట .ఈయన అనువాదాల్లో కాళిదాసు కవితా చాయలు తొంగి చూస్తాయి .మందాక్రాంత వృత్తాన్ని బెంగాలీ లో మహా భేషుగ్గా ఇమిడ్చి మెప్పు పొందాడు .బరోమేజర్ చాడో –ఆరురుతువులు లో ఆయన మనోహర కాల్పనిక లోకం దర్శిస్తాం ..శాబ్దిక అలంకారాలు అనుప్రాసలను ఆశ్చర్యకరంగా ప్రయోగిస్తాడు .పిల్లల మనస్సులను యిట్టె ఆకర్షిస్తాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-22-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -2

Inbox

 ఆంద్ర పత్రిక – వీరాజి 

జీవిచప్తు వెలుగు రీకట్ము సమంగా రుచి చూచిన వ్యక్తి, నునస్సులో నుహిగ్ని గోళాలు (బద్బ లవుళున్నా లోశాన్నంతటినీ హాస్యలహరిలో ముంచి తేల్చగల ఘటికుడు, నటకుడు కూదా (శీ రేలంగి నెంకస్మస్టామయ్య, | రేలంగి నెంక[(టామయ్య, చిన్నతనం నుంచి రంగు పూనుకోటం (పారంభించారు. రంగు పూసు కుంటే సిల్ళి నిన్వరుు వద్చని మందలించే తంటడి తన వీపు అప్పజెప్పి కాకినాడ యంగ్‌ మన్స్‌ హానీక్ళట్‌ కాట చిన్నచిన్న వేషాలు

  ఎస్నోంఢవారు, ఈ త౦0(ఉ ౩ డుకఖల మెధఎంల శాను మధనపడలేక (శ రేలంగిని ఫోర్న్డు ఫారం వాకా ఆదుకున్న సరస్వతీదేవి సెలవు పుచ్చుకుంది, (శీ సి పుల్ణయ్యగారి. (కింద రేలంగి మొట్ట మొదటగా ‘ సినిమాల్నో అడుగు పెట్టారు. 1936 లో ధృవ — అనసూయలో ఇం(దుడుగా, వేషణ కట్మారు, ఒకనాటి నటి పుష్పవల్సి ఈనాటి భానునుతి (పభృతులు కూడా ఆనాడు రేలంగితో ప్తాటు పనిచేశారు. అయితే రేలంగి వేషం వెయ్య టమే. గాక కంసెనీ తాలూకు ఇతర వ్యవహారాలు చక్కబెడ్డుండేవారు. కళాదర్శకుడుగా, ఏజెంటుగా కౌస్ట్రింగ్‌ డ్నెరెక్సరుగా కూడా ఆయన పనిచేశారు, “వీరభదయ్యనుగాను ఉళ్కి భ్యదయ్యనే” అన్నట్టు ఆరోజుల్ళో ఆయన ఉళ్యి వెంకటరామయ్యగా మౌ(తమే వుండేవారు. ఎప్పటిక్టైనా “స్పెకిరాకపోతానా అనే ఆలోచనతో బు( రనుకసొసిసామసొచేస్తుండేవారు, మొదటి (పపంచ యుద్ధం తర్వాత చలన చిత పర్మిశమ మ,(దాసులో స్మిరపడింది అప్పుడు వచ్చిన బాలనాగమ్మలో రేలంగి తలారి రాముడు పాతధరించారు. రేలంగి ఆరోజునుంచి “ఎందెందు. వెదకినందందే కలొడనిసించుకుంటూ ఇప్పటికి సుమారు 125 స్నెన చితాల్ళో నటించి (పజల మన్నన పొందారు. . ఈతఠోజున హాస్యానికి మారు సేరు. లేలంగి హాస్యరసభరితమ్మెన పొ్టతలలో వివిధముల్నెన పాతలను ధరించారు. రేలంగి (వమయోగించిన ఊత పదాలు తెలుగునాట హాస్యరాొస్తొని, కంగీల్టె పోయాయి. “తప్పు తప్పు, “జంబలకరపంబా, కసా పిసొమసా%, చచ్చ’కే చచ్చకు ఆ ఇలాటివెన్నో రేలంగి కన్న చిరపరిచితాల్నె పోయాయి. ఆయన థరిం చిన పఫొ్యళలు (వజ ల్నో. హత్తుకుపోయి | రేలంగి నడకి ఒకటి. పత్యేకంగా ఏర్పాటు 

   “ిసరట్టు — అనే సుచ్చిశెట్టిగా చింతామణిలోను పిసినారి. వీరభ్య దయ్యగా దోంగరాముడులోను, అస్పులవాడిలాగా హరిశ్చంటదుని వెంట తిరుగుత హాస్యాని తా నప్పుగా ఇచ్చే నక్త తకుడుగా-లాషా ఎన్నో పాతలు ధరించి హాస్యానికి కొత్త పూలం గీని తొడిగారు రేలంగి. ఈనాటి తెలుగువాటిలో రేలంగి మాట్క “రేలంగి చేష్ట, ‘“రేలంగివాడిలాగా”’ సామెతలుగా తయార య్యాయన్నా ఆశ్చర్యంలేదు నిత్య భూతనులల్నెన నటుల్లో రేలంగి వెంక (టొమయ్య ఒకరు. ఏళ్ళకు ఏళ్ళు గడచినా ఒే పాతను మళ్ళీ సోయగం సోలిసోకుంగా జనాకర్య యంగా నటిస్తున్నారం టే కారణం ఆయన నటనలో ఉన్న నిత్య నూతనత్వమే స్వర్మీయ గోవిందరాజుల సుబ్బారావు నటించిన జెమినీ బాల నాగమ్మలో తలొరి రాముడు పాత ధరించి (పజల నురూత * లూగింవారు. దాదాపు 20 సంవత్స రాలకు వచ్చిన వెంకటరమణా వారి “బొలనాగమ్మలో మళ్ళీ జ తలారి రాముని పాతనే నిర్వహించి (పజల మన్నన పొందారు అలొగే రేలంగి పూర్వపు కృష, తులాభారంలోను రెండేళ్ళ కిందట విడుదల్నిన కృష ,తులాభారంలోను వేషాలు వేశారు ఒక నటుడ తాను ధరించిన పాృాతనే 20 ఏళ్ళ తర్వాత ధరిం? “భక అనిపించుకోటం ఆ నటుని నిత్య నూత (పతిభకు తార్కాణం కాదూ లి తొము ధరించిన పాత లన్నిటిలో: పెద్ద మనుష్యుల్గ్యోని _తిక్కశంకరం పాత తమకు నచ్చిందంటారు. రేలంగి, అయితే (పజలు మాతం దొంగరాముడులోని వీరభ్యద య్య పాతను మెచ్చు కున్నారట రేలంగికి నటనప్పెన కొన్ని నిర్శిష్పాభిపాయా లున్న్నై. ఒక సవ్మాన సభలో మాటాడుతూ నటుని ఆంగిక అభినయంవల్ననే హాస్యం ఉత్పన్నం కాదు. చూచేవారిలో కూడా తదనుగుణమైన భావం కలగాలి నేను నవ్వవమంటే, అలాంటి  చేష్టలు చేసినంతమా[తాన మీరు నవ్వరు మీ మొహాన (వాసుం కే (మీ మనస్సులో కలిగితే) నవు క్‌ తారు అన్నారు దీన్నిబట్టి నటునకు అన్ని పాతలు ఒక నని హాస్య పాాత ధరించేవారు కూడా గంభీరమ్నెన పొాతలు, దుష్పపాతలు ధరించగలరన్కీ తదనుగుణమ్మెన భావం సామాజికు లలో నటుడు కలిగించగల్సి నప్పుడు, (సేక్టకులు ఆ నటుని హాస్యనటునిగా మరచిపోయి అతని పా(తను, గంభీరపా తగానో, దుష పా్యతగానో అనుభూతిపొంది ఆదరించితీరుతారని భానించి తము చితాల్ళో న్స్‌ (శీరేలంగి నిరూపించారనిపిస్తుంది కొన్ని చిితాల్గో ఆయిన పా్యతలు చూస్తే లక్ష్మి శ్రలో కొంత గంభీర మ్నైన పాతను ధరించారు, తోజులు మారాయిలో ‘్రొక్ట పోలయ్య పా తను ధరించారు “పెంకిపెళ్లాంలో ఆయన ధరించిన పాత గంభీరమ్నెంది, నిషాద మయము. గాక, (పక్సకుల సానుభూతిని చూర గొన్నది కూడా ఇటీవల విడుదల్నెన “*కలసివుం కు కలదు సుఖం లో (శీ వెంక్క్టటామయ్య ధరించిన దుష్పుడు, సమౌాజ విమర్శకుడు, విజ్ఞా ని రాజా పాత, ఎయన వాక్యాలకు సరెన నిరూపణంగా ఉంది. పా్యతకు తగిన అంగీని సింగారించుకోగల రన్నమాట రేలంగి. నాటక చలనచిత రంగాలలో చలనచి. త రంగంలో పన లేదని చితపరి.శమ నిర్మీవ మ్నెందనీ, కేవలం యాం(తిక (ప్మకియే నే వాదాన్ని రేలంగి భంకా భజాయించినంత తీవంగా “5ట6త పరి్యశమ నిజం గానిర్జ్మీన  ్నెతే ఇది ఇన్నాళ్ళు ఉండేదే కాదు. దీని జీవశక్తి తరగంది గనుకనే పరి(శవమ రోజురోజుకీ పెంపు పొందుతున్నది. నిజానిక్కి కళ అనేది రెండు రంగా లోను సమానమే నాటకం అన్ని సన్నాహాలతో పాటు ౩3 గంటలు (పదర్శిస్తే, ఆ మూడు గంటల పొటు (పదర్శించే చి(తాన్ని మూడు నెల్ల పాటు తీస్తాం” “కెమెరా నటునిలో ఉన్న (ప్రతిభను (పస్ఫుటం చేస్తుందేగాన్మి అసలే లేని వాటిని తేగల శక్తి లేదు. నాటకాలలో ఉన్న అలంకరణ సొమ(గి; జనరంజకావకాశౌలు చలనచి(తాల్మొ ఉండవు నటులు మంచి “మూడ్స్‌” లో ఉన్నప్పుడు వారి ముఖ కవళికలు, ఆంగిక విన్యాస్యాలు చి(తీకరిస్తారు, నాటకంలో ఉండే తొందర ఇందులో లేదు అయినా నటులు చలనచి తొల్గో రాణించటం లేదంట. దానికి వారి అశక్తతే గాని “కెమేరా” యాం(తిక (ప్మకియ కారణంకాదు తనలో లేని దాన్ని కెమేరా చూపగల్న్లా అనటం (టిక్‌ ఫోటో (గఫీ విషయం కాదు) సమంజసం గాదు. జీవశక్తి చలనచి.తాల్గో ఉండబ స్టే అదీ (పజొరంజకమ్మెన కళ గనుకనే ఇంకా మనగల్ను తున్నది” ఆంటారు (కీ రేలంగి చలనచి[తాలు చూస్తే చిితాల్మో ప జనం చెడిపోతారన్న నాదం పూర్తిగా అనంగత మ్మెందని రేలంగి అభిప్రాయం “ఈనొడు మన చి్యతాలు చాలా మంచిని తయారవుతున్నాయి. (పణల్నొ కూడా. విచక్ష్మ్ణ  శ అధికమవుతున్నది. ఈనాడు మన చిటతాలు చూసి నేర్చుకోవలసింది చాలా వుంది. చెల్టెళ్ళ అనుబంధం *“పెశమలర్‌* లాంటి చిితాలు నిరూపిస్తున్నాయి అలాగే అనేక దృక్పథాలు ఆధా రంగా ఉత్తమ చి.తాలు తయారవుతుం టే చలన చితాలు చూస్తే (పజలు చెడిపోతారనటం పెద్ద ఆపోహ అలాగే నటిస్తే వెడిపోతారనే వాదం కూడా చలనచిత పరి.శమ ఏర్పడ్డ తర్వాత చొలా కుటుంబాలు బాగుపడ్డా యి మంచి చెడ్డ ల లెక్కలేనివారు మంచీ చెడులను విభజించి, మంచి మౌార్నాన్ని ఆనుసరించి బొగుపడింది కూడా ఈ పరి (శమ వల్గనే, చలనచిి త సరి శమలో నీతి నియమా లంటూ వుంశే అవి దక్సిణాది పరి (శమలోనే ఉన్నాయి అందులోను. తెలుగువారు మరిక్‌”న్ని కట్ము బోటు కలవారు కనుక చిషత పరి_శమలో చేరితే మరీ చెడిపోతో రనటం సత్యా నిశి సగం దూరం” స్నెగా అభినయ కళకు గల (పాముఖ్యం ఉంది గనుకనే కదా! ఇప్పుడు విశ్వవిద్యాలయాల్నో కూడా (పత్యేకంగా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు 1 ఈ (వయత్నానికి యధా శక్షి తోడ్పడటానికి సంసిద్భుణ్తి అన్నారు. రేలంగి వ నే శః (పస్తుుతం 1రి చితాల్నో నటిస్తున్నారు రేలంగి వెంక్ట్టామయ్య, అందువల _ పొపం ఎప్పుడూ తీరికనేదే. ఉండదు | చలనచి( తాల్బో పనిచేయటంవల్స కుటుంబ వీవితంతో కొంత అశాంతి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా. యని పని ఎక్కువగా ఉండటం మూలాన “స్వేచ్చ అనేది తగ్గు తుందనీ ఆయన అభి పాయం “చిన్న నా పొట్టకు (శీరామరక్ట్మ” అనుకునే వ్యక్తీ కాదు రేలంగి తనకు తోచినంత తృణమో ఫణమో:. యధాశక్తి _గువ్‌చిప్‌గా దానం చేస్తుంటారు. నూరు చిలతాలు పూర్ణ్చ్యయిన సందర్బంలో నెంక  “టశ్వరా విశ్వవిద్యాలయానికి నిరాడంబరంగా రు 25,000 –లు విరాళం యిచ్చిన సంగతి అందరికి తెలిసిందే. “ఏన్నెనా నంన్ఫల కోసం సహాయ _ (పదర్శనాల్హాంటివి జరిగితే వాటిల్నో (శీ రేలంగి ఉచితంగా పాల్గొంటుంటారు నో శః ల రేలంగి మాదిరే జూనియర్‌ రేలంగి కూడా మంచి. నటుడే. రేలంగి సత్యనారాయణబాబు (సకాళ్‌ (పొడక్షృన్సువారి బాలానంద చి.తమాళి కలో ‘“రాజయోగం’ అన్నదాంట్నో నాయకుడు ఇప్పుడు వేషాలు వేయకపోయినా ఇంకొ చిత పరి(శమక. విడాకులు నూ(తం ఇవ్వలేదు తూనీగ వేగంతో కారు నడపటంలో (శీ సత్య నారాయణ నేర్చరిట కూడా తంశడికి తెలియ కుండానే శరవేగంగా కారు నడిపే పోటీలో పాల్గొని బహుమతిని గెల్భుకున్న ఘటికుడు |! (శీ రేలంగి వెంకటరామయ్య న్వగామం తూ గో, బిల్లా రావులపొడు, తండి రేలంగి రామ  దాసు కొలదికాలం (కిందట స్వర్ణ స్పుల య్యారు రేలంగి అత్తవారి ఇల్ట్ము సెంటపొడు. రేలంగి సోదరి ఇప్పుడు కొకినాడలో ఉన్నారు. (శీ వెంకట రామయ్యగారికి బంధు, పీతి అధికం. ఆయన ఇళ్ళె వృుడూవచ్చే పోయే బంధువుల తోసందడిగాఉంటుంది,. అన్నటు రేలంగి “ఆడువారి. గొక *“పాడువారు కూడా మొదట మొదటలో ఆయన కంఠమే చ్మితాల్నో ఉండి, రానురాను మనకెందుకులే వట్టి _చాకిరనుకుందేమో మాధవపెద్ని గొంతునే పనిచేయిస్తు ౦టుంది తరచుగా ఇతరులకు సాయపడలు నుం ఎంతో సంతోషం రేలంగికి. మనమందరం వినే ఉంటాం శీ రేలంగి పాడిన పా శేమిటో ? అదేవింటీ! ఏ సిన్మాలో చెప్మా! “చిరునవ్వే. చాలే చిత్తయి పోతానే’ అంటూ ఆయన పొడిన పొట ఇంకా గుబుల్‌ గుబుల్‌ గా గుందె లదర జేస్తుంటుందీ 7? ( క (ప్రతినిధి ఇంటర్వ్య)

కొడవటి గంటి  కుటుంబరావు మాటలలో రేలంగి

కొడవటిగంటి 

అన్ని రసాలలోకి విలక్షణంగా కనిపించేది హాస్యరసం. మిగిలిన రసాలు సృష్టించటంకంటె హాన్యం సృష్టించటం చాలా ఎక్కువ కష్టంగా కనిపిస్తుంది. నిజమైన హాస్యగాడికి మానవ మనస్తత్వమూ, సంఘంలోని లొసుగులు కరతలామలకంగా ఉండాలి. కళద్వారా సంఘ సంస్కరణ జరగాలంటే అందుకు హాస్యాన్ని మించిన సాధనం లేదు. ఇందుకు గురజాడ వారి “కన్యాశుల్కం” ,వీరేశలింగంగారి ప్రహసనాలూ, పానుగంటి వారోసాక్షి మంచి నిదర్శనాలు. మన తెలుగు సినిమారంగంలో మొదటినుంచీ ఎవరోఒకరు హస్యగాళ్ళు ఉంటూనే ‘ ఉన్నారు. స్టేజిమీద హస్యగాళ్ళుగా నటించిన కుంపట్లు సుబ్బారావు, కంచి నరసింహం, పరబ్రహ్మశాస్త్రి, వంగర వెంకటసుబ్బయ్య మొదలైనవారు చాలామంది సినిమాలలోకి హాస్యగాళ్ళు గావచ్చారు. 

హెచ్‌.ఎం. రెడ్డిగారు “గృహలక్ష్మి లో బొండాం హాస్యం ప్రారంభించారు. వాహినీ వారు ఇంతకన్న చాలా సున్నితమైన హాస్యాన్ని అందించటమేగాక ఒక్క “వందేమాతరం” చిత్రంలోనే రాజా బహద్బుర్‌, అల్లుడు, పాత్రలు రెంటిని చిరస్మరణీయమైన వాటిని సృష్టించారు. కామిడియన్‌ కూడా తారల స్థాయిని అందుకుని ఆడతారలకు సయితం తీసిపోకుండా జనాన్ని ఆకర్షించి వెర్రెత్తించగలడని మొట్టమొదటిగా నిరూపించినవాడు కస్తూరి శివరావు. ఇతను ఏనాడో ‘“చూడామణిలో మంగలిశా( స్త్రీగా నటించాడు. అయితే ఆనాడు అతన్ని గమనించిన వారు లేరు. అతను తిరిగి ప్రతిభావారి “ముగ్గురు మరా రీలు”, “బాలరాజు? మొ లైన చిత్రాలలో నటించ నారంభించేసరికి దశ తిరిగిపోయింది. శివరావు పేరు ప్రజలకు బీజాక్షరాలయింది. శివరావు కారు కనిపిస్తే వేలకొద్దీజనం చుట్టుముట్టేసేవారు. అతను అనేక చిత్రాలలో బుక్‌ అవసాగాడు. శివరావు శకం ఎట్టాప్రారంభమయిందో అట్లాగే ముగిసింది. అతను పైకి రావటానికి ఎక్కువ కారణం లేదు. శివరావు ఒకరకం బహూన్‌ కాకపోలేదు. కాని అతను ఏనాడూ చెప్పుకోదగిన నటుడు కాడు. మెదట్లో తాను ధరించేపాత్ర పట్లు శ్రద్ద చూపుతూ వచ్చాడు. తనలో తనకు గురికుదిరాక శివరావు తాను ధరించే పాత్రలను తృణీకరించి శివరావునే ప్రదర్శించ సాగాడు. అతన్ని చూసి నవ్వటం మానేశారు ప్రేక్షకులు. “జ్యోతి? లో అతను ఎక్కడా ఎవరిని నవ్వించలేక పోయాడు. మేనరికం” చిత్రంలో మొదట్లో శివరావు చేత వేషం వేయించి తరువాత ఆపాత్రను జోగారావు కిచ్చారు శివరావులాగే జానపద చిత్రాలలో ముందుకు వచ్చి ఇతర రకాల చిత్రాలలో రాణించలేక పోయినవాడు నల్లరామూర్తి. ఇతనిది సరి అయిన జానపద హాస్యం. అంజలీదేవి గృహ వ్రవేశంనాడు ఇతను చెప్పిన “లవకుశి వీధి నాటకమూ, పొంగల్‌ కార్నివాల్‌ లో ఇతను ఆడిన “తూర్పు సావిత్రి? ఇతని హాస్యానికి సరిఅయిన నమూనాలు. హాస్యంలో నల్లరామూర్తి సిద్దహస్తుడు. ఈహస్యంలో ఇతనికి జంటగా ఉండినవాడు సీతారామయ్య. అయితే సీతారామయ్య మామూలు నటుడుగా రాణించగలవాడు. ఇటీవల విడుదలైన “పల్లెపడుచు” లో ఇతని సి. ఐ.డి. పాత్రను ప్రజలు మెచ్చుకున్నారు. మొత్తంమీద తెలుగు సినిమా రంగంలో హాస్యనటులు తక్కువ. తమిళ సినిమా రంగంలోమొదటి నుంచీ కూడా హాస్యనటులకు హోదా ఉంటూనే వస్తున్నది. కళారత్నం, కృష్ణన్‌, మధురం సారంగపాణి, దొరై, పుళిమూటై, టి.ఆర్‌. రామచంద్రన్‌ , తంగవేలు మొదలైన తమిళ హాస్యకారులు తమిళ చిత్రాలలో రాణిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో హాస్యకారులు అంత ఎక్కువ సంఖ్యలో లేకపోవటమే గాక అంతగా చెప్పుకోదగ్గవారు కూడా లేరు. ఇప్పుడు మనకు ఉన్న హాస్యగాళ్లలో రేలంగిది అగ్రస్థానం. అతను సినిమా ప్రేక్షక వర్గాల ఆప్పుడు. తెరమీదికి రేలంగి రాగానే ఈలలు వేసి చప్పట్లు చరిచే (ప్రేక్షకులు ఉన్నారు. చేసుకున్న పాపంలాగా, ఇదివరకు చిత్రాలలో చేసిన హాస్యంయావత్తూ కొత్త చిత్రంలోకి అతన్ని వెన్నంటి వస్తోంది. చిత్రం దెబ్బతిన్నా తానుదెబ్బ తినకుండా బయట పడగల బహుకొద్దిమంది నటులలో రేలంగి ఒకడు. అతనికి సామాన్యంగా అపజయమంటూ ఉండదు. 

నటుడుగా రేలంగికి ఉండే ఒక్కలోపం వాచకం సరిగా లేకపోవటం. ఆ లోటును అతను ఆంగికాభినయంతో భర్త్‌వీసుకొని మరింత హాస్యం స్నష్టించేవాడు. బొత్తిగా మాటా పలుకూలేని పాత్ర నిచ్చినా రేలంగి నెగ్గుంచుకు రాగలడు. రేలంగికి హాస్యం సహజంగా వచ్చిందని చెప్పటానికి లేదు. అతను హాస్యగాడు కావటానికి చాలా శ్రమపడ్డాడు. ఇప్పుడు కూడా శ్రమపడుతూ ఉన్నాడు. కాని అతనికి ఇతర రహస్యాలకన్నా హాస్యం మీద వస్తుతహ ఎక్కువ మమకారం ఉంది. ఇతరుల నటనలో ఏమాత్రం హాస్యం కనిపించినా అతను ఆనందిస్తాడు. హాస్యంలో తాదాత్మ్యం సులువుగా సంపాదిస్తాడు. అతను ఇతర హాస్యనటుల నుంచి ఏమైనా నేర్చుకున్నా అది స్వంతం చేసుకోకుండా ప్రేక్షకుల ఎదుట పెట్టాడు. హాస్యరసానికి కీలకం మనస్తత్వమన్నది రేలంగికి స్పష్టంగా తెలుసు. వికార చేష్టల వల్ల హాస్యంపుట్టించవచ్చు గాని అది హాస్యరసంగా భావించరు. రేలంగి వికార చేష్టలమీద ఎంత మాత్రమూ ఆధారపడడు. “మనం ఈ చిత్రంలో (ప్రేక్షకుడికి ఏమి ఇస్తాం! “అన్న ప్రశ్న అడుగడుగునా ప్రతి పెద్ద నటుడికీ కలుగుతూ ఉండటం సహజం. రేలంగి ఈ విషయమై చాలా జిజ్ఞాసగా ఉంటాడు. “నేను శుద్ద కామెడియన్‌ను. నేను ఏం చేసినా ప్రేక్షకులు సంతోషిస్తారు”, అన్న వెఖరి అతనిలో కనబడదు. “నాలో ఏముంది? నేను వాళ్లకి ఏదైనా ఆనందం కలి గించకపోతే నన్నుచూడబటానికి ఎవరు మాత్రం కానీ కూడా ఎందుకిస్తారు?”* అనే వెఖరిలో ఉంటాడు. సాధారణంగా, ఒక సంస్థచాటున ఉండే నటుల కంటే ముగ్గులోకి దిగి ఫ్రీలాన్స్‌ చేస్తూ, నాలుగు కంపెనీలలోనూ నటించే నటులు ప్రేక్షకుల విషయమై మరింత శ్రద్దాశక్తులూ, బాధ్యతా కలిగి ఉంటారు. రేలంగికి మాతృసంస్థ అనదగినది లేదనే చెప్పాలి– కొందరు డైర్మెక్షర్లపట్ల గురుభక్తి ఉన్నప్పుటికీనీ! -.. అందుచేత అతను తాను ధరించే పాత్రలు రక్తి కట్టటం కోసం అలా వొళ్లు వొంచి పనిచేస్తాడు. (రేలంగిది ఒకంతట వొంగే వొళ్లు కాదు కూడానూ.) రేలంగి తాను పాత్రలో లీనమవుతాడో, తనలో పాత్రను లీనం చేసుకుంచాడో చెప్పటం ‘సులభంకాదు; రెండూ చేసేటట్టు కనబడతాడు. “పెద్దమనుషులు? లో తిక్కశంకరం లాంటి విజయవంతమైన పాత్ర ధరించినప్పుడు కూడా ఆ పాత్రలో మనం రేలంగిని చూడవచ్చు. కాని పాత్రకూడా అంత స్ఫుటంగాను కనిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా “చంద్రహారం” లోని ధూమకేతు పాత్రలో మనకు రేలంగి కనిపిస్తాడు, ధూమకేతుకూడా సృష్టంగా కనిపిస్తాడు. వేరే చిత్రాలలో మనం రేలంగి యొక్క వేరువేరు అవతారాలు– ఒకదాంచ్చో కోమచారబ్బాయి, ఒక దాన్లో గాజుల బత్తుడు, ఒకదాన్లో రాజశ్యాలకుడు, ఒకదాన్లో పిచ్చి వేదాంతి, ఈ విధంగా–చూస్తున్నట్టుగా ఉంటుంది. ఏ అవతారానికా అవతారం సమగ్రంగా ఉంటుంది. హిందీ చిత్రాలలో కూడా ముద్రవేసిన హాస్యగాళ్లు కొందరున్నారు. వారిలో చాలామంది కొన్ని రకాల వాచకము, కొన్ని హాస్యవిన్యాసాలూ నేర్చి ప్రతిచిత్రంలోనూ ఇంచుమించు ఒకేపాత్రను వ్రదర్శిస్తూంటారు. ఈ తరగతి హాస్యగాళ్ల కన్నా రేలంగి తాను ధరించే పాత్రలను గురించి చాలా హెచ్చు కృషి చేస్తాడు. 

రేలంగి సంపాదించిన విజయం కష్టార్జితం. అది ఒక్క వేటున, ఉట్టుడియంగా లభించినది కాదు, అంత సులువుగా పోయేదీకాదు. రేపు రేలంగి కంటె మంచి హాస్యనటులు అవతరించ వచ్చు– అవతరిస్తారనికూడా ఆశిద్దాం. కాని రేలంగిది మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒకశక మనటానికి సందేహంలేదు. తెలుగు న్వూతంత్ర వారపత్రిక, 10-12-1954. 

    ‘

 సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64

64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -1

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 – నవంబరు 27, 1975)[2] పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.[3] తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు(రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నారు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించారు 1935లో కృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు సి.పుల్లయ్య రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారూ.[4] కానీ, 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేసారు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా తారాస్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975లో వచ్చిన పూజ.[3] చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం
రేలంగి వెంకట్రామయ్య తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడులో 1910, ఆగష్టు 9వ తేదీన జన్మించాడు.[5] గవర కులానికి చెందిన రేలంగి పూర్వీకులు అబ్కారీ వ్యాపారం చేసేవారు.[3] కానీ రేలంగి తండ్రికి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏమీ పెద్దగా లేదు. రేలంగి తండ్రి అసలు పేరు రామస్వామి. ఒక పాఠశాలలో సంగీతం మాస్టారుగా పనిచేస్తూ హరికథలు, సంగీతం నేర్పించేవాడు.[6] అందుకని ఈయన్ను దాసు అనీ, తర్వాత రామదాసు అని పిలవడం ప్రారంభించారు. తల్లి అచ్చయ్యమ్మ. వీరికి వెంకట్రామయ్య ఒక్కడే సంతానం. ఈమె రేలంగి మూడు సంవత్సరాల వయసులోనే మరణించింది. రామస్వామి భార్య చెల్లెలైన గౌరమ్మను వివాహం చేసుకున్నాడు.

రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకినాడలోని మెక్లారిన్ పాఠశాలలో చదువుకున్నాడు. రేలంగి రూపం చూసి తండ్రి అతన్ని పోలీసును చేయాలని ఆశపడ్డాడు. ఏమీ తెలియని వయసులో రేలంగి అందుకు సంబరపడినా నెమ్మదిగా అతని దృష్టి నాటకరంగం వైపు మళ్ళింది. దాంతో చదువు సజావుగా సాగలేదు. రామదాసు ఆర్థిక పరిస్థితి కుమారుడిని పై చదువులు చదివించే స్థోమత లేకపోయినా ఎం. ఎన్. ఎస్. ఛారిటీస్ సహాయంతో చదివించాలనుకున్నాడు. కానీ వాళ్ళు మార్కులు బాగా రావాలని షరతు విధించారు. కానీ రేలంగి మాత్రం చదువు కన్నా నాటకాల మీదనే ఎక్కువ ఆసక్తి కనబరచసాగాడు. తండ్రి కూడా తన కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా జీవించాలని ఆశించినా కొడుకుకు నటనపై ఉన్న ఆసక్తిని చూసి ఏమీ అనలేక తటస్థంగా ఉండిపోయాడు. దాంతో ఆయన చదువు నాలుగో ఫారం (ప్రస్తుత ప్రమాణాల ప్రకారం తొమ్మిదో తరగతి) లో ఆగిపోయింది.[2]

నాటక రంగం
ఒకసారి రామదాసు కొడుకుని ఎస్వీ రంగారావు, అంజలీదేవి మొదలయిన వారు సభ్యులుగా ఉన్న యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవ రాజీయం అనే నాటకానికి తీసుకుని వెళ్ళాడు. అది రేలంగికి బాగా నచ్చింది. తాను కూడా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. కానీ తండ్రికి చెబితే కాదంటాడేమోనని ఆయనకు తెలియకుండా నాటకాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ లో చేరి 1919లో తన పదవ ఏట బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రలో మొదటిసారి నటించారు. ఈ విషయం తండ్రికి తెలిసి తీవ్రంగా మందలించాడు కానీ రేలంగిని మాత్రం నటనకు దూరం చేయలేకపోయాడు. తర్వాత కూడా అనేక నాటకాల్లో ఆడ పాత్రలు ధరించాడు. అప్పట్లో ఆడ వేషాలకు నటులు అంతగా ముందుకు వచ్చేవారు కాకపోవడంతో ఈయనకు విరివిగా అవకాశాలు వచ్చాయి.

ఆంధ్ర బాల గాన సంఘం, ఆంధ్ర సేవా సంఘం వారు ఈయనకు ప్రమీలార్జునీయం, రామదాసు, రోషనార, మోహినీ భస్మాసుర, చింతామణి మొదలైన నాటకాల్లో ఈయనకు పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రమీలార్జునీయంలో సుయోగుడు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి, చింతామణి తల్లి శ్రీహరి పాత్రలు, విప్రనారాయణ లో శ్రీనివాసుడు, శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు, మిస్ ప్రేమ ఎం. ఎ అనే సాంఘిక నాటకంలో విషాదరావు అనే విలన్ పాత్ర లాంటి విభిన్నమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దాంతో నటన మీద మంచి పట్టు ఏర్పడింది.

కొంతమంది మిత్రులతో కలిసి నాట్యమిత్ర మండలి అనే పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించారు. ఈ సమాజం వాళ్ళ తొలి నాటకం శ్రీరామనవమి పర్వదినాన తెనాలిలో ఏర్పాటు అయింది. ఈ నాటకం రక్తి కట్టింది కానీ నాటకం కోసం ఇంట్లో అమ్మ చీరలు దొంగతనం చేసుకుని వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి భయపడి ఎక్కడ నాటకాల్లో అవకాశాలు వస్తే అక్కడ నటిస్తూ ఊరూరా తిరగసాగారు. ఉన్నప్పుడు తిండి, లేనప్పుడు పస్తులు ఇలా గడిచాయి ఆ రోజులు. అదే సమయంలో పారుపల్లి సుబ్బారావు, జొన్నవిత్తుల శేషగిరిరావు ఈయనకు తమ నాటక కంపెనీలో ఆశ్రయం కల్పించారు. ఈ కంపెనీలో హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ మొదలైన నాటకాల్లో వేషాలు వేస్తూ దత్త మండలంలోని (సీడెడ్) జిల్లాలు తిరిగారు.

సినీ రంగ ప్రవేశం
రేలంగికి బాగా జ్ఞానం వచ్చేనాటికి థియేటర్లలో మూకీ చిత్రాలు ఆడుతుండేవి. అప్పటి దాకా నాటకరంగంలోనే అనుభవం ఉన్న రేలంగికి మనుషులు తెరమీద కనిపించడం ఆసక్తి కలిగించింది. 1931లో విడుదలయిన భక్త ప్రహ్లాద చిత్రం చూశారు. తాను కూడా చలనచిత్రాలలో నటించాలని నిశ్చయించుకుని సినిమాలు ఎక్కడ నిర్మిస్తారో వారి చిరునామా తెలుసుకుని తనకు తెలిసీ తెలియని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు కానీ వాటికేమీ ప్రత్యుత్తరాలు వచ్చేవి కావు. అప్పటికే టాకీ సినిమాల శకం మొదలైంది. రేలంగికి సినిమాల్లో ఎలాగైనా కనిపించాలనే కోరిక దృఢమైంది.

పారుపల్లి సుబ్బారావు ట్రూపులో రేలంగికి పరదేశి అనే తబలా కళాకారుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి దాకా ఒక లక్ష్యమంటూ లేకుండా లోకజ్ఞానం లేకుండా ఉన్న రేలంగికి పరదేశి రూపంలో ఒక మార్గనిర్దేశకుడు కనిపించాడు. తల్లిదండ్రులను వదిలి వచ్చేసి తాను తప్పు చేశాడని తెలుసుకుని, తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను క్షమాపణ వేడుకుని, ఇకమీదట బుద్ధిగా వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పారు. వాళ్ళు పెళ్ళి చేస్తే అతని జీవితం గాడిలో పడుతుందని తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చియ్యమ్మనిచ్చి వివాహం జరిపించారు. ఆయన బావమరుదులు వ్యాపారంలో బాగా సంపాదించారు. అప్పటికి రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా ఒక కళాకారుడిగా అతన్ని గౌరవించారు బావమరుదులు. భార్య తరపున ఎంత సంపద ఉన్నా స్వంతకాళ్ళ మీద నిలబడి ఆమెను బాగా చూసుకోవాలనుకున్నారు. మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. వచ్చిన కొద్దో గొప్పో డబ్బును భార్య చేతిలో పెట్టేవారు. ఆమె కూడా నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయో ఎరిగుండటం చేత సర్దుకుని పోగలిగింది.

మొదటి అవకాశం
కొద్ది రోజులకు నాటకాల్లో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. రేలంగికి మాత్రం నటనపై మోజు అంతకంతకు పెరుగుతూనే ఉంది. కొద్ది రోజులకి పరదేశికి కలకత్తాలో సి. పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న లవకుశ సినిమాలో అవకాశం వచ్చింది. పరదేశితో పాటు తాను కూడా కలకత్తా వస్తానన్నాడు. కానీ ఆయన మాత్రం తాను అక్కడ కుదురుకున్న తర్వాత అతని కోసం అవకాశాలు వెతుకుతాననీ మాట ఇచ్చాడు. కానీ రేలంగి మనసంతా కలకత్తా మీదనే ఉంది. అప్పుడు కలకత్తాలో ఐ. రాజారావు అనే వ్యక్తి శ్రీకృష్ణ తులాభారం సినిమాగా తీయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు. ఇందులో వసంతకుడి పాత్ర కోసం అప్పట్లో నాటకాల్లో సున్నిత హాస్యానికి పెట్టింది పేరైన ఘండికోట జోగినాథం ఎంపికై కలకత్తాకు ప్రయాణమవుతున్నాడు. ఆయనతో పాటు హార్మోనిస్టు దూసి శాస్త్రి, దర్శకుడు రాజారావు మొదలైన వారంతా బయలు దేరారు. ఆ సినిమాలో ముందుగా అవకాశమేమీ రాకపోయినా ఏదో ఒక పని చేయవచ్చులే అని రేలంగి కూడా ఇంట్లో వాళ్ళనూ, భార్యను ఒప్పించి వాళ్ళతో పాటు బయలుదేరారు. కలకత్తా వెళ్ళగానే నిర్మాత దగ్గరకు వెళ్ళి ఆ సినిమాలో ఏదో ఒక వేషం ఇవ్వమని అడిగారు. అప్పటికే ప్రధాన పాత్రలు నిర్ణయమైపోవడంతో రేలంగి కొద్ది సేపు మాత్రమే కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు లాంటి మూడు పాత్రల్లో నటించాడు. ఈ సినిమాకి గాను రేలంగికి నాలుగు నెలలు బస, భోజనం పెట్టి డెబ్భై రూపాయలు పారితోషికం ఇచ్చారు. 1935లో నిర్మించిన ఈ చిత్రం రేలంగికే మొదటి చిత్రం కాదు. జోగినాథానికి, కాంచనమాలకీ, ఋష్యేంద్రమణికీ, కపిలవాయి రామనాథ శాస్త్రికీ, లక్ష్మీరాజ్యానికి మొదటి సినిమానే. కానీ ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పొందడం వల్లా, రేలంగి ధరించిన పాత్రలు బొత్తిగా ప్రాధాన్యం లేకపోవడం వల్లా, సరైన గుర్తింపు దొరకలేదు. మరే చిత్రంలోనూ అవకాశం లభించలేదు. దాంతో చేతికందిన డబ్బు తీసుకుని కలకత్తా వదిలి మళ్ళీ కాకినాడకు వచ్చేసి మళ్ళీ నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు.

పుల్లయ్య నీడలో
సి. పుల్లయ్య దగ్గర లవకుశ సినిమాకు పనిచేసిన, రేలంగికి ఆత్మీయుడు అయిన పరదేశికి మళ్ళీ ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న అనసూయ ధృవ విజయం అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఎలాగైనా పరదేశి ద్వారా పుల్లయ్య దగ్గర అవకాశం సంపాదించాలనుకున్నారు. దాంతో ఆయన రేలంగిని కూడా కలకత్తాకు తీసుకువెళ్ళి పుల్లయ్యకు పరిచయం చేశాడు. దాంతో రేలంగి ఒక్క వేషాలే కాకుండా సహాయకుడిగా, క్యాస్టింగ్ సహాయకుడిగా ఇలా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ పాలుపంచుకున్నాడు. అనసూయ ధృవ విజయంలో రేలంగి ఇంద్రుడి వేషం వేశారు. ఈ సినిమా తర్వాత రేలంగి పుల్లయ్య దగ్గరే పదిహేనేళ్ళ పాటు ప్రొడక్షన్ అసిస్టెంటుగా, సహాయ దర్శకుడిగా, క్యాస్టింగ్ అసిస్టెంటుగా, ప్రొడక్షను మేనేజరుగా గొల్లభామ (1947) చిత్రం వరకు పని చేశాడు. క్యాస్టింగ్ ఏజెంట్ కావడం వల్ల ఎంతోమంది నూతన నటీ నటులు ఈయన ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వీరిలో కృష్ణవేణి, పుష్పవల్లి, భానుమతి, అంజలీ దేవి మొదలైన నటీమణులు ఉన్నారు. భానుమతి, అంజలీ దేవి నిర్మాతలుగా మారి సినిమాలు చేసినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా మంచి వేషాలిచ్చారు. అదే సమయంలో వర విక్రయం, మాలతీమాధవం, మోహినీ భస్మాసుర, శ్రీ సత్యనారాయణ, బాలనాగమ్మ, గొల్లభామ మొదలైన సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు. వరవిక్రయంలో వీధిగాయకుడి పాత్రలో ఒక పాటను కూడా పాడారు. బాలనాగమ్మ సినిమాలో తలారి రాముడు పాత్రలో నటించాడు. గొల్లభామ సినిమాలో రాజుగారి విదూషకుడిగా నటించారు. బాలనాగమ్మ, గొల్లభామ చిత్రాలతో రేలంగికి కాస్త గుర్తింపు లభించింది.

కష్టాల నుంచి విజయాల వైపుకి
గొల్లభామ (1947) దాకా పుల్లయ్య దగ్గర పనిచేసిన రేలంగి తర్వాత కుటుంబం కోసం మళ్ళీ కాకినాడ వెళ్ళిపోవలసి వచ్చింది. అక్కడే ఉంటే సంసారం ఎలా నెట్టుకురావాలో తెలియక సినిమాల్లోనే తాడో పేడో తేల్చుకుందామని కుటుంబ సమేతంగా మద్రాసు వచ్చేశారు. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా వచ్చేవి కావు. దాంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి అనారోగ్యం ఒక వైపు. భార్య మెటర్నటీ ఆసుపత్రిలో మరో వైపు. చేతిలో సరిపడా డబ్బులు ఉండేవి కావు. కొంతకాలం గడిచాక 1948లో వింధ్యరాణి అనే చిత్రంలో మంచి హాస్యపాత్ర లభించింది. పింగళి నాగేంద్రరావు రాసిన నాటకం ఆధారంగా వైజయంతీ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి నాయక, నాయికలుగా నటిస్తే రేలంగికి జంటగా జి. వరలక్ష్మి నటించింది. ఈ సినిమాకు గాను రేలంగికి మూడు వందల రూపాయల పారితోషికం లభించింది.[2] దీంతో ఆర్థిక కష్టాలు కొద్దిగా తీరాయి.

తర్వాత శోభనాచల ప్రొడక్షన్స్ వారు తీస్తున్న కీలుగుర్రం (1949) అనే సినిమాలో ప్రముఖ నటి కృష్ణవేణి సహకారంతో ఒక చిన్న వేషం సంపాదించగలిగాడు. రేలంగికి జోడీగా కనకం నటించింది. రేలంగి ఈ చిత్రంలో స్వయంగా ఓ పాట కూడా పాడాడు. ఈ సినిమాకు గాను మరో మూడు వందలు లభించాయి. ఈ డబ్బులుతో తన వ్యక్తిగత సమస్యలు తీర్చుకుంటూనే రంగూన్ రౌడీలో తనతో పాటు నటించిన పద్మనాభాన్ని తన సైకిల్ మీద తిప్పుతూ వింధ్యరాణి సినిమాలోనే అవకాశం ఇప్పించారు. కీలుగుర్రం సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో రేలంగిది చిన్న పాత్రే అయినా ఈ చిత్ర నిర్మాత అయిన మీర్జాపురం రాజా నుండి వెండి కీలుగుర్రాన్ని జ్ఞాపికగా అందుకున్నారు. ఈ రెండు సినిమాలతో రేలంగ్ కెరీర్ విజయపథం వైపు మళ్ళింది.

రేలంగి ప్రతిభను వాడుకున్న వారిలో కె.వి.రెడ్డి ఒకరు. ఆయన గుణసుందరి కథ (1949) సినిమాలో రేలంగికి మంచి పాత్రనిచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వం దర్శక నిర్మాతలకు బాగా నచ్చింది. స్త్రీ సాహసము, పాతాళ భైరవి, పెద్దమనుషులు, షావుకారు, సంసారం, బ్రతుకుతెరువు, పక్కింటి అమ్మాయి మొదలైన చిత్రాలతో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి.

విజయాలు
తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవారు. ముఖ్యముగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పు కూడు మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి.

రేలంగి పోషించిన కొన్ని పాత్రలు:

· నర్తనశాలలో – ఉత్తరకుమారుడు

· మాయాబజార్లో – లక్ష్మణకుమారుడు

· హరిశ్చంద్రలో – నక్షత్రకుడు

· లవకుశలో – రజకుడు

· జయభేరిలో – లచ్చన్న బంగారయ్య

· జగదేకవీరుడులో – రెండు చిడతలు

· సువర్ణ సుందరిలో – కైలాసం

· ప్రేమించి చూడు లో – బుచ్చబ్బాయ్

· వెలుగునీడలులో – వెంగళప్ప

· అప్పుచేసి పప్పుకూడులో – భజగోవిందం

· మిస్సమ్మలో – దేవయ్య

రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువ నటించారు. రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవారు. ఆయన పాడిన వినవే బాల నా ప్రేమ గోల, కాణీ ధర్మం సెయ్ బాబూ, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హాస్యనటుడు రాజబాబుకు మొదటి చిత్రం.

కెరీర్ చివరి రోజులు
రేలంగికి పేరు, డబ్బు వచ్చిన తర్వాత తోటి హాస్యనటులకు అవకాశం కల్పించడం కోసం తన చిత్రాలను బాగా తగ్గించుకున్నారు. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో చలం, పద్మనాభం మొదలైన వారున్నారు.[2] అంతే కాకుండా ఉత్తమ హాస్యనటుడికిచ్చే పురస్కారాల పోటీల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. వృద్ధాప్యం మీద పడినా, కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నా పారితోషికం గురించి పట్టింపు లేకుండా కాలక్షేపం కోసం చిన్న చితకా వేషాలు వేస్తూనే ఉండేవారు.[1]

కుటుంబం
రేలంగి సతీమణి పేరు బుచ్చియమ్మ.[7] ఈమె పెంటపాడుకు చెందిన చేబోలు వీరాస్వామి కుమార్తె. ఈమె అన్నదమ్ములు పెద్దగా చదువు లేకపోయిన తమ కులవృత్తి అయిన అబ్కారీ వ్యాపారంలో బాగా సంపాదించారు. తమ చెల్లెలికి వెంకట్రామయ్య తగిన జోడీ అని భావించారు. 1933 డిసెంబరు 8 వ తేదీన వీరి వివాహం వధువు స్వగృహంలో జరిగింది. పెళ్ళి సమయానికి బుచ్చియమ్మ రేలంగి కన్నా పదిహేనేళ్ళు చిన్నది. వీరి కుమారుడు సత్యనారాయణ బాబు. సినిమాల్లో తీరిక లేకుండా నటిస్తున్నప్పుడు ఇంటి వ్యవహారాలన్నీ భార్య బుచ్చియ్యమ్మే చూసుకునేది. రేలంగి తన సంపాదన మొత్తం ఆమె చేతిలో పెట్టి తన అవసరాలకు, దాన ధర్మాలకు వరకు ఆమె నుంచి తీసుకునే వాడు. భార్యా భర్తలిద్దరూ దైవ భక్తి కలవారు కావడంతో ఖాళీ దొరికినపుడు కుటుంబంతో సహా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చేవారు. కొడుక్కి పెళ్ళీడు వచ్చేసరికి రేలంగి మంచి స్థితిమంతుడు. ఎంతోమంది తమ ఆడపిల్లలని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఆయన మాత్రం తనకు పూటకు ఠికాణా లేని రోజుల్లో కూడా గౌరవించి పిల్లనిచ్చిన తమ బావమరిది కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు.

రేలంగి తన తల్లిదండ్రులకు ఎలా ఏక సంతానమో ఆయనకు కూడా సత్యనారాయణ బాబు ఒక్కడే సంతానం. తండ్రి గారాభం వల్ల అతనికి కూడా చదువు పెద్దగా అబ్బలేదు. అతని చదువు పి.యు.సి తో ఆగిపోయింది. బాల్యం నుంచీ నటనపై ఆసక్తి ఉండేది. చిన్నతనంలోనే నాటకాల్లో నటించి మూడు అవార్డులు సంపాదించాడు. బాలానందం అనే సినిమాలో హీరోగా, విలన్ గా కూడా నటించాడు. సత్యనారాయణ బాబు చిన్నతనంలోనే సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం ప్రారంభించాడు. చట్టాలు మారాలి అనే సినిమాను తమిళంలో డబ్బింగ్ చేసి నిర్మాతగా కూడా మారాడు. తండ్రికిచ్చిన మాట కోసం సినిమాలకు దూరంగా ఉన్నాడు. 1958లో కుసుమ కుమారితో సత్యనారాయణ బాబు పెళ్ళి జరిగింది. కాలక్రమంలో అతనికి ఇద్దరు కొడుకులు, ఐదుగురు కూతుర్లు కలిగారు. సత్యనారాయణ బాబు డిసెంబరు 26, 2013 న హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశాడు.[8] సత్యనారాయణ కొడుకులిద్దరూ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్ద అల్లుడు మెదక్ జిల్లా సదాశివపేట ఛైర్మన్ గా పనిచేశాడు.

బుచ్చియమ్మ భర్త మరణానంతరం దాదాపు మూడు దశాబ్దాల పాటు జీవించింది. తాడేపల్లి గూడెంలో రేలంగి కట్టించిన విశాలమైన ఇంటిని కొడుకు అమ్మేసే దాకా ఆమె అక్కడే జీవించింది. ఒక్క థియేటరు తప్ప భర్త సంపాదించిన అపారమైన సంపద అంతా ఆమె కళ్ళ ముందే కరిగిపోయింది.[9] చివరి దశలో రేలంగి చిత్రమందిర్ వెనుకల ఉన్న అతిథి గృహంలో నివసించేవారు. ఈమె 2004లో మరణించింది.

విశిష్టత
రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవి.[10] రేలంగి పుట్టింది రావులపాడు, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లి గూడెంతో ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకు కారణం ఆ ఊరి ప్రజలు ఆయనపై చూపిన అభిమానం. వారికోసం ఏమైనా చేయాలనుకున్నాడు. ఊరి ప్రజలకు సినిమాలపై ఆసక్తి మెండు. ఆయన పెద్ద నటుడైన తర్వాత తన సినిమా విడుదలైతే మొదటి రోజునే చూడాలని ఉబలాట పడేవాళ్ళు. అందుకని అక్కడే అత్యాధునిక సదుపాయాలతో సినిమా థియేటర్ నిర్మించాలనుకున్నాడు. అనేక వ్యయప్రయాసలతో కూడుకున్న ఈ పనికి పూనుకున్న రేలంగిని కొంతమంది శ్రేయోభిలాషులు వారించారు. కానీ రేలంగి మాత్రం వారి మాటలు లెక్క చేయలేదు. అలా రేలంగి చిత్ర మందిర్ నిర్మాణం ప్రారంభమైంది. తాను చిత్రీకరణల్లో విరామం లేకుండా ఉండటంతో తన కుమారుడికి ఈ బాధ్యత అప్పజెప్పాడు. ఈ పని కోసం ఆయన మద్రాసు నుంచి కుటుంబంతో సహా తాడేపల్లిగూడెం కి వచ్చి స్థిరపడ్డాడు. నిర్మాణానికి అనుకున్నదానికంటే ఖర్చు చాలా ఎక్కువైంది. చివరికి 1962 లో ఈ థియేటర్ నిర్మాణం పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి ఎస్. వి. రంగారావు, జమున, కాంతారావు, జె. వి. రమణమూర్తి లాంటి ప్రముఖులందరూ విచ్చేశారు. దర్శకుడు కె. వి. రెడ్డి రిబ్బన్ కత్తిరించాడు. రేలంగి గురువు సి. పుల్లయ్య మొదటిసారిగా ప్రొజెక్టరు ఆన్ చేశాడు. ఈ థియేటర్ పుణ్యమా అని ఆ ఊరి ప్రజలకు ఎంటర్ ది డ్రాగన్, మెకన్నాస్ గోల్డ్ లాంటి హాలీవుడ్ చిత్రాలను కూడా తమ ఊళ్ళోనే చూసే అరుదైన అవకాశం లభించింది. ఈ థియేటరును సత్యనారాయణ బాబు మల్టీప్లెక్స్ లాగా తీర్చిదిద్దాలనుకున్నా ఆ కోరిక తీరకుండానే మరణించాడు.[8]

సన్మానాలు, పురస్కారాలు, బిరుదులు
రేలంగి నటుడిగా తారా స్థాయికి చేరగానే ఆయనకు సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో జరిగాయి. 1955 లో హైదరాబాదులో ఆంధ్ర నాటక కళాపరిషత్తు వాళ్ళు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సన్మాన కర్త ప్రముఖ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు. 1956లో రేలంగికి రాజమండ్రిలో లలిత కళానికేతన్ వారిచే మరో ఘన సన్మానం జరిగింది. ఈ సభలో హాస్యబ్రహ్మగా పేరు గాంచిన భమిడిపాటి కామేశ్వరరావు రేలంగికి హాస్య నటచక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశాడు. ఈ సభలో ఆయనకు సువర్ణ కంకణాలు, దండం బహుకరించారు. 1959 మే 14 న తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాసు వాణీ మహల్ లో రేలంగిని గజారోహణం చేయించి ఘనసన్మానం జరిపారు. ఆ మరుసటి రోజునే మద్రాసు విజయా గార్డెన్స్ లో తోటి నటీనటులందరూ కలిసి సన్మానం చేశారు. ఈ సన్మానానికి ప్రముఖ తెలుగు, తమిళ భాషల నటులందరూ హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా నియమింపబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు.

బండారులంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన ఊళ్ళలో రేలంగికి కనకాభిషేకాలు జరిగాయి. 1967 లో ఏలూరు పట్టణంలోని ప్రభాత్, శ్యామల థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో రేలంగికి ఘన సన్మానం జరిగింది. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది.

మరణం
చివరి దశలో రేలంగి తీవ్రమైన నడుమునొప్పితో బాధపడ్డాడు. వైద్యులు ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా తేల్చారు. ఈ సమయంలో ఆయనకు రేలంగి సతీమణి బుచ్చియమ్మ అక్క కూతురైన రాజేశ్వరి ఆయనకు దగ్గరుండి సేవలు చేసింది. రాజేశ్వరి రేలంగి దంపతులను స్వంత తల్లిదండ్రుల్లా భావించేది. 1975 నవంబరు 27 ఉదయం తాడేపల్లి గూడెంలోని తన స్వగృహంలో మరణించాడు.

నవ్వించడమంటే నవ్వుకునేంత హాయి కాదు .. నవ్వించడమంటే ఎదుటివారిని ఏడిపించేంత తేలికా కాదు. నవ్వించాలంటే మాటల్లో మెరుపుల్లాంటి విరుపులు ఉండాలి.. భావాల ఆవిష్కరణలో చాతుర్యం ఉండాలి .. అర్థాల్లో చమత్కారం పండాలి. అదే సమయంలో అందుకుతగిన హావభావ విన్యాసం చేయగలగాలి. అలాంటప్పుడే అవతలివారిని నవ్వించే ప్రయత్నం ఫలిస్తుంది. తెరపై నవ్వించలేకపోతే నవ్వులపాలు కావలసి వస్తుంది. అందుకే నవరసాల్లో హాస్యరసంతో అవతలివారిని మెప్పించడం చాలా కష్టతరమైనదని పెద్దలు సెలవిచ్చారు. అంతటి కష్టతరమైన హాస్యాన్ని అవలీలగా నడిపించిన తొలితరం హాస్యనటుల్లో రేలంగి వెంకట్రామయ్య ఒకరు.

రావులపాడులో పుట్టి చెన్నైలో అడుగెట్టి..

రేలంగి 1910.. ఆగస్టు 13న కాకినాడ సమీపంలోని ‘రావులపాడు’ గ్రామంలో, ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి హరికథలు చెబుతూ జీవనాన్ని నెట్టుకొచ్చేవారు. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా 9వ తరగతితో చదువు ఆపేసిన రేలంగి నటనపట్ల ఆసక్తిని చూపడం మొదలెట్టారు. సినిమాల పట్ల ఆసక్తితో చెన్నైకి చేరుకున్నారు. దర్శకుడు సి.పుల్లయ్య దగ్గర ప్రొడక్షన్ టీమ్ లో స్థానం లభించడంతో సాపాటుకు ఇబ్బందిలేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు నుంచి పుల్లయ్యగారు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ, నటుడిగా ఎప్పుడు అవకాశం వస్తుందా అనే ఆశతో ఎదురుచూడసాగారు.

రేలంగి పనితీరు .. వ్యక్తిత్వం నచ్చడంతో, ఆయనను నటుడిగా చేయాలనే నిర్ణయానికి సి.పుల్లయ్య వచ్చారు. తన సినిమాల్లో రేలంగికి చిన్న చిన్న పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. తన పని తాను చేస్తూనే ఆ పాత్రల్లో నటిస్తూ, నటుడిగా రేలంగి తన వేగాన్ని పెంచారు. ‘కీలుగుఱ్ఱం’లో చేసిన ‘గోవి౦దుడు’ పాత్ర .. ‘గుణసుందరికథ’లో చేసిన ‘కాలమతి’ పాత్ర హాస్య నటుడిగా ఆయన ఉనికిని చాటాయి. అలా 40వ దశకంలో నటుడిగా తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన రేలంగి, 50వ దశకం ఆరంభంలోనే ‘పాతాళభైరవి’ చేశారు.

పాటలు పాడటంలోనూ ఘనాపాటి

‘పాతాళ భైరవి’ సినిమాలో సూరసేనుడి పాత్రలో ‘వినవే బాలా నా ప్రేమ గోల’ అంటూ రేలంగి చేసిన సందడితో కెరియర్ పరంగా ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అప్పట్లో ఏ స్టేజీ నాటకంలోనైనా ఈ పాట ఉండవలసిందే అనేంతగా ఈ పాట పాపులర్ అయింది. రేలంగికి ఒక పాట పెట్టడమనేది ఈ సినిమా నుంచే మొదలైంది. ‘శివ శివ మూర్తివి గణనాథా .. ‘ .. ‘ధర్మం చెయ్ బాబూ ..’ .. ‘కాశీకి పోయాను రామా హరే .. ‘శివగోవింద గోవిందా .. ‘ఇంగిలీషులోన మ్యారేజీ .. ‘ చక్కనిదానా చిక్కనిదానా ..’ .. ‘సుందరి నీ వంటి దివ్య స్వరూపం .. ‘, ‘సరదా సరదా సిగరెట్టు..’ వంటి కొన్ని పాటలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

రేలంగి పనితీరు .. వ్యక్తిత్వం నచ్చడంతో, ఆయనను నటుడిగా చేయాలనే నిర్ణయానికి సి.పుల్లయ్య వచ్చారు. తన సినిమాల్లో రేలంగికి చిన్న చిన్న పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. తన పని తాను చేస్తూనే ఆ పాత్రల్లో నటిస్తూ, నటుడిగా రేలంగి తన వేగాన్ని పెంచారు. ‘కీలుగుఱ్ఱం’లో చేసిన ‘గోవిదుడు’ పాత్ర .. ‘గుణసుందరికథ’లో చేసిన ‘కాలమతి’ పాత్ర హాస్య నటుడిగా ఆయన ఉనికిని చాటాయి. అలా 40వ దశకంలో నటుడిగా తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన రేలంగి, 50వ దశకం ఆరంభంలోనే ‘పాతాళభైరవి’ చేశారు.

పాటలు పాడటంలోనూ ఘనాపాటి

‘పాతాళ భైరవి’ సినిమాలో సూరసేనుడి పాత్రలో ‘వినవే బాలా నా ప్రేమ గోల’ అంటూ రేలంగి చేసిన సందడితో కెరియర్ పరంగా ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అప్పట్లో ఏ స్టేజీ నాటకంలోనైనా ఈ పాట ఉండవలసిందే అనేంతగా ఈ పాట పాపులర్ అయింది. రేలంగికి ఒక పాట పెట్టడమనేది ఈ సినిమా నుంచే మొదలైంది. ‘శివ శివ మూర్తివి గణనాథా .. ‘ .. ‘ధర్మం చెయ్ బాబూ ..’ .. ‘కాశీకి పోయాను రామా హరే .. ‘శివగోవింద గోవిందా .. ‘ఇంగిలీషులోన మ్యారేజీ .. ‘ చక్కనిదానా చిక్కనిదానా ..’ .. ‘సుందరి నీ వంటి దివ్య స్వరూపం .. ‘, ‘సరదా సరదా సిగరెట్టు..’ వంటి కొన్ని పాటలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

రేలంగిపై చిత్రీకరించిన పాటలన్నీ ఆదరణ పొందుతూ, అవి ఆయా సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఆయన కెరియర్ ను మరింత బలంగా ముందుకు నడిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు కమెడియన్ గా ఉన్న కస్తూరి శివరావు .. రేలంగి సహనటుడైన రమణారెడ్డి ఇద్దరూ బక్కపలచగా ఉండి, తమదైన బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పూయించారు. ఆ శరీరాకృతి కారణంగా కామెడీని పండించడంలో వాళ్లు చాలా చురుకుగా ఉండేవారు. వాళ్లతో పోలిస్తే రేలంగి కాస్త మందంగానే ఉండేవారు. నిదానంగా .. భారంగా అడుగులువేస్తూ, కనుబొమలు .. భుజాలు ఎగరేస్తూ గమ్మత్తైన మేనరిజంతో డైలాగ్స్ చెబుతూ ఆయన ముందుకెళ్లారు.

నడకతోనే నవ్వులు పూయించే ఆయన తీరుకి ప్రేక్షకులు పట్టుబడిపోయారు. హాస్య పాత్రల్లో ఒదిగిపోయే విధానానికి ఆనందంతో అభిమానులైపోయారు. తెరపై రేలంగి కనిపిస్తే నిండుదనం .. పండుగదనం అనుకుంటూ ఆత్మీయులైపోయారు. ‘మిస్సమ్మ’ చిత్రంలో ప్రతిచిన్న విషయానికి ‘తైలం .. తైలం’ అంటూ డబ్బులు వసూలు చేసే ‘దేవయ్య’ పాత్రలో ఆయన చేసిన హడావుడిని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక ‘వెలుగు నీడలు’లో మాటకి ముందు .. వెనుక ‘శ్రీమతే రామానుజాయ నమః’ అంటూ ఆయన పోషించిన ఉదాత్తమైన పాత్ర కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది.

‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమా రేలంగి పాత్రపైనే మొదలవుతుంది. ఈ సినిమాలో అప్పులవారి బారి నుంచి తప్పించుకునే ‘భజగోవిందం’ పాత్రలో ఆయన పెట్టిన కితకితలు ఇప్పటికీ తలచుకుని నవ్వుకునేలా చేస్తాయి. ‘పెద్దమనుషులు’ సినిమాలోని ‘తిక్క శంకరయ్య’ పాత్ర రేలంగికి మంచిపేరు తెచ్చిపెట్టింది. పెద్దమనుషుల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నవారిని ఆటపట్టిస్తూ .. ఆటకట్టించే పాత్రలో ఆయన నటన అభినందనీయమని చెప్పకతప్పదు.

‘మాయాబజార్’ లో చేసిన ‘లక్ష్మణ కుమారుడు’ పాత్ర .. ‘నర్తనశాల’లో చేసిన ‘ఉత్తర కుమారుడు’ పాత్ర దేనికవే వైవిధ్యభరితమైనవి. ఈ రెండు పాత్రలు .. అసమానమైన ఆయన హాస్యరస పోషణకు అద్దం పడతాయి. ఇక ‘లవకుశ’ సినిమాలో అనుమానంతో భార్యను నిందిస్తూ, ఆ సమస్యను తీసుకెళ్లి రాముడికి ముడిపెట్టే సన్నివేశంలో ఆయన నటన అనితర సాధ్యం అనిపిస్తుంది. ‘విప్రనారాయణ’లో వేశ్య కుటుంబానికి చెందిన స్త్రీ మాయలో తన గురువుగారు పడకుండా కాపాడుకునే ‘రంగరాజు’ పాత్ర .. ‘వాగ్దానం’లో హరికథలు చెప్పుకుని జీవించే ‘రామదాసు’ పాత్ర ఆయన సహజ నటనకు సాక్ష్యంగా నిలుస్తాయి. నిజమైన నటనకు నిర్వచనం చెబుతాయి.

ఇలా ఎన్నో విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు .. విరామమెరుగని విజయాలు రేలంగి ఖాతాలో కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రేయింబవళ్లు చెప్పుకున్నా తరగని చరిత్రే రేలంగి. ఈ రోజుల్లో కొంతమంది సినిమాల్లో అవకాశాల కోసం కొన్ని రోజుల పాటు ప్రయత్నాలు చేసి, ఇక ఈ కష్టాలు తమవల్ల కాదని నిరాశ చెందుతారు. అవకాశాలు రావడం లేదని దిగాలుపడిపోతారు. అలాంటివారికి ఎప్పటికీ ఎనర్జీని ఇచ్చే పాఠం .. రేలంగి జీవితం. ఆయన పని చేయలేదు .. ఒక యజ్ఞం చేశారు .. ఒక తపస్సు చేశారు. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లతో సావాసం చేయకుండా, ఆశల దుప్పటికప్పి నిరాశను నిద్రబుచ్చారు.

కాలానికి ఎదురీదే ఓ వ్యక్తి జీవితంలో ఎంతవరకూ ఎదగగలడు అనే ప్రశ్నకి, తన పేరునే సమాధానంగా చూపిన నటుడు ‘రేలంగి’ ఒకానొకప్పుడు చెన్నైలో అద్దె ఎక్కువగా ఇచ్చుకోలేని కారణంగా ఊరు బయట ఇంట్లో మకాం పెట్టిన రేలంగి, ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ వరుస బంగ్లాలను కట్టించారు. ఏ రోడ్లపై ఎర్రటి ఎండల్లో నడిచారో .. అదే రోడ్లపై ఏసీ కారుల్లో తిరిగారు. తను హాస్య నటుడై వుండి, మరో హాస్యనటుడైన పద్మనాభానికి అవకాశాలు ఇప్పించిన విశాల హృదయం ఆయన సొంతం.

అంకితభావాన్ని మిత్రుడిగా ఆదరించిన ఆయన, అహంభావాన్ని మాత్రం ఎప్పుడూ శత్రువులానే చూశారు. ఆకలితో పాటు ఆత్మాభిమానం కూడా అందరికీ ఉంటుందని భావించిన రేలంగి, ఎవరి మనసులను కష్టపెట్టకుండా మసలుకునేవారు. తనని తాను మైనంలా మలచుకుంటూ ఆయన మేరు పర్వతంలా ఎదిగిపోయారు. తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకంలా మిగిలిపోయారు. ఈ రోజున రేలంగి వర్ధంతి .. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ఆయనను స్మరించుకుంటోంది.

– పెద్దింటి గోపీకృష్ణ

అలాంటి వీలునామా ఎవ్వరూ రాసి ఉండరు..
రేలంగిని ఆప్యాయంగా రేలంగోడు అంటూ సొంతవానిగా అక్కున చేర్చుకుంటారు. సినిమాలో రేలంగి కనపడితే నవ్వులే నవ్వులు. నడక, మాట తీరు, వస్త్ర ధారణ.. అన్నీ హాస్యమే. తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి. ఆయనే రేలంగి వెంకట్రామయ్య. హాస్యంతో పాటు వీలునామా కూడా విలక్షణమే.. రేలంగి మనవరాలు గాయత్రి, తన తాతను గుర్తు చేసుకుంటూ, అందమైన సంఘటనలెన్నో సాక్షికి వివరించారు.
మా ముత్తాత రామస్వామి (రేలంగి తండ్రి) హరికథలు చెప్పేవారు. ఆయనకు తాతయ్య ఏకైక సంతానం. ఆగస్టు 13, 1910న రావులపాడులో పుట్టారు. తాతయ్యకు నాన్న ఏకైక సంతానం. నాన్నను సత్యనారాయణబాబు, రేలంగి బాబు అని పిలిచేవారు. నాన్నగారికి మేం ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలం. తాతయ్యకు ఆడ పిల్లలంటే చాలా ఇష్టం. బంధువుల పిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుండేది. యంగ్‌మెన్స్‌ ఆర్టిస్ట్స్‌ క్లబ్‌లో తాతయ్య హార్మోనియం నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే తాతయ్య నాటకాలు వేసేవారు. పి. పుల్లయ్య గారితో కలకత్తా వెళ్లి, ఒక సినిమాలో చేశాక, చెన్నైలో ఎన్నో ఇబ్బందులు పడుతూ చిన్నచిన్న వేషాలు వేశాక, గుర్తింపు వచ్చింది. 1950 – 70 మధ్య హీరోలకు దీటుగా పని చేశారు. తాతయ్యను చూడటానికి బస్సులలో వచ్చిన అభిమానులందరికీ భోజనాలు పెట్టి పంపేవారట.

నా పేరు పెట్టొద్దు అన్నారు…
దానధర్మాల్లో తాతయ్యకు మంచి పేరు. ఎవరైనా చదువుకోవటానికి ఆర్థిక సహాయం కోసం వస్తే, ‘మంచి మార్కులతో పాస్‌ అయి చూపించాలి’ అనేవారట. 1967లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించే ముందు, ‘రేలంగి వెంకటేశ్వర యూనివర్సిటీ’ అని పేరు పెడతాం, ఐదు లక్షలు విరాళం ఇవ్వమన్నారట. అందుకు తాతయ్య, ‘నా పేరు పెట్టక్కర్లేదు, నాలుగు లక్షలు ఇస్తాను, మా వాళ్లందరికీ చదువు రావాలని మొక్కుకోండి’ అన్నారట. దానధర్మాలలో ‘నాగయ్యగారి తరవాత రేలంగి గారు’ అన్న పేరు సంపాదించుకున్నారు.

పిల్లల మీద చాలా ప్రేమ..
దక్షిణాది భాషల చిత్రాల షూటింగ్‌లన్నీ వాహిని స్టూడియోలో జరిగేవి. ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా గార్డెన్స్‌ను తాతయ్య 1956లో కొని, అందులో పంటలు పండించారు. ఆ చోటును∙వాహిని వారికి లీజ్‌కిచ్చారు. ఆ స్థలం తాలూకు వీలునామా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడ, మగ తేడా లేకుండా ఎంతమంది మనవలు పుడితే అంతమంది సమానంగా అనుభవించేలా విల్లు రాయించారు. అప్పటికి నాన్నకి ఇంకా వివాహం అవ్వలేదు. నాన్న జీవించినంత కాలం ఆ ఆస్తిని మనవలకు అమ్మే హక్కు లేకుండా రాయించారు. ఆ వీలునామా ఎన్నటికీ మరచిపోలేని విషయం.

తాతయ్యతో చూడలేకపోయాం..
తాతయ్యతో ఎక్కువ సమయం గడపలేక పోయామనే బాధ ఉంది మాకు. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. మాయాబజార్, పాతాళభైరవి వంటి చిత్రాలు తాతయ్యతో కలిసి చూడలేకపోయాం. ఆయన నటించిన సినిమాలన్నీ టీవీలో చూస్తూ, ఎంజాయ్‌ చేస్తాం. తాతయ్య 360కి పైగా సినిమాలు చేశారని తరవాత తెలిసింది. సినిమా పరిశ్రమలో ఉండే రాజకీయాలు తాతయ్యకి తెలుసు. అందుకే నాన్నను సినిమాలలోకి వద్దన్నారు. నాన్న ‘బాలానందం’ అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాతయ్య చివరి రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఎవరైనా వస్తే ఉండటానికి వీలుగా అక్కడ పోర్షన్స్‌గా కట్టించారు. తాతగారికి మనుషులు కావాలి. నాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికే తాతయ్య పోయారు. ఆయన పోయాక కూడా ఆంధ్ర నుంచి తెలుగువారు చెన్నై వచ్చి మా ఇంట్లో ఉండేవారు.

మద్రాసు పాండీబజార్‌లో…
తాతయ్య బాగా డబ్బు సంపాదించిన రోజుల్లో, మద్రాసు పాండీ బజారులో థియేటర్‌ కడదామనుకున్నారు. కాని తాతగారి బంధువులంతా తాడేపల్లిగూడెంలో ఉండటంతో, ‘మన పేరు తెలిసేచోట కడితే, మనల్ని పదికాలాల పాటు గుర్తు చేసుకుంటారు’ అని తాడేపల్లి గూడెంలో 1962లో ‘రేలంగి చిత్ర మందిర్‌’ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు థియేటర్‌ ప్రారంభించారు. అందులో విడుదలైన మొదటి సినిమా లవకుశ. ఇప్పుడు అది బాగా పాతబడిపోవటంతో ‘పద్మశ్రీ వెంకట్రామయ్య మాల్‌’ గా మారుస్తున్నాం.

మనవలంటే ప్రాణం…
తాతయ్యకు మనవలంటే మహా ఇష్టం. మాతో చాలా స్నేహంగా ఉండేవారు. నానమ్మతో మా గురించి చెప్పుకుంటూ మురిసి పోయేవారట. మేమంతా మద్రాసులోనే పుట్టి పెరిగాం. తాతయ్య సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఇంటి విషయాలన్నీ నానమ్మ చూసుకునేది. మా బంధువులలో చాలామందికి తాతయ్యే పెళ్లిళ్లు జరిపించారు.

తాతగారి డాడ్జ్‌ కారు నెంబరు ఎంఎస్‌ఆర్‌ 1722. అప్పట్లో పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కారు నెంబరుతో పిలిచేవారు. అలా వినటం వల్ల నెంబరు గుర్తుండిపోయింది. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా అందరినీ బయటకు తీసుకువెళ్లేవారు. పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలామందిని తనతో ఢిల్లీ తీసుకువెళ్లారు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేవారు. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల, మాతో ఎక్కువ సమయం గడపేవారు కాదు. కాని మా బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకున్నారు. షైన్‌ వేలాంకణి స్కూల్‌లో చేర్పించారు. అందువల్ల మాకు చదువులో మంచి ఫౌండేషన్‌ పడింది.

అందరూ చక్కగా ఉన్నారు…

తాతగారి వైపు బంధువులంతా వృద్ధిలోకి వచ్చారు. తాతగారి దగ్గర పనిచేసిన మేనేజర్, మా నాన్నగారి దగ్గర కూడా చేశారు. అప్పట్లో మేం తాతాజీ సినిమాలు చాలా తక్కువ చూశాం. తాతాజీతో ఒకటిరెండు ప్రివ్యూలకు వెళ్లాం. ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయామని బాధపడతాం. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం.

మరచిపోలేని అదృష్టాలు…
తాతాజీతో బీచ్‌కి వెళ్లినరోజులు ఇప్పటికీ మరిచిపోలేం. మద్రాసు బీచ్‌లో కారు ఆపుకుని, సముద్రం వరకు నడిచేవాళ్లం. తాతాజీకి ఫోల్డింగ్‌ చైర్‌ తీసుకువెళ్లేవాళ్లం. ఆయన అందులో కూర్చునేవారు. చాలాసేపు అక్కడే ఆడుకునేవాళ్లం. మేం ఏం కొనుక్కోవాలన్నా నానమ్మకే చెప్పేవాళ్లం. ఇంటి విషయాలన్నీ నానమ్మకు వదిలేశారు. తాతాజీ సంపాదనంతా నానమ్మకి ఇచ్చేవారు. నానమ్మ తన దగ్గర నగలన్నీ ఎవరికి కావాలంటే వారికి పెట్టేసేది. అందరికీ పెట్టగలిగేంత బంగారం ఉండేది. ఇంట్లో చాలామంది భోజనాలు చేసేవారు. నేను తాతాజీ వాళ్ల అమ్మలా ఉంటానని, నన్ను ‘అమ్మ’ అని పిలిచేవారు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, అత్తవారిళ్లకు వెళితే ఎలా అని బెంగగా ఉండేవారు. తాతాజీ తన చేతుల మీదుగా ఒక్క మనవరాలికి మాత్రమే కన్యాదానం చేశారు. ఇంకా కొంతకాలం ఉండి ఉంటే, మాకు కూడా చేసేవారేమో.

అందరి ఫంక్షన్లు బాగా ఘనంగా చేశారు. అది లోటే మాకు. జకార్తా వెళ్లినప్పుడు వాచ్‌ తెచ్చారు. స్ట్రాప్స్, బెల్టులు మార్చుకోవచ్చు. ఇప్పుడు పనిచేయకపోయినా, ఆయన గుర్తుగా ఉంచుకున్నాను. మా అక్కను అపురూపంగా చూసేవారు. కారులోనే స్కూల్‌కి వెళ్లేది. అక్క చిన్నప్పటి నుంచి సుకుమారం.

ఆ వీలునామాలో ముందుజాగ్రత్త…
‘‘మాది రైతు కుటుంబం కనుక, తాతగారి పొలం ఆడ, మగ తేడా లేకుండా నా కొడుకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ సమానంగా ఇవ్వాలి. వారంతా నా పేరు చెప్పుకుని కడుపు నిండా తినాలి’’ అన్నారట తాతయ్య. అప్పటికి మా నాన్న వయసు పందొమ్మిది సంవత్సరాలు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. తాతయ్య పెద్దగా చదువుకోకపోయినా ఎంతో దూరదృష్టితో ఈ పని చేసి ఉంటారనుకుంటాం. మనవలు అమ్మకుండా, డబ్బు పాడవ్వకుండా ఆ రోజుల్లో అంత బిగింపుగా వీలునామా రాశారంటే తాతయ్య నిజంగా చాలా గొప్పవారనిపిస్తుంది.

మా కుటుంబం
తాతాజీకి మేం ఆరుగురు మనవలం. పెద్దక్కయ్య చాముండేశ్వరీ దేవి, అన్నయ్య తిరుమలబాబు, మూడు నేను గాయత్రీ దేవి, నాలుగు రాజ్యలక్ష్మి, ఐదు శ్రీదేవి (నానమ్మ పేరు, తాతగారు నానమ్మని శ్రీదేవమ్మ అని పిలిచేవారు), ఆరు హేమంత్‌కుమార్‌. మేమంతా నానమ్మను అమ్మ అనేవాళ్లం. తాతయ్యను తాతాజీ అనేవాళ్లం. మా నాన్నగారు కూడా అలాగే పిలిచేవారు. ఏం కొనాలన్నా వాళ్ల సలహా తీసుకునేవాళ్లం. నాన్నగారు ఆరు సంవత్సరాల క్రితం, అమ్మ రెండు సంవత్సరాల క్రితం పోయారు. తాతాజీ, నానమ్మలే కాకుండా మా అమ్మనాన్నలు కూడా లేకపోవటం మాకు ఎంతో పెద్ద నష్టం అనిపిస్తుంది. 1975లో తాతాజీ కన్నుమూశారు.
– గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు

నా డైరీలోని బహిరంగ రహస్యాలు…..

● రావులపాడు అనే గ్రామంలో పుట్టానుట. అక్కడే పుట్టాను అని నాకు తెలీదు… పెద్దలు చెప్పారు. పెద్దలు అబద్ధం ఆడరు. అయినా సరే, “ట”
అన్నాను.

● పదో ఏట నాటకంలో వేషాలు వేశాను. నాటకం బృహన్నల. అందులో మనం బృహన్నల! ఇంతకంటే అప్పుడు ఇంకా అందంగా వుండేవాణ్ణి – మీకేం తెలును!

● చదువు మీద ఉత్సాహం కలగలేదు. నాలుగో ఫారంలో “చదువు” నన్ను విడిచి పెట్టి పారిపోయింది!

● పది హేనూ ఏళ్ళపాటు అలా అనేక నాటకాల్లో వేషాలు వేసి, వేసి, వేశాక – సినిమా ఛాన్సు తగిలింది. 1935 లో, హార్మోనిస్టు దూని శాస్త్రి గారూ వాళ్ళంతా కలకత్తా బయల్దేరుతున్నారు. నన్ను రమ్మవలేదు. కాని నేనే వాళ్ళ వెంటబడి కలకత్తా వెళ్ళాను. వెళ్ళాను గదా అని నా చేత కొన్ని వేషాలు వేయించుకున్నారు. ఆ చిత్రం ‘కృష్ణతులాభారం. నిజానికి సినిమా నాకు దొరకలేదు. ఆ విధంగా నేనే దొరికిపించుచుకున్నాను !

● అప్పుడు మనం రౌడీ. ఏదేదా చిన్న పేచీ వస్తే ఎదటివాడిని కొట్టి వాణ్ణి.. ఏదో మాట వస్తే అసిస్టెంటు డైరెక్టర్ని కొట్టాను. దాంతో “చెడ్డ రేలంగి” అన్న బిరుదు ఇచ్చారు. బిరుదు పొందడం అదే మొదటిసారి.

● కొంతకాలం సి పుల్లయ్యగారి దగ్గర చేరాను. పది హేనేళ్ళు ఆయనతో వాసం చేశాను. ఆ శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ళ వనవాసం చేశాడు. నేను అతనికంటే గొప్పవాణ్ణి కాబోలు – పది హేమ సంవత్సరాలు పట్నవాసం చేశాను. అనేక మంది తారలను, నా చేతిమీదిగా బుక్ చేశాను ! హె……

● 1947 లో ‘గొల్లభామ’ విడుదలయింది. అప్పటికి నాకు హాస్యనటుడిగా కాస్త పేరొచ్చింది. కాని అన్ని సంవత్సరాలు పరిశ్రమలో నిలబడి వున్నా – తర్వాత నిలబడలేక పోయాను. నిలబడ్డం కష్టమైంది. ఇంటి వెళ్ళి, కూచుందామా అనుకున్నాను. కాని.. పట్టుదల….. ఆగాను.

● తర్వాత కొంత కాలానికి “వింధ్యరాణి’లో మంచి పాత్ర లభించింది. జి. వరలక్ష్మి, నేను హాస్య జంటగా పాల్గొన్నాం. ఆ చిత్రంలో నేను బాగా చేశానని పేరొచ్చింది. ‘కీలుగుర్రం’ లో మరో మంచి వేషం దొరికింది.

● గుణసుందరి కథ, పాతాళ భైరవి తో రేలంగి, రేలంగి”గా, రేలంగిలా నిలబడ్డాను. తర్వాత చాలా చిత్రాల్లో నటించాను.

● తారల జాబితాలో చేరాను. చాలా చిత్రాల్లో ముఖ్య హాస్య పాత్రలు ధరించాను. అభిమానుల ఆదరాభిమానాలు పుష్కలంగా లభించసాగాయి.

● అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్తు హైదరాబాదులో (1955) నాకు ఘనమైన సన్మానం జరిగింది.

● మద్రాసులో నాకు ఘనమైన సన్మానం జరిగింది. ఆంధ్రా ఫిల్ము ఆర్నలిస్టులు నన్ను ఏనుగు మీద కూచో పెట్టి పూరేగించారు. ఏనుగెక్కటం చాలా చాలా గొప్పట. (మావటి ఎప్పుడూ ఎక్కుతూనే వుంటాడుగదా అంటే… చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దన్నారు).

● విజయా గార్డెన్స్‌లో సాటి, తోటి నటీనటులందరూ కలిసి నన్ను సన్మానించారు. నటీనటులందరూ కలిసి, ఇంకో నటుని సన్మానించడం అన్నది – అదే మొదటిసారి. ఆ ఘనత నాకు దక్కింది. ఆ తర్వాత అలాంటిది మళ్ళీ జరగలేదు.

● శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీకి పాతిక వేలు విరాళం ఇచ్చాను. సెనేట్ సభ్యుడినయ్యాను.

● ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు.

● బండారులంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన పూళ్ళలో నాకు కనకాభిషేకాలు జరిగాయి (బంగారం కంట్రోలు వున్నా)

● నర్తనశాల చిత్రంతో డెలిగేట్గా జకార్తా వెళ్ళాను. అందులో వేసిన ఉత్తర కుమార్డు దక్షిణం మీదగా తూర్పు దిశకు వెళ్ళాడు.

● ఎన్నో పరిషత్తులూ, సంస్థలు సన్మానిస్తూనే వున్నాయి. వీటన్నిటికి కారణం ఎవరు?… ఎవరు ?.. మీరు.. మీరే..

చిత్తగించవలెను
మీ
రేలంగి వెంకట్రామయ్య

పాత బంగారం: రేలంగి.. సైకిలుతో స్నేహం,జర్నలిస్ట్ పై కోపం!
రేలంగి ప్రారంభ రోజుల్లో మద్రాసులో కాలినడకన మైళ్ళకొద్దీ నడిచేవాడు. అది గుర్తు పెట్టుకుని తను స్టూడియో నుంచి ఇంటికి వెళుతూ ఎంతోమందికి లిఫ్ట్‌ ఇచ్చేవారు. అలాగే ఆ రోజుల్లో తను స్టూడియోలకు,షూటింగ్ స్పాట్స్ లకు తిరగటానికి అండగా నిలిచిన పాత సైకిల్‌ని భద్రంగా దాచుకున్నారు.

రేలంగి సినిమాల్లోకి వచ్చి వృధ్ది అయ్యినా తన గతాన్ని మర్చిపోవటానికి ఇష్టపడేవాడు. తన అప్పటి కష్టాలను, కష్టాలలో ఆదుకున్న స్నేహితులను మరచిపోలేదు. సినిమా ట్రైల్స్ రోజుల్లో తిండితిప్పలు ఇబ్బంది పడినవాడు కనుక, తను భోజనం చేసేటప్పుడు కనీసం పాతికమందికి భోజనం పెట్టేవారు. అలాగే తనకు చదువు అబ్బలేదు కనుక చదువుకోసం ఆర్దికసహాయం అర్దించే వాళ్లకు చేయూత ఇచ్చేవారు. రేలంగి ఏనాడూ ధనమదంతో విర్రవీగలేదని ఆయన్ను ఎరిగున్న వాళ్లు చెప్తారు.

రేలంగి ప్రారంభ రోజుల్లో మద్రాసులో కాలినడకన మైళ్ళకొద్దీ నడిచేవాడు. అది గుర్తు పెట్టుకుని తను స్టూడియో నుంచి ఇంటికి వెళుతూ ఎంతోమందికి లిఫ్ట్‌ ఇచ్చేవారు. అలాగే ఆ రోజుల్లో తను స్టూడియోలకు,షూటింగ్ స్పాట్స్ లకు తిరగటానికి అండగా నిలిచిన పాత సైకిల్‌ని భద్రంగా దాచుకున్నారు. ఆ సైకిలు అంటే ఆయనకు చాలా మక్కువ. అప్పుడప్పుడూ తన ప్రెండ్స్ తో…ఎప్పుడైనా నాకు వేషాలు లేక, సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లే పరిస్దితి కనుక వస్తే… యీ ఆస్తిపాస్తులన్నీ ఎక్కడివక్కడ వదిలేసి, ఈ సైకిలు తొక్కుకుంటూ తన ఊరైన తాడేపల్లిగూడెం వెళ్లిపోతాను’ అని అనేవారు. అలా ఆ సైకిలు ఆయన తోడుగా జీవితాంతం ఉంది.

రేలంగి కోపం..

జీవితంలో చిన్న స్దాయి నుంచి వచ్చి పైకి ఎదిగిన రేలంగికి మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలు లేవు. కానీ అప్పట్లో సంచలన వార్తలకు, అవాస్తవమైన రాతలకు, ఎల్లో జర్నలిజానికి పెట్టింది పేరైన ‘కాగడా’అనే పత్రిక ఉండేది. ఆ పత్రికకి హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్ కమ్ ఎడిటర్ శర్మ. ఆ పత్రికలో అన్ని ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్న తరహాలో సంచలనం కోసం క్రియేట్ చేయబడ్డ వార్తలు వస్తూండేవి. ఒకసారి తన పత్రికలో సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం ‘రేలంగి తాగి తందానా లాడతాడు’ అంటూ చాలా దారుణంగా.. అసభ్యమైన భాషలో రాశాడు.

ఆ పత్రిక మార్కెట్ లోకి వచ్చిన మరుసటిరోజు స్టూడియోలో షాట్‌ బ్రేక్‌లో కాగడా శర్మ రేలంగికి ఎదురయ్యాడు. వెంటనే రేలంగి అతడి చెంప చెళ్లు మనిపించాడు. దాంతో రేలంగిపై తనను కొట్టాడని పోలీసు కేసు పెడతానని అన్న కాగడా శర్మను తోటి జర్నలిస్టులు మందలించి చీవాట్లు పెట్టారు. అప్పటినుంచి కాగడా శర్మ…రేలంగికు చాలా దూరంగా ఉండేవాడు.తన పత్రికలో కూడా రేలంగి ఊసు ఎత్తేవాడు కాదు.

BAPU

“మికు బాగా నచ్చిన వాటిలో బెస్ట్‌ జోక్‌ ఏమిట?” అని ఒక మితుడు అడిగితే, ఏముందీ, “లెఫ్‌, అనగా జీవితం” అన్నాడు రేలంగి వంకటరామయం. రాళ్లూ రప్పులూ తిని హరాయించుకోగల రోజున మరమరాలు కూడా దొరకవు; తిరా వృజాలూ వైడూర్యాలూ పోగేసుకొన్నాక మరమరాలు కూడా అరగవు… రేలంగీ, వెంకటరామయ్యా తెరమదా జీవితం మీదా షిళారు వెళ్తూన్నుపుడు తరుచు ఈ మాట చెప్పుకుని పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. దొరక్క వీడూ, అరక్క వాడూ అనుకుంటూ ఉంటారు. నవ్వడం, నవ్వించడం, నవ్వుకోవడం రేలంగికి ఈనాటి విద్య కాదు; కాకినాడ యంగ్‌ మన్స్‌ హాప్‌ క్లబ్‌లో చేరిన “అన్‌ హాపీ మెంబర్లోతో కలిసి తిరిగిన నాడు కూడా నవ్వడం నవ్వించడమే

రేలంగి ఉద్యోగం. సినిమా పేటలలో వేషాల వేట సాగించినపుడు, హేళన మాటలు పడినపుడు, జార్జిటవున్‌లో ఉల్ఫాగా సెనిమా చూసి నిశిరా్నాతివేళ, ఆరుమైళ్ళ దూరాన ఉన్న ఆళ్వారుపేటకి రాజబాట కొలుస్తూ వచ్చి బార్హీగంజి తాగి కళ్లు మూసుకు పడుకున్నపుడు, ఉచ్చస్థితిక వెళ్ళి జారిపడినపుడు, తననిచూసి, తనని చూసి నవ్విన వాళ్ళని చూసీ కూడా నవ్వుతూనే వచ్చాడు. నవ్వుకుంటూనే వచ్చాడు, అతను కష్టాలుపడా దుఃఖం ఎరగడు. ఖభోజనంలేక శోషవస్తే నిద నటించి జీవితంతోనే సరసమాడి దాన్ని నవ్వించాడు. మెప్పుంచాడు. లొంగదీ్‌నుకు శువారీ చేస్తున్నాడు. ఈ విధంగా ఎంతసేపూ తన కష్టాలు తలుచుకు కమిలిపోయి తనమీద తనే జాలిపడుతూ కూర్చున్నవాడుకాడు కాబట్టి తనచుట్రూ ఊన్న వాళ్ళ కష్టసుఖాలు చూడగలిగాడు. అలా హలాహలంలోంచి అమృత ఖాండాలను, వాధథలను చిలికచిలికి తీసిన అతని నవు; ఆతని హాస్యం, సినిమాలో ఆతను పలికే మాటలు కొన్ని వెలితిమాటలఅయినా ఆతనినోట వచ్చినపుడు నిండుగా ఉండడానికి ఒక కారణం ఇదే.

పాత “చింతామ౭ి” చ్మితం నుంచి నేటివరకూ నూటికి మెబజ్జు చితాలలో నటించినా హాస్యం మటుకు పాత చింతకాయ పచ్చడి లా తయారవకుండా శంక అతను చేసిన కృషి అపారం. సినిమాలో వేషానికి సాథారణుంగా రచయితా దర్శకుడూ పకల్పన చేయడం నిజమే అయినా, రేలంగి అందులో జీవం పూరించి ఏదో కొత్తదనం తేవడానికి, సమకాలిక జీవితానికి దగ్గర కావడానికి కృషచేస్తూవచ్చాడు. కొత్తల్లో చేసిన ఆ కృషవల్లనే పాతల బదులు రేలంగే (పజాదరణు పొందాడు. “రేలంగి ఉంటే చాలండీి అనే జనం పెరిగారు. చిపరికి, కేలంగి తత్వాన్నిబట్టి, జీవితంపట్ల ఆయన దృక్పథాన్ని బట్టి ఆయన ధరించే పాతలకు రూపకల్చ్బన చేయడం, చేషభాషలు నిర్ణయించడం జరిగింది. సినిమా ఏదైనాసరే- కథ ఏవైనా సరే రేలంగి హస్వానికి ఒక వ్యవస్థ అనిపి పెంచుకున్నాడు, తెలుగు సినిమాలో ఒక శకం నెలకొల్పాడు. తతో ఒక నటుడుగా వ్యక్తిగా ఆయన ఘనతకు ఇది జోహారు చేయడమే కావచ్చుకాని, సినీవిపణవివీధిలో ఇది బాక్సాఫీసు సూత్రమైపోయింది. దుమ్ముకొట్టింది

(ఈమంగా రెలంగి పేరునే తవ్ప (పజ్ఞని వాడుకోడం మర్చిపోతున్నారు సినిపారి శామికులు, రేలంగి కూడా కొంత పరాకు చిత్తగించడం, కొంత మొహమాటాలకు లొంగడం జరిగిందని ఆయన విమర్శకులు అంటారు. ఇలాటివి మిశపర్మిశమలో తప్పవు. అయితే ఇలాటివి వచ్చినా రేలంగి ఓడిపోడు. పదేళ్ళనాడు పెకివస్తున్న రెలంగిని కిందకి కొట్టింది అదృష్టం; రెట్టించిన జవసత్వాలతో బంతిలా పైకి ఎగిరాడు తను. అదీ అతని తరహా. తెరమీద రేలంగి ఎంత సందడయినవాడొ జీవితం మీద ఎంకటరామయ్యగారూ అంత సందడయిన మనిషీను, సినిమాలో పాతలు మన సొమ్మేం పోయిందన్నట్లు దయాదాక్షిణ్యాలు వెదజల్లితే, జీవితంలో రేలంగి అంతకన్న దర్జాగా ఉదారంగా ధారాళంగా మంచి పనులు చేస్తాడు. కష్టాలను, కష్టాలలో ఆదుకున్న మిత్రులను

మరచిపోలేడు. తిరుపతి విశ్వవిద్యాల యూానికిచ్చిన విరాళం వంటివి కాక, గుప్రదానాలు ఎన్నో చేశాడు. పెళ్ళిళ్లు చేయించి అళ్ళు నిలబెట్టడం అతని సరదా. ఎప్పుడూ దిగులు తన జోలికిరాకుండా చుట్రూరా పది మందిని కూర్చోబెట్టుకుని కబుర్తాడుతూ తిని తిరగడం సరదా. తన యింట్లో రోజూ పాతిక ముప్పై విస్తళ్లు లేవగా చూడడం సరదా. నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్టుగా జీవించడం. సందడిగా జీవించడం సరదా,

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -2

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -2

బుద్ధ దేవ్ గురుత్వమే చాలామందికి మార్గదర్శకమైంది .’’కవితా భవన్ ‘’సంస్థ  స్థాపించి వివిధ ధోరణులకవులను ,రచయితలు కేంద్రీకరించాడు .నవతరం రచయితలకు ఆసరాగా ఉన్నాడు .’’ఏక్ పైసా ఏక్తీ’’అంటే పైసాకి ఒక ప్రతి అనేధారావాహిక ప్రారంభించాడు.చివరి రోజుల్లో రుషి గా ఆశ్రమవాసం కల్పించుకొన్నాడు .పరిపక్వత పెరిగిన కొద్దీ భాష ప్రౌఢ తరమైంది .సంక్షిప్తత పెరిగింది .జీవించి ఉండగానే విశేష కీర్తి ప్రతిష్టలు పొందాడు .రోజురోజుకూ ఆయన గౌరవం పెరుగుతూనే ఉంది .సాహిత్య నిర్మాతలలో ఒకడయ్యాడు .

‘’నా కళకు ఇతి వృత్తం మానవ జీవన మృత్తిక ‘’అన్న  ఆడెన్ మాటలు బుద్ధ దేవ్ కు నచ్చాయి .ఒక విశిష్ట వ్యక్తిత్వ రూపమే మనిషి అన్నాడు .నిత్య నైమిత్తిక బాధలు ,నిత్యం మృత్యువాత పడుతున్న మానవుడు (UNAMUNO) అనే ఈభావం టాగూర్ భావానికిచాలా దూరం .మానవుని దైవత్వం గురించి టాగూర్ చెప్పింది చాలామందికి అర్ధం కాలేదు .దుర్గామాత ఆరాధన విషయం లో ఇతని వ్యాఖ్యానం విలక్షణం విశేషమైనది .వంగ భూమికేచెందిన ఓఅక అద్వితీయ సంప్రదాయంగా భావించాడు .అమ్మ విగ్రహాన్ని పచ్చిమట్టి తో నిర్మిస్తారు .ఇది జీవిత అశాశ్వతత్వానికి ,అనివార్య మృత్యు శక్తికి సంకేతంగా భావించాడు .

  1930లో బంధితుని ఆక్రోశం – ‘’బందీర్ బందనా ‘’రాసి ప్రచురించాడు .ఇది ఆయన ఉత్తమకావ్యాలలో ఉత్తమ శ్రేణికి చెందింది .దీనిలో ఆయన తిరుగుబాటు తత్త్వం కనిపిస్తుంది .సాహసోపేత రొమాంటిక్ ప్రయోగావాదిగా కనిపిస్తాడు .దేహం ,ఆత్మల సమ్యగ్ స్వరూపమే జీవితం అనే తత్త్వం ప్రదర్శించాడు .ప్రకృతిలో దర్శనీయ సౌందర్యాలకు రసమయ ప్రతిక్రియ ఇది .ఒక ఇంద్రియాను భూతిని వేరొక ఇంద్రియానుభవంగా అందించే ‘’సైనే స్ధటిక్’’ ఉపమాలంకారాలు ఇందులో కోకొల్లలు .మన్మధ యజ్ఞానికి కాక వంగ జాతి ఒక విశిష్ట సామూహిక ఆరాధనా క్రతువులో బందీ అయ్యాడు కవి .స్వర్గం నుంచి బహిష్కృతుడైన ప్రవాసి ఆక్రందన వినిపిస్తాడు .విషాద భరిత జీవిత నాటకం లో కవి ఏకాకి పాత్రలో లోగొంతులో ఆర్తనాదం వినిపిస్తున్నాడా అని పిస్తుంది –‘’ ఆ బీజాక్షర  లిపిని  గ్రహించ గలిగే సరికి –ఆశ్చర్య ముగ్ధు డనైపోయాను-యవ్వనమా నువ్వు తు౦టరివి కాదు మెకానివికాదు-కనీసం చిన్నపురుగైనా కావు –నీవొక దేవతవు –స్వర్గలోక బహిష్క్రుతవు-నేనే ఆ దేవతను స్వర్గలోక బహిష్క్రుతుడను –కనుక నీ కనులు –పంజర బంధిత పక్షుల జంట –దైహికబంధాల –బాధలపాఠశాల-తెంచి విముక్తి పొందాలని తహతహ ‘’ శాప భ్రష్ట కావ్యం లొని ఈ పంక్తులు అనుభూతమయే  ఒకానోకవాయు సంచారానికి అర్ధం -అతిక్రమణమే –trans gression  మేకానీ ఊహాలోక ఉత్క్రమణం –trans cendendence కాదు.ఈ విహార యాత్ర ముగించి భౌతిక జీవన ఆవరణ లోకి అడుగుపెట్టాలి .కొత్త చంద్రుడికి పూర్ణ చంద్రుడితో పెళ్లి కావాలి .ఇదే ఫలితార్ధం.కవే పురోహితుడు ..కావ్య సందర్భంగా అతడే వరుడౌతాడు  . దురదృష్టం అతడిని వెంటాడుతుంది .తప్పించుకొని ముందుకు పోతున్నాడు ఈనూతన చంద్రుడు .ఇతన్ని తప్పించుకోని గమ్యం దూరమౌతోంది .దోబూచులాడే ప్రేయసితో అతడు సాహసిక యాత్రికుడు .చేరుకోవటమే ఫలశ్రుతి .కామ ప్రకోపాలతో భ్రమలు గొలిపే యవ్వన రాజధాని అది .ప్రేయసి సర్వలక్షణాలు అతనికి పూర్వానుభవాలే .తన ప్రశస్త జ్ఞానం తో కవి ఒక ఐన్ద్రిక మంత్ర నగరి నిర్మించుకొన్నాడు .అతని కవిత్వం లో క్లినికల్ టచ్ ఉంటుంది .పయార్ చందస్సుల బంధాలనుంచి బుద్ద దేవ్ విడుదలపొందాడు .సందర్భ శుద్ధి పాటించాడు .’’నేనుకవిని –నేనే పాట కూర్చాను –మెరుపు వెలుగుల కవచం తో –ఇదే నా ప్రజ్ఞా విశేషం –నీ వందించే దానికి నా శ్రమశక్తితో మెరుగులు తీర్చాను –ఇదే నా బుద్ధి  విశేషం ‘’అంటాడు .బందీర్ బందనా ఆధునిక భాషా శైలితో రాశాడు .టాగూర్ ఆధునికతను మరింత మెరుగు పరచాడు ఈ కవి ఆయన నాదాన్ని ఉదాత్తనుదాత్త స్వరిత౦ గా మార్చి ప్రయోగించాడు బుద్ధదేవ్  .

  దీని తర్వాత 1933లో రాసిన ‘’పృధ్వీర్ పధే’’-భూమికిఅభిముఖంగా –కవితా సంపుటిలో పరిపూర్ణ తాత్విక అవగాహన పెంచుకొన్నాడు బుద్ధదేవ్.సందేహం లేని వాక్శుద్ధి ప్రదర్శించాడు .తన అనుభూతులనే కవితామయం చేశాడు .1937లో రాసిన ‘’కనకావతి ‘’కావ్యం లో సౌందర్య రసవాద సిద్ధి చూపాడు .ఇది సాధనా అభ్యాసాలతో సాధించినదే .టాగూర్ శ్రోత్రిక భావం నుంచి విముక్తి పొందింది .విపరీత విమర్శకు గురయ్యాడు మనకవి .ఇందులో భావతీవ్రత అసామాన్యమైనది .రొమాంటిక్ భావం మొదట్నించీ ఉండనే ఉంది .కోనో మేయర్ ప్రతి –అమ్మాయి కోసం వంటికవితల్లో ఈ లక్షణం బాగా కనిపిస్తుంది .’’ఎందుకో తెలీకుండా నేను మరణించాల్సిందే –ఈ పాణి పల్లవం ఎవరికీ చెందిందో అలాంటి నేనే ‘’.వేదనామయ అనుభూతి పారిపోకుండా ఇందులో స్థిరంగా నిలిచి ఉంది .’’తత్కాలీన మహోద్రేక స్థితి లో కవితలు ఉప్పొంగి వచ్చాయి .నా సర్వెంద్రియాను భావాలను ఉద్రేకతల్ని రసావేశాలను రంగరించి రాసినకవితలివి .శేషేర్ రాత్రి రాశాక నాలో భావుక శక్తి మరింతస్వేచ్చ పొందింది ‘’అన్నాడు బోస్.ఇంతకీ భావుకస్వేచ్చ అంటే ఏమిటో తెలుసుకోవటానికి 1940లో రాసిన ‘’పూవులు ‘’చెబుతుంది .పూలు వ్రేళ్ళు ముఖ్యంకాదు .పత్ర సౌందర్యమే సృజన శక్తికి ప్రతీకాత్మకమైంది ‘’అన్నాడు .అవి ‘’ఆవుల్లో నియన్ డయోసిషన్ శక్తులు కావచ్చు –‘’దైవం జీవనోత్సవాల ప్రతినిధి –వసంతారామ పవమానం –పరవశిస్తాడు ఒక ముద్దుకు ‘’.ఇందులోని కవితలన్నీ జంత్ర వాద్య సమ్మేళన స్వరభరితాలు .గుణాత్మకత సంపూర్ణత్వం పొందుతుంది .విలియం ఏట్స్ కవి అభి వ్యక్తి కన్పిస్తుంది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-2-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63

62,63-సినీ పరిశ్రమలో డాడీ,మమ్మీ లు -పిపుల్లయ్యశా౦తకుమారి దంపతులు

62- జయభేరి, అర్ధాంగి ,వెంకటేశ్వర మహాత్మ్యం దర్శక ఫేం, ఫైర్ బ్రాండ్ దర్శకులు -పి.పుల్లయ్య

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 – మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి

బాల్యం

పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు.

చిత్రసమాహారం

దర్శకత్వం

· అందరూ బాగుండాలి (1975)

· కొడుకు కోడలు (1972)

· అల్లుడే మేనల్లుడు (1970)

· ప్రాణ మిత్రులు (1967)

· తాయే ఉనక్కాగ (1966)

· ఆసై ముఖం(1965)

· ప్రేమించి చూడు (1965)

· మురళీకృష్ణ (1964)

· సిరి సంపదలు (1962)

· శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)

· జయభేరి (1959)

· అదిసయ తిరుడన్ (1959)

· బండ రాముడు (1959)

· కలైవణన్ (1959)

· ఇల్లారమే నల్లారం (1958)

· వనగముడి (1957)

· పెన్నిన్ పేరుమై (1956)

· ఉమా సుందరి (1956)

· కన్యాశుల్కం (1955)

· అర్ధాంగి (1955)

· రేచుక్క (1955)

· మనంపోలే మాంగల్యం (1953)

· ధర్మదేవత (1952/I)

· మచ్చ రేకై(1950)

· తిరుగుబాటు (1950)

· వీటుకరి (1950)

· భక్తజన (1948)

· మాయా మచ్చీంద్ర (1945)

· భాగ్యలక్ష్మి (1943)

· ధర్మపత్ని (1941/I)

· ప్రేమబంధం (1941)

· సుభద్ర (1941)

· బాలాజీ (1939)

· సారంగధర (1937/I)

· హరిశ్చంద్ర (1935)

నిర్మాత

· కొడుకు కోడలు (1972)

· అల్లుడే మేనల్లుడు (1970)

· ప్రాణమిత్రులు (1967)

· ప్రేమించి చూడు (1965)

· సిరి సంపదలు (1962)

· శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)

· అర్థాంగి (1955)

· ధర్మపత్ని (1941)

రావి కొండలరావు జ్ఞాపకాలు

పి. పుల్లయ్య గారు 1972లో రష్యా విజయం చేశారు. చేశాను గదా అని, సినిమా స్టూడియోలు తిరిగారు. అక్కడ అద్భుతమైన విగ్గులు, ఫేస్‌ మోల్డులూ చూసి అబ్బుర పడిపోయారు.

ముఖానికి తగిలించే మోల్డ్‌లు చాలా సహజంగా వున్నాయట. “మిరు డ్యుయల్‌ రోల్‌ సినిమా చెయ్యాలనుకుంటే, మో హీరో ముఖం రెండోవాడికి తగిలించి, ట్రిక్స్‌ బాధలేకుండా డైరెక్టుగా తీసుకోవచ్చు ” అని వాళ్లు చెప్పారుట. సునిల్‌దత్‌ అలాంటి సినిమా ప్లాన్‌ చేస్తున్నాడని అతని ముఖంలాంటి మోల్డ్‌లు చూపించారుట. “నేనూ అలాంటి సినిమా తియ్యెచ్చునే – అనుకున్నారు గాని, మన వూరు వెళ్లాక ఈ ముఖం మోల్డ్‌ చిరిగినా, విరిగినా నా వల్ల కాదురో అనీ, నాడా దొరికిందని గుర్రం కొనడం ఎందుకని, వూరుకున్నాను” అని చెప్పారు పుల్లయ్యగారు అప్పుడు. ఆయనది పూర్తి “క్లాత్‌ హెడ్‌” అంటే బట్టతల. ఒక్క వెంట్రుక వుండేది కాదు తలమోద. అక్కడున్న విగ్గు మేకర్లు పుల్లయ్యగారి తల చూసి, “మీ కెందుకూ 7 అద్భుతమైన విగ్గు- మో ముఖానికి తగిన క్రాపు విగ్గు వేసి ఇస్తాం. అలా తగిలించుకుంటే చాలు. అతి సహజంగా వుంటుంది. విగ్గు పెట్టినట్టు అస్సలు తెలీదు” అని ఆశపెట్టారుట.ఆయన ఆర్జరిచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారుట. “ఓర్నాయినో -ఇన్నాళ్లూ ఈ బాల్డ్‌ హెడ్డుతో తిరిగి, ఇప్పుడు బాలుడి హెడ్డుతో కనిపిస్తే – ఉన్న వెంట్రుకలు లాగేస్తారు. నా కెందుకీ విగ్గు సిగ్గులేక? అని నోరు మూసుకుని ఆ స్టూడియోల ప్రతిభకి ఓ నమస్కారం పెట్టి తిరగు ముఖం పట్టాను” అని చెప్పారు పుల్లయ్యగారు.

ఈ పుల్లయ్య గారు “ప్రేమించిచూడు” తీశారు. (అందులో నేను వేసిన వేషం గురించి,” “సైలెన్స్‌ అని-ఇప్పటికీ చెబుతూ వుంటారూ శ్రేయోభిలాషులు) అందులో నాగేశ్వరరావుగారు హీరో, నేను ఆ హీరోకి తండ్రిని. ముళ్లపూడి రమణగారు స్కిప్ట రాశారు. రాస్తూ, హీరో తండ్రి బడిపంతులు గనక, దాన్ని అలా రూపొందించి చెప్తే – పుల్లయ్య గారు సంతోషించారుట. “ఈ వేషం రావికొండలరావు చేత వేయిస్తే- బాగా పండిస్తారు” అని రమణగారు చెప్పి ఆ మాట నాతో చెప్పి “మోరొకసారి పుల్లయ్య గారిని చూడండి” అంటే, నేను – ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమైనంత స్పీడుగా వెళ్లాను. అప్పుడు నాకు 32,33 ఏళ్లు. కుర్రాడిని. ఒత్తుగా జుట్టు, నల్లగా వుండేది. నాకు వుల్లయ్యగారు తెలునుగాని, ఆయనకి నేను తెలియదు. “ఎవరయ్యా?” అంటూ వచ్చారాయన. “నేను ఫలానా. ఫలానా రమణగారు పంపిస్తే వచ్చాను. ఫలానా హీరో గారికి… ఫలానా తండ్రి వేషానికి..” అన్నాన్నేను. తత్తరపాటుతో తత్తత్తడబడుతూ. ఆయన ముఖంలో రంగు మారింది. తెల్లటి

ముఖారవిందం అరవిందం రంగులోకి దిగింది. నన్ను ఎగాదిగా చూశారు. నా పాంటు, నా షర్టు, నా క్రాపు చూసి- రెండో మాట లేదు, “ఫస్ట్‌ గెటవుట్‌ొ” అన్నారు. నా నల్లజుట్టు తల గిర్రున తిరిగింది- మూర్భవచ్చిన వాడిలా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ వుండగా” నీకు బుద్ధిలేదా? ఆ రమణకి బుద్ధిలేదా? నాకు బుద్ధి లేదా? . నువ్వు నాగేశ్వర్రావుకి తండ్రివా ?…. ఐయామ్‌ నాట్‌ ఎ పూల్‌ – ప్లీజ్‌ గో !…” అన్నారు మళ్ళీ. నేనేదో అనబోయానుగాని , లోపలుంటుందిట- అంతరాత్మ కాబోలు అది నా నోరు నొక్కేసింది!.. ఓ నమస్కారం పెట్టి దిగులు, బాధ, నిఠాశల్దాంటి వన్నింటినీ తోడు చేసుకుని -ఈసారి మాయమైనట్టు కాకుండా – తాబేలు స్పీడులో రమణగారి దగ్గర కెల్లి జరిగింది వివరించాను . ఆయన నవ్వేసి “ఆపాత్ర చేసి చూపించండి” అన్నారు. మళ్లీ వెళ్లడం ఎలా? ..ఈ లోపల పుల్లయ్య గారికి సన్నిహితులైన

కొడవటిగంటి కుటుంబరావుగారు, ప్రతిభా శాన్వ్తీిగారూ ” అలా వుంటాడుగాని, పెద్దవాడిలాగానే చేస్తాడు” అని కొంత బోధ వరిస్తే ఎందుకైనా మంచిదని ఈ సారి రమణగారి చెయ్యిపట్టుకుని, తప్పుచేసిన విద్యార్ధి తండ్రి చెయ్యి పట్టుకుని మాస్టారి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్లాను. తెలుగు మాస్టారి పాత్ర- తీరు చెప్పి – నటించి పుల్లయ్యగారికి _ చూపించాను. ‘వూ’ అని పుల్లయ్య గారు _. తలవూపారేగాని, నమ్మకం చాల్లేదు. నన్ను బరబరా లాక్కళ్ళి కారెక్కమన్నారు. ముందు సీట్లో ఆయన కూచున్నారు. ఎక్కడికో తెలీదు, ఎందుకో తెలీదు నాకు ! వెరివెధవలా చూస్తూన్నాను. జార్జి టవున్‌లో ఓ విగ్గుల షాపు వుంటే అక్కడికి తీసుకెళ్లి ఓ నాలుగైదు ముసలి విగ్గులు తీయించి, నాకు తగిలించి, చూసుకుని “ఈ విగ్గు ఖాయం చెయ్యవయ్యా”’ అని షాపు యజమానికి చెప్పి “పద” అని ఆఫీసుకి తీసుకెళ్లి కూచోబెట్టు నిదానంగా కూల్‌గా, “ యస్‌… యూ ఆర్‌ డూయింగ్‌ దట్‌ కారెక్టర్‌”… అన్నారు పుల్లయ్యగారు. “అమ్మయ్య!” అనుకుంది తడబుడుతున్న మనసు. “ఆయనని పుల్లయ్య అనకూడదు. -‘పెద్ద పులయ్య ‘ . బాబోయ్‌ పెద్దపులయ్య!” అనుకున్నవాడిని- కూల్‌గా ఆయన చెప్పేసరికి, “గోవులాంటి మనసు. వులయ్యకాదు, గోవయ్య” అనుకున్నాను ఆనందంగా. అలా వచ్చిందా వేషం నాకు “పేమించిచూడు’ లో.

పి.పులయ్య గారు“సిరిసంపదలు” తీశాడు. అందులో నాగయ్య గారు వేశారు. తర్వాత పుల్లయ్యగారు “ప్రాణమిత్రులు” తీశారు. అందులో జగ్గయ్య గారి కుటుంబం జమిందారీ కుటుంబం. ఆయన తండ్రి జమిందారు – కీర్తి శేషుడు. చిత్రంలో ఆ పాత్రరాదు. అయినా ఆ భవనంలో పెద్ద పెయింటింగ్‌ వుండాలని, ఎవరిదో పెయింటింగ్‌ అని కాకుండా, అలాంటి గెటప్‌లో అంతకు ముందొచ్చిన సినిమాలోని నాగయ్య గారి ఫోటోనే తీసుకుని, నిలువెత్తు పెయింటింగ్‌ చేయించి, సెట్లో వ్రముఖంగా పెట్టారు. ఆ విషయం నాగయ్యగారికి తెలిసి, పుల్లయ్యగారికి ఫోన్‌చేశారుట. “వుల్లయ్యా !నేను నీ సినిమాలో లేకపోయినా నా ఫోటో పెద్దసైజులో పెట్టావుట. మూరు నన్ను ఈవిధంగా ఉపయోగించు కుంటున్నావు కదా, మరి నాకు ఎంత ఇస్తావు? అని అడిగారు. దానికి పుల్లయ్య గారు పకపకా నవ్వి “ఓరి నీ అసాధ్యం కూలా! ఎంత పెద్దజోక్‌ పేల్చావయ్యా పొద్దున్నే” అన్నారుట. నవ్వుతూనే ఆ విషయం అందకికీ చెప్పేవారు పుల్లయ్యగారు.

దొంగ కొంగ!

“పొణమిత్రులు” తీస్తున్నప్పుడు ఒక తమాషా జరిగింది. హైదరాబాదు సారథి, స్టూడియోలో షూటింగ్‌. ఒక ఫ్లోర్‌లో సెట్టు వేశారు. అప్పటి పరిస్థితేమిటంటే, క్రేన్‌ కావాలంటే మద్రాసునుంచి రావాలి. ప్రొడక్షన్‌ వాళ్లు ఏర్పాటుచేశారు. అది, మద్రాసులో బయలుదేరింది ట్రక్కుమీద. షూటింగ్‌ కి ముందు రోజే అది హైదరాబాదు చేరుకోవాలి. షూటింగ్‌ లో నాగేశ్వరరావుగారు, జగ్గయ్యగారు, గుమ్మడిగారు, శాంతకుమారి గారూ- ఇంకా కొంత మంది వున్నాం. క్రేన్‌ వచ్చేస్తుందన్న ధీమాతోనే షూటింగ్‌ ఏర్పాట్లు జరిగాయి. ఉదయమే అంతా స్టూడియో చేరుకుని, మేకప్‌ వేస్తుకుని సిద్ధమైపోయారు.

ప్లోర్‌ లోవల – క్రేన్‌ షాట్‌కి తగ్గట్బగా లైటింగ్‌ చేశారు ఛాయాగ్రాహకుడు శ్రీ సెల్వరాజ్‌. క్రేన్‌ రాలేదు! ఫోన్లమీోద ఫోన్లు వెళ్తున్నాయి. అక్కడ ట్రక్కు బయల్టేరింది- మూడు రోజులయింది. ఇక్కడకు రాలేదు! పుల్లయ్యగారు చిందులు తొక్కుతున్నారు. పోనీ, క్రేన్‌ షాట్స్‌ వదిలేసి, తక్కినవి తీసుకోవచ్చుగదాని పుల్లయ్యగారికి చెప్పే సాహసం ఎవరికీ లేదు. పైగా పులయ్యగారు ఆ షాటులో సీను మొదలు పెట్టాలని ప్రిపేర్‌ అయికూచున్నారు. మధ్యాహ్నం వరకూ చూసిచూసి ‘పాకప్‌’ చేశారు. జరిగినదేమిటంటే విజయవాడ దాటిన తర్వాత ట్రక్కుకి రోగం వచ్చి మంచాన పడింది! మందులు,మాకులు అయిన తర్వాత, తెరిపిన పడింది- రాత్రి బయళల్టేరుళుంది. తెల్లవారేలోగా సారథి స్టూడియోకి చేరుకోగలదు. ఆ టక్కు డైవర్‌ తెలివిగా వ్యవహరించి, సాయంకాలానికి సారథి స్టూడియోకి ఓ ఫోన్‌ కొట్టాడు. ఈ శుభవార్తకి, అందరికీ-ముఖ్యంగా పుల్లయ్య గారికి, ఒకరోజు పోయిందేనన్న బాధవున్నా కొంత ఉపశమనం కలిగింది. మర్నాడు షూటింగ్‌ ఏర్పాట్లు జరిగాయి. మళ్ళీ అందరూ సిద్ధమై కూచున్నారు. తెల్లవారేసరికి వస్తుందనుకున్న “కొంగ” అనబడే క్రేన్‌ ఉదయం పదిగంటలయినా గూడు చేరుకుని వాలలేదు! మళ్ళీ అందరికీ టెన్షన్‌! పుల్లయ్య గారికయితే మరీనో. ఆయన ఏకంగా సారథి గేటు దగ్గరికే వెళ్లి రోడ్డుపైన తిరుగుతున్న ట్రక్కుల్ని చూస్తూ నించున్నారు.చూసి చూసి పుల్లయ్య గారికి బీపీ పెరిగిపోయినట్టుంది స్టూడియో దద్దరిల్లేలా అందరిమోద అరుస్తున్నారు. ఆ అరుపుతో ఆ టెన్షన్‌లో మొత్తానికి శబ్దంచేస్తూ ట్రక్కు వచ్చిచేరింది! అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భాగాలు భాగాలుగా విడగొట్టిన గ్రేన్‌ని వచ్చినవాళ్లూ లైట్‌మెన్స్‌ అంతా కలిసి గబగబా దింపారు. బిగించారు. క్రేన్‌ లేచి నిటారుగా నిలబడింది….అందరూ కలిసి నెట్టుకుంటూ ఫ్లోర్‌ సింహద్వారం దగ్గరికి వచ్చేసరికి ఏముంది? శ్రేన్‌ లోపలికి వెళ్ళలేదు! ద్వారం క్రేన్‌ సైజుకంటే చిన్నది!…. అంతే! మళ్లీ పుల్లయ్యగారు తలపట్టుకుని నేలమోద కూలబడ్డారు.- “ఓరి క్రేనో” అంటూ.

అయిన ఆలస్యం అయిందని, ఏం పర్వాలేదని – మళ్లా క్రేన్‌ భాగాలు విడగొట్టి, ఒక్కొక్కటీ ఫ్లోర్‌ లోపలికి తీసుకెళ్ళి. మళ్ళీ బిగించేసరికి ‘లంచ్‌ బ్రేక్‌కి గంట కొట్టారు! “సీరియస్‌నెస్‌లో కూడా కామెడీ” అని అందరూ నవ్వేసుకున్నారు.

పుల్లయ్య గారు సెట్ లో అడుగుపెడితే అందరూ భయపడే వారు .అగ్రతారలైనా ఆయన ఆగ్రహానికి గురికావాల్సిందే .తాలీ వుడ్ లోఆయన ‘’ఫైర్ బ్రాండ్ దర్శకులు ‘’దర్శకత్వం లో దిట్ట.కోపమోస్తేమాత్రం దానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు .ఎన్నో విజయవంతమైన చిత్రాల దర్శకులాయన .స్టోరీ డిస్కషన్ ,షూటింగ్ సమయాలలో ఎవరైనా అడ్డం వస్తే కొట్టినంత పని చేసేవారు .ఇదంతా కాసేపే .ఆతర్వాత చల్లబడి పోయేవారు .మాటలు పలుగు రాళ్ళే .మనసు వెన్నపూస..అందర్తో కోపంగా ,ప్రేమగా ఉండటం ఆయన విశిష్ట లక్షణం .అందుకే ఆయన్ను ‘’people లయ్య’’ అంటారు అని రావికొండలరావు గారువాచ .

63- అమ్మ పాత్రకు అసలు నిర్వచనం ,’’ఎన్నాళ్ళని కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా పాట ఫేం,కమ్మని పాటకు సుస్వరం,నటగాయక సంచలనం -శాంతకుమారి

శాంతకుమారి తెలుగు సినిమా నటి, దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి. ఈవిడ 1936లో ‘శశిరేఖా పరిణయం’ సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించారు

బాల్య0]

శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. సుబ్బమ్మ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లో మే 17, 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి. సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. డి.కె.పట్టమ్మాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది.

సినీ జీవితం

సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు మాయాబజార్ (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించడంతో, పి.వి.దాసు, అతని మేకప్ మనిషైన మంగయ్య వప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు.

శాంతకుమారీగా మారిన నట-గాయక సంచలనం తరువాత సినిమా సారంగధర (1937). ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్య గారిని ఇష్టపడి పెళ్ళిచేసుకొంది. పెళ్ళిచేసుకొన్న తరువాతకూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోద గా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ “చిరు చిరు నగవులు చిందే తండ్రి” అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు.

శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు విద్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా చిన్న తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు. మాయలోకం సినిమాలో అక్కినేనికి ప్రక్క కథానాయికగా నటించిన శాంతకుమారి, జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలోనైతే సవతి తల్లిగా నటించారు. ఎన్.టీ.ఆర్ కు కూడా తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.

పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం.

సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.

నటించిన సినిమాలు

  1. మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం (1936)
  2. సారంగధర (1937)
  3. రుక్మిణీ కల్యాణం (1937)
  4. భక్తజయదేవ (1938)
  5. శ్రీ వేంకటేశ్వరమహత్యం (1939)
  6. ధర్మపత్ని (1941)
  7. పార్వతీ కల్యాణం (1941)
  8. కృష్ణప్రేమ (1943) (రాధ పాత్ర)
  9. మాయాలోకం (1945)
  10. గుణసుందరి కథ (1949) (గుణసుందరిదేవి దుష్ట బుద్ధిగల అక్కగా)
  11. షావుకారు (1950)
  12. ధర్మదేవత (1952) (కాత్యాయిని పాత్ర)
  13. అర్ధాంగి (1955)
  14. సారంగధర (1957)
  15. జయభేరి (1959) (అన్నపూర్ణ పాత్ర)
  16. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) (వకుళ పాత్ర)
  17. సిరిసంపదలు (1962)
  18. ప్రేమించి చూడు (1965)
  19. ప్రాణమిత్రులు (1967)
  20. బంగారు పిచ్చుక (1968)
  21. అక్కాచెల్లెలు (1970) (జడ్జి రామచంద్రరావు గారి తల్లి)
  22. ప్రేమనగర్ (1971)
  23. కొడుకు కోడలు (1972)
  24. సోగ్గాడు (1975)
  25. అందరూ బాగుండాలి (1976)

బహుమతులు

· 1999వ సంవత్సరానికి గాను ఆమె ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు.

· ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా సినీ కళాకారులకు ఇచ్చే ‘కళా నీరాజన’ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.

మరణం

తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుచుకునే నటి శాంతకుమారి జనవరి 17 2006 తదీ మధ్యాహ్నం 12.30 గంటలకు దీర్ఘకాలిక అస్వస్థత తరువాత చెన్నై లోని స్వగృహంలో మరణించారు .

పూర్వం సినిమా రంగంలో స్వార్ధం, అసూయ,ద్వేషాలు లేవు . కేవలం కళ కోసం నటించే రోజులవి. డబ్బు సంపాదించాలనే యావ ఏకోశానా ఉండేది కాదు. నటన కోసం పోటీ పడేవాళ్ళు.
మంచి పాత్రల కోసం తపించేవాళ్ళు. వచ్చిన పాత్రను ఎలా మెప్పించాలా అని రేయింబవళ్ళు కృషి చేసే వాళ్ళు . దర్శకుడే దేవుడు. ఆయన మాటే వేదం.ఇది మొదటి తరం సినీ సాంప్రదాయం.
అప్పుడు నటీనటులు జీతాల పద్ధతిలో పనిచేసేవారు.
ఒక్కొక్క చిత్రం 4 నుంచి 6 నెలల నిర్మాణం జరిగేది. ఆ చిత్రం పూర్తయి, ఆ నిర్మాణ సంస్థ ‘రిలీవ్ ఆర్డర్” ఇచ్చే వరకూ మరో చిత్రంలో నటించడానికి వీల్లేదు.
సకాలంలో చిత్ర నిర్మాణం పూర్తి కాక పోతే అదనపు రోజుల కు అదనపు డబ్బు ఇచ్చేవారు. దర్శకుడంటే గురువు, దేవుడు. ఆయన సెట్లోకి వస్తే భయపడేవాళ్లు. దర్శకుడే అప్పుడు సమస్తం.అలాంటి రోజుల్లో సినీ నాయిక గా అడుగు పెట్టిన తార వెల్లాల సుబ్బమ్మ అలియాస్ శాంతకుమారి.

1936లో పివి దాసుగారు తీసిన ‘మాయాబజార్’ చిత్రాన్ని ‘శశిరేఖా పరిణయం’ అని కూడా అంటారు. రెండు పేర్లు ఉన్న సినిమా ఇది.ఈ చిత్రం ద్వారా చిత్ర రంగంలో అడుగు పెట్టారుశాంతకుమారి. ఈ చిత్రంలో శశిరేఖ పాత్ర ధరించారు. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు.

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో 1920 మే17 న వెల్లాల సుబ్బమ్మ జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఇష్టం.
వెల్లాలసుబ్బమ్మను మద్రాసులో ఉన్న ప్రొ పి సాంబమూర్తి వద్ద కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్పించారు. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. కర్నాటక సంగీతాన్ని క్షుణ్నంగా అభ్యసించిన ఒకే ఒక తెలుగు నటిగా ఆమెకు పేరుంది.
తరువాత గురువుతో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది.
వెల్లాలసుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పివి దాసు 1936 మాయాబజార్ లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ మొదట నిరాకరించారు. అయితే సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది.
పి వి దాసు వెల్లాలసుబ్బమ్మ పేరు పాతగా ఉందని పేరు ను శాంతకుమారి గా ఈ సినిమాలో మార్చారు.
ఇది తెలుగులో ‘మాయాబజారు’ ఇతివృత్తంతో వచ్చిన తొలి సినిమా. 1936లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు శశిరేఖా పరిణయం అని కూడా ఇంకో పేరు ఉంది. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించారు.
సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్ర పోషించాడు. ఈ సినిమా శాంతకుమారి తొలిచిత్రము. వేల్ పిక్చర్స్ సంస్థ ఆధ్వర్యంలో పి.వి.దాసు చిత్రాన్ని నిర్మించారు. గాలిపెంచల నరసింహారావు సంగీతం అందించారు.
తరువాత 1937 లో రెండవ సినిమా సారంగధర లో నటించింది.సారంగధర 1937, ఫిబ్రవరి 5న విడుదలైంది. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వరరావు,పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్, కన్నాంబ, పి.శాంతకుమారి, బాలామణి తదితరులు నటించగా, ఆకుల నరసింహారావు సంగీతం అందించాడు.
ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రలో ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్య గారిని 1937లో ఇష్టపడి ప్రేమపెళ్ళిచేసుకొన్నారు .
పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. పద్మశ్రీ పిక్చర్స్ అధిపతి. పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించారు.
పెళ్ళిచేసుకొన్న తరువాత కూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పద్మ పేరును వెంటేశ్వర మహాత్యం సినిమా గుర్తుగా పెట్టారు.
శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోద గా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ “చిరు చిరు నగవులు చిందే తండ్రి” అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు.
1937లో రుక్మిణీ కల్యాణము లో నటించచారు . 1937, జూలై 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమాఇది. విభూతి దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి తదితరులు నటించగా,
పి.మునుస్వామి సంగీతం అందించాడు.
శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని.
ఈ సినిమా 1941లో విడుదలైంది. సుప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.మరాఠీలో మొదటి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఈయనే.
పి.పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్‌ ఫిలింస్‌ పతాకాన ఈ’ చిత్రాన్ని షిరాజ్‌ ఆలీ హకీం నిర్మించాడు. శాంతకుమారి ఈ చిత్రంలో హీరోయిన్‌.
కొల్హాపూర్‌లోని శాలిని సినీటోన్ స్టూడియోలో చిత్రీకరణ జరిపారు. ఇందులో పనిచేసిన టెక్నిషియన్లంతా మరాఠీ వారే. మ్యూజిక్ అన్నాసాహెబ్ మైన్ కర్. అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు ఉప్పులూరి సంజీవరావు కుమారుడు హనుమంతరావు హీరోగా పరిచయమయ్యారు. ఈచిత్రానికి మాటలను విశ్వనాథ సత్యనారాయణ చేత రాయించాలనుకున్నారు. అయితే, మరీ గ్రాంధికమవుతుందేమో నని ఆలూరి వెంకటసుబ్బారావు చేత రాయించారు. ఆయనే చక్రపాణి. ఈచిత్రం విడుదల తర్వాత ఆమెకు కూతురుపుట్టారు. పాపకి హీరోయిన్ పేరు రాధ అని పేరుపెట్టారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి సినిమా ఇదే. ఓ చిన్న పాత్రలో బాల నటుడిగా విద్యార్థి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. అపుడు ఆయన వయసు కేవలం 15 సంవత్సరాలు. అన్న రామబ్రహ్మం నాగేశ్వరరావు ఈ చిత్రంలో హీరోకావాలని ఆశించి కోల్లాపూర్ కు తీసుకు వెళ్లారు. మరీ చిన్న వయసు కావడంతో అది సాధ్యపడలేదు. అపుడు పుల్లయ్య ‘ఆనందమాయెగా, మన మోహనుడు పెళ్లి కొడుకాయెగా, మనరాధమ్మ పెళ్లికూతురాయెగా’ అనే పాట సీక్వెన్స్ లో కనిపించిన పది మంది విద్యార్థుల్లో ఒకరిగా కనిపించే అవకాశాన్ని పుల్లయ్య కల్పించారు. అయితే, అదే పుల్లయ్య నాగేశ్వరరావును అర్థాంగి (1955) చిత్రంలో హీరోని చేశారు.

అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు.
మాయలోకం సినిమాలో అక్కినేని ప్రక్కన హీరోయిన్ గా శాంతకుమారి నటించారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన రెండవ చిత్రం.మాయలోకం సినిమా కు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం. త్రిపురనేని గోపీచంద్ సంభాషణలు రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని సమకూర్చారు.
ఈ సినిమాలో శాంతకుమారి “మోహనాంగ రార నవ మోహనాంగ రారా “- పాట,.మరియు “ఎవరోయీ నీవెవరోయీ ఈ మాట తెలిపి పోవోయి “- ఈ రెండు పాటలు పాడారు. అపుడు టాప్ హీరోయిన్ అయిన శాంతకుమారితో నటించేందుకు నాగేశ్వరరావు సిగ్గుపడేవారట. ఆయనకు ప్రేమ పాఠాలు తానే చెప్పానని ఒక సారి ఆమెయే రాశారు.
“మాయలోకం లో నాగేశ్వర్రావుతో నాయికగా వేశాను. అప్పటికినేనే సీనియర్ ను. షావు కారు చిత్రంలో ఎన్టీయార్ తో నటించాల్సింది. కాని ఆయన పీలగా ఉండేవారు. నేను కాస్త పుష్టి. దాన్తో కుదర్లేదు. నాపక్కన నటించడానికి నాగేశ్వర్రావు భయపడేవాడు. అతనిని నేనే ప్రేమ పాఠాలు చెప్పేదాన్ని…’ అని ఆమె జ్యోతిచిత్ర లో ‘అయిదు దశాబ్దాల తెలుగు చిత్ర చరిత్ర’ మీద రాస్తూ చెప్పారు. Source:
నాగేశ్వరరావు నటించిన జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలో సవతి తల్లిగా నటించారు.
ఎన్.టీ.ఆర్ కు తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.
పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం.
సుమారు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మాయబజార్, సారంగధరలలో ఆమె పాటిన పాటలు దొరకడం లేదు. అయితే, కృష్ణ ప్రేమ పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రంలో ఆమె గొప్పగా పాడిన, ఈ చిత్రం తమిళ డబ్బింగులో పాడింది పి లీల.అయితే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్బు చేసినపు హిందీ పాటలు చక్కగా పాడి ఆందరినీ ఆశ్చర్యం పరిచారు
మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం,సారంగధర
రుక్మిణీ కల్యాణం , భక్తజయదేవ,
శ్రీ వేంకటేశ్వరమహత్యం,
ధర్మపత్ని,పార్వతీ కల్యాణం,
కృష్ణప్రేమ,మాయాలోకం,
గుణసుందరి కథ, షావుకారు,
ధర్మదేవత,అర్ధాంగి,
సారంగధర,జయభేరి
శ్రీ వెంకటేశ్వర మహత్యం,
సిరిసంపదలు,ప్రేమించి చూడు,ప్రాణమిత్రులు,
బంగారు పిచ్చుక,ప్రేమనగర్,
కొడుకు కోడలు,సోగ్గాడు ఇలా వందకు పైగా సినిమా ల్లో నటించారు.
1975లో ‘సోగ్గాడు’ విడుదలైంది . పల్లెటూరు నేపథ్యంలో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా శోభన్ బాబును “సోగ్గాడు శోభన్ బాబు” అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. ఈ సినిమా లో శాంతకుమారి శోభన్ బాబు అత్త పాత్రలో జయచిత్ర తల్లిగా నటించింది.
సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.
1999వ సంవత్సరానికి గాను ఆమె ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు. ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా సినీకళాకారులకు ఇచ్చే ‘కళా నీరాజన’ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.
దీర్ఘకాలికంగా అస్వస్థత కు గురైన శాంతకుమారి 2006 జనవరి17 న చెన్నై లోని స్వగృహంలో మరణించింది.

‘అమ్మ’ పాత్రల్లో మేటిగా న

నటించి మెప్పించడమే కాదు, నిజజీవితంలోనూ ఎందరి చేతనో ‘అమ్మా’ అని పిలిపించుకున్న మహానటి పి.శాంతకుమారి. ప్రముఖ తెలుగు దర్శకులు పి.పుల్లయ్య సతీమణి శాంతకుమారి. పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అంటూ పలువురు నటీనటులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు అభిమానంగా పిలిచేవారు. ఆ దంపతులు సైతం ఎంతోమందిని తమ కన్నబిడ్డల్లాగే చూసుకొనేవారు. చిత్రసీమలో ఆదర్శప్రాయమైన జంటల్లో పుల్లయ్య, శాంతకుమారి ముందు వరుసలో ఉంటారు. ఈ దంపతులిద్దరికీ తెలుగుచిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ లభించడం విశేషం!

శాంతకుమారి అయిన సుబ్బమ్మ!
శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 1920 మే 17న కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెల్లాల శ్రీనివాసరావు, పెద్ద నరసమ్మ దంపతులకు ఆమె జన్మించారు. శ్రీనివాసరావుకు లలితకళలంటే ఎంతో అభిమానం. దాంతో కూతురు సుబ్బమ్మకు పిన్నవయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఆల్ ఇండియా రేడియోలో గాయనిగానూ పనిచేశారామె. సుబ్బమ్మ గానం, అభినయం నచ్చి 1936లో తెరకెక్కిన ‘శశిరేఖా పరిణయం అను మాయాబజార్’లో శశిరేఖగా ఆమెను ఎంచుకున్నారు. చిత్రసీమలో సుబ్బమ్మ కాస్తా శాంతకుమారిగా మారిపోయారు. తరువాతి సంవత్సరంలోనే పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘సారంగధర’లో చిత్రాంగిగా తన పాటతోనూ, నటనతోనూ మురిపించారు. ఈ సినిమా పూర్తికాగానే తన 17వ యేట ఆ చిత్ర దర్శకుడు పి.పుల్లయ్యను వివాహమాడారు శాంతకుమారి. 1939లో తన భర్త తెరకెక్కించిన ‘బాలాజీ’ చిత్రంలో పద్మావతిగా నటించి మెప్పించారు. ఆ సినిమా కథనే తరువాత 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా రూపొందించారు పుల్లయ్య. ఇందులో యన్టీఆర్ శ్రీనివాసునిగా నటించగా, వకుళ మాతగా శాంతకుమారి అభినయించారు. ఈ చిత్రమే యన్టీఆర్ ను తెరవేలుపుగా నిలిపింది. థియేటర్లను దేవాలయాలుగా మార్చింది.

అందరికీ ‘అమ్మ’నే!
తన భర్త దర్శకత్వం వహించిన పలు చిత్రాలలో శాంతకుమారి నాయికగానూ, కీలక పాత్రల్లోనూ నటించారు. 1947లో పుల్లయ్య, శాంతకుమారి దంపతులు రాగిణి పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తరువాత ‘పద్మశ్రీ పిక్చర్స్’ పతాకంపైనా అనేక సినిమాలను నిర్మించి, తెలుగువారిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రాలన్నిటా శాంతకుమారి తనకు తగ్గ పాత్రలు ధరించి మెప్పించారు. తనకంటే వయసులో చిన్నవారయిన ఏయన్నార్, గుమ్మడి వంటి వారికి జోడీగానూ నటించారు శాంతకుమారి. తరువాతి రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్, జగ్గయ్య, శివాజీగణేశన్, జెమినీ గణేశన్ వంటి మేటి నటులకు తల్లిగా నటించి మెప్పించారు. తెలుగులోనే కాదు తమిళ చిత్రాలలోనూ శాంతకుమారి మేటి నటిగా సాగారు. చిత్రసీమలో అడుగుపెట్టే నిర్మాతలు ఎందరో పుల్లయ్య, శాంతకుమారి దంపతుల ఆశీస్సులు తీసుకొనేవారు. అలాంటి వారిలో డి.రామానాయుడు ఒకరని చెప్పవచ్చు. ఆయన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ (1964)లో యన్టీఆర్ కు అక్కగా నటించారు శాంతకుమారి. ఆ సినిమాతో నిర్మాతగా పరిచయమైన రామానాయుడు, ‘ప్రేమనగర్’ (1971)తో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. ‘ప్రేమనగర్’లో ఏయన్నార్ కు తల్లిగా నటించారామె. అలా రామానాయుడును నిర్మాతగా నిలిపిన రెండు చిత్రాలలోనూ శాంతకుమారి కీలక పాత్రలు పోషించారు. నాయుడు సైతం ఆమెను ‘అమ్మ’గానే ఎంతో గౌరవించేవారు.

నటిగా…గాయనిగా…
తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడంలో శాంతకుమారి ఎప్పుడూ ముందుండేవారు. నటిగానే కాకుండా గాయనిగానూ సుప్రసిద్ధులైన శాంతకుమారి చేతనే తరువాతి రోజుల్లోనూ కొందరు అదే పనిగా పాటలు పాడించారు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా-పెళ్ళామా’లో హీరోకు తల్లిగా నటించిన శాంతకుమారి, అందులో “మమతలెరిగిన నా తండ్రీ… మనసు తెలిసిన ఓ నాన్నా…” అనే పాటను పాడి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ పాటలో నందమూరి హరికృష్ణ ఆమె మనవడిగా నటించడం విశేషం. 1979 వరకు శాంతకుమారి నటిగా కొనసాగారు. 1981లో పి.పుల్లయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. 1999లో శాంతకుమారికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006 జనవరి 16న శాంతకుమారి కన్నుమూశారు. తెలుగునాట ‘అమ్మ’ పాత్రల్లో శాంతకుమారి అభినయం నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు.

పుల్లయ్య గారి జయభేరి చిత్రం ఆల్ టైం క్లాసిక్ .అర్ధాంగి సాంఘిక చిత్రరాజమే .వెంకటేశ్వర మహాత్మ్యం సూపర్ డూపర్ క్లాసికల్చిత్రం

చిత్రం .ఇవి ఆదంపతులు సాధించిన విజయానికి ఆణిముత్యాల వంటి తీపి గుర్తులు .

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ 10-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్

బద్ధదేవ బోస్ జీవిత చరిత్రను ఆంగ్లం లో అలోక్ రంజన్ దాస్ గుప్తా రాస్తే తెలుగులోకి శ్రీ ఆవంత్స మో సోమసుందర్ అనువాదం చేయగా  సాహిత్య అకాడెమి 1982లో ప్రచురించింది. వెల-4రూపాయలు .

‘’ఉత్తమాభిరుచి ,పరిపక్వ బుద్ధీ ,కలిగిన పాఠకులు లభించేంతవరకు వారికోసం నిరీక్షించటం రచయితకు బాధాకరం కాదు .సాహిత్య కృషి ఫలించినట్లే ‘’అంటాడు బుద్ధ దేవ బోస్.సరళల సుందర భాషలో ఆయన సాహిత్యం వెలువరించాడు .అతనంత అపార్ధాలకు గురైన వంగ సాహిత్యకర్త లేడు.ఇదే అతన్ని విశిష్టవ్యక్తిని చేసింది .విశిష్ట సాహితీ విన్యాసం అతడిది .తన అభిప్రాయాల్ని తానె ఖండించుకొంటాడు అమెరికన్ జాతీయకవి వాల్ట్ విట్మన్ లాగా .దీనికి కారణం అనంత మానవుల స్వరూపస్వభావాలతో మమైక్యం చెందటం కావచ్చు .అత్యధికంగాఉత్పత్తి చేసిన కళాకారుడు .అతడు సృజనోత్సవ భా౦డారమే .వందకు పైగారచించాడు .రవీంద్రుని తర్వాత లెక్కలోకి వచ్చేవాడు బుద్ధ దేవ్ .టాగోర్ పట్ల విమర్శనాత్మక గౌరవం ,,పరిశీలనాత్మక తిరస్కారం ఉన్నవాడు .ఒంటెత్తు పోకడ మనిషి అన్నారు .1924లో వెలువరించిన తొలి కవితా సంపుటి ‘’మర్మ వాణి’’నుంచే ఆయన పై విమర్శ నాలుగు దశాబ్దులు సాగింది .నైతిక నిష్టాపరులు సంఘ సంస్కర్తలు పత్రికా సంపాదకులు సనాతనధర్మ పండితులు తిట్టినా తిట్టు తిట్టకుండా ఈ నలభై ఏళ్లు తిడుతూనే ఉన్నారు ఆయన్ను .దీనికి కారణాలు –బాలకవిగా టాగూర్ వాత్సల్యం పొందటం ,లైంగిక అశ్లీల సాహిత్య నాయకమణి కావటం ,సమకాలీన సామాజిక ప్రతిబింబాలను తన సాహిత్యం లో చొప్పించటం ,సంప్రదాయ పత్రికాదిపతులకు అభ్యుదయ కల్లోలవర్గాలపట్ల ద్వేషమే అన్నాడు సువీర్ రాయ్ చౌదరి .

  19-12-1970న కలకత్తా హైకోర్ట్ ఈయనకు అశ్లీల సాహిత్యం సృష్టిస్తున్నాడని శిక్షించింది .70రోజుల విచారణ ఫలితం ఇది .ఆ రోజే ఆయనకు భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’ప్రకటించింది .కావ్యాలు నవలలు వ్యక్తీ చిత్రణలు ,సాహిత్య విమర్శలు ప్రతీకాత్మక నాటకాలు ,వినోదపద్యాలు, సామాన్యులకు గాధలూ రాశాడు .తాత్వికంగా ఇవి ఒకదానిలో ఒకటి చొచ్చుకు పోయినవే కానీ తీర్దానికి తీర్ధం ,ప్రసాదానికి ప్రసాదం వంటివి కావు .నిత్య ప్రయోగాత్మకం ,చైతన్య విలసితాలు ఆతని రచనలు .మహాకావ్యాలలో క్లాసికల్ వస్త్వాశ్రయ విధానం అవలంబించాడు .కొన్ని చోట్ల అంతర్ముఖీనత కనిపిస్తుంది .రొమాంటిక్ కళాశీలిగా కనిపిస్తాడిక్కడ.మహాకావ్య మార్గానికి చెందినవాడుగా సుధీన్ద్రనాథ్ దత్తా గుర్తింపు పొందాడు .దీన్ని బుద్ధదేవ్ ఖండించాడు .ఆయన రొమాంటిక్ కవే అన్నాడు సవివరంగా .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-22-ఉయ్యూరు  

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -61 61-చింతామణి శ్రీహరి ఫేం ,శతాధిక వత్సరాల నటి,సూర్యకాంతం కు ఆదర్శం –గంగారత్నం

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -61

61-చింతామణి శ్రీహరి ఫేం ,శతాధిక వత్సరాల నటి,సూర్యకాంతం కు ఆదర్శం –గంగారత్నం

గంగారత్నం ప్రముఖ రంగస్థల, సినిమా నటీమణి. ఈమె గయ్యాళి మహిళ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించింది.

జీవిత విశేషాలు

ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో 1893లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, గంగలకుర్రు గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఈమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. ఈమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె భర్త మరణించాడు. ఫలితంగా ఈమె జీవనోపాధి కోసం 17 సంవత్సరాల పిన్నవయసులోనే నాటకాలలో వేషం వేయడం ప్రారంభించారు. 1936లో సినిమా రంగప్రవేశం చేశారు .ఈమె తొంభై సంవత్సరాల వయసు వరకు నటజీవితాన్ని కొనసాగించారు . ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె చివరి దశలో పేదరికాన్ని అనుభవిస్తూ 2001లో తన 108వ యేట మరణించారు .

నాటకరంగం

జీవనోపాధి కోసం అతి పిన్నవయసులోనే నాటకాలు వేయడం ప్రారంభించిన గంగారత్నం ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకంలో కలహకంఠిగా, చింతామణి నాటకంలో శ్రీహరిగా పాత్రలు ధరించారు . చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర పోషించాలంటే ఒక్క గంగారత్నమే దానికి సమర్థురాలనే పేరు గడించారు . విద్యుత్ దీపాలు లేని ఆ రోజుల్లో, దివిటీల వెలుగులో దీపాల కాంతిలో నాటక ప్రదర్శనలు నిర్వహించే రోజులలో కూడా ఈమె అధ్భుతంగా నటించి పేరు సంపాదించుకున్నారు . ఆ రోజుల్లో రంగస్థలంపై ఉద్దండులైన యడవల్లి సూర్యనారాయణ, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నరసింహారావు, ఉప్పులూరి సంజీవరావు, నెల్లూరు నాగరాజు మొదలైనవారితో నటించిన అనుభవం ఆమెది ఈమె 1936- 1985 మధ్యకాలంలో సుమారు 50 ఏళ్ళు 0సినిమాలలో నటించారు సినిమాలలో నటించడం మానివేసిన తరువాత మళ్ళీ నాటకరంగంలో పునఃప్రవేశం చేసి సుమారు 20 సంవత్సరాలు అనేక పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించారు .

సినిమా రంగం

ఈమె క్రమంగా నాటకాల నుండి చలనచిత్ర రంగంలోనికి ప్రవేశించారు.. కాకినాడకు చెందిన కొమ్మారెడ్డి నాగేశ్వరరావు 1936లో నిర్మించిన ప్రేమవిజయం అనే సాంఘిక చలనచిత్రంలో తొలిసారిగా నటించారు . తరువాత ఈమె అనేక ప్రఖ్యాత చలన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ఈమె నటించిన చివరి చిత్రం శ్రీవారి శోభనం. ఈమె గయ్యాళి పాత్రలను అతి సహజంగా పోషించి మంచి పేరు సంపాదించుకున్నారు . ఈమె పోషించిన గయ్యాళి పాత్రలు తరువాతి తరం నటి సూర్యకాంతానికి ఆదర్శ ప్రాయం అయ్యాయి.

నటించిన చిత్రాలు

  1936 ప్రేమవిజయం

  1936 సతీ తులసి

  1937 కనకతార

  1938 మాలపిల్ల

  1939 రైతుబిడ్డ

  1941 తెనాలి రామకృష్ణ

  1946 ఇది మా కథ

  1947 పల్నాటి యుద్ధం

  1947 యోగివేమన

  1949 కీలుగుర్రం

  1951 మల్లీశ్వరి

  1952 ప్రియురాలు

  1953 పక్కింటి అమ్మాయి

  1955 అర్ధాంగి

  1955 శ్రీకృష్ణ తులాభారం

  1983 నెలవంక ... రహీం తల్లి

  1985 శ్రీవారి శోభనం

  సశేషం

    మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు,అణకువ ,భక్తీ ,సేవాతత్పరత ఉన్నసింపుల్ మహిళ- శ్రీమతి సస్యశ్రీ

ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు,అణకువ ,భక్తీ ,సేవాతత్పరత ఉన్నసింపుల్ మహిళ- శ్రీమతి సస్యశ్రీ

ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు

శ్రీ చావలి వెంకటప్పయ్య గారితో వారి కుటుంబం తో మాకు సుమారు నలభై ఏళ్ళుగా పరిచయం ఉంది .ఆయన భార్య శ్రీ మతి ఉమాసుందరి .ఈ దంపతులు మా దంపతుల్ని తమ తలిదంద్రులుగా భావిస్తారు ఆమె మమ్మల్ని నాన్నగారూ అమ్మగారూ అంటే ఆయన అల్లుడుగారుగా అనిపిస్తారు .ఆమె అంగన్ వాడీ టీచర్ .ఆ గ్రూపులకు నాయకత్వం వహించేది .ఆమె మాట వారికీ శిరోధార్యం .వీరిద్దరికీ ఇద్దరబ్బాయిలు .వాళ్ళూ మా కళ్ళముందు పెరిగినవారు. మాకు టుంబంతో సాన్నిహిత్యమున్నవాళ్ళు .’’తాతగారు,అమ్మమ్మగారూ’’అని మమ్మల్ని ఆత్మీయంగా పిలుస్తారు .వీరిద్దరిచదువులు , వివాహాలూ పూర్తీ అయి, పిల్లలు కూడా కలిగారు .అంతా సంతోషంగా ఉన్నారు .కాపులవీధి రామాలయం దగ్గర డాబా ఇల్లుకోనుక్కొని ఉంటున్నారు చాలాకాలం నుంచి .

  మా ఇంట్లో ఆబ్దీకలు వస్తే  వెంకటప్పయ్యగారు తప్పకుండా ఒక భోక్తగా ఉండేవారు .తర్వాత తర్వాత ఆయనా మంత్రాలు నేర్చి ,ఆబ్దిక మంత్రాలు చెప్పేవారు. మా ఇంట్లో .కార్తీకమాసం లో మా ఉసిరి చెట్టుకింద భోజనాలకు పిలిస్తే తప్పకుండా దంపతులు వచ్చేవారు .ఉమాసుందరి వస్తే సందడే సందడి నవ్వుతూ గలగలా మాట్లాడుతూ అందరికి వడ్డిస్తూ ,అలసట లేకుండా పని చేస్తుంది .అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం నాడు వారిద్దర్నీ పిల్చి వాయనం ఇవ్వటం జరిగేది .ఎంత ఆలస్యమైనా వచ్చి తీసుకొని వెళ్ళేవారు .వారికి నూతన వస్త్రాలు అందిస్తూండేవాళ్ళం .మా ఇంట్లో మా అబ్బాయిల  పెళ్లిళ్లకు అమ్మాయి పెళ్ళికి గృహప్రవేశానికీ వచ్చారు  .ఉమాసుందరి వచ్చారంటే సందడే సందడి .

  వెంకటప్పయ్యగారు  కాపుల వీధి రామాలయం దగ్గర వినాయకచవితి పందిట్లో పూజలు చేసేవారు .విష్ణ్వాలయం శివాలయం లలో పూజలకు ,మంత్రపుష్పాలకు హాజరయ్యేవారు .పూజలు అభిషేకాలు,వ్రతాలు  చేయించేవారు దానాలు పుచ్చుకోనేవారు .ఆబ్దిక మంత్రాలు చెప్పేవారు .చాలా బిజీ గా ఉ౦డేవారేప్పుడూ. చాల సౌమ్యులు .పెద్దాగా మాట్లాడేవారు కాదు చిరునవ్వే ఎప్పుడూ .స్కూటర్ బాగా నడిపేవారు .భార్యాభర్తలు దానిమీదే ఎక్కడికైనా వెళ్ళేవారు .ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం ను నా మిత్రుడు స్వర్గీయ వేమూరి దుర్గయ్య  ప్రెసిడెంట్ గా  .స్వర్గీయ మంత్రాల రాధా కృష్ణమూర్తి స్వర్గీయ గోవిందరాజుల వెంకటేశ్వరరావు ,స్వర్గీయ సీతంరాజు సత్యనారాయణ గార్లు చాలా యాక్టివ్ గా నడిపినప్పుడు ,నేనూ ఏదో ఒక బాధ్యతతో పని చేశాను. సామూహిక ఉపనయనాలు జరిపించాం. అప్పుడు వెంకటప్పయ్య దంపతుల పెద్దకొడుకు ఉపనయనం కూడా  అందులో జరిపించిన గుర్తు .అప్పుడే ఆయన అత్తగారూ ,మామగారూ పరిచయమయ్యారు .వీరిద్దరి పిల్లలు ఉయ్యూరు ఆర్ కే ఎం స్కూల్ లో చదివారు .సుబ్రహ్మణ్య షష్టి కి మా ఇంటికి బ్రాహ్మణ వటువులుగా వచ్చి తాంబూలం తీసుకొని సంతృప్తిగా భోజనం చేసేవారు .ఈఇద్దర్దీ నవ్వుమొహమే .  .పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా భక్తీ శ్రద్ధ ఉన్న వారు అణకువ , వినయమున్నవారు .తలిదండ్రుల లక్షణాలు వీరికి బాగా అబ్బాయి .

  బ్రాహ్మణా సంఘం విష్ణ్వాలయం లో నిర్వహించే కార్తీక వనసమారాధనకు వెంకటప్పయ్య దంపతులు గొప్ప సహాయ సహకారాలు అందించేవారు .ఆమె ఉంటె ఎంతమందికైనా వడ్డన సునాయాసంగా జరిగి పోయేది. గలగలామాట్లాడుతూ ,చకచకా పనిచేస్తూ చేయిస్తూ ,అలుపు సొలుపు లేకుండా భేషజం లేకుండా సాయం చేసేవారు .పిల్లలూ అంతే ఉద్యోగాలు వచ్చి వెళ్ళేదాకా .

  మాశ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కూడా వెంకటప్పయ్యగారు ,పిల్లలు అవసరమైతే పూజారికి సహాయంగా ఉండేవారు .గుడి ప్రతిష్టలకు ఆతర్వాత అక్కడ జరిగే భారీ కార్యక్రమాలకు కల్యాణాలకు  వెంకటప్పయ్య గారు వచ్చి తాంబూలం తీసుకొనేవారు .వారికివ్వటం మాకు అత్యంత  సంతోషం,సంతృప్తి కూడా .వారి పెద్దబ్బాయి పెళ్లి చేసినపుడు అందర్నీ ఆహ్వానించి భోజనాలు పెట్టారు .మా దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు .మాకే కాదు చాలామందికి బట్టలు పెట్టారు .రెండోవాడి పెళ్లి భోజనం కూడా చేసిన గుర్తు .కోడళ్ళు ఇద్దరూ చాలా బుద్ధిమంతురాళ్ళు .పిల్లలకు సంబంధాలు కుదరగానే మాకు తెలియజేసే సౌజన్యం ఆ దంపతులది .ఊళ్ళో అందరికీ తలలో నాలుకగా ఉండేవారు .అందుకే అందరూ వాళ్ళిద్దరూ అంటే గొప్ప అభిమానం తో ఉంటారు .

  ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి నాడు మా నాయనమ్మగారు నాగమ్మగారి తిధి .అ రోజు వెంకటప్పయ్య గార్ని పిలిచి దక్షిణా తాంబూలం ఇవ్వటం ఈమధ్యపదేళ్ళనుంచీ చేస్తున్నాం.ఆయన ఊరిలోలేకపోతే ఆయన చెప్పిన వారికిచ్చేవారం .మకర సంక్రమణం సంక్రాంతినాడు గుమ్మడికాయ దానం మాత్రం పుచ్చుకోనేవారు కాదు .ఆయనే ఎవర్నైనా పురమాయించి ఇప్పించేవారు .ఈ సంవత్సరం దుర్గాస్టమి ముందు ఆయనకు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నానన్నారు .సంక్రాంతి ముందు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు .ఆవిడకూ చేసినా తీయలేదు .ఏమిటా అనుకొన్నా .

  నిన్న మా కోడలు రాణి చెప్పింది వెంకటప్పయ్య గారు చనిపోయారని .నేను ఉమా సుందరి గారికి వెంటనే ఫోన్ చేస్తే వాళ్లరెండవ అబ్బాయి ఎత్తి మాట్లాడాడు విషయం చెప్పాడు . నాలుగు నెలలక్రితం  కొంత నలతగా ఉంటె హైదరాబాద్ తీసుకు  వెళ్లామనీ,ట్రీట్ మెంట్ బాగానే చేయిన్చామనీ ,కోలుకోన్నారనీ,  డిసెంబర్ 24 న అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చివెంకటప్పయ్య గారు  తుది శ్వాస విడిచారనీ చెప్పాడు .అయ్యో అనిపించింది .ఆయన మొదటిమాసికం ,త్రైపక్షం ఉయ్యూరులో స్వంత ఇంట్లోనే పెట్టామని ,నాకు ఫోన్ చేశామనీ ఫోన్ కలవ లేదనీ చెప్పాడు .ఊరికి ఉపకారి ,మంచిమనసున్న సౌజన్యశీలి వెంకటప్పయ్య గారి మరణానికి చింతిస్తున్నాం .వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాం .

  అణకువ ,భక్తీ ,సేవాతత్పరత ఉన్నసింపుల్ మహిళ- శ్రీమతి సస్యశ్రీ

 అప్పుడే శ్రీ మతి సస్యశ్రీ మరణించి ఇవాల్టికి సంవత్సరం అయింది .ఆమె కుటుంబం కోటలో ఉన్న ఇంట్లో కాపురముండేవారు .దైవభక్తి ఆమెఅణువణువునా  తోణికిసలాడేది .రోజూ మా సువర్చలాన్జనేయస్వామి శివాలయం విష్ణాలయం లను రెండుపూటలా సందర్శించకుండా ఉండేదికాదు .సేవాతత్పరత ఆమె నైజం .మా ఆలయం లో ధనుర్మాసం లో లడ్డూ పూజ ,అరిసెల,వెన్నపూస  పూజలకు ఆమె భక్తుఅలందరికీ చెప్పి వారిచ్చేడబ్బు పంచదార బెల్లం సెనగ పిండి వసూలు చేసి పూజారికి అందించేది .కల్యాణాలకు,సామూహికసత్యనారాయణ వ్రతాలకు ధనుర్మాస పూలకు హనుమద్వ్రతానికి హనుమజ్జయంతి కి తప్పక  హాజరయ్యేది నక్షత్రహారతికిసిద్ధం  చేయటం ఆమెకు చాలా ఇష్టమైన పని చితికేలోసిద్ధం చేసేది  .సింపుల్ గా ఉండేది.నన్ను ‘’మాష్టారు గారూ’’అనే సంబోధించేది .మాటకూడా చాలా మెల్లగా మాట్లాడేది .శ్రీ సువర్చలాన్జనేయస్వామికి మాశ్రీమతి కట్టే డిసెంబర్ పూలదండకు మురిసి పోయేది .ఆ దండ లేక పొతే స్వామి వెలా తెలా పోయినట్లు ఉంటాడు అనేది.2008లో మేము అమెరికా వెడుతూ ,ఆమెను మాదోడ్లో ఉన్న డిసెంబర్ పూలు కోసిరోజూ ధనుర్మాసంలోనూ ,ప్రతి మంగళవారం సాయంత్రం దండ కట్టి అందజేయమంటే ,అత్యంత భక్తీ శ్రద్ధలతో చేసి ,మాట నిలబెట్టుకొంది శ్రీమతి సత్యశ్రీ . కోట నుంచి కాపురం దూరంగా ఉన్న అపార్ట్ మెంట్ కు మారినా, ఆమె కాలినడకన నిత్యం అన్ని దేవాలయాలను సందర్శించేది. వంచిన తల ఎత్తని మహా ఇల్లాలు. భర్త కెసీపి లో పని చేసి రిటైర్ అయ్యాడు .పిల్లలు చేతికి అంది వచ్చి పువ్వుల్లో పెట్టి  చూసు కొంటున్నారు .ఏలోటూ లేదామెకు.కనిపించినప్పుడల్లా మా అమ్మాయి,పిల్లలు  అమెరికాలో ఎలా ఉన్నారని అడిగేది. ఆప్యాయత ఆమె సహజ లక్షణం .  అందరు ఒకేకుతుమ్బమని ఆమె భావన .రెండేళ్ళ క్రితం ధనుర్మాసం ఉత్తమ భక్తురాలుగా ఆమెను గుర్తించి ఎదో జ్ఞాపిక అందించాను .సరసభారతి కార్యక్రమాలకు తప్పక హాజరయ్యేది . ఏడాదిక్రితం ఆమె సునాయాసంగా మరణించి దైవ  సన్నిధి చేరింది  .తెలిసిన వెంటనే ఒక మంగళవారం గుడిలో ఆమె కు శ్రద్ధాంజలి ఘటించాం .మరుపుకు రాని సౌజన్యం శ్రీమతి  సస్యశ్రీ ది .  

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-22-ఉయ్యూరు —

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60

60- ఇంట్లోనే సెట్ వేసి మార్కండేయ సినిమా తీసిన ,రంగుల లవకుశ ఫేం,తెలుగు చిత్ర పితామహ –సి.పుల్లయ్య

సి. పుల్లయ్యగా పేరుగాంచిన చిత్తజల్లు పుల్లయ్య (1898 – అక్టోబర్ 6, 1967) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత.

కాకినాడ వాస్తవ్యుడైన ఈయన బి. ఎ చదివి జాతీయభావం ప్రభావంతో 1920వ దశకంలో కాంగ్రెస్ లో చేరడం కోసం కలకత్తా వెళ్ళాడు. అక్కడ బులుసు సాంబమూర్తి సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరాడు. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల్లో పనిచేశాడు. తెలుగు చలనచిత్ర పితామహుడి కుమారుడైన రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్. ఎస్. ప్రకాష్ దగ్గర భీష్మ ప్రతిజ్ఞ (1921) అనే మూకీ సినిమాకి సహాయకుడిగా పనిచేశారు. తర్వాత సినీ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని తన స్వస్థలమైన కాకినాడకు తీసుకువచ్చి ఇంట్లోనే సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీశారు. దాన్ని ప్రదర్శించడం కోసం కాకినాడలో స్వంతంగా సిటీ ఎలక్ట్రిక్ అనే పేరుతో టెంటు హాలు కట్టారు. ఇందులో చాలా మూకీ సినిమాలు ఆడాయి. సినిమా థియేటర్ ను ఒక ఉద్యమం లాగా చేపట్టి గుడారాలు, ప్రొజెక్టర్లూ, కుర్చీలు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే కాక బెంగాల్, ఒరిస్సాల్లో కూడా ఊరూరా తిరిగి వాటిని ప్రదర్శించారు.[1]

టాకీ సినిమాలు రాగానే ఆయన దృష్టి చిత్ర నిర్మాణం మీద పడింది. 1933లో సతీ సావిత్రి సినిమా తీశారు. అది మంచి విజయం సాధించింది. తర్వాత లవకుశ చిత్రం తీశారు. అది కూడా మంచి విజయం సాధించింది. కలకత్తాకు చెందిన ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, ఈయన రూపకల్పనలో అనసూయ, ధృవ విజయం (1936) అనే చిత్రాలు తీసి రెండింటినీ కలిపి ఒకే సినిమాగా విడుదల చేశారు.

బాల్యం
చిత్తజల్లు పుల్లయ్య 1898లో కాకినాడలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ చాలా చురుకైన కుర్రాడు. 1921 లో ఆయన బి.ఎ.చదువుతున్న సమయంలో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు వెళ్లిన పుల్లయ్య మీద జాతీయభావాల ప్రభావం పడింది. వెంటనే ఇంగ్లీషు చదువుకు స్వస్తి చెప్పి, ఖద్దరు దుస్తులు కట్టడం మొదలెట్టారు. కాంగ్రెస్ సేవాదళంలో చేరేందుకు బొంబాయి వెళ్లారు.

సినీ రంగంలో
రఘుపతి వెంకయ్య, అతని కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక “మొదటి తెలుగువాడి సినిమా” అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. ‘డి కాస్టెల్లో’ (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య కాకినాడలో ‘భక్తమార్కండేయ’ మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసారు. ఒక తెలుగు వాడు ఆంధ్రదేశంలో నిర్మించిన మూకీ ‘భక్తమార్కండేయ’. ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు.

అక్కడ కాంగ్రెస్ నాయకుడు బులుసు సాంబమూర్తి సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరారు. రెండు పూటలా భోజనం పెట్టి, నెలకు ఐదు రూపాయల జీతం ఇచ్చేవారు. అక్కడే సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ నేర్చుకున్నారు. అయితే, కొన్నాళ్లకు ల్యాబ్ దివాళా తీసి మూతపడే పరిస్థితి రావడంతో, పుల్లయ్యకు ఇవ్వాల్సిన జీతం బదులు ఓ సెకండ్ హ్యాండ్ కెమెరా, ప్రొజెక్టరు, ఫిల్ములు ఇచ్చి దయచేయమన్నారు నిర్వాహకులు. వాటిని తీసుకుని కాకినాడ చేరారాయన. కెమెరా చేతిలో ఉండడంతో సినిమా తీయాలన్న కోరిక కలిగింది. తమ ఇంటి రేకుల షెడ్డులో సెట్లు వేసి, ‘భక్త మార్కండేయ’ సినిమా తీయడానికి ప్లాన్ వేశారు. అందులో తను యముడిగా కూడా నటించారు. కష్టపడి తీసిన సినిమాను తన ఇంట్లో చీకటి గదిలో గోడ మీద ప్రోజక్ట్ చేసి, తమ వీధిలోని వాళ్లందరికీ చూపించారు. అయితే, ఆయనకు అది సంతృప్తినివ్వలేదు. సినిమా మెలకువల్ని ఇంకా నేర్చుకోవాలన్న తలంపుతో, తన కళాశాల ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నం నాయుడు వద్ద రికమండేషన్ లెటర్ తీసుకుని, మద్రాసు బయలుదేరారు. అక్కడ వెంకటరత్నం నాయుడు సోదరుడు వెంకయ్య నాయుడు అప్పటికే సినిమా నిర్మాణంలో ఉన్నారు. వారి కుమారుడు ప్రకాష్ వద్ద పుల్లయ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. రఘుపతి వెంకయ్యగారికి థియేటర్లు కూడా ఉండేవి. కొన్నాళ్లకు వాటి ప్రదర్శన నిర్వహణను పుల్లయ్యకు అప్పజెప్పారు. అప్పుడే ఆయన ఆ రంగంలో కూడా అనుభవం సంపాదించారు.

టాకీ సినిమా వచ్చిన తర్వాత మళ్లీ పుల్లయ్య దృష్టి సినిమా మీదకు మళ్ళింది. అదే సమయంలో ఈయన గురించి తెలుసుకున్న కలకత్తాలోని ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, తమ తెలుగు చిత్ర నిర్మాణ విభాగానికి ఇంచార్జ్ గా పుల్లయ్యను ఆహ్వానించారు. ఈస్టిండియా కంపెనీకి ఆయన రూపొందించిన తొలి సినిమా ‘సతీ సావిత్రి’. ఆనాటి రంగస్థల ప్రముఖులు వేమూరి గగ్గయ్య, రామతిలకం అందులో నటించారు. తర్వాత దేవకీ బోస్ బెంగాలీలో ‘లవకుశ’ ప్లాన్ చేస్తుంటే, ఆ సబ్జక్ట్ పుల్లయ్యను ఆకర్షించింది. దాంతో, ఆ కంపెనీకే దీనిని తెలుగులో తీయడానికి రెడీ అయ్యారు పుల్లయ్య. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి స్క్రిప్ట్ రాశారు. పారుపల్లి సుబ్బారావు, సీనియర్ శ్రీరంజని ఇందులో సీతారాములుగా నటించారు. రథాలు, సెట్లు, కాస్ట్యూమ్స్ వంటి వాటిని బెంగాలీ వెర్షన్ కి వాడిన వాటినే వాడారు. 1934 లో విడుదలైన సినిమా గొప్ప విజయం సాధించింది. 1963లో ఇదే సినిమాను తన తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య పునర్నిర్మించాడు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా నమోదైన లవకుశలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి సీతారాములుగా నటించగా, నాగయ్య వాల్మీకిగా నటించారు. పుల్లయ్య తీసిన అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి.

దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు
· భువన సుందరి కథ (1967)

· భామావిజయం (1967)

· పరమానందయ్య శిష్యుల కథ (1966)

· లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు..

· దేవాంతకుడు (1960)

· పక్కింటి అమ్మాయి (1953)

· సంక్రాంతి (1952)

· అపూర్వ సహోదరులు (1950)

· వింధ్యరాణి (1948)

· గొల్లభామ (1947)

· నారద నారది (1946)

· బాలనాగమ్మ (1942)

· మాలతీ మాధవం (1940)

· వరవిక్రయం (1939)

· మోహినీ భస్మాసుర (1938)

· సత్యనారాయణ వ్రతం (1938)

· చల్ మోహనరంగ (1937)

· దశావతారములు (1937)

· కాసుల పేరు (1937)

· అనసూయ (1936)

· ధ్రువ (1936)

· కృష్ణ తులాభారం (1935)

· లవకుశ (1934 సినిమా) (1963)

· రామదాసు (1933)

· సావిత్రి (1933)

మరణం[మార్చు]
1967, అక్టోబర్ 6 న మద్రాసులో మరణించాడు.

·

1926లో సి. పుల్లయ్య కాకినాడలో భక్త మార్కండేయ చిత్రాన్ని నిర్మించారు. కానీ అది తెరమీద కాకుండా గోడమీద ప్రదర్శతం కావడంతో అది గోడమీద బొమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే తెలుగు మాట్లాడటం ఎవరూ వినలేదు.

తెలుగు సినిమా దర్శకుల గొప్పదనం గురించి అందరికీ తెలిసిన విషయమే. మన సినిమాకు మొదటి దశలో కూడా వెలుగులు నింపిన మేటి దర్శకులు ఉన్నారు. వారిలో ప్రముఖుడు సి.పుల్లయ్య. కాకినాడకు చెందిన ఈయన 1920వ దశకంలో కాంగ్రెస్ లో చేరేందుకు కలకత్తా వెళ్లి పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లో చేరారు. 1921లో ఆర్ఎస్ ప్రకాశ్ తీసిన భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాకు సహాయకుడిగా పని చేశారు. తర్వాత కాకినాడలోనే తన ఇంట్లోనే సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీసి ప్రదర్శించారు. ఇందుకోసం కాకినాడలో సిటీ ఎలక్ట్రిక్ అనే పేరుతో టెంటు హాలు నిర్మించార

అనంతరం ఇందులో చాలా మూకీ సినిమాలు ఆడాయి. సినిమా ప్రదర్శనల కోసం సినీ సామాగ్రితో ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్ కూడా తిరిగి ప్రదర్శించేవారట. టాకీ సినిమాలు మొదలయ్యాక ఆయన 1933లో సతీ సావిత్రి సినిమా తీశారు. ఈ సినిమా విజయం తర్వాత అనేక సినిమాలు తీశారు. సి.పుల్లయ్య తీసిన సినిమాల్లో నేటికీ అద్భుతంగా నిలిచిపోయిన సినిమా లవకుశ. ఎన్టీఆర్, అంజలీదేవి నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అప్పట్లో బెంగాలీలో ‘లవకుశ’ ప్లాన్ చేసారు. తెలుగులో పుల్లయ్య ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య 1963లో తీశారు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా లవకుశ రికార్డు సృష్టించింది.

పుల్లయ్య తీసిన అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి. ఆ తర్వాత ఆయన పరమానందయ్య శిష్యుల కథ, భామా విజయం, పక్కింటి అమ్మాయి, వర విక్రయం, దేవాంతకుడు, భువనసుందరి కథ, బాలనాగమ్మ, సంక్రాంతి, అపూర్వ సహోదరులు.. వంటి హిట్ చిత్రాలు ఎన్నింటినో తెరకెక్కించారు. తెలుగు సినిమా తొలి తరం దర్శకుడిగా ఖ్యాతి గడించిన సి పుల్లయ్య

కుమారుడు ,డైరెక్టర్ సి స్ రావు –

(శి హ్మ సృష్టిలో తానొక బ్రహ్మగావుట్టి – ఆ సృష్టికి ప్రతిస్పష్టిగా తన యుగంలోని తారలను నూటికి 95 మందిని తానే స్పష్టంచి, “పిల్లల కోడీ స.పుల్లయ్య” అన్న బిరుదు నందుకున్న దర్శక పీతానుహుడు చిత్తజల్లు పుల్లయ్యగారి కుమూరుడిగా నెను పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను! చలనచిత్ర స్పష్టిక సంబంధించి నా దృష్టిలో సి,పుల్లయ్య, హెచ్‌. ఎమ్‌. రెడ్డి గూడవల్లి రామబ్రహ్మంగార్హు బ్రహ్మ, విష్పు, ను హశ్వరులు. మా నాన్నగారు తెరపైన కథ చెప్పె విధానంలో డొంకతిరుగుడులేని సూటీ అయిన విధానాన్ని అవలంబించేవారు. ఈనాటిమాదిరిగా ఫ్లాష్‌బ్యాక్‌లు, కళ్ళముందు గుండ్రాలు తిరగడాలు లాంటివి ఆ రోజుల్లో లేవు. “ప్రేక్షకులకు కథ పూర్తిగా అర్థమయ్యేరీతిలోనే చిత్రాలు తీయాలి” అని చెప్పేవారు. జీతంగా కెమెరా 1921, ఆ ప్రాంతంలో నాన్నగారు కాకినాడలో ల్‌ చదువుతున్నప్పుడు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశం జరిగింది. బులుసు సాంబమూర్తిగారి అధ్యక్షతన ఉపన్యాసాలు జరిగాయి! ఆ సమావేశాల్లో నాన్నగారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు! అదిగో ఆ కాంగ్రెస్‌ సమావేశాల రోజునుంచి ఆయనగారు చనిపోయేవరకు ఖద్దరు బట్టలే వేసుకున్నారు. బులుసు సాంబమూర్తిగారి సూచనమేర నాన్నగారు బొంబాయి వెళ్ళి సినిమాటో(గ్రఫీలో శిక్షణ పొందారు. కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు అలహాబాద్‌ వెళ్ళారు. అటునుంచి బొంబాయి వెళ్ళి కాకా కలేల్‌కర్‌ ఫోటోస్టూడియోలో లేబరేటరీ పనిలో జాయిన్‌ అయ్యారు. కొంతకాలంపాటు స్టూడియోలో పనిచేసిన తర్వాత నాన్నగారు తిరిగి కాకినాడ వచ్చారు. “కాకా కలేల్‌కర్‌” స్టూడియోవారు జీతం ఇవ్వలేని స్థితిలో నాన్నగారికి ఓ కమెరా పెట్టె, డెవలప్పింగ్‌ ఫిల్మ్‌ ఇచ్చి దండం పెట్టేశారు! అవి పుచ్చుకుని నాన్నగారు కాకినాడ వచ్చేశారు. అది మూకీ చిత్రాలయుగం, (స్త్రీపాత్రల్నికూడా పురుషులే ధరించేవారు. బొంబాయి నుంచి వచ్చిన నాన్నగారు మ(ద్రాసువెళ్ళి రఘుపతి వెంకయ్యగారు స్థాపించిన స్టార్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిలిమ్స్‌ లిమిటెడ్‌ సంస్థలో చేరారు. ఈ చేరడంలోకూడా చిన్న కధ ఉంది. కాకినాడలోని కాలేజీ ప్రిన్సిసాల్‌ గారైన రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు నాన్నగారికి సిఫార్సు లెటరు రాసి ఇచ్చి మద్రాసు పంపడం వలన రఘుపతి వెంకయ్యగారు నాన్టగార్జి తన శిష్యునిగా తీసుకున్నారు. నాన్నగారు ఒకే ప్రింట్‌ని తన సైకిల్‌ వెనకాల కట్టుకుని (ప్రదర్శన కోసం గెయిటీ మొదలైన సినిమా హాల్స్‌కి టైమ్‌ ప్రకారం ప్రేంట్‌ను అందచేస్తూ ఉండేవారు. నాన్నగారికి తాను చేసే పనిలో అసంతృప్తి ఏర్పడింది. ఎంచేతనంటే నాన్నగారు డైరెక్షన్‌ సైడ్‌ పనినేర్చుకుందామని మద్రాసువస్తే వెంకయ్యగారు (ప్రొజెక్షన సైడ్‌ పని నేర్పారు. ఇదే విషయాన్ని ఓరోజున నాన్నగారు వెంకయ్యగారికి చెప్పేశారు. రఘుపతి వెంకయ్యగారు నాన్నగారి అభిప్రాయాన్ని, ఉద్దేశాన్ని అర్ధంచేసుకుని తన కుమారుడైన (ప్రకాష్‌ వద్దకు పంపారు. దర్శకత్వశాఖలో పనిచేసేందుకు రాక్సీ థియేటర్‌ వెనకాల ఓ చిన్న షెడ్‌ ఉండేది. దాన్నే స్టార్‌ ఆఫ్‌ది ఈస్ట్‌ ఫిలిమ్స్‌ ఆఫీస్‌ అనేవారు. నాన్నగారు ప్రకాష్‌గారి వద్ద డైరెక్షన్‌ శాఖలో చేరి కొన్ని చిత్రాలకు సహాయదర్శకుడిగా కూడా పనిచేశారు! ‘ప్రకాష్‌గారు వ్యాపారరీత్యా దెబ్బతినడంతో నాన్నగారికి ఓ ఓపెన్‌ షట్టర్‌ (ప్రొజెక్టర్‌, నాలుగు ఫిలు శైలు, కొనో,ఫ్రోమ్‌ అనే ఇన్‌స్టుమెంట్‌ ఇచ్చి నాన్నగారిపై తనకు గల అభిమానాన్ని చాటారు. లై న్తూదీరూ… ప్రకాష్‌ గారి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో నాన్నగారు కాకినాడ వచ్చి మా సొంత ఇంటివద్దనే సెట్టులేసి సాంకేతిక పరికరాలనన్నిటిని అమర్చుకుని “భక్త మార్కండేయ” చిత్రాన్ని తీశారు. యముడిగా మా నాన్నగారు, ఇంకా ముద్దూరి బుచ్చన్నశాసై కాకినాడ రాజారత్నం మొదలైనవారు ఆ సినిమాలో నటించారు. పౌరాణిక చిత్రాలు (ప్రజలకు బాగా నచ్చుతాయనే ఉద్దేశంతో ముందుగా పౌరాణిక చిత్రాలనే నాన్నగారు తీశారు. నాన్నగారి గురించి ఒక విచిత్రమైన సంఘటన చెబుతాను. ఫిలిమ్‌ ఇండ(స్టీలోకి మొట్టమొదటగా నాన్నగారు | ప్రవేశించాలనుకున్నప్పుడు ఆయనగారు కలకత్తా వెళ్ళి | గంగానదిలో స్నానం చేస్తుంటే అక్కడ ఓ ఫిల్మ్‌ కంపెని వాళ్ళు చెట్టుకింద కూర్చొని ఎడుస్తున్నారు. నాన్నగారు వాళ్ళదగ్గరకెళ్ళి “బాబూ మీరు తెలుగులో ఎడుస్తున్నారు మీరు తెలుగువాళ్ళా?” అని అడిగారు! వెంటనే వాళ్ళు “మేము తెలుగువాళ్ళమే. సురభి నాటకం కంపెనీవారి “రామదాసు” నాటకం పట్టుకొచ్చాం. సినిమాగా ఎలా తీయాలో తెలియదు. మీకుగానీ తియటంవస్తే కాస్త తీసిపెట్టరాదూ” అని అన్నారు. “ఓ అలాగే తిసిపెడ్డా!”’ అని నాన్నగారు చెప్పి షాట్‌ డివిజన్‌, సినీ ఆర్డర్‌ అన్నీ ప్రిపేర్‌చేసి వాళ్ళకి సినిమాతీసి ఇచ్చారు. అలా నాన్నగారు సినిమా పరిశ్రమలోకి రాకమునుపే ఓ సినిమా తీశారు. 1933, ఆ (ప్రాంతంలో కలకత్తాలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీవారు నాన్నగారి ప్రతిభాపాటవాలు గుర్తించి నాన్నగార్ని వాళ్ళ కంపెనీకి ఆహ్వానించి తెలుగు విభాగం నాన్నగారికి అప్పుగించి సినిమాలు తీయమన్నారు. ప్రథమంగా “సావిత్రి” చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చి(తంలో ఆనాటి మేటి రంగస్థల నటీనటులైన వేమూరు గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు, రామతిలకం మొదలైనవారు నటించారు. సావిత్రి చిత్రం తర్వాత నాన్నగారు షీ దశాబ్దం పాటు లవకుశ, సతీ అనసూయ, ధృవవిజయం, కాసులపేరు, మోహినీ భస్మాసుర, వరవి[క్రయం, బాలనాగమ్మ, సత్యనారాయణ(వ్రతం, గొల్లభామ, ఛల్‌మోహనరంగా మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహెంచారు. లవకుశ చేసిన మేలు నాన్నగారి రోజుల్లో థియేటర్లలో ప్రింట్‌ ఆడేందుకు కాంట్రాక్ట్‌ పద్దతి ఉండేది. ఆ పద్దతి ప్రకారమే ఆ థియేటర్లలో ఆ సినిమా ఆడాలి అన్న రూల్స్‌ ఉండేవి. నాన్నగారి లవకుశ వల్ల అటు ప్రజలకు, ఇటు సినీ పరిశమకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే – “సింగిల్‌ స్టార్‌ సింసైక్స్‌ ప్రొజెక్టర్‌” సౌకర్యం అన్ని థియేటర్లలో అమర్భబడింది. ఇది ఎలాగంటే – లవకుశ ఫల్ము డబ్బాలు రాజమండ్రి, కాకినాడ మొదలైన థీయేటర్‌లకు వెళ్ళాల్సి ఉండేవి. అవి అక్కడికి వెళ్ళిన తర్వాత వారం, పదిరోజులు గడిచినా తిరిగి వచ్చేవి కావు. థియేటర్లతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ గడువు అయిపోయేది, ఫిల్ములు మ(ద్రాసు వచ్చేవికావు. దానివల్ల (ప్రింట్లు వెళ్ళాల్సిన థియేటర్‌ వాళ్ళకు, ఆ వూళ్ళోని (ప్రజలకు కోపం వచ్చెది. ఇదంతా దేనివల్ల జరిగిందంటే లవకుశ ప్రింట్‌ ఓ వూరికివెడితే అక్కడి ప్రజలు ఆ ప్రింట్‌ని నెలరోజులపాటు వారి వూళ్ళో (ప్రదర్శింపచేసేవారు. పైగా థియేటర్‌వాళ్ళు = గోమ్స్‌ ఫిల్ముని తిరిగి పంపడానికి మాకు ఏమాత్రం అభ్యతరం లేదు కాని ఫిల్ము పంపితే మమ్మల్ని చంపెస్తామని, మా థియేటర్‌ని నాశనం చేసేస్తాం అని ప్రజలు అంటున్నారు” అని మద్రాసులోని ఫీల్ము కంపెనీవారికి చెప్పేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కలకత్తాలోని “ఛటర్జీ – భూపాల్‌’ సౌండ్‌సిస్టమ్‌ వారితో ఈస్ట్‌ ఇండియా కంపెనివారు అగ్రిమెంట్‌ కుదుర్చుకుని “సింగ్‌స్టార్‌ సిం ప్లెక్స్‌ (ప్రొజెక్టర్‌ “ని ప్రవేశపెట్టారు. అంతకుముందుదాకా థియేటర్లలో సినిమా ఆడించేందుకు మేకులు కొట్టి చెక్కముక్కలతో ప్రొజెక్టర్‌ తయారుచేసే ప్రక్రియ ఉండేది! ఈ సింగిల్‌స్టార్‌’ (ప్రొజెక్టర్‌ రావడంతో ఆ పాతపద్దతికి తెరపడింది. ఇది నాన్నగారి “లవకుశ చేసిన మేలు. 17 వారాల భత్యం నాన్నగారు సినిమాలు తీసేరోజుల్లో అందరు ఆర్జిస్టులూ కంపల్సరీగా షూటింగ్‌ మితం చూడాల్సిందే. అలా చూడటం ఆర్టిస్టులకు ఓ ఎడ్యుకేషన్‌ అని నాన్నగారు అంటూ సంయేాళు! అలాగే నాన్నగారు తన తప్పులను, లోపాలను ఎవరైనా ఎత్తిచూపితే ఎంతో ఆనందంగా వాటిని తీసుకునేవారు. తిరిగి ఆ తప్పులు, ఆ లోపాలు జరగకుండా ఎంతో జాగ్రత్త తీసుకునేవారు. _వినదగునెవ్వరు చెప్పన” అన్న సూక్తిని అక్షరాలా నాన్నగారు పాటించేవారు. చలనచిత్ర రంగంలో మేటి తారలైన భానుమతి, అంజలీదేవి, కృష్ణవేణి, పుష్పవల్లి, రేలంగి, కస్తూరి శివరావు మొదలైన ఎందరెందరో నటినటుల్ని నాన్నగారు వెండితెరకు, తెలుగు (ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాన్నగారు మొట్టమొదటిగా దర్శకత్వం వహించిన ‘సతీసావిత్రి” ఆరోజుల్లో బెంగుళూరులో 17 వారాలపాటు ఆడటం గొప్పవిషయం. అది నాన్నగారి దర్శకత్వ (ప్రతిభకు షే మచ్చుతునక, అలాగే నాన్నగారు దర్శకత్వం వహించిన ‘లవకుశి గ్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ బంట నీరాముడిగా పారుపలి ల్లి సుబ్బారావు, సతగా మంగళగిరి శ్రీరంజని అద్భుతంగ ‘లవకుళో.. నంధృ కాంతారావు, ఎన్‌.టీ.ఆర్‌. కన్టాంబ నటించారు. పల్లెప్రజలు అన్నంమూటలు కట్టుకుని, ఎడ్డబండ్హమీద తిరునాళ్ళకు వచ్చినట్టుగా లవకుశ చిత్రాన్ని చూడటానిక్తి వచ్చేవారు. తర్వాత 1958లో ఎన్‌.టి.ఆర్‌. శ్రీరాముడిగా నటించిన లవకుశ చిత్రం నాన్నగారి పర్యవేక్షణలో తీయబడింది. ఆ చిత్రానికి నేను దర్శకత్వం వహించడం నా పూర్వజన్మ సుక[తంగా నేనుభావిస్తాను! నాన్నగారు 1949లో దక్షిణ భారతదేశంలోనే (ప్రప్రథమంగా, మద్రాస్‌లో ఎయిర్‌ కండిషన్‌ థియేటర్‌ మినర్వా టాకీసు నిరి గ్రంచారు. అలాగే 1952లో మద్రాసులో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ స్థాపించారు. పిక్సరని చక్కగా తీయగలనన్న నమ్మకం, విశ్యాసం కలిగిన తర్వాతే నాన్నగారు ఏదైనా పిక్చర్‌ తీసేవారు. కథ్రాపరంగా పెద్దపెద్ద పండితులతో, చరిత్ర పరిశోధకులతో చర్చించేవారు. వారి అభి[ప్రాయాలను తీసుకునేవారు, వారి సలహాలను పాటించేవారు, నాన్నగారి గురించి ఇలా చెప్పుకుంటూపోతే ఓ మహా [గ్రంథమే అవుతుంది. మట్టిలోని మాణిక్యాలతో ఓ అందమైన హారాన్ని తయారుచేసిన రూపశిల్పి నాన్నగారు!

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్-5(చివరిభాగం )

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్-5(చివరిభాగం )

ఆశాన్ రాసిన కావ్యాలు మళయాళ సాహిత్య విమర్శకులకు చేతినిండా పని కల్పించాయి .ఆయన రాసిన ‘’సీత ‘’బాగా విమర్శకు గురైంది .ఈ కావ్యం పూర్తిపేరు ‘’చింతా విష్టయాయ సీత ‘’.కరుణ రస ప్రపూరిత ఘట్టాలతో వర్ణించాడు .1919లో ప్రచురితమైనా ,అయిదేళ్ళకాలం లో కేవలం 80పద్యాలే రాశాడు .మిగిలిన 112పద్యాలు కొద్దిరోజుల్లోనే రాసేశాడు .ఈమధ్యకాలం లో పెళ్లి అవటం, యోగం బాధ్యతలనుంచి విముక్తి జరిగాయి .సీత కావ్యానికి ప్రేరణ రవి వర్మ చిత్రించిన సీత చిత్రం అంటారు .ఈ కావ్యం రాలిన పువ్వులాగా అద్వితీయం అని పిస్తుంది .కధను ప్రవేశపెడుతూ –‘’అపరాహ్ణకాలం –ఆమె కుమారులిద్దరూ –మహర్షి వెంట అయోధ్యకు వెళ్ళారు –చింతా విష్ట యైన సీత –ఆశ్రమ సమీపాన –ఉద్యానవనం లో కూర్చున్నది ‘’ఆమె తన మిట్టపల్లాల జీవితాన్ని తలపోస్తోంది ..తర్వాత కవి ప్రకృతి రామణీయకత వర్ణించి 16వ పద్యం లో సీత దుఖకారణం తెల్పాడు –‘’మృగాలు బాధ అనుభవించినా బాధ ఎక్కువకాలం ఉండదు –దెబ్బతిన్న గర్వం తో ఉత్పన్నమైన –తీరని బాధకు గురయ్యేది మానవులు మాత్రమె ‘’

  ఈ కావ్యం లో పర్యాలోకన దశ ,సందిగ్ధ దశ ,దూషణ దశ ,కల్పనా దశ అని నాలుగు దశలున్నాయని ప్రముఖ విమర్శకుడు సుకుమార్ అజికోడ్ చెప్పాడు .కొందరు సీత నోటిలోనుంచి అనుచితాలు చెప్పించి రాముడిని కించ పరచేట్లు చేశాడు కవి అన్న వారూ ఉన్నారు .కాని ఆశాన్ సృష్టించిన సీత పతివ్రత, గుణవతి ,నీతిమంతురాలు, వివేచనా శక్తిగల ఉత్తమ జాతి స్త్రీ .చీము నెత్తురు ఉన్నమనిషి .వాల్మీకి పదేళ్ళు ఆమెను తెరవెనుక ఉన్చేశాడు .ఆశన్ ఆమె మనసులోని మాటలు చెప్పించాడు .ఆశ్రమం లో పదేళ్ళు సన్యాసినిగా ఉంది –‘’తన శరీర రూపాన్ని విడిచే వరకు ప్రాణి తన సహజ ప్రవృత్తి నిలబెట్టుకొన్నది ‘’అంటాడు కవి .రాముడిని మర్చిపోలేదు –‘’కొండ చిలవలాపడుకొని ఉంది –తలెత్తలేని నిద్రలో ఉంది ‘’అని ఆమెస్థితి వర్ణించాడు .’’సోదర స్వరూప మరిదీ లక్ష్మణా! నన్ను మన్నించు ‘’అంది .’’అపకీర్తి వస్తుందనే భయం తో అపవాదును రాజు రూఢి చేయలేదా ?’’అను కొంటుంది .’’పెళ్ళాడిన భార్యతో కాపురం చేయటానికి అడవిలో ఆయనకు చోటే దొరకలేదా ?’’అను కొంది.’’ధర్మం న్యాయం క్రూరమైనవి బాధాకరమైనవి –రాజులు ధర్మ బద్దులు కదా –అందుకే నా భర్త నన్ను బహిష్కరించాల్సి వచ్చింది –నా విగ్రహానికి ఆరాధకుడు కావాల్సి వచ్చింది ‘’అని తలపోసింది .’’ప్రభూ నీ అర్ధాంగిని మన్నించు –కోపోద్రిక్తంతో నీకు లోపాలు దోషాలు ఆపాదించాను ‘’అని బాధపడింది .ప్రకృతిలోని సర్వానికి వీడ్కోలు చెప్పింది –‘’మీ వల్ల ఆనందానుభూతి పొందిన –ఈ అదృష్టవతి –మీకిక వీడ్కోలు పలుకుతోంది ‘’అన్నది . 

   సాంఘిక కావ్యాలు

బుద్ధిపూర్వకంగానే ఆశాన్ మహా కావ్య రచన చేయలేదు .జీవిత చరమాంకం లో ‘’దురవస్థ ‘’చండాల భిక్షుకి ‘’అనే రెండు కావ్యాలు రాశాడు .వీటిలో వర్ణ వ్యవస్థ కళంకాన్ని వెలుగు లోకి తెచ్చి ప్రజల దృష్టి ని ఆకర్షించేట్లు చేశాడు .1921లో మోప్లా తిరుగుబాటు తర్వాత జరిగిన హిందూ ముస్లిం కలహాల గురించి రాసిందే దురవస్థకావ్యం –‘’పావురాళ్ళు ఎగిరిపోతున్నాయి –కులాల తారతమ్యాలు అవి చూడలేవు –వాటికి తెలీదు ‘’.హెచ్చరికగా ‘’మీరే శాస్త్రాలు మార్చండి –లేకపోతె శాస్త్రాలే మిమ్మల్ని మార్చేస్తాయి ‘’అంటాడు .చండాల భిక్షుకి దురవస్థ కావ్యానికి ఉత్తరభాగం అనుకో వచ్చు .ఇతి వృత్తం బౌద్ధం లోనిది .ఇందులోచండాలిక –‘’రెక్కలు తెగిన మిణుగురు పురుగులాగా కాలంగడిపింది ఆరాత్రి –స్థిరమైన చైతన్యం ముందు –సోలుతూ ఊగుతున్న సందేహం లాగా ఉంది ‘’అ౦టాడుకవి .బుద్ధుడు ఆమెను శాంతపరచి  భిక్షుకి గా స్వీకరిస్తాడు .ఆయన ‘’బిడ్డా నువ్వురావటం మంచిదే అయింది –ఏపాపమూ తెలియనిఆన౦దునికి నీరిచ్చావు –జీవన్మరణాలు అనే దుఖాన్నికలగజేసే దాహం నుంచి –నువ్వుకూడా విముక్తురాలివి కావాలి ‘’అంటాడు భగవాన్ ‘’చండాల స్త్రీశరీరం-బ్రాహ్మణ  బీజానికి ఫలవంతం కాదా ?జందెం నెత్తిన పిలక ,నుదుటిబొట్టు పుట్టుకతో వచ్చేవా ?గురు బోధలేకుండా బ్రాహ్మణుడు పండితుదౌతాడా ?’’చివరికి –ప్రేమనుంచే లోకం ఉదయిస్తుంది-ప్రేమవల్లలోకం వర్ధిల్లుతుంది-ప్రేమ ప్రపంచానికి త్రాణ-ప్రేమ అంటే జీవమే ‘’అంటారు ఆప్రేమమూర్తి .

  లఘుకావ్యాలు

ఆశాన్ పుష్పవాటి ,మణిమాల,వనమాల  అనే సంపుటాలలో తన లఘుకావ్యాలను ప్రచురించాడు .ఇవి సందర్భాన్ని బట్టి రాసిన కవితలు .

పత్రికా సంపాదకుడు

ఆశాన్ సంపాదకుడుగా ‘’వివేకోదయం ‘’పత్రిక నడిచింది ఆయన సంపాదకీయాలు జన జాగృతికలిగించాయి.సాహిత్య వ్యాసాలూ విజ్ఞాన వ్యాసాలూ రాశాడు .చమత్కారం స్వారస్యం అపహాస్యం ఎత్తిపోడుపులతూ సూటిగా విషయాన్న్ చెప్పేవాడు .15 ఏళ్ళు దీని సంపాదకుడుగా ఉంటూ పత్రిఅక్ ప్రజల ఆశయాలకు ప్రతిబింబంగా తీర్చిదిద్దాడు .

విమర్శకుడు

వాళ్లతోల్ కావ్యం ‘’చిత్రయోగం ,ఉల్లూరు పరమేశ్వర్ అయ్యర్ కావ్య౦  ‘’ఉమా కేరళం ‘’,పంతలం కేరళవర్మ కావ్యం ‘’రుక్మాంగద చరిత్ర ‘’లకు  ఆశాన్ రాసిన విమర్శ అగ్రశ్రేణికి చెందినదిగా కొనియాడబడింది .విమర్శకాగ్రేసరుడు అనిపించుకొన్నాడు

  ఎడ్విన్ ఆర్నోల్డ్ రాసిన ‘’లైట్ ఆఫ్ ఏషియా ‘’ను బుద్ధ చరితంగా అనువదించాడు .వాల్మీకి రామాయణ౦ ను దృష్టి లోపెట్టుకొని  ‘’బాలరామాయణం ‘’గా రాశాడు .జేమ్స్ ఎల్లాన్ రచన‘’ఆజ్ ఎ మాన్ ధింకేత్ ‘’  గ్రంథాన్ని మలయాళం లోకి ‘’మనం పోలె మాంగల్యం ‘’గా అనువదింఛి వివేకోదయం లో సీరియల్ వేసి తర్వాత ‘’మనశ్శక్తి‘’గా పుస్తకరూపం లో తెచ్చాడు .పతంజలి యోగశాస్త్రం ఆధారంగా స్వామి వివేకానందుడు రాసిన రాజయోగం ‘’ను సమర్ధంగా అనువదించాడు .మిదోన్ టేలర్’’తార ‘’నవలను దైవికమాయ ప్రతీకారం’’ గా ,,ఇంగ్లీష్ లోని ‘’మైత్రేయి ‘’ని మలయాళం లోకి అనువదించాడు .

  బహుముఖ ప్రజ్ఞకల ఆశాన్ అంతర్ముఖుడు .రచనలో నిర్మాణ సౌష్టవం ,పొందిక యుక్తాయుక్త విచక్షణం ,శ్రద్ధ ఆయన సొత్తు .చివరగా ‘’కరుణ ‘’కావ్యం రాశాడు .ఇందులో వాసవదత్త ఉపగుప్తుల కథ ఉంటుంది .సంక్షుభిత మనసుకు శాంతికలుగాజేయటమే ఇందులో ముఖ్యవిషయం .

 మరణం

16-1-1924 న ఆశాన్ తిరువనంతపురానికి 15మైళ్ళదూరం లో ఉన్న తోన్నక్కల్ నుంచి ఆల్వే వెళ్ళటానికి సిద్ధమయ్యాడు .అక్కడ ఆయనకు 18ఎకరాలపొలం ఉంది .అక్కడి పెంకుల ఫాక్టరీ లోకోన్నిషేర్లున్నాయి .ఫాక్టరీ సమావేశం లో ఆయన పాల్గొనాలి. కోయిలోన్ నుంచి అలప్పీ వెళ్ళే చివరి పడవలో ప్రయాణం చేస్తున్నాడు .పడవ నిండా జనమున్నారు అష్టముడి సరస్సు పెద్ద అలలల్తో అల్లకల్లోలంగా ఉంది .వాటిని చీల్చుకొని పడవ పోతోంది .అందులో నిద్రపోయే సౌకర్యం లేదు .పద్యాలు చదివి వినిపించమని అందులోని వారు కోరితే బుద్ధ చరితం లోనివి కరుణ కావ్యం లోవి చదివి వినిపించాడు. అర్ధరాత్రి దాటింది .కిందున్న మొదటి తరగతి అరలోకి వెళ్ళాడు. చలిగా ఉంది .ఖాదీ కోటు లోనే ఉన్నాడు .తలపై పల్చని శాలువా కప్పుకొని నిద్రపోయాడు .అంతే.మళ్ళీ నిద్ర లేవలేదు .పడవ పల్లన వద్ద చిన్నకాలువలో మునిగిపోయింది .అనాయాసంగా మరణించాడు ఆశాన్ .ఆపడవ పేరు ‘’రక్షకుడు ‘’రక్షించాల్సిన పడవ భక్షించింది ఆశాన్ ను .విధి వైపరీత్య౦ .మర్నాడు శవం దొరికింది నుదుటిపై దెబ్బ కనిపించింది. అదే చావు దెబ్బ అయి ఉంటుంది .ఆశాన్ వయసు 51మాత్రమె .భార్య భానుమతికి 23.ఏడేళ్ళు మాత్రమె కాపురం చేశారు

  మృత్యువు తప్ప ఆశాన్ కు అన్నీ అందుబాటులోకి వచ్చాయి .ఆయన కావ్యాలలో స్త్రీలకూ వెలుగు ప్రసరింపజేశాడు .మళయాళ కవిత్వం లో రినైజాన్స్ కు అంటే పునరుజ్జీవనోద్యమానికి నాయకత్వం వహించిన మహద్భాగ్యం కుమారన్ ఆశన్ కే దక్కింది .ఆయన పేరుమీద అకాడెమీలు విద్యాలయాలు వెలిశాయి .మద్రాస్ లో ఆశాన్ మెమోరియల్ స్కూల్ ఉంది .

ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే చెప్పినట్లు మలయాళం లో కే ఎం జార్జి రచనకు తెలుగులో శ్రీ డి రామలింగం చేసిన అనువాదం –కుమారన్ ఆశాన్ .

  రధ సప్తమి శుభాకాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -59

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -59

59- తొలి తెలుగు చిత్రనిర్మాత – ‘టాకీ పులి’…. హెచ్.ఎం. రెడ్డి

హెచ్. ఎం. రెడ్డి గా పేరు గాంచిన హనుమప్ప మునియప్ప రెడ్డి తెలుగు సినిమా తొలినాళ్ళలో ప్రముఖ దర్శకుడు. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు.[2]

ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.

1930లో ఇంపీరియల్‌ కంపెనీకి విజయకుమార్‌, 1931లో ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌ అన్న రెండు మూకీలను హెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రధారి. అలా – శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ఆలం ఆరా అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక భక్తప్రహ్లాదని ఆయనకు అప్పజెప్పారు. అలాగే కాళిదాసు కూడా తమిళంలో తీశారు రెడ్డి.

హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘ఆలం ఆరా’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, పితామహుడు అనిపించుకున్నారు.

రెడ్డిగారిని టైగర్‌ అనేవారు. మీసం మీద చెయ్యి వేసి ఈ పక్కా ఆ పక్కా దువ్వి ఇది తమిళం ఇది తెలుగు అని దర్జాగా, గర్వంగా చెప్పుకోగల ఘనుడు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. తర్వాత సీతాస్వయంవరం (1933) చిత్రం హిందీలో తీశారు. రెడ్డి కొల్హాపూర్‌లో వున్నప్పుడు పారుపల్లి శేషయ్య, కూరుకూరు సుబ్బారావు ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) తియ్యాలని, ఆయన సహాయం కోరారు. హెచ్‌.వి. బాబు చేత ఆయన దర్శకత్వం చేయించి – తాను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించారు. ఆ చిత్రం విజయవంతమైంది. గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా సినిమా రంగప్రవేశం చేశారు. అంతకుముందు రెడ్డిగారు తీసిన ప్రహ్లాద నుంచి కొన్ని చిత్రాల వరకు ఎల్.వి.ప్రసాద్ సహాయకుడుగా పనిచేశారు.

రోహిణి పిక్చర్స్‌ పేరిట బి.ఎన్.రెడ్డి లాంటి వారిని కలుపుకుని గృహలక్ష్మి (1938) తీసి సాంఘిక పతాకం ఎగరవేశారు రెడ్డి. రోహిణి స్థిరపడింది, భాగస్వాములు విడిపోయి వాహిని పిక్చర్స్ స్థాపిస్తే అదీ స్థిరపడింది. రెడ్డిగారు నిర్దోషి (1951) తీసిన తర్వాత రోహిణి స్టూడియో కట్టారు మద్రాసులో. ప్రయోగాలు చెయ్యడంలో కూడా హెచ్‌.ఎమ్‌.దిట్ట. అంతవరకూ విలన్‌ వేషాలే వేస్తున్న ముక్కామలని నిర్దోషిలో హీరోని చేశారు. వాంప్‌ వేషాలు ఎక్కువగా వేసిన అంజలీదేవిని నిర్దోషి (1951) తో హీరోయిన్‌ని చేశారు. నిర్దోషిలో ఓ చిన్నవేషంలో కనిపించిన కాంతారావుని ప్రతిజ్ఞతో హీరోని చేశారు. అలాగే ప్రతిజ్ఞలో విలన్‌ రాజనాలకు అదే తొలిచిత్రం.

కమలాకర కామేశ్వరరావు, సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, మల్లాది వెంకటకృష్ణశర్మ, కొవ్వలి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీశ్రీ – ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.

భారతీయ చలనచిత్ర పితామహుడుగా పిలుచుకునే ఆర్దేషిర్‌ ఇరాని తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ను ఇంపీరియల్‌ మూవీటోన్‌ పతాకం మీద 1931లో నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెంగుళూరులో సూర్యా ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించి మూకీ చిత్రపరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హనుమప్ప మునియప్ప రెడ్డి అనే హెచ్‌.ఎం. రెడ్డి బొంబాయికి వెళ్లి ఇంపీరియల్‌ మూవిటోన్‌ నిర్మాత, దర్శకుడు అర్దేషిర్‌ ఇరాని వద్ద సహాయకునిగా పనిచేస్తూ కొన్ని మూకీ చిత్రాలకు స్వతంత్రంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. తొలి టాకీ ‘ఆలం ఆరా’ విజయంతో దక్షిణాది భాషల్లో కూడా టాకీ చిత్రాలు నిర్మించాలని అర్దేషిర్‌ ఇరాని నిర్ణయించి తనవద్ద వున్న అనుభవజ్ఞుడైన హెచ్‌.ఎం.రెడ్డికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అలా అర్దేషిర్‌ ఇరాని నిర్మించిన తొలి తమిళ టాకీ ‘కాళిదాస’ (31 అక్టోబరు 1931), తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (6 ఫిబ్రవరి 1932) చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి టాకీ చిత్రాల దర్శక పితామహునిగా హెచ్‌.ఎం.రెడ్డి పేరు గడించారు. అలా తెలుగు తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ తొలి ప్రదర్శన బొంబాయి న్యూ చార్లీ రోడ్డు లోని కృష్ణా సినిమా హాలులో నిర్వహించిన ఘనత హెచ్‌.ఎం.రెడ్డిదే. తరవాత కాలంలో హెచ్‌.ఎం.రెడ్డి మద్రాసులో ప్రముఖ దర్శకుడు బి.ఎన్‌. రెడ్డి, బి. నాగిరెడ్డి, ప్రముఖ నటి కన్నాంబలను భాగాస్వాముగా చేసుకొని ‘రోహిణి పిక్చర్స్‌’ సంస్థను నెలకొల్పి ‘గృహలక్ష్మి’ (1938) చిత్రాన్ని నిర్మించారు. అదే బ్యానరు మీద ‘వందేమాతరం’ (1939), ‘తెనాలి రామకృష్ణ’ (1941), ‘సత్యమే జయం’ (1942), ‘నిర్దోషి’ (1951), ‘ప్రతిజ్ఞ’ (1953), ‘వద్దంటే డబ్బు’ (1954), ‘బీదల ఆస్తి’ (1955) వంటి చిత్రాలను హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించారు. అటువంటి ఈ తొలితరం దర్శక పితామహుని 127వ జయంతి జూన్‌ 12న జరుగుతున్న సందర్భంగా ఈ ‘మీసాల పులి’ గురించి కొన్ని విశేషాలు…
పోలీసు అధికారి దర్శకునిగా మారి…
మీసాల పులిగా చలనచిత్రరంగాన్ని హడలెత్తించిన హనుమప్ప మునియప్ప రెడ్డి కన్నడిగుడు. పుట్టింది జూన్‌ 12, 1882 న బెంగుళూరులో. ఆయన బెంగుళూరు నగరంలోనే చదివి అక్కడే పోలీసు అధికారిగా చాలాకాలం పనిచేశారు. ఆరోజుల్లో పోలీసు శాఖ బ్రిటీష్‌ వారి ఆధీనంలో వుండేది. వారి క్రింద పనిచేయడం ఇష్టంలేని హెచ్‌.ఎం. రెడ్డి పోలీసు అధికారి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. సినిమాల మీద మోజుతో తన సోదరుని కుమారుడు హెచ్‌. వి. బాబును వెంటపెట్టుకొని బొంబాయి నగరం చేరుకున్నారు. అక్కడ బి.పి. మిశ్రాకు సహాయకుడిగా పనిచేశారు. తరవాత ఇంపీరియల్‌ స్టూడియో యజమాని, టాకీ సినిమాలకు ఆద్యుడు అర్దేషిర్‌ ఇరాని వద్ద తొలుత లైట్‌ బాయ్‌గా చేరి, మూకీ సినిమా నిర్మాణ మెళకువలు అధ్యయనం చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేశారు. అర్దేషిర్‌ ఇరాని హెచ్‌.ఎం. రెడ్డి ప్రతిభను గుర్తించి తన వద్ద సహాయ దర్శకునిగా నియమించుకున్నారు. తరవాత 1930లో ‘ప్రిన్స్‌ విజయకుమార్‌’ అనే మూకీ చిత్రానికి దర్శకునిగా నియమించారు. ఆ చిత్రంలో పృథ్వీరాజ్‌ కపూర్‌ హీరో. అర్దేషిర్‌ ఇరాని తొలి భారతీయ టాకీ ‘ఆలం ఆరా’ (14 మార్చి, 1931) బొంబాయిలో ఇంపీరియల్‌ మూవిటోన్‌ పతాకం మీద నిర్మించారు. అందులో పృథ్వీరాజ్‌ కపూర్, మాస్టర్‌ విఠల్, ఎల్‌.వి. ప్రసాద్, జుబేదా, జీలూమా నటించగా ఫిరోజ్‌ షా మిస్త్రి, బి. ఇరాని సంగీతం సమకూర్చారు. ‘ఆలం ఆరా’ చిత్రానికి హెచ్‌.ఎం. రెడ్డి సహాయ దర్శకుడుగా వ్యవహరించారు. ముందుగా స్కీన్ర్‌ వర్షన్‌ తీసి, తరవాత టనర్‌ సింగిల్‌ కెమెరాతో సౌండ్‌ సిస్టం రికార్డుచేసి సినిమాకు జతచేసి తొలి టాకీ పూర్తిచేశారు. ఈ టాకీ చిత్రాన్ని చూడడానికి జనం ఎగబడడంతో పోలీసు బందోబస్తు నిర్వహించాల్సి వచ్చింది. సినిమా విడుదలైన ఎనిమిది వారాలు బొంబాయి మెజెస్టిక్‌ సినిమా హాలులో హౌస్‌ ఫుల్‌ నడిచింది. ఒక రాజకుమారునికి (మాస్టర్‌ విఠల్‌), ఆలం ఆరా (జుబేదా) అనే ఒక ఆటవిక జాతి వనితకు మధ్య జరిగిన ప్రేమాయణం ఈ చిత్ర నేపథ్యం. ఈ చిత్ర విజయంతో అర్దేషిర్‌ ఇరానికి దక్షిణ భాషల్లో కూడా సినిమా తీయాలని సంకల్పం కలిగింది. ఆ సంకల్పబలం హెచ్‌.ఎం. రెడ్డి ఇచ్చిందే. వెంటనే తమిళంలో ‘కాళిదాస’, తెలుగులో ‘భక్త ప్రహ్లాద’చిత్రాలనిర్మాణానికిహెచ్‌.ఎం.రెడ్డినడుంబిగించారు.

తొలితెలుగు,తమిళటాకీలునిర్మించి…
ఆ రోజుల్లో వనారస సోదరులు గోవిందరావు, చిన్నరామయ్య సురభి నాటక సమాజం స్థాపించి తమ కుటుంబ సభ్యులే పాత్రధారులుగా, రంగస్థల నటనే జీవనాధారంగా చేసుకుంటూ, పల్లెలు పట్టణాలలో ప్రదర్శనలు ఇస్తుండేవారు. సురభివారు ప్రదర్శించే పౌరాణిక నాటకాల్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం ఆరోజుల్లో బాగా పేరుతెచ్చుకుంది. హెచ్‌.ఎం. రెడ్డి సురభి నాటక సమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళికను రూపొందించారు. అక్కడే కృష్ణా మూవిటన్‌ స్టూడియోలో ‘భక్త ప్రహ్లాద’ చిత్ర నిర్మాణం జరిగింది. ఇందులో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి, ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, ఇంద్రునిగా దొరస్వామి నాయుడు, బ్రహ్మగా చిత్రపు నరసింహా రావు, ప్రహ్లాదుని సహాధ్యాయి మొద్దబ్బాయిగా ఎల్‌.వి. ప్రసాద్‌ నటించారు. అలాగే హెచ్‌.ఎం. రెడ్డి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కాళిదాస’ లోకూడా ఎల్‌.వి. ప్రసాద్‌ నటించడం విశేషం. సురభి కమలాబాయి నటనకు మెచ్చి మొదట అనుకున్న 500 రూపాయలకు బదులుగా వెయ్యినూట పదహార్లు పారితోషికాన్ని అర్దేషిర్‌ ఇరాని బహూకరించారు. ఎవరి పద్యాలు, పాటలు వారే పాడుకోగా హెచ్‌.ఆర్‌. పద్మనాభశాస్త్రి హార్మోనియం మీద సంగీత సహకారాన్ని అందించారు. ఈ సినిమా సూపర్‌ హిట్టయింది. బ్లాక్‌ లో టికెట్లు కొని మరీ సినిమాను చూశారు. అయితే ఈ సినిమామీద కొన్ని విమర్శలు రాకపోలేదు. సినిమా ప్రింటు మసక మసకగా అగుపించిందని, సంభాషణలు, పద్యాలూ మధ్య మధ్యలో తగ్గుతూ కొన్నిచోట్ల హెచ్చుతూ వినిపించాయని అనుకున్నారు. అయితే తొలి టాకీ కావడంతో అటువంటి లోపాలు సహజమేనని సర్దుబాటు చేసుకున్నారు ప్రేక్షక్లులు. ‘భక్త ప్రహ్లాద’ సినిమాతో సమాంతరంగా నిర్మించిన ‘కాళిదాస’ సినిమాకి కూడా హెచ్‌.ఎం. రెడ్డి దర్శకత్వం చేశారని చెప్పుకున్నాం కదా. ఇందులో కాళిదాసుగా జి. వెంకటేశన్, విద్యాధరిగా టి.పి. రాజ్యలక్ష్మి, దేవాలయ అర్చకుడిగా ఎల్‌.వి. ప్రసాద్‌ నటించారు. ఈ చిత్రానికి జర్మన్‌ టెక్నాలజీతో కూడిన శబ్ద గ్రహణ యంత్రాలను ఉపయోగించారు. ఈ చిత్ర నిర్మాణానికి కేవలం 8 రోజులు మాత్రమే పట్టింది. అయితే ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి వినియోగించినంత సమయాన్ని ‘కాళిదాస’ కు కేటాయించలేకపోవడంతో నాణ్యత తగ్గింది. ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో వలె కాకుండా నటీనటులు ఇందులో వారి వారి సొంత భాషల్లో సంభాషణలు పలికారు. రాజలక్ష్మి తమిళంలోనూ, వెంకటేశన్‌ తెలుగులోనూ, ఎల్‌.వి. ప్రసాద్‌ హిందీ లోను సంభాషణలు పలికారు. అందుకే ‘కాళిదాస’ చిత్రాన్ని తొలి తమిళ టాకీ అనేదానికన్నా, తొలి భారతీయ బహుభాషా చిత్రం అని వ్యవహరిస్తే బాగుంటుందని కొందరు సినీ పండితుల అభిప్రాయం. ‘కాళిదాస’ చిత్రానికి పాటలు, సంగీతం సమకూర్చినవారు భాస్కరదాస్‌. ఈ చిత్రాన్ని మొదట మద్రాస్‌ కిన్నెర సెంట్రల్‌ థియేటర్‌ లో విడుదల చేశారు. ఎనిమిది రోజుల్లో తయారైన ఈ సినిమా ఆ రోజుల్లోనే 75 వేల రూపాయల వసూళ్లు రాబట్టి హిట్‌ అయింది. తరవాత హెచ్‌.ఎం. రెడ్డి సీతా స్వయంవర్, జాజ్‌ ఆఫ్‌ లైఫ్‌ వంటి మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆరోజుల్లో హెచ్‌.ఎం. రెడ్డి ఎక్కువగా కొల్హాపూర్‌ లో వుండేవారు. అక్కడే కొల్హాపూర్‌ ఫిలిం కంపెనీకి పనిచేస్తూ శాలిని సినీ టోన్‌ స్టూడియోలో సినిమాలు నిర్మిస్తూ వుండేవారు. ‘భక్తప్రహ్లాద’ సినిమా విజయంతో బొంబాయి సాగర్‌ ఫిలిం కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా వున్న చున్నీబాయి దేశాయి తెలుగు సినీరంగంలోకి దిగి ‘పాదుకా పట్టాభిషేకం’, ‘శకుంతల’ అనే రెండు చిత్రాలు నిర్మించారు. అయితే ‘భక్త ప్రహ్లాద’ సినిమాకు వచ్చినంత పేరుగాని, ఆదాయం గాని ఈ సినిమాలకు రాలేదు. అయినా టాకీ సినిమాలు ప్రేక్షకులకు కొత్త కావడంతో బాగానే ఆడాయి. తరవాత 1935 ప్రాంతంలో విజయవాడ కు చెందిన పారుపల్లి శేషయ్య, కురుకూరు సుబ్బారావు తెలుగు టాకీ నిర్మించే ఉద్దేశ్యంతో హెచ్‌.ఎం. రెడ్డిని కలిసి తమకు ఒక సినిమా నిర్మించి ఇవ్వమని ఆడిగారు. అప్పుడు తన అన్న కుమారుడు హెచ్‌.వి. బాబు దర్శకత్వంలో ‘ద్రౌపదీ వస్తాప్రహరణం’ చిత్రాన్ని నిర్మింపజేశారు. అందులో యడవల్లి సూర్యనారాయణ, సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, నెల్లూరు నగరాజరావు, చొప్పల్లి సూర్యనారాయణ, వేమూరు గగ్గయ్య, కన్నాంబ, రామతిలకం వంటి మేటి రంగస్థల నటీనటులతో ఆ చిత్రం నిర్మించబడింది. మల్లాది అచ్యుతరామశాస్త్రి విరచించిన నాటకానికి మునువంటి వెంకటేశ్వరరావు సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాకు పోటీగా లక్ష్మి ఫిలిమ్స్, మద్రాసు సంస్థ ఎం. జగన్నాథ స్వామి దర్శకత్వంలో దైతా గోపాలం చేత స్క్రిప్టు రాయించి ఇదే కథను ‘ద్రౌపదీ మానసంరక్షణము’ పేరుతో సినిమా నిర్మించి 1936 లో సమాంతరంగా విడుదల చేసింది. ఇందులో బళ్ళారి రాఘవ (దుర్యోధనుడు), బందా కనకలింగేశ్వరరావు(కృష్ణుడు), పారుపల్లిసుబ్బారావు(ధర్మరాజు), మంత్రవాది వెంకటశేషయ్య (భీష్ముడు), సురభి కమలాబాయి (ద్రౌపది) ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఈ చిత్రం ‘ద్రౌపదీ వస్తాప్రహరణం’ ముందు నిలవలేకపోయింది.
‘గృహలక్ష్మి’తో రోహిణీ పిక్చర్స్ ఆవిర్భావం…
హెచ్‌.ఎం. రెడ్డి సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమాలు నిర్మించాలని సంకల్పించి, బి.ఎన్‌. రెడ్డి (ప్రముఖ నిర్మాత, దర్శకుడు), బి. నాగిరెడ్డి (ప్రముఖ నిర్మాత), మూలా నారాయణస్వామి (ప్రముఖ వ్యాపారవేత్త) లను భాగస్వాములుగా చేర్చుకున్నారు. కె.వి. రెడ్డి (ప్రముఖ దర్శకనిర్మాత)కి నిర్మాణ శాఖను కేటాయించారు. కన్నాంబ భర్త కడారు నాగభూషణం ప్రొడక్షన్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. ఇక కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకునిగా, సముద్రాల రాఘవాచార్య ఆస్థాన రచయితగా నియమితులయ్యారు. హెచ్‌.వి. బాబు, డి.ఎల్‌. రామచందర్‌ లు దర్శకత్వ శాఖలకు కుదిరారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలు నిర్మించిన హెచ్‌.ఎం. రెడ్డి సాంఘిక చిత్రాల బాట పట్టారు. సోమరాజు రామానుజరావు ప్రఖ్యాత నాటిక ‘రంగూన్‌ రౌడీ’ హక్కులు కొని ఆ నాటికకు అసంఖ్యాక మార్పులుచేసి ‘గృహలక్ష్మి’(1938) చిత్రాన్ని నిర్మించారు. ప్రభల సత్యనారాయణ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి రామనాథ్‌ ఛాయాగ్రహణం అందించగా శేఖర్‌ శబ్దగ్రాహకుడిగా పనిచేశారు. ఇందులో ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం పాత్రకు మంచి పేరు సంపాదించిన రామానుజాచారిని హీరోగా, కన్నాంబ, కాంచనమాల, నాగయ్య, గౌరీపతిశాస్త్రిలను ముఖ్యతారాగణంగా పెట్టి సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి స్పెన్సర్‌ కంపెనీ వారు సెట్టింగులు సమకూర్చగా, చిత్రాన్ని మద్రాసులోని గ్రీన్‌ వేస్‌ రోడ్‌లో వున్న కార్తికేయ ఫిలిమ్స్‌ స్టూడియోలో నిర్మించారు. ఈ సినిమా పతాక సన్నివేశంలో కన్నాంబ పారిస్‌ కార్నర్‌ రోడ్‌లో పిచ్చిదానిలా ‘‘దేవుడు లేడూ…సత్యం జయించదూ’’ అంటూ బస్సులకు అడ్డంగా పరిగెడుతూ ఉంటే, ఆ వేగాన్ని యూనిట్‌ అందుకోలేకపోయింది. ఆమె నిజంగానే పిచ్చిదని భావించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను పూల బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిర్మాతలు, యూనిట్‌ సభ్యులు వచ్చి ఆమెను విడిపించాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే కన్నాంబకు హెచ్‌.ఎం. రెడ్డి పదివేల పారితోషికాన్ని ఇచ్చి గౌరవించారు. ‘గృహలక్ష్మి’ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. అయితే బి.ఎన్‌. రెడ్డి కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో హెచ్‌.ఎం. రెడ్డితో విభేదించి తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని బయటకు వచ్చేశారు. తరవాత బి.ఎన్‌.రెడ్డి నాగిరెడ్డి, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సముద్రాల రాఘవాచార్యను కూడా బయటకు తీసుకొని వచ్చి వాహినీ సంస్థను నెలకొల్పారు. గృహలక్ష్మి చిత్రం తరవాత వెంపటి సదాశివబ్రహ్మం చేత కథ రాయించి హెచ్‌.ఎం. రెడ్డి ‘తెనాలి రామకృష్ణ’ (1941) చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పి. కోటేశ్వరరావు, ఎస్‌.పి.లక్ష్మణస్వామి, ఎల్‌.వి. ప్రసాద్, రామతిలకం, పువ్వుల అనసూయ, పారుపల్లి సుబ్బారావు, గంగారత్నం నటించారు. గండోపంత్‌ వలవల్కర్‌ సంగీతం సమకూర్చారు. సదాశివబ్రహ్మంకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. సినిమా విజయవంతమైంది. తరవాత 1942 నుంచి 1951 మధ్యకాలంలో ఘరానా దొంగ, సతీ సీత, నిర్దోషి సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్దోషి చిత్రాన్నే తమిళంలో నిరపరాధి పేరుతో సమాంతరంగా నిర్మించారు. ఘంటసాల ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం విశేషం. అప్పటిదాకా విలన్‌ వేషాలు వేస్తున్న ముక్కామలను ఈ చిత్రంలో హీరోగా చేయడం, హీరోయిన్‌ పాత్రల్లో బిజీ అవుతున్న అంజలీదేవిని వ్యాంప్‌ పాత్రలో నటింపజేయడం ఆయనకే సాధ్యమైంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మొదలుపెట్టిన ‘అమృత హస్తం’ అనే చిత్రాన్ని హెచ్‌.ఎం. రెడ్డి పూర్తిచేయలేకపోయారు. తరవాత బెంగుళూరుకు మకాం మార్చి ‘మైసూర్‌ మూవీ టోన్‌’ అనే సంస్థను నెలకొల్పారు. మధ్యకాలంలో బొంబాయి వెళ్లి ‘జస్టిస్‌’ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1949లో బొంబాయినుంచి మరలా మద్రాసు వచ్చేశారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ‘నిర్దోషి’ (1951) చిత్రం విజయవంతం కావడంతో హెచ్‌.ఎం. రెడ్డి మద్రాసులో రోహిణీ స్టూడియో నిర్మించారు. 1953 లో హెచ్‌.ఎం. రెడ్డి ‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా కాంతారావుని హీరోగా, రాజనాలను విలన్‌ గా పరిచయం చేశారు. ప్రస్తుతం జెమినీ సర్కిల్‌ వద్ద గల పాంగ్రోవ్‌ హోటల్‌ వున్న స్థలం ప్రక్కనే హెచ్‌.ఎం. రెడ్డి బంగాళా వుండేది. తను కారులో స్టూడియోకి వెళ్తున్నప్పుడు ఎవరైనా సినిమా టెక్నీషియన్‌ కనపడితే వారికి లిఫ్ట్‌ ఇవ్వడం హెచ్‌.ఎం. రెడ్డికి అలవాటు. తరవాతి కాలంలో పోషణ లేక విరుగంబక్కం లోని రోహిణీ స్టూడియో గోల్డెన్‌ స్టూడియోగా మారిపోయింది. ఆ స్థలంలో ఇప్పుడు ఫుడ్‌ కార్పోరేషన్‌ వారి గిడ్డంగులు దర్శనమిస్తున్నాయి. హెచ్‌. ఎం. రెడ్డి మంచితనానికి జేజేలు పలుకుతూ ఈ మీసాల పులిని ఆప్యాయంగా అందరూ ‘పప్పాజీ’ అని పిలుస్తుండేవారు. ‘గజ దొంగ’ సినిమా నిర్మాణంలో వుండగా జనవరి 14, 1960 న ఈ మీసాల పులి మద్రాసులో తనువు చాలించింది.

సశేషం

రధసప్తమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-21-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58


· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58

58-మరో మొహంజదారో నాటక౦,మరో ప్రపంచం ఫేం, నటుడు ,రచయిత-మోదుకూరి జాన్సన్

మోదుకూరి జాన్సన్ (ఆగష్టు 8, 1936 – డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.[1]

జననం – విద్యాభ్యాసం – ఉద్యోగం
వీరు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో 1936, ఆగష్టు 8 తేదీన జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం దుగ్గిరాల, గుంటూరులో చేసిన తర్వాత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తెనాలి లో కొంతకాలం న్యాయవాది గా పనిచేశారు,

నాటకరంగ ప్రస్థానం
ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వీరు నటనాలయం,[2] దేవాలయం, హృదయాలయ, సిలువభారం మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢక్కాభిషేకం నవల రాశారు. రాగ హృదయం అనే రూపకానికి నేపథ్యగానం అందించారు. ఛండాలిక, పైరుపాట సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.

సినీరంగ ప్రస్థానం
మోదుకూరి రాసిన నటనాలయం నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే అక్కినేని నాగేశ్వరరావు – ఆదుర్తి సుబ్బారావు లు తమ సొంత చిత్రమైన మరో ప్రపంచం సినిమాకు సంభాషణల రచయితగా అవకాశం ఇచ్చారు.[3] వీరు కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు – దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.[4]

నటుడుగా ,సంగీత దర్శకుడు గా అనేక బహుమతులు పొందారు .జాన్సన్ గొప్ప వక్త .సంభాషణా చతురులు

రచించిన పాటలు[మార్చు]

  1. కదిలింది కరుణరథం… సాగింది క్షమా యుగం (కరుణామయుడు)[5]
  2. మన జన్మభూమి… బంగారు భూమి(పాడిపంటలు)[1]
  3. స్వాగతం దొరా (దేశోద్ధారకులు)[3]

మరణం
— వీరు 1988, డిసెంబరు 24 తేదీన 52 ఏళ్ళకే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

హీరో,దర్శకనిర్మాతకృష్ణ –‘’ ‘చెరగని జ్ఞాపకం’ పుస్తకావిష్కరణలో కృష్ణ
‘తెలుగు సినీ రంగంలో రచయితగా మోదుకూరి జన్సర్‌ చెరగని ముద్ర వేశార’ని నటుడు కృష్ణ అన్నారు. ‘మరో ప్రపంచం’, ‘మానవుడు – దానవుడు’, ‘డబ్బుకులోకం దాసోహం’, ‘దేశోద్ధారకులు’, ‘బంగారుభూమి’, ‘కరుణామయుడు’, ‘దేవాలయం’, ‘నేటి భారతం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటలను, ‘మన జన్మభూమి… బంగారు భూమి'(పాడి పంటలు), ‘కదిలింది కరుణ రథం..'(కరుణామయుడు) వంటి పాటలను రచించిన సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ జీవిత విశేషాలపై ‘చెరగని జ్ఞాపకం’ పేరుతో తెనాలికి చెందిన న్యాయవాది, రచయిత గుంటూరు కృష్ణ రూపొందించిన పుస్తకాన్ని కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పద్మాలయ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, ‘జాన్సన్‌ తెనాలి సమీపంలోని కొలకలూరులో 1934లో జన్మించారు. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు. దాదాపు 50 సినిమాలకుపైగా మాటలు సమకూర్చారు. మాటలతో పాటు శ్రీ శ్రీ, దాసరథి, ఆరుద్ర వంటి ప్రముఖుల సరసన కొన్ని చిత్రాలకు పాటలను కూడా రాశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, విజయచందర్‌ చిత్రాలకు రచయితగా పనిచేశారు. పి.సి.రెడ్డి, టి.కృష్ణ, విజయనిర్మల కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు, సురేష్‌ ప్రొడక్షన్స్‌, పద్మాలయ పిక్చర్స్‌, ఉషా శ్రీ పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన పలు చిత్రాలకు రచయితగా పనిచేసి తెలుగు సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 1988 డిసెంబర్‌ 24న ఆయన మరణించారు. చనిపోయి 30ఏండ్లు అవుతున్నా నేటికీ జాన్సన్‌ మాటలు, పాటల ద్వారా చిరస్మరణీయుడుగానే ఉన్నారు. జాన్సన్‌పై పుస్తకాన్ని రాసిన గుంటూరు కృష్ణకు నా అభినందనలు’ అని అన్నారు. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడటం చాలా ఆనందంగా ఉంది’ అని రచయిత కృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, శాఖమూరి మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు మన వెండి తెర మహానుభావులు -57

Print all
In new window

మన మరుపు వేనుక మన వెండి తెర మహానుభావులు -57 57-అందాల హుందా తార వేదవల్లి-సంధ్య

సంధ్య అసలు పేరు వేదవల్లి . నటి. మాయాబజార్ చిత్రంలో రుక్మిణి పాత్రధారి.ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు తల్లి.

జీవిత విశేషాలు
ఆమె బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924 లో జన్మించారు ఆమె అసలు పేరు “వేదవల్లి”. సంధ్య పేరుతో సినిమా నటిగా వెలిగారు . 1950లో తన 26వ యేట తన భర్త జయరామన్ మరణించాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు జయకుమార్, జయలలిత. ఆమె భర్త జయరామన్ మరణించేనాటికి జయలలిత వయస్సు రెండేళ్ళు[1]. ఆమె భర్త జయరామన్ లాయరుగా పని చేసేవాడు.[2] జయరామన్ మరణించిన తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటికి కూతురితో సహా చేరారు వేదవల్లి. కుటుంబ బాధ్యతను మోయడం కోసం వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టారు. తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి (విద్యావతి) దగ్గరికి వేదవల్లి వెళ్ళారు. ఆమె తన సోదరి అంబుజవల్లి అడుగుజాడలలో నటించారు . దాంతో ఆమె కుమార్తె జయలలిత ఆమెకు దూరంగా అమ్మమ్మ-తాతల దగ్గర పెరిగింది. చిన్నారి జయను వదిలి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేసింది.[3] కూతురికి దూరంగా వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళారు. వాస్తవానికి కూతురిని బాగా చదివించాలన్నది తల్లి సంధ్య ఆశయం. అందుకే, బాల నటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు, ‘అమ్మాయి చదువుకు ఆటంకం లేకుండా షూటింగ్స్ పెడితే ఓకే’ అని ఆమె కండిషన్ పెట్టేది[4]. తదనంతరం ఆమె జయలలిత ను కూడా నటిగా ప్రోత్సహించారు .

ఆమె క్యారెక్టర్ నటిగా, గుర్తింపు పొందిన నటులకు సోదరి లేదా తల్లిగా సహాయక పాత్రలను కూడాఅ పోషించారు . నటి కావడానికి ముందు వ్యవసాయ డైరెక్టరేట్‌లో కార్యదర్శిగా పనిచేశారు సుమారు 11ఏళ్ళు మాత్రమె ఫీల్డ్ లో ఉన్నా ఆమె ధరించిన పాత్రలు చిరాస్మరణీయం .

సంధ్య కేవలం 47 ఏళ్ళు మాత్రమె జీవించి 1971లో మరణించారు.చక్కని అంగసౌష్టవం ముఖవర్చస్సు కాంతులీనే కనులు అందమైన నాశిక ,స్పష్టమైన వాచికం ఆమె ప్రత్యేకతలు .అన్నీ హుందా తనం ఉన్న పాత్రలే పోషించారు .ఆమెను చూస్తుంటే అందమే మూర్తీభవించి నడిచి వస్తోందా అని పించేది .

నటించిన చిత్రాలు-

· ఇరుగు పొరుగు (1965)

· నర్తనశాల (1963)

· కులగోత్రాలు (1962)

· శ్రీశైల మహత్యం (1962)

· భార్యాభర్తలు (1961)

· శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)

· మనసిచ్చిన మగువ (1960)

· కృష్ణలీలలు (1959)

· చెంచులక్ష్మి (1958)

· మాయాబజార్ (1957)

· ప్రేమే దైవం (1957)

· తెనాలి రామకృష్ణ (1956)

· విప్రనారాయణ (1954)

నర్తనశాలలో విరాట రాజుభార్య సుధేష్ణ గా సంధ్య గొప్ప నటన ప్రదర్శించారు .విప్రనారాయణ లో దేవదేవి అక్కగా సమర్ధ వంతంగా నటించారు .తెనాలి రామకృష్ణ లో రాణీ పాత్ర లో మహా హుందాగా నటించారు .ప్రేమే దైవం లో గుమ్మడి శ్రీరంజని లతో ఆర్ నాగేంద్రరావు డైరెక్షన్ లో నటించారు .చెంచు లక్ష్మి లో చెంచు రాణిగా అంజలి తల్లిగా సహజంగా నటించారు .రంగారావు లక్ష్మీ రాజ్యం లతో కృష్ణలీలలు లో జంపన డైరెక్షన్ లోనూ ,భీం సింగ్ దర్శకత్వం లో జెమిని గనేశన్ సావిత్రి లతో ,పి.పుల్లయ్య డైరెక్షన్ లో వెంకటేశ్వర మహాత్మ్యం లో సరస్వతీదేవిగా నటించారు ప్రత్యగాత్మ డైరెక్షన్ లో భార్యాభర్తలు సినిమాలో రమణారెడ్డి భార్య,కృష్ణకుమారి తల్లి కనకం గా సరదాగా నటించారు .ఆరూర్ పట్టాభి దర్శకత్వం లో శ్రీశైల మహాత్మ్యం లో రాజకుమార్ సరసన ,కులగోత్రాలలో ప్రత్యగాత్మ డైరెక్షన్ లోనూ నటించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -55,56 55,56-తాపీ తండ్రీ,తనయులు –ధర్మారావు ,చాణక్య గార్లు

5-హేతువాది,నాస్తికుడు, ఆంధ్ర విశారద విజయోల్లాస వ్యాఖ్యకర్త ,తాతాజీ -తాపీ ధర్మారావు

తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 – మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.[1]

జీవిత చరిత్ర[మార్చు]
ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.[1] ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో “బండి” లేదా “బండారు” కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో “తాపీ లక్ష్మయ్యగారు” అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.

జీవితంలో ముఖ్య ఘట్టాలు[2][మార్చు]
1887 – సెప్టెంబర్ 19 జననం – గంజాం జిల్లా, బరంపురం
1903 – మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం
1904 – మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత – విజయ నగరం
1904 – గురజాడను సుదూరంగా దర్శించడం
1904 – ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి

విశేషాలు[మార్చు]
· ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.

· ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.

· ‘మాలపిల్ల’ (1938) సినిమాకు కథ అందించినది- గుడిపాటి వెంకటచలం.

· తాపీని గౌరవంగా ‘తాతాజీ’ అని పిలిచేవారు.

రచనలు[మార్చు]

  1. ఆంధ్రులకొక మనవి
  2. దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
  3. పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
  4. ఇనుపకచ్చడాలు
  5. సాహిత్య మొర్మొరాలు
  6. రాలూ రప్పలూ
  7. మబ్బు తెరలు
  8. పాతపాళీ
  9. కొత్తపాళీ
  10. ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
  11. విజయవిలాసం వ్యాఖ్య
  12. అక్షరశారద ప్రశంస
  13. హృదయోల్లాసము
  14. భావప్రకాశిక
  15. నల్లిపై కారుణ్యము
  16. విలాసార్జునీయము
  17. ఘంటాన్యాయము
  18. అనా కెరినీనా
  19. ద్యోయానము
  20. భిక్షాపాత్రము
  21. ఆంధ్ర తేజము
  22. తప్తాశ్రుకణము

· శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,

  1. చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
  2. మరెన్నో సాహిత్య పురస్కారములు.

శ్రీ నాగసూరి వేణుగోపాల్ మాటలలో – ‘పత్రికలు వట్టి మాటల పోగులే కాదు, క్రియాకలాపానికి కూడా దారి తీయాలి. సంఘంలో ఒక కొత్త జీవనకళను కలిగించడంలో చేతనైన విధంగా పత్రికాముఖంగా పాటు పడాలి’’ ఇది తాపీ ధర్మారావు సంపాదకుడుగా ‘కాగడా’ వార పత్రికలో సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన విషయం! అది ఇప్పటికీ అర్థవంతమైనదే. తాపీ ధర్మారావును కొందరు జనవాణి, సమదర్శిని, కాగడా మొదలైన పత్రికల సంపాదకుడుగా గుర్తుంచుకుంటే–మరికొందరు ఎన్నో విజయవంతమైన తెలుగు చలనచిత్రాల స్క్రీన్‌ ప్లే, సంభాషణల రచయితగా స్మరించుకుంటారు. కొంతమంది కొత్తపాళీ, దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?, విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వంటి విభిన్నమైన రచనల కర్తగా ప్రస్తుతిస్తుండగా – ఇంకొంతమంది రచయితల సంఘాలకు వారు చేసిన సేవలను కొనియాడుతారు.

కానీ వారు చేసిన సేవ ప్రధానంగా ఏమిటో విద్వాన్‌ విశ్వం, ఆరుద్ర వంటివారు చాలా విస్పష్టంగా పేర్కొన్నారు. తెలుగు దినపత్రికల్లో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన సాహసిగా విద్వాన్‌ విశ్వం ‘మాణిక్యవీణ’లో ధర్మారావును శ్లాఘించారు. మన తెలుగు సినిమాల్లో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్ష అని ఆరుద్ర ‘వనిత’ మాసపత్రికలో తాపీవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విశదం చేశారు. 1887 సెప్టెంబరు 19న పుట్టిన తాపీ ధర్మారావు 1973 మే 8న కన్నుమూశారు. గిడుగు రామమూర్తి ఆయనకు పర్లాకిమిడిలో పాఠం చెప్పిన గురువు. ఆయన విజయనగరంలో చదువుకునే కాలంలో గురజాడ అప్పారావు ఉన్నారు.

ధర్మారావు ఆసక్తి చూపిన అంశాల జాబితాగానీ, తిరిగిన ఊళ్ళ సంఖ్య గానీ, చేసిన ఉద్యోగాల చిట్టాగానీ పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది! శ్రీకాకుళం, విజయనగరం, బరంపురం, పర్లాకిమిడి, చీకటి సంస్థానం, విశాఖపట్నం, మదరాసు, చుండి, ఊర్కాడు, దక్షిణ వల్లూరు, మందసా, చల్లపల్లి, విజ యవాడ – ఇలా చాలా ఊళ్ళలో ఆయన పనిచేశారు. ఉపాధ్యాయుడు, సర్వేయరు, సంరక్షకుడు, అంతరంగిక కార్యదర్శి, మేనేజర్, రిక్రూటింగ్‌ ఆఫీసర్‌ – ఇలా ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఈ ఉద్యోగాల సమయంలో వేట, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం, ఫొటోగ్రఫీ, టెన్నిస్‌ వంటివి నేర్చుకున్నారు. కుస్తీలు, నాటకాలు, మ్యూజిక్‌ గురించి చెప్పనక్కరలేదు. కనుకనే వారికి జీవితమంటే ఏమిటో తెలుసు. జనం భాష ఏమిటో బాగా తెలుసు!

గూడవల్లి రామబ్రహ్మంగారి తోడ్పాటుతో దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు– అనే శీర్షికతో వ్యాసాలు రాశారు. అంతేకాదు ఆయనతో కలసి ‘మాలపిల్ల’తో చలనచిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగు చలనచిత్రాల తొలిదశలో ప్రవేశించిన ధర్మారావు ఒకవైపు సంభాషణలలో వ్యావహారిక భాషను, మరోవైపు హేతుబద్ధతను రంగరించారు. అప్పట్లో తెలుగు సినిమారంగంలో స్క్రీన్‌ ప్లే పరంగా ‘తాపీ స్కూలు’ అని ప్రత్యేకంగా పిలిచేవారట. పత్రికలలో అగ్రస్థానంలో ఉంటూనే సినిమాల్లో పనిచేశారు. ఏక కాలంలో మేధావుల, పండితుల వేదిక అయిన పత్రికారంగంలోనూ; పామరుల, సామాన్యుల రంజకమైన సినిమాల్లోనూ రాణించడం చిన్న విషయం కానేకాదు. వారికి ఆ మాధ్యమాల మర్మాలే కాదు, వాటి ప్రభావాలు కూడా బాగా తెలిసి వుండాలి!

ధర్మారావు సంభాషణలు రాసిన ప్రతి సినిమా శతదినోత్సవం జరుపుకుంది. వారి దగ్గర ఉపసంపాదకులుగా పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పి. శ్రీరాములు మొదలైన వారు తర్వాతి కాలంలో ప్రముఖ సంపాదకులుగా రాణిం చారు. తాపీ ధర్మారావు సంపాదకుల సంపాదకుడు, ఆయనను చూసి నేర్చుకున్నానని నార్ల వెంకటేశ్వరరావు పేర్కొనడం గమనించాలి. తన పత్రికాభాషకు స్ఫూర్తి వేమన అని ప్రకటించిన ప్రజాస్వామిక స్ఫూర్తిమూర్తి తాపీ ధర్మారావు.

-డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌

పెదవి దాటితే పృథివి దాటుతుందన్న సమయం. అ సంయమమూ ఎప్పు డయినా సడలు తుందేమోనన్నట్లు తరుచు చుట్ట బిగింపు; ముక్తసరిగా నూత పాయ మయిన మాట తీరు, న్యాయంకోనం ఎంతటి వారినయినా ఎదిరించగల దిట్టతనం:
తమ భావాలను ఎదుటివారికి సౌమ్యంగానయినా కచ్చితంగా చెప్పే కరకుతనం; మత భేదం కలిగినపుడు కుమారుణ్ణేకాదు, మరొకరినయనా సహించగల జౌదార్యం, తెలి యని ఏ చిన్న విషయమయినా ఏ చిన్నవాడు తెలిపినా స్వీకరించే సరనత. పరస్పరం పోటిలుపడి జీవితం నడివిన జిజ్ఞాసాపర్మిశమలు; తప్పని తెలిసిన తరువాత
చప్పున సవరించుకొని ముందడుగు వేసే గుండెనిబ్బరం; శతృత?౦తో నమీపించిన వారినెనా

మితులనుగా మార్చే సరళతర్యప్రవర్తన; కీర్రికోసం కాని, కాంచనం కోసంకాని,
కక్కు_ర్రిపడని వుదాత్తత; పాండిత్య పకర్ష కోసం కాక పరికోధితాంశాలు పదిమందికి. తెలియజేయడాని కే చేపట్టిన రచనాదీక్షః గడ్డంతోపా టే అందంగా పెరిగిన ఆంత రంగం; తాళ్సార మేమోనన్నంతగా ఒకొకప్పుడు తలపీ ంపజీసే తాపీఠనం – ఈధర్మా
లన్నీ సమపాళాలుగా పోతపోసినవ్య క్రిత్వం (శ్రీ తాపీ ధర్మారావుగారిడి అంటే పలు
రంగాలలో పాతకొ త్తలకు పసిడి వంతెనవంటి.. వారిని గురించి శాఖాచం దనాాయంగా చెప్పినట్టవుతుంది.
తావీవారి నాయనగారు నరసింగరావుగారు. పెద్ద గవర్నమెంటు డాక్టరు.
అప్పన్నగారు – అన్నగారు యిద్దరూ డాక్టర్లే, నాయనగారు బరంప్ప రానికి బదిలీ
అయినపుడు 1887లో తాపీవారు “జన్మించారు. వారి చిన్ననాటి చదువు సాములు
గ్రీకాకుళ ౦లో సాగాయి. వారు విజయవాడలో మె[టిక్క్యులేషన్‌ చదివి, పర్దాకిమి కలో
ఎప్‌. ఏ. పూర్తిచేసి, మదాను పచ్చయప్ప కళాశాలలో పట్టథదులయారు.
తాపీవారికి పసితనంనుంచే తెలుగు సాహిత్యమన్నా విషయ జిజ్ఞాస అన్నా
ఆసక్తీ, అభిరుచీ వుండేవి. కాని, నాయనగారు షు పూర్తిగాదొర. పద్యాలు “అల్లితే పడ
తిట్టేవారు. తెలుగు చదివితే తినేవారు; కనుక తాపీవారు నాయనగారు మేడమీదకు వెళ్ళే
వరకూ ఏ ఇంగ్రీషు పుస్తకమో చదువుతున్నట్లు నటించి తర్వాత పద్యాలు [వానుకునేవారు.
నాయన్‌గారి [కమశిక్షణకూడా కరుకై నదే. తమ పిల్లలు ఇంగ్రీషుబాగా చదివి,
గొప్పవాళ్ళయి, పెద్దకే పెద్ద సర్కారు ఉద్యోగాలు వెలిగించాలని వారి ఆశయం. తాపీ
వారు చిన్న ప్పుడు ఒకనాడు తాంబూలం నములుతుండడం శాయనగారు చూచారు.
“కాంబూలం వేసుకుంటే చదుకృరాదు” ఆని శాసించారు. తాపీవారు తమ్ములం మర
ప్పుడూ తాకనై నా తాకలేదు. కాని చుట్టమా[త్రం అనుంగుచుట్టం వలె అర్థశతాబ్ది వారిని
వెన్నాడింది. తం డ్రికొడుకుల ఒడ్డూ పొడుగూ ఒకటే ఆందువల్ణి పొరపాటున
ఒకరి దుస్తులు మరొకరు ధరించడం సంభ వించేది. నాయనగారు కోటుజేబులో సైత
స్కోపుకోసం తముడుకుంటే, చుట్టముక్కలు తగిలే వేళకు కొంచెం తికమక పడేవారు.
ఏమంటారు తమంతటి క మారుణ్ణి |
తాపీవారు తలచుకునే వుంటే వారి యోగ్యతనుబట్టీ నాయనగారి పలుకుబడిని
బట్టీ, గొప్ప సర్కారు ఉద్యోగమే దొరికేది. కాని వారికది యిష్టంలేదు ఒక్కదాసికి
ఆంటి పెట్టుకుని వుండడంకూడా ఆ స్వేచ్బాచారులకు, సాహితీ, పియలకు గిట్టలేదు
ఉన్నంతలో ఉపాధ్యాయవృ శే వుత్తమమని బరంపురంలో కళ్ళికోటరాజా కళాశాలలో
లెక్కల మేష్టారుగా చేళారు. అప్పుడే (19010—11) కొందరు మితు3 ఇతో కలిసి
వేగుజుక్క- ‘గంథమాల స్థాపించారు. విజ్ఞాన నచం|డికా (గంథమాఐ. ఆం|ధ భాషాభి
వర్ధిసీ సభ తాకని విషయాలపై (గంధాలు (పచురించడం యీ (గ్రంథమాల లక్షం.
తదనుగుణంగానే తెనుగులో మొట్టమొదటి ఆంధ వాజ్మయచరి తను “తెలుంగనెడు
కాంత” సీీయచరి|త రూపంలో “* “ ఉషఃకాలము” అనే పేరుతో ప్రకటించారు. మొదటి

నిరూపక నవల “వాడే వీడు మొదటి థావపరిణామనవల “ కొవ్వురాళ్ళు”, మొదటి
ఆంధ చార్మితక నాటకం “_పేమముూ” మొదలయిన [గంథాలు వెలువరించారు. వారి
కార్య వ్య|గతకు (ప్రోత్సాహకరంగా మొట్టమొదటి ఊగాది సంచికలో (1911 లో)
“అంధుల కొక మనవి” అన్న వ్యాసం [పచురితమయింది. అదే వారి తొలి వచన
రచన. సమకాలంలోనే ఆంధప(తికలో (అప్పుడది బొంబాయినుంచి వెలువడుతున్న
వారప్మతిక )
“నల్రిరొ నిన్ను జేకౌని ఘనంబగు నా తపమందువై చి, నీ
వల్దలనాడుచుండ, దరవాసము జేయుచు జూచుచుండు నీ
కల్పిరి వాని దూరవు; ముఖంబున గోపము జూప; వెంతయో
చల్చగనోర్చి; తౌర ! ఘనసౌఖ్యము నాకమునందు గాంచ వే”
అంటూ “నల్లిపె పె కారుణ్యము” అన్న శీర్షికతో ఎలిజీ ([వాళారు. అవే వారి అచ్చయిన
మొట్టమొదటి పద్యాలు, ఆంగ్లంలోని అనేక వాజ్మయకాఖలను అనుసరించి, మన రచ
నలను కొత్త పుంతలకు తిప్పాలని రకరకాల రచనలు జేశారు.
ఇంతలో నాయనగారు కాలధర్మం చెందడం వల్ల వారు విశాఖపట్టణం తిరిగి
రావలనీ నచ్చింది అప్పుడు: “కొండెగాడు” అనే కానీ ప్మతిక పెట్టి—
“ప త్రార్థేన [ప్రవక్ష్యామి యదు క్తం [గంధ కోటిభిః”
అనే హెడింగ్‌తో పిటి. శ్రీనివాసయ్యంగారు మొదలయిన పెద్దల రచనలను ఘాటుగా
విమర్శించారు. సెట్టి నరసింహంగారి వసంత సేనకూడా ఈ కొండెగాని క థినవిమర్శను
తప్పించుకోలేదు. ‘దానితో వారి [పసిద్ధి విస్తరించి, కలెక్టర్‌ వెర్నాన్‌ దృష్టిలో
పడింది. మైనర్‌ జమీందార్హకోనం కోర్టాఫ్‌. వార్డ్‌ మదానులో పెట్టిన న్యూయింగ్లన్‌
కాలేజీలో ‘ట్యూటర్‌- గార్డియన్‌ పదవికి వెర్నాన్‌ తాపీవారిని సిఫార్సుజేశారు. న.
1018 నుంచీ పదహారు సంవత్సరాలపాటు ఊర్కాడు, చుండి, సౌత్‌వల్లూరు, మందసా
మైనరు జమీందారులకు ఉపాధ్యాయులుగా వుంటూ వారివెంట దక్షిణ భారతమంతా
తిరిగారు. వారికి ఆప్తులుగా నిజమయిన సంరక్షకులుగా వుంటూ వారి హృదయాలను
చూరగొని, వారిని కమశితణలో పెట్టారు. ఒక జమీందారు కుమారుడు న్యాయం
కాలేజీ (పిస్పిపాలును కోపంతో “తుపాకీతో కాల్చి చంపాడు, కాని, తాపీవారు
మ్మాతం ఎప్పుడూ ఆచార్య గొర వాన్ని కోల్పోలేదు.
అటు తర్వాత వారు విజయనగరంలో సంవత్సరంపాటు ట్యుటోరియల్‌ కాలేజి
నడిపారు. అలా ఉంటూనే బొబ్బిలి దివాన్‌ గిరి (హెడ్‌ మేనేజరీ) చేశారు, అప్పుడే
జస్టిన్‌ పార్టీ పతిక ‘ సమదర్శిని’ సంపాదకులయ్యారు. సక బాం ముమ్మరం కావ
డంవల్ల సమదర్శినిని దినప తిక చేయడం, చెన్నపురిలో వాసం అవసరమయ్యాయి.
పతిక జస్టిస్‌ పౌర్టీదయినా, భావాలు జాతీయాలు. కనుక ఆ పిక తాపీ వారి వయా
ములో ఎంతో ప్రజా సేవచేసింది. వారు ఒక్కరూ వా ర్రలు(వాసి వేళ్ల కాయలుకాచేవట.

ఆ రోజులలోనే భాషా విషయంలో వారీ మతం మారింది. వారు మొదట్లో వీర గాంధికవాదులు; గిడుగువారికి పర్పాకిమిడిలో |పియశిమ్యలయినా వ్యావవిరిక భాషా
వాదంలో వారిని ఎదిరించినవారు; 1907 లో వ్రాసిన “విలాసార్దునొ నాఓకంలో గుర జాడ వారిని దుయ్యబట్టిన వారుకూడ. మతం మారడంతో ‘కొ త్రపాశీ’ “పేరుతో (ప్రజా
మిితలో ధారావాహికంగా భాషావిషయిక వ్యాసాలు వాళారు.
ఇంతలో దేశంలో ఎన్నికల సంరంభం బయలుదేరింది (1986). పిఠాపురం రాజావారు తమ పార్టీకోసం ఆంగ్ల తమిళ తెలుగులలో మూడు పృత్రికలు.. పెట్టారు. వాటిలో తెనుగు ష,తీక ‘జనవాణికి తాపీ వారు సంపాదకులు. ఇప్పుడు పేరు మోనిన
పతికా రచయితలలో చాలమంది వారివద్ద శిక్షణ పౌందినవారే. జనవాణి మూడేళ్ళ
పాటు నడిచింది. తర్వాత వారు స్వతం| తంగా కాగడా” వార పతిక కొన్నాళ్ళపాటు
నడిపి, మ!దానుపై బాంబులు పడగానే, పత్రిక ఆవి, చల్లపల్లికి వెళ్ళి మూడేళ్లపాటు
యుద్ధంకోసం అసిస్టెంట్‌ పబ్టిసిటీ- రె కూటింగ్‌ ఆఫీసరుగా పనిచేశారు, 1986 నుంచే
సారంగధర చితంతో వారికి సినిమాతో కలిగిన సంబంధం 46-47 అలో పూర్తిగా
జీవనాధార మయింది. అప్పటినుంచి ఇంతవరకు దాదావు 50 చిత్రాలకు సంభాషణలు
మొదలయినవి |వాశారు, 49 నుంచి ఐదేళ్ళపాటు “జనవాణి ఆనే వారప(తిక నడిపారు.
తర్వాత నేటి వరకు తమ పాత రచనలను పునర్ము|దించడంలో నిమగ్నులయి
ఉన్నారు.
చుండి జమీందారుకు సంరక్షకులుగా ఉన్నప్పుడు వారికి నెల్లూరు ఉనికిపట్టు.
అప్పటి నెల్లూరును గురించి చెప్పనక్కరలేదు-అదొక సకల కళాకేంద్రం. అక్కడ
మహావిద్వాంసులు వేదం వేంకటాచలయ్య (న్యాయవాది) గారితో తాపీ వారికి పరిచయ
మయింది. “వారి [ప్రభావం నాపై ఎంతో |పసరించింది. వారు నాతో తప్ప ఎవ్వరి
తోనూ మాట్లాడే వారుకారు, వారి పుస్తకాలు నాకు తప్ప ఎవరికీ ఎరవిచ్చేవారుకారు.
అప్పుడే నేను మిథిక్‌ సొసైటీ నభ్యుడు, లిటరరీ సొసైటీ సభ్యుడు కావడం. పెళ్ళి
పుట్టు పూర్వాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు మొదలయిన విషయాలు పిళో
ధించాను.” అని పాతవిషయాలు చెబుతున్నప్పుడు తాపీ వారి సంయమం సడలిన క్లే
కనిపిస్తుంది.
14వ ఏటే వారు విజయవిలాసం చదివారు. నెల్హారిలో మితులతో
బిలియర్స్‌స్‌ ఆకుకుంటూ, పద్యాలు చెప్పుకుంటూ విశోద కాలక్షేపం చేసుకోనే
టప్పుడు ఓక మిత్రుడు విజయవిలాసంలోని పద్యం . చదివి అవివట్టంఅంటే ఏమి
టన్నారు. వేదం వెంకటరాయశా న్ర్రీగారి వ్యాఖ్యానం చూడగా, వారికి సంకృ స్తీ కలుగ
లేదు. అలాగే గుట్టగియాడవంటి పద్యాల వ్యాఖ్యా వారికి నచ్చలేదు. [పతి పదంలోను
జాతి, వార్త, చమత్కారం గుప్పించాంని [ప్రతిజ్ఞ చేసిన వేంకటకవి హృదయం ‘ఇంకొ
బాగా తెలుపాలనే సత్మంకల్నంతో విజయవిలాస వా౭భఖి? |పారంభించారు. ఒక పతి

ఊర్కాడు సంస్థానంలో ఉన్నప్పుడు శృంగేరీ పీఠాధిపతులు తాపీ వారిని
“ఆం(ధ విళారదా $” అని సంబోధించి, చకార రలత్‌ సన్మానించారు. అప్పుడు
తాషీవారు చెప్పిన “అక్షరకారదా ప్రశంస” అన్న కవిత మనలిపి పుట్టుపూర్వాల
[పామాణిక మైన చరిత సం్యగహమే.
తాపీవారు ఆగర్భ శ్రీమంతులు; నూనూగు మీసాల కాలంనుంచి సంస్థానాధీ శులతోనే మెలగి, సకల భోగాలూ అనుభవించి, వివిధ మానవ (సవృత్తులూ తరచిన
వారు. ఆడంబరాలన్నా, ఆర్భాటాలన్నా వారికి గిట్టవు కనుకనే “రావు బహదూర్‌”
బీరుదం నిరాకరించారు. చిన్నప్పుడు గోల్స్‌, చదరంగం మొదలయిన ఆటలు ఆడే
వారు. గురపు స్వారీలో నిపుణులు, వారి ఇరువురు కుమారులు శ్రీ మోహనరావు,
(ఫ్రీ చాణక్య తండికి కీర్తి తెచ్చేవారే.
తాపీవారు ప్రస్తుతం వె హేదరాబాదులో శ్రీ చాణక్యవద్ద ఉన్నారు. పాత రచనల
పునర్ముదణ చూచుకోడం, సాహిత్య అకాడెమీ పనులు చేయడం వారి నేటి దినచర్య.
వారు తమ దృష్టినంతా నేడు విజయవిలాస వ్యాఖ్యాన ప్రచురణలో కేంద్రీకరించి
ఉన్నారు. దేవాలయాలమీద బూత బొమ్మలెందుకన్న రచన రెండవ ము[దణం పెక్కు
ఫోట్రోలతోను, విదేశాల మ్యూజియంలలోని చితాలతోను ఉదాత్త పరిశోధక [ప్రచు
రణగా సుర్రు యత్నిస్తున్నారు.
తాపీ వారిది తాబేటి నడక అని ఈ తరం ఆ(తగాష్ట అనుకోవచ్చు. ఆ గుణమే
వారి పాత కొ త్త పాశ్టీలనుంచి సంఖ్యాతీతంగా వివిధ రచనలను వర్షింపజేసింది. వివిధ రంగాలలో భీమ్మలుగా దర్శనమిన్తూ, పాత కొత్తలకు పూవుల వంతెనగా కానవన్తూన్న
తాపీవారు వేదోకాయువుతో తమ రచనలన్నింటినీ సంపుటాలుగా ముదించి తమ
ధర్మాన్ని నిర్వర్తి ‘ర్రింపజేస్తారు. సందేహంలేదు.

తన మనస్సుకు నచ్చకపోతే ఉద్యోగాన్నీ కూడా వదిలి పెట్టేసేవారు సంపన్న గృహం లో పుట్టినా అందుకే ఆటుపోటులు ఎదుర్కొన్నారు .కళ్ళికోట రాజా కాలేజిలో లెక్కల మేష్టారుగా పని చేశారు .1910లో బరంపురం లో మిత్రులతోకలిసి ‘’వేగుచుక్క ‘’గ్రంధ మాల స్థాపించి ‘’తెలుమ్గానేది కాంత ‘’,ఉషః కాలం మొదలైనపుస్తాకాలు ప్రచురించారు .పత్రికా నిర్వహణలో కడు సమర్ధులు కొండెగాడు ,సమదర్శిని ,జనవాణి ,కాగడ పత్రికలూ ఆయన సమర్ధతకు నిదర్శనాలు .అవి రాజకీయాలను విమర్శించటమే కాక ,జాతీయతను పెంపొందించాయి .అడుగు జాలని వాడు ,పోతనకవిత్వ పటుత్వం వంటి గొప్ప వ్యాసాలూ రాశారు దేవాలయాలపై బూతుబోమ్మలు తో గొప్ప ప్రచారం లభించింది .ఇనుప కచ్చడాలు నేపాల చోలగా శబ్దాలు మొదలైన పరిశోధన వ్యాసాలూ రాశారు .నెల్లూరు లో ఉన్నకాలం లో మిధిక్సొసైటీ ,లిటరరీ సొసైటీ సభ్యులుగా ఉన్నారు .చేమకూర వేంకటకవి రచించిన ‘’విజయ విలాస కావ్యం ‘’లోని ప్రతి పద్య చమత్కృతి ,జాతి వార్తా చమత్కారాలు ఆవిష్కరిస్తూ ఆయన రాసిన ‘’విజయోల్లాస వ్యాఖ్య ‘’రసజ్ఞులకు జుంటి తేనే .పండితుడు అనే గౌరవం పొందారు .ముక్కు తిమ్మన పారిఆతాపహరణం కావ్యానికి ‘’భావ ప్రకాశిక ‘’వ్యాఖ్యానం కూడా రాశారు

ఈయన యుద్ధకాలం లో ‘’అసిస్టెంట్ పబ్లిసిటి –రిక్రూట్ మెంట్ ఆఫీసర్ గా ‘’పని చేశారు

1936లో సినీ రంగ ప్రవేశం చేసి నాలుగు దశాబ్దాలు మాటలు,పాటలు రాశారు .ముద్దుబిడ్డ సినిమాలో వీరిపమాటలు ,ఆరుద్ర పాటలు చిరస్మరణీయాలు .కొడుకే డైరెక్టర్ .

సినిమా జీవితం

· మాలపిల్ల (1938)

· రైతుబిడ్డ (1939)

· కృష్ణప్రేమ (1943)

· ద్రోహి (1948)

· కీలుగుర్రం (1949)

· పల్లెటూరి పిల్ల (1950)

· కన్నతల్లి (1953)

· రోజులు మారాయి (1955)

· 56-త్రిభాషా చిత్ర దర్శకుడు,ఆర్మీటేలీగ్రాఫిస్ట్ , రోజులుమారాయ్ మూవీ ఫేం –తాపీ చాణక్య

· తాపీ చాణక్య చలనచిత్ర దర్శకుడు. తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు అయిన తాపీ ధర్మారావు నాయుడు ఇతని తండ్రి. తల్లి అన్నపూర్ణమ్మ. 1925లో విజయనగరంలో జన్మించారు. సినిమారంగంలో ప్రవేశించడానికి ముందు భారత సైన్యంలో రేడియో టెలిగ్రాఫిస్టుగా పనిచేశారు. పల్లెటూరి పిల్ల చిత్రంలో బి.ఎ.సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేశాడరు. రోజులు మారాయి చిత్రానికి దర్శకత్వంతో పాటు కథను కూడా అందించారు తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

సినిమాల జాబితా
తెలుగు

  1. అంతా మనవాళ్లే (1954)
  2. రోజులు మారాయి (1955)
  3. పెద్దరికాలు (1957)
  4. ఎత్తుకు పైఎత్తు (1958)
  5. భాగ్యదేవత (1959)
  6. కుంకుమ రేఖ (1960)
  7. జల్సారాయుడు (1960)
  8. కలసి ఉంటే కలదు సుఖం (1961)
  9. కానిస్టేబులు కూతురు (1963)
  10. రాముడు భీముడు (1964)
  11. వారసత్వం (1964)
  12. సి.ఐ.డి. (1965)
  13. అడుగు జాడలు (1966)
  14. విధివిలాసం (1970)
  15. బంగారుతల్లి (1971)
  16. బందిపోటు భయంకర్ (1972)

తమిళం

  1. పుదియ పతై (1960)
  2. ఎంగ వీటు పెన్ (1965)
  3. నాన్ అనైట్టల్ (1966)
  4. ఒలి విళక్కు (1968)
  5. పుదియ భూమి (1968)

హిందీ

  1. రామ్‌ ఔర్ శ్యామ్‌ (1967)
  2. మాధవి (1969)
  3. బిఖరే మోతి (1971)
  4. మన్ మందిర్ (1971)
  5. జాన్‌వర్ ఔర్ ఇన్‌సాన్ (1972)
  6. మానవతా (1972)
  7. సుబహ్ ఓ షామ్‌ (1972)
  8. గంగ మంగ (1973)

మరణం
హానక్య తన 48వ యేట 1973, జూలై 14న మరణించారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు[1].

.1954లో అంతామనవాళ్ళే ,1955లో సూపర్ డూపర్ హిట్ రోజులుమారాయి 1967పెద్దరికాలు సినిమా కు దర్శకత్వం వహించారు .మాటలు నార్ల చిరంజీవి సంగీతం మాష్టర్ వేణు .పాటలు ధర్మారావు కొసరాజు గార్లు .కుంకుమ రేఖ సెంటిమెంటల్ సినిమా అద్భుతంగా చిత్రీకరించారు .1964లో సురేష్ వారి రాముడు భీముడు సినిమా ను కూడా సప్పర డూపర్ హిట్ చేసిన దర్శకుడు .రామారావు ద్విపాత్రాభినయం ,పెండ్యాల సంగీతం ,శ్రీశ్రీ నారాయణ రెడ్డి కొసరాజు గార్లపాటలు ,నాగార్జున సాగర్ షూటింగ్ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి –‘’ఉందిలే మంచికాలం ముందు ముందునా’’,దేశమ్ము మారిందోయ్కాలమ్ము మారిందోయ్ తెలిసిందిలే తెలిసిందిలే ,నవ్వుపాట సరదా సరదా సిగరెట్టూ పాటలు ఇంకా చెవులలో హోరు పెడుతూనే ఉన్నాయి ,హిందీ సినిమా రాం ఔర్ శ్యాం కూడా గొప్ప విజయమే పొందింది చాణక్య దర్శకత్వం లో .తండ్రి సాహిత్యం లో కుమారుడు సినీ దర్శకత్వం లో గొప్ప పేరు పొందారు .వర్దీ సం ఆఫ్ ఎ వర్దీ ఫాదర్ చాణక్య .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5454-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -54
54-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ

బొల్లిముంత శివరామకృష్ణ (నవంబరు 27, 1920 – జూన్ 7, 2005) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత.. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. మనుషులు మారాలి ఆమె ఎవరు సినిమాల సంభాషణకర్త ఆయనే.కళ్యాణ మంటపం సినిమాలో అయన సంభాషణలు టపాసుల్లా పేలాయి గొప్ప పేరు తెచ్చాయి .

జీవిత విశేషాలు
గుంటూరు జిల్లా చదలవాడలో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్ లతో పరిచయం కలిగింది. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. అందుకు కారణం వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం తోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ సంబంధాల ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడ్డాయి. ఈలోగా గోపీచంద్‌ కథలు రాసి పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొడ్డు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు.

రచయితగా
1945లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి చల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల మృత్యుంజయులు రాశారు. నగారా అనే పత్రిక నడిపారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘పిల్లి’ అనే కథపై కొడవటిగంటి తిరోగమన యాత్ర అంటూ విమర్శ రాశారు. బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. ‘రైతుబిడ్డ’ హరికథ రాశారు. సూక్ష్మంలో మోక్షం, అంతరాత్మ అంత్యక్రియలు, శివరామకృష్ణ కథలు బొల్లిముంతవే. ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ… ఇలా ఎన్నో నాటికలు రాశారు. రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం వంటి పద్యనాటకాలు రాశారు. దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం… వంటి రేడియో నాటికలు రాశారు. నేటి భారతం పేరుతో మూకీ నాటిక రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్‌తో కలసి అందరూ బతకాలి నాటకం రాశారు. దీన్ని రక్తకన్నీరు నాగభూషణం వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.

1955 మధ్యంతరం ఎన్నికల్లో రెండు పర్యాయాలు బొల్లిముంతపై హత్యాప్రయత్నం జరిగింది. 1960లో మనసుకవి ఆత్రేయ దగ్గర చేరారు. వాగ్దానం, కలసివుంటే కలదుసుఖం, కలిమిలేములు వంటి అనేక చిత్రాలకు ఆరుద్రకు సహరచయితగా సహకరించారు. బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో అధిక భాగం ఆయన రాసినవే. 1968లో విశాలాంధ్ర ప్రారంభించిన ప్రతిభ వారపత్రికకి సంపాదకుడయ్యారు. దర్శకుడు వి.మధుసూదనరావు చిత్రాలకు ఎన్నిటికో సంభాషణలు రాశారు. ఆయన రాసిన దాదాపు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, ప్రజా నాయకుడు వంటి సీరియస్ సినిమాలేకాక శారద, కళ్యాణమంటపం, మూగకు మాటొస్తే, విచిత్రబంధం వంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి. నాటకాల్లో హార్మోనియం వాయించారు. స్త్రీ పాత్రలు ధరించారు.

ఉద్యమాలలో]
1938-39 సంవత్సరంలో గుంటూరులో హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థిఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన ‘దేశం ఏమయ్యేట్టు?’, ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచురించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని కథలుగా మలచడం తప్ప, పనికట్టుకుని కథలు రాయాలని రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతర నిరుపేదలపై దృష్టి సారించి, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ రాశేవారు. ఆ రోజుల్లో చదలవాడ పిచ్చయ్య చౌదరి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నాయకుడు. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణ శాస్ర్తి లాంటి వారందరినీ కలుపుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకు వెడుతూ ఉండేవారు. 1943 లో తెనాలిలో అరసం తొలి మహాసభ జరపడంలో చదలవాడ పిచ్చయ్య చౌదరి కృషి ఎంతో ఉంది. ఆ సభకు అధ్యక్షులు తాపీ ధర్మారావు. బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికి ఇరవై మూడేళ్ళ యువకుడు. ఆ మహాసభకు కార్యకర్తగా పనిచేశారు. అప్పటిదాకా అరసంతో సంబంధాలు లేకపోవడం వల్ల, అరసం నిర్వహణలో వెలువడే ‘తెలుగు తల్లి’ పత్రికలో బొల్లిముంత కథలు అచ్చు కాలేదు.

మృత్యుంజయులు[మార్చు]
బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్య పేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల హనుమంతు, తిరునగరి రామాంజనేయులు, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ అక్షరాయుధాలతో ముందు నిలిచారు.

తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబరు 25న విడుదల చేశారు. ఒక రకంగా కవుల కంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, మహీధర రామ్మోహనరావు ‘ఓనమాలు’, మృత్యు నీడల్లో’, తిరునగరి ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహ గర్జన’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కానీ నాటి తెలంగాణలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పడించాల్సి వచ్చేది. అంతటి దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది మృత్యుంజయులు నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని దిన దిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్య పాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి.అంటే వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించినవారు, మృత్యుంజయులు అని అర్ధం. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజా పోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులు నవలకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరు సార్లు తిరగరాయించారట! రావి నారాయణ రెడ్డి ఈ నవలకు ముందు మాట రాశారు.

సినీ రచయితగా
1960లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడుగా మద్రాసు వెళ్ళారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలో పెద్ద హిట్టయ్యింది. దాంతో బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సి వచ్చింది. సుమారు నలభై ఐదు సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.

సినిమా రచయితగా[మార్చు]
· ఖైదీ బాబాయ్ (1973) (మాటల రచయిత)

· కాలం మారింది (మాటల రచయిత)

· శ్రీదేవి (1970) (మాటల రచయిత)

· తిరుపతమ్మ కథ (1963) (మాటల రచయిత)

· వాగ్దానం (1961) (స్క్రీన్ ప్లే)

· ఆయన జూన్ 7, 2005 న మరణించారు.ఆ మరుసటి నెలే జూలై 2005 సంచికను ‘ప్రజాసాహితి’ బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది.

· ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖీనమైన ప్రతిభను కనరపరచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.

పురస్కారాల
· 1988లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నారు1

· తెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమం తొలిదశలో ఉన్నప్పుడే బొల్లిముంత శివరామకృష్ణ (1920-2005) సాహిత్య సృజన ప్రారంభించారు. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకు కారణం, వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంతోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడింది. త్రిపురనేని రామస్వామి చౌదరి పద్యకవిత్వం రాస్తూ ఉండేవారు. అయితే పత్రికలకు పంపేవారు కాదు. బొల్లిముంత, గోపీచంద్‌, పి.వి.సుబ్బారావు లాంటి కుర్రాళ్లంతా ఆయనకు శిష్యులైపోయి ఆయనలాగా పద్య కవిత్వం రాయాలని ఉబలాటపడేవాళ్లు. వీళ్ల కవిత్వాన్ని ఆయన సరిచేసి సూచనలిస్తూ ఉండేవారు. ఈలోగా గోపీచంద్‌ తన తండ్రి గారి పద్య కవిత్వాన్ని పక్కన పెట్టి వచనంలోకి మారారు. కథలు రాసిన పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుంచి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొద్దు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారేళ్లు!
ఉద్యమాలతో మమేకం
కథలు రాసి ప్రచురించడం ప్రారంభించిన తర్వాత కొన్నేళ్ల వరకు ఆయనకు అభ్యుదయ రచయితల సంఘంతో సంబంధాలు ఏర్పడలేదు. 1938-39లో గుంటూరులో హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ విద్యార్థి ఉద్యమంతో, ఆ తర్వాత చదలవాడలో ఉద్యోగంలో చేరినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన ‘దేశం ఏమయ్యేట్టు?’, ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచురించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని కథలుగా మలచడం తప్ప, పనికట్టుకుని కథలు రాయాలని రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతర నిరుపేదలపై దృష్టి సారించి, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ రాసేవారు. ఆ రోజుల్లో చదలవాడ పిచ్చయ్య చౌదరి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నాయకుడు. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణశాస్త్రి లాంటి వారందర్ని కలుపుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. 1943లో తెనాలిలో అరసం తొలి మహాసభ జరపడంలో పిచ్చయ్య చౌదరి కృషి ఎంతో ఉంది. ఆ సభకు అధ్యక్షులు తాపీ ధర్మారావు. బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికి ఇరవై మూడేళ్ల యువకుడు. ఆ మహాసభకు కార్యకర్తగా పనిచేశారు.
మృత్యుంజయుడు నవల
అవి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతమైన రోజులు. బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనుల మీద తిరుగుతూ, మునగాల పరిగణాలోని జగ్గయ్యపేటకు వెళ్లిరావడం జరగుతూ ఉండేది. అక్కడే తెలంగాణా పోరాటం గురించి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన బొల్లిముంత ఇరవై ఏడేళ్ల వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధలై దోపిడి వర్గాలపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు, ఎంతోమంది భాగ స్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల, తిరునగిరి, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ ఆక్షరాయుధాలతో ముందు నిలిచారు. తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబర్‌ 25న విడుదల చేశారు. ఒక రకంగా కవులకంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టి కోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’; ‘మహీధర రామ్మోహనరావు’ ‘ఓనమాలు’, ‘మృత్యునీడల్లో’, ‘తిరునగిరి’ ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. అయితే అవన్నీ పోరాటం విరమించిన తర్వాత వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహగర్జన’.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కాని, నాటి తెలంగాణాలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పండించాల్సి వచ్చేది. ఆ దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది ‘మృత్యుంజయులు’ నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని, దినదిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్యపాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి. అంటే, వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించిన వారు, మృత్యుంజయులు అని అర్థం! తెలంగాణా పోరాటకాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజాపోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులుకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరుసార్లు తిరగరాయించారట! రావి నారాయణరెడ్డి ఈ నవలకు ముందుమాట రాశారు.
సినీ రచయితగా …
కమ్యూనిస్టు పార్టీ చీలిపోకముందే 1964లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడిగా మద్రాసు వెళ్లారు. మొదట్లో తమిళ సినిమాలకు అనువాదాలు చేస్తుండేవారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన, ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలతో పెద్ద హిట్టయ్యింది. దాంతో, బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సివచ్చింది. సుమారు 45 సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.
”రచనలు అభూత కల్పనల వైపుకాక, జీవిత వాస్తవాల వైపు సాగాలి. సమస్యలు చర్చించాలి. పరిష్కారాలను సూచించాలి. యువ రచయితలకి సరైన మార్గం నిర్దేశించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది.” అని తరచూ చెబుతూ ఉండేవారు బొల్లిముంత శివరామకృష్ణ. వారితో నా పరిచయం చాలా సాదాసీదాగా జరిగింది. అది 1993-97 మధ్య కాలం. ఓ రోజు ఓ కుర్రాడొచ్చి ”మా పెద్దనాన్న వస్తానన్నారు. ఇంట్లో ఉంటున్నారా?” అని అడిగాడు. ఎవరో సాహిత్యాభిమాని అయిఉంటాడనుకుని ‘సరే తీసుకురా… ఉంటా’నన్నాను. తీరా చూస్తే ఆయన సాహితీ దిగ్గజం బొల్లిముంత శివరామృష్ణ! అప్పటికే 70 ఏళ్ల పెద్దాయన. అభ్యుదయ నవలా రచయితగా, ‘మనుషులు మారాలి’ చిత్ర రచయితగా పెద్దపేరు సంపాదించుకున్నారాయన. అయనకు నాపై ఏర్పడిన వాత్సల్యపూరిత అభిమానానికి కృతజ్ఞతలతో వినమ్రంగా నమస్కరించి కూర్చోబెట్టాను. తీసుకొచ్చిన కుర్రాడి ఇంటిపేరు కూడా బొల్లిముంత అన్న విషయం మరిచిపోయాను. ఎందుకంటే, అతన్ని మా ఇంట్లో రమణ అని పిలుస్తుండేవాళ్లం. అతనే కవి బొల్లిముంత వెంకట రమణారావుగా రూపుదిద్దుకున్నాడు. అది ఆ తర్వాతి విషయం, శివరామకృష్ణ వాళ్లబ్బాయి హైద్రాబాదు విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేస్తుండే వాడు. అందువల్ల ఆయన తెనాలి నుంచి ఎప్పుడు కొడుకు దగ్గరకు హైద్రాబాదొచ్చినా మా ఇంటికి వస్తుండేవాడు. నేను దగ్గరలో ఉన్న దండమూడి మహీధర్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రేరియన్‌ రాజు, రేడియో చిరంజీవి మొదలైన వాళ్లకు కబురు పెడుతుండేవాడిని. ఓ సారి మా ఇంట్లో, మరోసారి సుందరయ్య పార్కులో కూర్చుని సాహిత్యం గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఒక్కోసారి ఆయనకు ఓపిక ఉందంటే చిక్కడపల్లి నుంచి అలా హిమాయత్‌ నగర్‌ దాకా వెళ్తుండేవాళ్లం. డా|| ఏటుకూరి ప్రసాదో, బూదరాజు రాధాకృష్ణో ఎవరో ఒకరు కలుస్తుండే వాళ్లు. మళ్లా ముచ్చట్లు.. గజ్జెల మల్లారెడ్డి కొంతకాలం చిక్కడపల్లిలో ఉన్నారు. అప్పుడు అదో మీటింగ్‌ ప్లేస్‌! తండ్రి వయసున్న పెద్దవాళ్లతో ఈయనకు ఈ స్నేహాలేమిటని నన్ను చూసి కొందరు ఆశ్చర్యపోతుండేవాళ్లు.సంపాదకత్వం
ఆ రోజుల్లోనే బొల్లిముంత ‘ప్రజాపక్షం’ అనే మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు అకాడెమీ పక్కన డా|| మిత్ర ఉండే వీధిలో పత్రిక ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. పత్రిక ప్రారంభోత్సవం త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ప్రారంభ సంచికలో తెలంగాణ ప్రజల భాషలో నేను ఒక కవిత రాశాను. అయితే పత్రిక కొన్ని నెలలు మాత్రమే నడిచింది. ఆ తరువాత ఆయన మళ్లీ తెనాలి వెళ్లిపోయారు. మేం మళ్లీ కలుసుకునే అవకాశం రాలేదు. ఆయన 7 జూన్‌ 2005న మరణించారని తెలుసుకుని బాధపడ్డాం. ఆ మరుసటి నెల జులై 2005 సంచికను ‘ప్రజాసాహితి’ బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది. ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖ ప్రతిభను కనబరిచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.

·

· రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో బొల్లిముంత శివరామకృష్ణయ్య నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం.

VDO.AI

‘మనిషి జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది సామాజిక అస్తిత్వం-సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది’ అన్న దృక్పథంతో రచనలు చేసిన అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య. ఉపాధ్యాయుడు, హార్మోనిస్టు, నటుడు, గాయకుడు, కవి, కథారచయిత, నవలాకారుడు, బుర్రకథా రచయిత, హరికథా రచయిత, జర్నలిస్టు, సినిమా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, రాజకీయ కార్యకర్త, ఉత్తమ కమ్యూనిస్టు బొల్లిముంత.

1920 నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం, చదలవాడలో శ్రీమతి మంగమ్మ-, శ్రీ అక్కయ్య దంపతులకు పుట్టిన శివరామకృష్ణయ్య ప్రాథమిక, మాధ్యమిక విద్య తమ స్వగ్రామంలో కొనసాగించి, గుంటూరులో హయ్యర్‌గ్రేడ్‌ శిక్షణ పూర్తి చేశారు. సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయంకృషితో నేర్చుకున్నారు. చదలవాడలో ఆయన తండ్రి నెలకొల్పిన పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేశారు. బొల్లిముంత 16వ ఏట రచించిన ‘ఏటొడ్డు’ కథ ‘చిత్రాంగి’ పత్రికలో అచ్చయ్యింది. అది ఆయన తొలిరచన. నూనూగు మీసాల నూత్న యవ్వనవేళ త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద భావజాలంతో ప్రభావితులయ్యారు. త్రిపురనేని గోపీచంద్‌తో ఏర్పడిన స్నేహం బొల్లిముంత జీవితాన్ని మలుపు తిప్పింది. తమ జీవిత లక్ష్యం నిర్ణయించుకోవలసిన దశలో మార్క్సిస్టు సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. తమ గ్రామస్థితిగతులు, రైతుల, వ్యవసాయకూలీల దుర్భర జీవితాలు పరిశీలించారు. వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయడం మొదలుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎక్కువగా మమేకమయ్యారు. చల్లపల్లి జమీందారుగా వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం హైదరాబాద్‌ సంస్థానంలో జరుగుతున్న రైతాంగ సాయుధ పోరాట ఉదంతాలను పత్రికలలో చదివి, స్పందించి 1947లోనే ‘మృత్యుంజయులు’ నవల రాశారు. తెలంగాణా విమోచనోద్యమ నవలల్లో ఇదే తొలి నవల. నిజాం నిరంకుశత్వానికీ, భూస్వాముల దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరులను మృత్యుంజయులుగా చిత్రించారు.
పోలీసుచర్య తరువాత నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టులపై క్రూర నిర్బంధకాండను అమలు జరిపిన కాలంలో అజ్ఞాతవాసంలో ఉంటూనే గుంటూరు నుంచి ‘నగారా’ పత్రికను నడిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం స్వదేశంలో కమ్యూనిస్టులపై దారుణమైన నిర్బంధకాండను, ఊచకోతను ప్రయోగిస్తూ, మరోవైపు విదేశీవ్యవహారాలలో సోషలిస్టు శిబిరంతో స్నేహసంబంధాల కోసం అర్రులు చాచే ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ బొల్లిముంత ‘మొదళ్ళు నరికి చివుళ్ళకు నీరు పోస్తానంటాడు పండిట్‌ నెహ్రూ’ అనే వ్యాసం రాశారు. రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో నిర్ద్వంద్వంగా ఖండించారు. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో తెనాలిలో జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభల నిర్వహణలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో భాగస్వామిగా ఉంటూనే, కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘పిల్లి’ కథను ‘నగారా’ పత్రికలో తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక రచనలు అచ్చవుతున్నాయని ఆ పత్రికను ప్రభుత్వం నిషేధించింది.
ప్రజలను చైతన్యపరచడానికి బొల్లిముంత శివరామకృష్ణయ్య అనేక సాహిత్య ప్రక్రియలనూ, ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు. బెంగాల్‌ కరువుపై బుర్రకథ రాశారు. రైతుల జీవన స్థితిగతులను వివరిస్తూ ‘రైతుబిడ్డ’ హరికథ రచించారు. బొల్లిముంత కథలు-‘సూక్ష్మంలో మోక్షం’, ‘అంతరాత్మ అంత్యక్రియలు’, ‘శివరామకృష్ణ కథలు’ సంపుటాలుగా వెలువడ్డాయి. 1940-50 దశకాల తెలుగు ప్రాంతాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను చిత్రిస్తూ ‘ఏ ఎండకాగొడుగు’, ‘పత్రికా న్యాయం’, ‘తెలంగాణా స్వతంత్ర ఘోష’, ‘క్విట్‌ కాశ్మీర్‌’, ‘ధర్మ సంస్థాపనార్థాయ’ మొదలైన నాటికలు రచించారు. ‘దొంగ దొరికింది’, ‘బలే మంచి చౌకబేరం’ రేడియో నాటికలు రాశారు. ‘నేటి భారతం’ పేరుతో మూకీ నాటికను రూపొందించారు.
‘ప్రజాశక్తి’ పత్రికలో శివరామకృష్ణ రచించిన ‘దేశం ఏం కావాలి’ కథ విశేష జనాదరణ సంపాదించింది. 1955 మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పరాజయంతో నిస్పృహ చెందిన బొల్లిముంత క్రమంగా ప్రజారంగాన్ని వదిలి 1960లో మద్రాసు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆచార్య ఆత్రేయకు ఘోస్ట్‌ రైటర్‌గా ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘కలిమిలేములు’ మొదలైన అనేక చిత్రాలకు సంభాషణలు రాశారు. ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ‘వాగ్దానం’ చిత్రానికి సహరచయితగా తెరపైకెక్కారు. నాటి నుంచి బి.ఎస్‌.నారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ బొల్లిముంత సంభాషణలు రచించారు.
1967లో తిరిగి తెనాలి వచ్చేశారు. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అదే సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బందరు స్థానం నుంచి సిపిఐ అభ్యర్థిగా బొల్లిముంతను పార్టీ నిలబెట్టింది. మోటూరి హనుమంతరావు సిపిఎం అభ్యర్థి. హోరాహోరీగా జరిగిన దాయాది పోరులో ఉభయ కమ్యూనిస్టులను ఓడించి, చల్లపల్లి జమిందార్‌ విజయం సాధించాడు.
1968లో ‘విశాలాంధ్ర విజ్ఞాన సమితి’ వారి ‘ప్రతిభ’ సచిత్ర వారపత్రికలో బొల్లిముంత సహాయ సంపాదకుడిగా చేరారు. 1969లో వి.మధుసూదనరావు పిలుపుతో తిరిగి మద్రాసు బాటపట్టారు. ‘మనుషులు మారాలి’ సినిమాకు కథ, సంభాషణలు సమకూర్చారు. ఆ చిత్రం వందరోజులు ఆడింది. అప్పటి నుంచి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు దర్శకత్వం వహించిన అత్యధిక భాగం సినిమాలకు బొల్లిముంతగారే సంభాషణా రచయిత. క్రమంగా కథకూ, సంభాషణలకూ, సందేశాలకూ ప్రాధాన్యత తగ్గిపోయి, నాయక ప్రాధాన్య చిత్రాల హోరు ప్రారంభమయ్యాక శివరాం మౌనంగా సినిమారంగం నుండి నిష్క్రమించి, స్వగ్రామం చదలవాడకు చేరుకున్నారు.
1943లో తెనాలిలో జరిగిన ‘అరసం’ మొదటి మహాసభల్లో కార్యకర్తగా పాల్గొన్న శివరామకృష్ణయ్య అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. ఆయన సారథ్యంలోనే తెనాలిలో అరసం స్వర్ణోత్సవాలు (1994), వజ్రోత్సవాలు (2004) ఘనంగా జరిగాయి. 1988 అక్టోబర్‌ 8, 9 తేదీలలో భీమవరంలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం 10వ రాష్ట్ర మహాసభల్లో బొల్లిముంత అరసం ప్రధాన కార్యదర్శిగా, నేను కార్యదర్శిగా ఎన్నికయ్యాం. 1992లో గుంటూరులో జరిగిన అరసం 11వ రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలను బొల్లిముంత శివరామకృష్ణయ్య నుంచి నేను స్వీకరించాను. పెనుగొండ లక్ష్మీనారాయణ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
బొల్లిముంత ఆదర్శాలను కొనసాగిస్తున్న ప్రగతిశీల రచయితలను సముచిత రీతిలో గౌరవించడానికి తెనాలి సాహితీమిత్రులు బొల్లిముంత బతికున్నప్పుడే, ఆ మహారచయిత పేరిట ‘బొల్లిముంత సాహితీపురస్కారం’ నెలకొల్పారు. ఈ పురస్కారం పొందిన వారిలో హితశ్రీ, పి. దక్షిణామూర్తి, వెలగా వెంకటప్పయ్య, నగ్నముని, ఎం.డి.సౌజన్య, కె.శివారెడ్డి, పరుచూరి సోదరులు, బి.నరసింగరావు, వంగపండు ప్రసాదరావు, గణేశ్‌ పాత్రో, సి.రాఘవాచారితోపాటు ఈ వ్యాస రచయిత కూడా ఉన్నారు.
85 సంవత్సరాల పరిపూర్ణమైన సామాజిక, సాహిత్య, రాజకీయ జీవితం గడిపిన బొల్లిముంత శివరామకృష్ణయ్య 2005 జూన్‌ 7నఅస్తమించారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం.

· —

బొల్లి ముంత పై ఆచార్య ఎస్ వి సత్యనారాయణ రాసిన ఆప్తవాక్యాలు –

రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో బొల్లిముంత శివరామకృష్ణయ్య నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం.

‘మనిషి జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది సామాజిక అస్తిత్వం-సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది’ అన్న దృక్పథంతో రచనలు చేసిన అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య. ఉపాధ్యాయుడు, హార్మోనిస్టు, నటుడు, గాయకుడు, కవి, కథారచయిత, నవలాకారుడు, బుర్రకథా రచయిత, హరికథా రచయిత, జర్నలిస్టు, సినిమా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, రాజకీయ కార్యకర్త, ఉత్తమ కమ్యూనిస్టు బొల్లిముంత.

1920 నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం, చదలవాడలో శ్రీమతి మంగమ్మ-, శ్రీ అక్కయ్య దంపతులకు పుట్టిన శివరామకృష్ణయ్య ప్రాథమిక, మాధ్యమిక విద్య తమ స్వగ్రామంలో కొనసాగించి, గుంటూరులో హయ్యర్‌గ్రేడ్‌ శిక్షణ పూర్తి చేశారు. సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయంకృషితో నేర్చుకున్నారు. చదలవాడలో ఆయన తండ్రి నెలకొల్పిన పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేశారు. బొల్లిముంత 16వ ఏట రచించిన ‘ఏటొడ్డు’ కథ ‘చిత్రాంగి’ పత్రికలో అచ్చయ్యింది. అది ఆయన తొలిరచన. నూనూగు మీసాల నూత్న యవ్వనవేళ త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద భావజాలంతో ప్రభావితులయ్యారు. త్రిపురనేని గోపీచంద్‌తో ఏర్పడిన స్నేహం బొల్లిముంత జీవితాన్ని మలుపు తిప్పింది. తమ జీవిత లక్ష్యం నిర్ణయించుకోవలసిన దశలో మార్క్సిస్టు సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. తమ గ్రామస్థితిగతులు, రైతుల, వ్యవసాయకూలీల దుర్భర జీవితాలు పరిశీలించారు. వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయడం మొదలుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎక్కువగా మమేకమయ్యారు. చల్లపల్లి జమీందారుగా వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం హైదరాబాద్‌ సంస్థానంలో జరుగుతున్న రైతాంగ సాయుధ పోరాట ఉదంతాలను పత్రికలలో చదివి, స్పందించి 1947లోనే ‘మృత్యుంజయులు’ నవల రాశారు. తెలంగాణా విమోచనోద్యమ నవలల్లో ఇదే తొలి నవల. నిజాం నిరంకుశత్వానికీ, భూస్వాముల దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరులను మృత్యుంజయులుగా చిత్రించారు.

పోలీసుచర్య తరువాత నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టులపై క్రూర నిర్బంధకాండను అమలు జరిపిన కాలంలో అజ్ఞాతవాసంలో ఉంటూనే గుంటూరు నుంచి ‘నగారా’ పత్రికను నడిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం స్వదేశంలో కమ్యూనిస్టులపై దారుణమైన నిర్బంధకాండను, ఊచకోతను ప్రయోగిస్తూ, మరోవైపు విదేశీవ్యవహారాలలో సోషలిస్టు శిబిరంతో స్నేహసంబంధాల కోసం అర్రులు చాచే ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ బొల్లిముంత ‘మొదళ్ళు నరికి చివుళ్ళకు నీరు పోస్తానంటాడు పండిట్‌ నెహ్రూ’ అనే వ్యాసం రాశారు. రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో నిర్ద్వంద్వంగా ఖండించారు. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో తెనాలిలో జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభల నిర్వహణలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో భాగస్వామిగా ఉంటూనే, కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘పిల్లి’ కథను ‘నగారా’ పత్రికలో తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక రచనలు అచ్చవుతున్నాయని ఆ పత్రికను ప్రభుత్వం నిషేధించింది.

ప్రజలను చైతన్యపరచడానికి బొల్లిముంత శివరామకృష్ణయ్య అనేక సాహిత్య ప్రక్రియలనూ, ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు. బెంగాల్‌ కరువుపై బుర్రకథ రాశారు. రైతుల జీవన స్థితిగతులను వివరిస్తూ ‘రైతుబిడ్డ’ హరికథ రచించారు. బొల్లిముంత కథలు-‘సూక్ష్మంలో మోక్షం’, ‘అంతరాత్మ అంత్యక్రియలు’, ‘శివరామకృష్ణ కథలు’ సంపుటాలుగా వెలువడ్డాయి. 1940-50 దశకాల తెలుగు ప్రాంతాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను చిత్రిస్తూ ‘ఏ ఎండకాగొడుగు’, ‘పత్రికా న్యాయం’, ‘తెలంగాణా స్వతంత్ర ఘోష’, ‘క్విట్‌ కాశ్మీర్‌’, ‘ధర్మ సంస్థాపనార్థాయ’ మొదలైన నాటికలు రచించారు. ‘దొంగ దొరికింది’, ‘బలే మంచి చౌకబేరం’ రేడియో నాటికలు రాశారు. ‘నేటి భారతం’ పేరుతో మూకీ నాటికను రూపొందించారు.

‘ప్రజాశక్తి’ పత్రికలో శివరామకృష్ణ రచించిన ‘దేశం ఏం కావాలి’ కథ విశేష జనాదరణ సంపాదించింది. 1955 మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పరాజయంతో నిస్పృహ చెందిన బొల్లిముంత క్రమంగా ప్రజారంగాన్ని వదిలి 1960లో మద్రాసు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆచార్య ఆత్రేయకు ఘోస్ట్‌ రైటర్‌గా ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘కలిమిలేములు’ మొదలైన అనేక చిత్రాలకు సంభాషణలు రాశారు. ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ‘వాగ్దానం’ చిత్రానికి సహరచయితగా తెరపైకెక్కారు. నాటి నుంచి బి.ఎస్‌.నారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ బొల్లిముంత సంభాషణలు రచించారు.

1967లో తిరిగి తెనాలి వచ్చేశారు. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అదే సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బందరు స్థానం నుంచి సిపిఐ అభ్యర్థిగా బొల్లిముంతను పార్టీ నిలబెట్టింది. మోటూరి హనుమంతరావు సిపిఎం అభ్యర్థి. హోరాహోరీగా జరిగిన దాయాది పోరులో ఉభయ కమ్యూనిస్టులను ఓడించి, చల్లపల్లి జమిందార్‌ విజయం సాధించాడు.

1968లో ‘విశాలాంధ్ర విజ్ఞాన సమితి’ వారి ‘ప్రతిభ’ సచిత్ర వారపత్రికలో బొల్లిముంత సహాయ సంపాదకుడిగా చేరారు. 1969లో వి.మధుసూదనరావు పిలుపుతో తిరిగి మద్రాసు బాటపట్టారు. ‘మనుషులు మారాలి’ సినిమాకు కథ, సంభాషణలు సమకూర్చారు. ఆ చిత్రం వందరోజులు ఆడింది. అప్పటి నుంచి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు దర్శకత్వం వహించిన అత్యధిక భాగం సినిమాలకు బొల్లిముంతగారే సంభాషణా రచయిత. క్రమంగా కథకూ, సంభాషణలకూ, సందేశాలకూ ప్రాధాన్యత తగ్గిపోయి, నాయక ప్రాధాన్య చిత్రాల హోరు ప్రారంభమయ్యాక శివరాం మౌనంగా సినిమారంగం నుండి నిష్క్రమించి, స్వగ్రామం చదలవాడకు చేరుకున్నారు.

1943లో తెనాలిలో జరిగిన ‘అరసం’ మొదటి మహాసభల్లో కార్యకర్తగా పాల్గొన్న శివరామకృష్ణయ్య అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. ఆయన సారథ్యంలోనే తెనాలిలో అరసం స్వర్ణోత్సవాలు (1994), వజ్రోత్సవాలు (2004) ఘనంగా జరిగాయి. 1988 అక్టోబర్‌ 8, 9 తేదీలలో భీమవరంలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం 10వ రాష్ట్ర మహాసభల్లో బొల్లిముంత అరసం ప్రధాన కార్యదర్శిగా, నేను కార్యదర్శిగా ఎన్నికయ్యాం. 1992లో గుంటూరులో జరిగిన అరసం 11వ రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలను బొల్లిముంత శివరామకృష్ణయ్య నుంచి నేను స్వీకరించాను. పెనుగొండ లక్ష్మీనారాయణ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

బొల్లిముంత ఆదర్శాలను కొనసాగిస్తున్న ప్రగతిశీల రచయితలను సముచిత రీతిలో గౌరవించడానికి తెనాలి సాహితీమిత్రులు బొల్లిముంత బతికున్నప్పుడే, ఆ మహారచయిత పేరిట ‘బొల్లిముంత సాహితీపురస్కారం’ నెలకొల్పారు. ఈ పురస్కారం పొందిన వారిలో హితశ్రీ, పి. దక్షిణామూర్తి, వెలగా వెంకటప్పయ్య, నగ్నముని, ఎం.డి.సౌజన్య, కె.శివారెడ్డి, పరుచూరి సోదరులు, బి.నరసింగరావు, వంగపండు ప్రసాదరావు, గణేశ్‌ పాత్రో, సి.రాఘవాచారితోపాటు ఈ వ్యాస రచయిత కూడా ఉన్నారు.

85 సంవత్సరాల పరిపూర్ణమైన సామాజిక, సాహిత్య, రాజకీయ జీవితం గడిపిన బొల్లిముంత శివరామకృష్ణయ్య 2005 జూన్‌ 7నఅస్తమించారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం.

ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ

( బొల్లిముంత శివరామకృష్ణయ్య శతజయంతి సందర్భంగా)

Advertisement

కమ్యూనిస్టు రచయిత బొల్లిముంత శివరామకృష్ణ
⋅ November 26, 2020

”కమ్యూనిస్టులకు తమ అభిప్రాయాలు, లక్ష్యాలూ దాచుకోవడమంటే అసహ్యం. సమస్త వర్తమాన సాంఘిక పరిస్థితులనూ బలవంతంగా కూలదోయడం ద్వారానే తమ లక్ష్యాలు సిద్ధించ గలవని వాళ్లు బహిరంగంగానే ప్రకటిస్తారు.” (కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక).
ఉత్తమ కమ్యూనిస్టు ఉత్తమ ప్రచారకుడు కావాలనే ఆదర్శానికి నిదర్శనగా బొల్లిముంత శివరామక ష్ణ తన అభిప్రాయాలను, లక్ష్యాలను ఏ మాత్రం దాచుకోకుండా తను ఆశించిన సమ సమాజ లక్ష్యంగా జీవించారు. జీవితకాలంలో కచ్చితంగా అటువంటి నికార్సయిన సాహిత్యాన్నే స ష్టించారు.
బొల్లిముంత శివరామకృష్ణ గుంటూరుజిల్లా వేమూరు మండలం చదల వాడ గ్రామంలో నూరేళ్ల క్రితం 27 నవంబర్‌ 1920న జన్మించారు. తల్లి దండ్రులు మంగమ్మ, అక్కయ్య. తండ్రి వద్దనే ప్రాథమిక విద్యతో పాటు సంస్కృతం నేర్చుకున్నారు. 8వ తరగతి చదివిన తరువాత హయ్యర్‌ గ్రేడ్‌ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. 13ఏళ్ల వయస్సులోనే నాటకరంగంలో ప్రవేశించిన బొల్లిముంత యువకునిగా ‘అమ్మ’ నవల చదివిన ప్రేరణలో కమ్యూనిస్టు ఉద్యమంలో కలిసి సాగారు. తెనాలి తాలూకా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. భూపోరాటాల్లో పాల్గొన్నారు. జైలు శిక్షలు అను భవించారు. అజ్ఞాత వాస జీవితం గడిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆదేశం మేరకు 1967లో బందరు పార్లమెంటు నియోజక వర్గానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అభ్యుదయ సాహితోద్యమంలో, ప్రజా సాంస్కృతిద్యోమంలో క్రియాశీలంగా వున్న బొల్లిముంత భీమవరంలో 1988 అక్టోబర్‌ 8, 9 తేదీలలో జరిగిన అరసం రాష్ట్ర 10వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎంపికై గుంటూరులో 1992 నవంబర్‌ 14, 15 తేదీలలో జరిగిన 11వ మహాసభ వరకూ కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి ఉపా ధ్యక్షులుగా కూడా సేవలందించారు.
కమ్యూనిస్టుగా రాజకీయోద్యమాలలో క్రియాశీలంగా పాల్గొంటూ సాహిత్య రచనకుపక్రమించిన బొల్లిముంత 1947లో ప్రారంభమైన తెలంగాణ విమోచన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ఆ ఏడాదే ‘మ త్యుంజయులు’ నవలను వెలువరించారు. పోరాట ప్రాంతం వాడిగా కాకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన బొల్లిముంత చేసిన ఈ రచన ఆ సాయుధ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా సాహిత్య చరిత్రకెక్కింది.
”యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణాలో ప్రారంభమైన ప్రజా పోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకుని, దాని ఆంత ర్యాన్ని అర్థం చేసుకొంటూ ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజల పక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథాకథనం ‘మృత్యుజయులు’ నవల” అని పుస్తక ప్రచురణ కర్తలు (ప్రజాశక్తి ప్రచురణాలయం, బెజవాడ-25 అక్టోబర్‌ 1947) అభిప్రాయం ప్రకటించారు. ఈ నవలను ప్రజా ఉద్యమాలకు ఒక సందేశంగా తెలంగాణా సమరసేనాని రావి నారాయణరెడ్డి అభివర్ణిస్తే, ప్రముఖ అభ్యుదయ రచయిత తుమ్మల వెంకట్రామయ్య ‘ఈ నాటికీ వీరగాథమే!’ అని కొనియాడారు. 2015 వరకూ ఆరు ముద్రణలు పొందిన చిరస్మరణీయ నవల మృత్యుంజయులు. తెనాలిలో 2015 నవంబర్‌లో జరిగిన బొల్లిముంత జయంతి సభలో ఆరవ ముద్రణను ఆవిష్కరించే గౌరవం నాకు లభించింది.
”ఆనాటి నైజాం రాజ్యంలో నెలకొన్న పరిస్థితుల్ని, దేశముఖులు, పటేళ్ళ ఆగడాల్నీ; సామాన్య ప్రజలు – ముఖ్యంగా గ్రామీణ రైతాంగ ప్రజానీకం అనుభవిస్తున్న కష్టాల్నీ, యువకుల్లో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణుల్నీ అక్షరీకరించి; ఇక్కడి ప్రజల్లో చైతన్యాన్నీ, బైటివారిలో సంఘీభావాన్ని రేకెత్తించి ఉద్యమ దిశగా జనాన్ని సమాయత్తం చేయడానికి జరిగిన ప్రయత్నమిది” అని మృత్యుంజయులు నవలను వివరిస్తూ ప్రసిద్ధ రచయిత శీలా వీర్రాజు ‘ప్రజా ఉద్యమానికి అద్దంపట్టిన బొల్లిముంతశివరామకృష్ణ నవల, మృత్యుంజయులు’ వ్యాసం (మహోజ్వల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నవలా సాహిత్యం – పరిచయాలు – పరిశీలన; జనసాహితి జంటనగరాల శాఖ ప్రచురణ – మే 2010)లో రాశారు.
బొల్లిముంత స జనాత్మక రచయితేగాక కళాకారుడు కూడా. అభ్యుదయ సాహిత్యోద్యమంతో, అరసంతో, ప్రజా సాంస్క తికోద్యమంతో, కమ్యూనిస్టు కార్యాచరణతో పెనవేసుకుపోయిన జీవితమాయనది, జీవనయానమాయనది. అనేక నాటికలు, నాటకాలు రచించి తెలుగునాట ఉద్యమస్ఫూర్తిని వెదజల్లారు. 1954లో వీరి తొలి కథాసంపుటి ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త అవసరాల సూర్యారావు ‘పరిచయం’తో వెలువడింది. ఆ సంపుటిలోని కథలతోపాటు మొత్తం 31 కథలతో విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 1990లో మళ్లీ అవసరాలవారి పరిచయంతో ‘బొల్లిముంత శివరామక ష్ణ కథలు’ సంపుటిని ప్రచురించింది.
రచనా వైఖరి
”రచనలో ఉద్వేగం ఉండాలి. ఉత్త ఉద్వేగం చాలదు. భావనాశక్తి, శిల్ప ప్రావీణ్యం, సజీవ భాష, పాఠకుణ్ణి ఉరకలు పెట్టించి మనసును వూటలూరించే సంవిధానం, సందేశం… ఒకటా? వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రజాజీవిత చిత్రణ – అదీ అభ్యుదయ మార్గంలో ఉండాలి” అని ”తెలుగుప్రాణి’ కథానికలో తన సాహిత్య దశ, దిశా నిర్దేశాన్ని స్పష్టం చేసిన బొల్లిముంత ఆ విధంగానే కథా సాహిత్యాన్ని స ష్టించారు. విశాలాంధ్ర పక్షపత్రిక, నగారా, ప్రతిభ, జయశ్రీ వంటి పలు పత్రికలలో ప్రచురితమైన 26 కథానికలు, 5 గల్పికలు ఈ సంపుటిలో చోటుచేసుకున్నాయి. 1948 నుండి 1969 వరకు రచనాకాలంగా కనిపిస్తుంది. తన 15వ ఏటనే రాసిన ‘ఏటొడ్డు’ కథ ఈ సంపుటిలో చోటుచేసుకోలేదు. బొల్లిముంత మరేమైనా కథలు రాశారేమో వెతకాల్సి ఉంది. స్వాతంత్య్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న, పెంచుకున్న ప్రజానీకానికి దానివల్ల వొరిగిందేమీ లేదని, అదొక మేడిపండని స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కథారచన ప్రారంభించిన బొల్లిముంత తన కథల్లో స్పష్టం చేశారు. వర్గసమాజంలోని స్వాతంత్య్రానికి అర్థం నిజమైన స్వేచ్ఛ లేకపోవటం, దోపిడీకి గురికావటమే అని విశదీకరించారు (‘స్వాతంత్య్రం’ గల్పికలో). నిజమైన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వర్గరహిత సమాజంలోనే సాధ్యమన్నారు. ఆ సమాజం పోరాటం ద్వారానే సాధ్యమని సందేశించారు. ”రండోరు! రండోరు! పేదల్లారా! పోరాడాం మన హక్కులకై… పోయేదేముందోరు మనకింకా/పోతే ఈ పేదరికమేనోరు!…… ఉక్కు ముక్కలుగ ఒక్కుమ్మడిగా, పోదాం రండోరు పేదల్లారా!” అని ‘సమ్మెపిలుపు’ కథానికలో సమరనాదం మ్రోగించారు. మార్క్స్‌, ఏంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో పేర్కొన్న ”కార్మికులు పోగొట్టుకునేది ఏమీ లేదు, తమ శ ంఖలాలు తప్ప. వాళ్లు పొందవలసింది ఎంతైనా ఉంది” మాటలను బొల్లిముంత ఉటంకించారు. బొల్లిముంత కథల్లో శ్రీశ్రీ చెప్పిన పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు, దగాపడిన తమ్ముళ్లు కనిపిస్తారు. అన్నార్తుల ఆక్రందనలు వినిపిస్తాయి. ‘తీవ్ర శ్రుతిలో, తీవ్ర ధ్వనితో వారు చేసే నినాదాలు మిన్నంటుతాయి. మరోపక్క నిస్సహాయతతో కూడిన దయనీయమైన జీవితాలు, భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాల దోపిడీ, పాలక కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలపై, ప్రజా సంస్క తిపై ప్రభుత్వ దమనకాండ వంటి ఎన్నో విషయాలు ఈ కథల్లో కనిపిస్తాయి. సామ్యవాద వ్యవస్థ కొరకు పోరాడే ప్రజా శక్తుల పక్షాన నిలిచి వారికి స్ఫూర్తినీ, చైతన్యాన్ని అందించే కథలను రాశారు బొల్లిముంత.
బ్రతుకు బాటలో పోరాటాలు
పద్దెనిమిదేళ్ల పాలేరు రంగడు పంటజొన్న చేను మంచెపై నిలబడి వడిసెల తిప్పుతూ, కేకలు పెడుతూ పక్షుల్ని తోలుతుంటాడు. ఆ మంచెపై వాలిన ముసలి కాకొకటి రంగడికి ‘జీవనగీత’ను బోధిస్తుంది. ”నీవూ నీలాంటి వాళ్లూ మమ్మల్ని డబ్బాలు మోగించి జడిపించ చూస్తున్నారు. నల్లటి గుడ్డల్ని వేలాడగట్టి, కాకినే చంపి గుంజకు వేలదీని ‘మీరూ యిలాగే చస్తారు. కనుక మా పొలాల మీదికి రాబోకండి’ అని భయపెట్టబోతున్నారు… కానీ మేం తిండికి మాడి చస్తామా? బ్రతుకు పోరాటం మానుకుంటున్నామా? బ్రతికి తీరుతాం. మేంకాకులం కానీ భీరువులం కాం…మీరూ మాలాగే పోట్లాడండి… చావుకు భయపడి చచ్చిపోకండి. బ్రతుకు కోసం పోరాడ్డంలో చచ్చిపోయినా ఫర్వాలేదు. మిగతావాళ్లకైనా బ్రతుకు బాటలు ఏర్పడతాయి.” వామపక్ష భావజాలప్రచారానికి కథా ప్రక్రియను బొల్లిముంత ఎంతచక్కగా ఆశ్రయిం చారో ఈ కథ ‘జీవనగీత’ద్వారా అర్ధం చేసుకోవచ్చు. పక్షులు, జంతువులు పాత్రలుగా మారి మాట్లాడటం, మాట్లాడే భావన కలిగించే ‘యాంత్రియో మార్ఫిజమ్‌’ శిల్ప విధానాన్ని ముసలికాకి పాత్ర ద్వారా ఈ కథలో చక్కగా ప్రయోగించారు బొల్లిముంత. కుహనా ప్రజాస్వామికవాది, భూస్వామి శ్రీరాములు దోపిడీని ముసలినక్క ఎలా తన చతురతతో ప్రతిఘటించిందో వివరించినకథ ‘చేపచెట్టెక్కింది’. ‘చందమామ’లోని జానపద కథలా పాఠకు లను ఆకట్టుకుంటుంది. బ్రతుకు బాటలు ఏర్పాటు చేసుకోవటానికి సంఘం పెట్టుకొని సమ్మెకట్టిన పాకీ పనివాళ్ల ధైర్యాన్ని ‘సమ్మె పిలుపు’ కథ వివరిస్తుంది. పాకీ పనివాళ్ల జీవితచిత్రణ, వాళ్ల పనిలో ఉండే నిక ష్టాన్ని, వాళ్ల జీవన దైన్యాన్ని, హైన్యాన్ని ఈ కథ కళ్లకు కడుతుంది. అదే బ్రతుకు బాటలో ఉద్య మించి హతుడైన సాలమన్‌ జీవితాన్ని చిత్రించిన కథ ‘గోరీల దొడ్లో, ‘హరిజనుడే మనరాజ్యం ఏలుతాడ’ని చెప్పిన గాంధీ మాటలు స్వాతంత్య్రా నంతరం ఎంత బూటకంగా, సత్యదూరంగా మారాయో ఈ కథ వివరిస్తుంది. దళితులపై సాగుతున్న దోపిడీని ఈ కథ ఆర్థంగా చిత్రించింది. చదువుల కోసం హిందూ మతం నుండి క్రిష్టియన్‌ మతం స్వీకరించి మతాంతీకరణ చెంది స్వామి సాలమన్‌గా మారి తనవారికోసం ఉద్యమించటం, ఆ ఉద్యమంలో దోపిడీదారుల పక్షాన కొమ్ముగాసిన పోలీసులు సాలమన్ను హత మార్చటం ఈ కథాంశం.
మా పాపమిట్టాపండి మనుషులం మార్కెట్టులో సరుకులాగా అయి పోయాం. అంతా బేరమే. మీకుఇష్టమైతే కొంటారు. మాకు ఇష్టమైతే అమ్ముతాం. అంతేనా?” మనిషి తన సమస్త సహజ అస్తిత్వాలను కోల్పోయి మార్కెట్‌ సరుగ్గా మారటాన్ని తెలుపుతున్న ఈ కథలోని మాటలు నేటికీ వాస్తవమే కదా!
”…. ఇరవై ఏళ్ల స్వరాజ్య జీవనంలో కూడా కూడూ గుడ్డా లేకపోవటమే ఈ కథకి కారణాలుగా బైటపడేవి. హ దయం ఉండి ఆలోచిస్తే, ఆచరణలోకి తెస్తే, ముందుముందు జనవరి 26లయినా ఇట్లాంటి కథలు లేనివిగా, కనీసం కథలకి కారణాలు కానివిగా ఉండేవి. కానీ, ”అయితే-గియితే”- అని మన ఆశలేతప్ప అవేవీజరుగలేదు…యికజరుగుతాయన్న ఆశాలేదు..” స్వాతంత్య్రం వచ్చిన ఇరవై ఏళ్ల అనంతరం 1969లో రాసిన ‘జరగని కథకోసం’లో దేశ వాస్తవ భౌతికపరిస్థితులను పేర్కొంటూ ‘మన స్వతంత్రమొక మేడిపండు, మన దరిద్రమొక రాచపుండు’ అని వివరిస్తారు బొల్లిముంత. స్వాతంత్య్రానంతరం ఆకలిచావులపై రాసిన మరోకథ ‘అంతరాత్మ అంత్యక్రియలు’.
బొల్లిముంత రాసిన ‘ప్రాణం వెల’ను గురించి కొంత చెప్పుకోవాల్సి ఉంది. సింహాద్రి నాగావళి నదిలో పడవతోటి జనాన్ని ఆ ఒడ్డుకు, ఈ ఒడ్డుకు చేరుస్తూ కుటుంబాన్ని పోషించుకునే శ్రమజీవి. గజ ఈతగాడు కూడా. ఒకానొక వరద సందర్భంలో పడవ నడపలేని అస్సహాయ స్థితి. ఇంట్లో ఆకలి కేకలు. షావుకారు గుర్నాథం వద్దకు నూకలకోసం వెళ్లినప్పుడు వరదకు నదిలో పైనుంచి కొట్టుకువచ్చే కలప ఏరుకొని వస్తే దానికి డబ్బు చెల్లిస్తానంటాడు. కొద్దిగా నూకలుకొలుస్తాడు. వరద ఉధ తిలో ఉన్న నాగావళి నదిలోకి దుస్సా హసంతో దూకి అందినకాడికి కలపను ఒడ్డుకు చేరుస్తాడు. కానీ, ప్రవాహ ప్రమాదంలో చనిపోతాడు. ఇదీ కథాంశం. బ్రతుకు తెరువుకోసం దుస్సాహ సానికి దిగి ప్రాణం కోల్పోయిన సింహాద్రిని మన కళ్లముందు కనబడేట్టు చిత్రించారు. ఈ కథలో వేగం వరద నాగావళి అంత వేగాన్ని సంతరించుకుని ప్రవాహరీతిలో సాగుతూ పాఠకునిలో క్షణక్షణమూ ఉత్సుకతను, ఉత్కంఠను రేకెత్తిస్తుంది. తెనాలి ప్రాంతానికి చెందిన బొల్లిముంత ఉత్తరాంధ్రకు చెందిన నాగావళి నదిని, అక్కడ ఎక్కువగా వినబడే పేర్లలో ఒకటైన సింహాద్రిని ఈ కథలో చేర్చటం విశేషం. మా గోఖలే రాసిన ప్రసిద్ధమైన కథ ‘బల్లకట్టు పాపయ్య’ను గుర్తుకు తెస్తుంది ఈ కథ.
ప్రజా సంస్క తిపై దాడులను నిరసిస్తూ…
‘ఏకపుత్రులు’ అందరిలాగానే అతి గారాబంగా పెరిగిన సీతారాముడులో ఆ ఊళ్లో ఏర్పడిన యువజన సంఘం ద్వారా మార్పులు చోటుచేసుకున్నాయి. సీతారాముడు కళాకారుడవుతాడు. ‘ఈ నాటకం ఆడితే ప్రజలు చెడతారు. శాంతిభద్రతలు ఇరుకునపడతాయి’ అనే అభియోగంతో హెడ్‌ కానిస్టేబుల్‌ సీతారాముడి బ ందం ఆడే నాటకాన్ని నిషేధిస్తాడు. తన అభియోగానికి సాక్ష్యంగా ”ఈ తెరలు చూడండి. లక్ష్మిగాని, సరస్వతిగాని, చివరకు మన హనుమంతుడుగానీ ఉన్నారేమో!…. ఈ తబలాకి చుట్టిన గుడ్డ చూడండి ఎర్రగా” అని చూపుతాడు. ఇవి నవ్వు తెప్పించే విషయాలుగా మనకు కనపడతాయి. అదే సమయంలో పాలకపక్ష చౌకబారుతనాన్ని, డొల్లతనాన్ని చూపుతాయి. నాటక ప్రదర్శన సందర్భంలో దర్శకుడిని అరెస్ట్‌ చేస్తాడు హెడ్డు. తరువాత సీతారాముడి గ్రామంపై పోలీసుల దాడి. ఎక్కడెక్కణ్ణుంచో, ఎవరె వర్నో పట్టుకొచ్చి ఆ వూరి పొలిమేరలో కాలుస్తారు. సీతారాముణ్నీ పట్టుకెళ్లి దాడులు, హత్యలు ఆరోపణలపై పోలీసులు చంపుతారు. ‘తెలుగు ప్రాణి’ అనే ఈ కథ 1954లో ప్రచురితమైంది. అయితే అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో తెలుగు నేలమీద అనేక గ్రామాల్లో కాంగ్రెస్‌ పాలకపక్షం సాగించిన దారుణ మారణకాండను బలీయంగా చిత్రించిందీ కథ. ఈ కథ 1950 ప్రాంతాలలో ప్రజా సాహిత్య, సాంస్క తికోద్యమాలపై ప్రభుత్వం చేసిన దాడులను, విధించిన నిషేధాలను గుర్తుకు తెస్తుంది. విశాలాంధ్ర పక్షపత్రిక, మా భూమి నాటకం, సోమసుందర్‌ వజ్రాయుధం కవితా సంపుటం వంటి రచనలపై నిషేధం, మా భూమి ప్రదర్శనపై, బుర్రకథ కళారూపంపై ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన నిషేధాలను కళాకారులు, రచయితలు, సంపాదకులపై దాడులు చేయటాన్ని ప్రజాస్వామిక స్వభావమున్న వారెవరూ మరచిపోలేని సత్యాలు. కమ్యూనిస్టులపై పోలీసు వ్యవస్థ సాగిస్తున్న హత్యాకాండను వివరించిన మరో కథ ‘పరిశోధన’.
అవకాశవాదాన్ని ఎండగడుతూ…
అంతవరకూ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన జస్టిస్‌ పార్టీకి చెందినవారు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ జెండాలు పట్టుకొని, గాంధీ టోపీలు పెట్టుకొని ‘ఏ యెండకు ఆ గొడుగు పట్టడా’న్ని, బీద ప్రజలను తమ పాత పద్ధతులలోనే దోచుకుంటున్న ‘షావుకారు నారయ్య’లాంటి వారి నిజస్వరూపాలను ‘ప్రజాసేవ’ కథ (1948 విశాలాంధ్ర పక్షపత్రిక) బహిర్గతం చేసింది. ఇటువంటిదే మరో కథ ‘దేశం ఏం కావాలి?. ”స్వాతంత్య్ర సమర యోధుడు చక్రపాణి జైలునుంచి విడుదలై స్వగ్రామం తిరిగొస్తుంటే అంతకు ముందు చక్రపాణిని స్వాతంత్య్రోద్యమాన్ని ద్వేషించిన, నిరసించిన రౌడి వెంకయ్య, షావుకారునారయ్య, గమళ్ళసోములు, ప్రైవేట్‌బాపినీడు, పెత్తం దారు, ప్రక్కవూరు గ్రామ మునసబు వంటివారు ఎదురేగి స్వాగత మివ్వటం ద్వారా వాళ్లలో ఏర్పడ్డ అవకాశవాద తత్వాన్ని, ఆ కాలంలో నడిచిన కాంగ్రెస్‌ మార్కు దుష్ట సంస్క తిని ఎండగట్టింది. ఈ కథ చక్రపాణి కలలో సాగిన ఈ కథలోని సంఘటనలను తలచుకొని ‘దేశం ఏంకావాలి?” అని బొల్లిముంతతో పాటు మనమూ ఆవేదనకు గురవుతాం.

· సశేషం

· మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -53

హాస్య చిడతల అప్పారావు

చిడతల అప్పారావు తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించారు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. దర్శకులు జంధ్యాల, ఇ. వి. వి సత్యనారాయణ ఈయనకు తమ చిత్రాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించారు.

నటజీవితం
చిడతల అప్పారావు నాటకరంగం నుంచి వచ్చినవాడు. సినిమాల్లో చిన్న చిన్న విషయాలు వేసేవాడు. పారితోషికం ఇంత అంటూ ఏమీ ఉండేది కాదు. నిర్మాతలు తమకు తోచినంత ఇచ్చేవారు. ఈయన కూడా అడిగితే ఉన్న వేషాలు కూడా పోతాయి అనే భయంతో కావలసిన పారితోషికం అడిగేవారు కాదు. ఈయనతో పాటు థం లాంటి మరికొంతమంది చిన్న హాస్యనటులను జంధ్యాల ప్రోత్సహించి అవకాశాలిచ్చాడు.[1] తర్వాత జంధ్యాల శిష్యుడైన ఇ.వి.వి. సత్యనారాయణ కూడా అప్పారావుకు తన సినిమాల్లో అవకాశం కల్పించాడు.

అప్పారావు పెంకిపిల్ల అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు. వేషాల మీదనే ఆధారపడితే జీవనం గడవదని గ్రహించి మేకప్ నేర్చుకుని సహాయకుడిగా వెళ్ళేవాడు. దుస్తుల విభాగంలో కూడా పనిచేసేవాడు.

నటించిన చిత్రాలు
· బొబ్బిలి యుద్ధం (1964)

· అర్ధరాత్రి (1968)

· జ్యోతి (1976)

· వేటగాడు (1979)

· సర్దార్ పాపారాయుడు (1980)

· కొండవీటి సింహం (1981)

· పటాలం పాండు (1981)

· కలియుగ రాముడు (1982)

· ఖైదీ ( 1983)

· ఘరానా అల్లుడు (1984)

· అడవి దొంగ (1985)

· చట్టంతో పోరాటం (1985)

· అపూర్వ సహోదరులు (1986)

· కొండవీటి రాజా (1986)

· జానకి రాముడు (1988)

· మంచి దొంగ (1988)

· మురళీకృష్ణుడు (1988)

· విజయ్ (1989)

· లారీ డ్రైవర్ (1990)

· కిల్లర్ (1991)

· అప్పుల అప్పారావు (1992)

· జంబలకిడిపంబ (1992)

· ప్రెసిడెంటు గారి పెళ్ళాం (1992)

· బృందావనం (1992)

· చిట్టెమ్మ మొగుడు (1992)

· గోల్‌మాల్ గోవిందం (1992)

· అల్లరి అల్లుడు (1993)

· ఆ ఒక్కటీ అడక్కు (1993)

· ముద్దుల ప్రియుడు (1994)

· ఆలీబాబా అరడజను దొంగలు (1994)

· అసెంబ్లీ రౌడీ (1991)

చిడతల అప్పారావు కుమారుడు ,నవీన్ కుమార్తె కృష్ణవేణి ఒక పత్రిక కిచ్చిన ఇంటర్వ్యులో తండ్రి గురించి చెప్పిన ముఖ్య విషయాలు –‘’ నాన్న అందరికీ సహాయం చేసేవారట..‘మా అమ్మ మాకు ఈ విద్య నేర్పిందిరా’ అంటూ ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో లైసెన్స్‌డ్‌ భిక్షకుడిగాను, ఆలీబాబా అరడజను దొంగలు చిత్రంలో ఒక దొంగగాను, అదే చిత్రంలో ఆడ వేషంలోను… కొన్ని వందల చిన్న చిన్న వేషాలు వేశారు వై.అప్పారావు. ఆయన చిడతలు వాయించటంలో దిట్ట కావటం వలన చిడతల అప్పారావుగా అందరికీ పరిచితులయ్యారు. ముఖ కవళికలతోనే హాస్యం పండించిన చిడతల అప్పారావు గురించి వారి పిల్లలు నవీన్, కృష్ణవేణి తండ్రితో వారికి ఉన్న అనుబంధాన్ని, తండ్రిలోని మంచితనాన్ని ‘సినీ పరివారం’ శీర్షిక కోసం సాక్షితో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

నాన్నగారు పుట్టి పెరిగినదంతా రాజమండ్రిలోనే. ఎంతవరకు చదువుకున్నారో సరిగ్గా తెలియదు. రాజమండ్రి నుంచి ఒకేసారి ఐదుగురు కలిసి సినిమా మీద ప్రేమతో మద్రాసు వచ్చారట. నాన్న, రాజబాబుగారు, జయకృష్ణగారు, మరో ఇద్దరు వచ్చారట. వారి పేర్లు జ్ఞాపకం లేవు. అందులో రాజబాబుగారు కమెడియన్‌గా ఎదిగారు. జయకృష్ణగారు నిర్మాత అయ్యారు. నాన్నగారికి చొరవ లేకపోవడంతో మరీ పెద్ద పెద్ద పాత్రలు చేయలేకపోయారు. నాన్నగారు హిట్‌ గురించి, ఫ్లాప్‌ గురించి ఆలోచించేవారు కాదు. ఆయనకు రెండూ సమానమే.

ఇదీ మా కుటుంబం..
నాన్నగారికి మొదటి భార్య చనిపోవటంతో, చెన్నై వడపళని దేవాలయంలో రెండో వివాహం చేసుకున్నారట. అప్పటికే సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న అమ్మ వాళ్ల బాబాయ్‌ ద్వారా ఈ సంబంధం వచ్చిందట. అమ్మ పేరు దుర్గ. నాన్నగారికి మేం ఇద్దరం పిల్లలం. నా పేరు నవీన్‌ కుమార్‌. మా అక్క కృష్ణవేణి. మేమిద్దరం చెన్నైలోనే చదువుకున్నాం.

నాన్నతో కూర్చోవటమే మాకు పండుగ…
ఉదయం నాన్నగారు షూటింగ్‌లకు, మేం స్కూల్‌కి వెళ్లటంలో బిజీగా ఉండేవాళ్లం. అందువల్ల రాత్రుళ్లు మాత్రం అందరం కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. ఆదివారం వస్తే చాలు.. అందరం కలిసి కింద కూర్చుని, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండుగా భోజనం చేసేవాళ్లం. ఆయన మాకు ఆ క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆ రోజు ఒక ముద్ద ఎక్కువే తినేవారం. మా నాన్నగారితో ఇంట్లో చాలా సరదాగా, జాలీగా ఉండేది.

అందరూ స్నేహంగా ఉండేవారు..
మా ఇంటికి అప్పట్లో పొట్టి సత్యం, రాళ్లపల్లి, చలపతిరావు, జయకృష్ణ, రాజబాబు…వీరంతా వచ్చేవారు. నాన్నగారితో అందరూ స్నేహంగా ఉండేవారు. రాళ్లపల్లిగారి ఇంటి నుంచి మామిడికాయలు, ఊరగాయలు వచ్చేవి. కృష్ణంరాజుగారు ప్రతి పండక్కి స్వీట్స్, వారి తోట నుంచి మామిడిపళ్లు పంపేవారు. అలీ నాన్నగారితో క్లోజ్‌గా ఉండేవారు. బాబాయ్‌ అని పిలిచేవారు.

ఎందరికో సహాయం చేశారు..
నాన్నగారు.. తెలిసిన వ్యక్తిని, తెలియని వ్యక్తిని అందరితోనూ ప్రేమగా ఉండేవారు. ఎవరు డబ్బులు అడిగినా లేదనకుండా ఇచ్చేసేవారు. ఫ్యాన్స్‌ వస్తే, వాళ్లకి భోజనం పెట్టి, వాళ్లు అడిగిన ఫొటో ఆల్బమ్‌లో నుంచి తీసి ఇచ్చేసేవారు. చెన్నైలో మేం ఉన్న బిల్డింగ్‌ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కోరస్‌ సింగర్స్‌ ఉంటుండేవారు. వారంతా మన తెలుగువాళ్లే. వాళ్లకు పనులు లేకపోతే, నాన్నగారు వారికి సహాయం చేయటం నేను మేడ మీద నుంచి చూసి అమ్మకి, అక్కకి చెప్పేవాడిని. ఎంతోమందికి గుప్తదానాలు చేశారు నాన్న.

తియ్యని జ్ఞాపకం…
నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నాకు అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ జరిగింది. అది వర్షాకాలం. నేను బడికి వెళ్లకుండా, ఇంట్లోనే ఉండటం వల్ల తోచేది కాదు. ఆడుకోవటానికి కారు బొమ్మ కావాలని అడిగిన వెంటనే, అంత వర్షంలోనూ… గొడుగు వేసుకుని పొట్టి సత్యం గారితో కలిసి పాండీ బజార్‌కి వెళ్లి కారు బొమ్మ తేవటం నేను మరచిపోలేను. ప్రతి రోజూ సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి అక్క కోసం బాదుషా, నాకు బందర్‌ లడ్డు, ఇద్దరికీ కుండ స్వీట్‌ (పాండీ బజార్‌ అరుణ స్వీట్స్‌) తెచ్చేవారు. ఇది మాకు తియ్యని జ్ఞాపకం.

అసూయకు ఆమడ దూరం…
ఎంతమంది కమెడియన్స్‌ ఇండస్ట్రీలోకి వచ్చినా, నాన్నగారికి ఎవరి మీద ఈర్ష్య ఉండేది కాదు. వారిలో ఉన్న మంచి గుణాల గురించి చెప్పేవారు. నాన్నగారు మాతో, ‘ధర్మమార్గంలో నడవాలి, ఎవరి దగ్గరా చేయి చాపకూడదు. ఎవరికీ తల వంచకూడదు’ అని చెప్పేవారు. ఆయన చనిపోయేవరకు అలాగే ఉన్నారు. ఎవరికీ తల వంచలేదు. ఎవ్వరి దగ్గరా చేయి చాపలేదు, ఎన్నడూ ధర్మం తప్పలేదు. తుది శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. నాన్నగారు వేషాల కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. అందుకు మేం మా నాన్నగారి గురించి గర్విస్తాం. నాన్నగారు నటించిన సినిమాలలో మాకు… ఆలీబాబా అరడజను దొంగలు, ఏమండీ ఆవిడ వచ్చింది, జంబలకిడి పంబ, అల్లరి పిల్ల… బాగా ఇష్టం.

డబ్బింగ్‌ అంటే తెలీదు…
నాన్నగారు డైలాగ్‌ పేపర్లు ఇంటికి తెచ్చుకునేవారు. మేం పాఠాలు చదువుకుంటుంటే, నాన్న డైలాగులు చదువుకుంటూ నవ్వుకుంటుండేవారు. ఆయన ఎందుకు నవ్వుతున్నారో తెలియక మేం కూడా నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేసేవాళ్లం. డబ్బింగ్‌ అంటుండేవారు. అప్పట్లో మాకు డబ్బింగ్‌ అంటే తెలిసేది కాదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఎవరైనా కొంచెం వయసువారు ‘మీ నాన్న గోల్డ్, మీ నాన్న భగవంతుడు, మంచివాడు’ అంటుంటే సంతోషంతో పాటు, నేను కూడా అలాగే ఉండాలి అనుకుంటాను. నాన్నగారికి నన్ను హీరో చేయాలనే కోరిక, ఆశ ఉండేవి. అలాగే కెమెరామెన్, డైరెక్టర్‌… ఏదో ఒకటి అవ్వాలి అంటుండేవారు. అమ్మ కోప్పడుతుండేది. నాన్నగారు నా చదువు పూర్తి కాకుండానే కన్నుమూశారు. నేను డిగ్రీ పూర్తి చేశాక, కెమెరామెన్‌ శరత్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను. షార్ట్‌ ఫిల్మ్స్‌ డైరెక్ట్‌ చేశాను. మంచి హిట్‌ కోసం చూస్తున్నాను. మేం చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చి 20 సంవత్సరాలు పైనే అవుతోంది. ‘ప్రేమకు వేళాయెరా’ సినిమా సమయంలో శరత్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించాను.

మధుర జ్ఞాపకాలు..
నాన్నగారితో కలిసి అందరం తిరుపతి వెళ్తే, పది నిమిషాలలో దర్శనం అయిపోయేది. అక్కడ చాలామంది ఫ్యాన్స్‌ మాతో ఫొటోలు తీయించుకునేవారు. నాన్నగారి ఫ్యాన్స్‌ని చూస్తే, మాకు చాలా సంతోషంగా ఉండేది. ఇప్పటికీ తిరుపతి వెళ్తే, మాకు ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఎన్‌. టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారికి రాజమండ్రిì సీటు ఇస్తామన్నారు. ‘రాజకీయాలు వద్దు’ అని అమ్మ అనటంతో నాన్న మానుకున్నారు. ప్రతి సినిమా ప్రివ్యూ నాన్నతో కలిసి చూసేవాళ్లం. అదొక సరదా. రాఘవేంద్రరావుగారికి, దాసరి నారాయణరావుగారికి నాన్నగారు బాగా క్లోజ్‌.

నాన్నగారికి లంగ్‌ క్యాన్సర్‌ వచ్చి ట్రీట్‌ చేయించుకున్నారు. సినీ పరిశ్రమలో అందరూ సహాయం చేశారు. దాసరి, చిరంజీవి, రాళ్లపల్లి, చలపతిరావు, కల్పనారాయ్, అలీ… ఇంకా చాలామంది వచ్చి నాన్నని పలకరించేవారు. ‘ఎలాంటి మనిషి ఇలా అయిపోయారు’ అని బాధపడేవారు. సినీ పరిశ్రమ మాకు బాగా సహాయం చేసింది. ఈవివి సత్యనారాయణగారి కుటుంబంతో నాన్నగారు బాగా క్లోజ్‌గా ఉండేవారు. వాళ్ల పిల్లలు నాన్నను, ‘బాబాయ్‌’ అని పిలిచేవారు. వాళ్ల పిల్లలిద్దరినీ నాన్న షాపింగ్‌కి తీసుకువెళ్లేవారు.

మంచి జీవితాన్ని ఇచ్చారు..
మా కుటుంబంలో మా కజిన్స్‌ వాళ్లకి నాన్నే పెళ్లి చేశారట. ఎవరు ఇల్లు కట్టుకుంటున్నామని వచ్చి అడిగినా డబ్బు సహాయం చేసేవారు. ‘లేదు’ అనే మాట వచ్చేది కాదట. బంధువులు, కొన్ని షాపులు చూపించి– ‘ఇది మీ నాన్నే పెట్టించారు’ అని చెబుతుంటే మాకు ఎంతో సంతోషం వేస్తుంది. రెండు వేలు, మూడు వేల రూపాయల చొప్పున చాలామందికి డబ్బు సాయం చేసేవారని చెబుతుంటే, నాన్న చేసిన సహాయమే మాకు శ్రీరామరక్షగా నిలిచింది అనిపించింది. మేం పరిశ్రమకు వచ్చాక మా నాన్నగారి గురించి అందరూ చెప్పటం వల్ల ఆయన గొప్పతనం మాకు తెలిసింది. ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం అన్నీ బావున్నాయి. నాన్న గురించి సినీ పరిశ్రమలో అందరూ మంచి మాటలే చెబుతారు. నాన్నగారు మాకు ఆస్తి కన్నా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చారు. అదే ఆయన మాకు ఇచ్చిన మంచి ఆస్తి. నేను పదో తరగతి పూర్తిచేశాక టీవీఎస్‌ చాంప్‌ కొంటానన్నారు. కాని నా రిజల్ట్స్‌ రాకముందే ఆయన కన్నుమూశారు. అందువల్ల ఆ కోరిక నెరవేరలేదనే బాధ మాత్రం మిగిలిపోయింది. నాన్నగారు కన్నుమూయటంతో అప్పట్లో నాన్న గొప్పతనం మాకు తెలియదు.

మా మంచి వాడు అని అందరి చేత అనిపించుకొన్నారు చిడతల అప్పారావు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -52 52-మొదటి తరం సినీ సంగీత దర్శకుడు,గానకళ,సంగీత కళానిధి గ్రంథరచయిత – గాలి పెంచల నరసింహారావు

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -52 52-మొదటి తరం సినీ సంగీత దర్శకుడు,గానకళ,సంగీత కళానిధి గ్రంథరచయిత – గాలి పెంచల నరసింహారావు

ఇంటిపేరు గాలి .అసలుపేరు పెంచల నరసింహారావు – పెంచల నరసింహారావు) (1903 – 1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం.[1] ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు, పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన తొలి, చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.

1936లో విడుదలైన మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన వివాహభోజనంబు పాటయే ఘంటసాల స్వరపరిచిన 1957లోని మాయాబజార్లోని పాటకు ఆదర్శం.

1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని జిక్కి. ఈ చిత్రంలో ఆమె ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన మాయలోకం చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావును తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడారు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు, ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) – తెరతీయగరాదా దేవా ఆలాపించారు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు.

1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన చెలియా కనరావా, ఎస్.వరలక్ష్మి పాడిన ఎవరినే నేనెవరినే మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే. ఆయనకి సంగీతోపాధ్యాయ అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. మాలపిల్ల (1938) చిత్రంలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు ఈయన తమ్ముడు. ఆయన ఇంటిపేరును చాలామంది గాలి పెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పేరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు. పెంచల నరసింహారావు 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964న 62వ ఏట పరమపదించారు.

చిత్రసమాహారం
సీతాకళ్యాణం (1934)……….మొదటి చిత్రం

    శ్రీకృష్ణ లీలలు (1935)

    మాయాబజార్ (1936)

    మైరావణ (1940)

    గరుడ గర్వభంగం (1943)

    కృష్ణ ప్రేమ (1943)

    పంతులమ్మ (1943)

    మాయలోకం (1945)

    పల్నాటి యుద్ధం (1947)

    బాలరాజు (1948)

    ధర్మాంగద (1949)

    అగ్నిపరీక్ష (1951)

    సీతారామ కల్యాణం (1961)..........చివరి చిత్రం

    ప్రముఖ సంగీత సాహిత్య విశ్లేషకులు శ్రీ వి ఎ కే రంగారావు ‘’ గాలి గారి మొదటి సినిమా సీతా  కల్యాణం, చివరి సినిమాసీతారామ కల్యాణం అవటం విశేషం .సీతాకల్యాణం లో రావణ సభలో  విష్ణు అంశ  సంభూతుడు రాముడిని వెక్కిరిస్తూ ‘’శివదీక్షా పరురాలనురా ‘’జావళి అభినయం చేయించారు .చివరి సీతారామ కల్యాణం లో పాటలస్వరాలు దాదాపు ఆయన చేసినవే .అందులో ‘’శ్రీ సీతా రాముల కల్యాణం చూదము రారమ్మా’’సూపర్ డూపర్ హిట్ .రామారావు గారి సినిమాకు ప్రేరణ సాంగ్ అయింది ఈ రెండు సినిమాలమధ్య  సుమారు 20 సినిమాలకు సంగీతం కూర్చారు ఆయన .సంగీతం లో శాస్త్రీయ ప్రభావం ఎక్కువ .’’కుటిల జన ధిక్కారము సైతునా ‘’అని గగ్గయ్య కంసుడిగా గర్జిస్తే ,పంతుఅలమ్మ సినిమాలో ‘’రాగ సుదారసమే ‘’,మాయలోకం లో ‘’చెలియా మనకేలనే ‘’జావళీ బెజవాడ రాజరత్నం పాడారు.బాలరాజులో ‘’పతి రూపము నీయరయా ‘’  అంటూ క్షేత్రాటనం చేసే ఎస్ వరలక్ష్మి పాడిన రాగమాలిక ,ధర్మా౦గదలో కృష్ణ వేణి పాడిన అలాంటిదే రాగమాలిక ,అగ్ని పరీక్షలో లీల పాడిన ‘’నిండు పున్నమి హాయి ‘’శాస్త్రీయ రాగ ఆధారాలైన సినిమా పాటలకు మణి మకుటాలు .

      ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆనాటి కృష్ణ ప్రేమ సినిమాలో ఉన్న 20పాటలూ ఒక ఎత్తు .అన్నీ రామణీయమైనవే.శాంతకుమారి పాడిన ‘’ఇదే ఆనంద మహహా ‘’,’’ఊదుము కృష్ణా’’వింటే ఆనంద తాండవమే .సూర్యకుమారి పాడిన ‘’కృష్ణా జేజేలయ్యా గోపాలా ‘’,’’రారాధా ఆటలాటి పోరాడా’’ రసగుళికలు .భానుమతి పాడిన ‘’చెంగల్వ పూవులోన ‘’నిజంగానే చెంగల్వ పరిమళ శోభే .సంగీత దర్శకుడు చేసుకొన్నా అదృష్టం ఇది .తర్వాత వచ్చిన కృష్ణప్రేమలో ఆనాటి పాటలు రెండు ‘’రేపే వస్తాడట గోపాలుడు –మాపే వస్తాడటగోపాలుడు ‘’  ఎక్కడున్నావే పిల్లా ‘’ఉంచారు .

      రెండు తమిళ సినిమాలకూ ఆయన సంగీతం కూర్చారు .సినిమాలలోకి రాక పూర్వం నాటకాలకు హార్మోనిస్ట్ గా ఉండేవారు .ఈ అనుభవం తో ‘’గాన కళ’’పుస్తకం రాశారు .ఇందులో తాను స్వయంగా రాసిన జావళీలు,పదాలు కీర్తనలు ,ప్రార్ధనలు స్వరపరచి ఇచ్చారు .కొన్ని హిందుస్తానీ తిల్లానాలు ,కాలేజ్ గరల్ ,సొరాబ్ రుస్తుం ,నారద వివాహం మొదలైన నాటకాలకు పాటలు కూర్చారు వీటికి మాత్రుకలైన ఇతర పాటల జాబితా కూడా ఇచ్చారు .’’సంగీత కళానిధి’’ అనే ఉద్గ్రంధం కూడా రాశారు .

      మద్రాస్ తేనాం పేట స్వగృహం లో ఆయన మరణించారు ‘’అని రంగారావు గారు తమ ‘’సరాగామాల’’లో రాశారు .

      సశేషం

    మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51 • 51-స్వాతంత్ర్య సమరయోధులు ,కవి , అవధాని ,కవితా కళానిధి ,నటుడు ‘’హరిశ్చంద్ర నాటక ఫేం’’,పుంభావ సరస్వతి –బలిజే పల్లి • బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 – జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది. జీవిత సంగ్రహం వీరు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్, 1881 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు. కర్నూలులో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి అవధానాలు ప్రదర్శించారు. చల్లపల్లి రాజావారి సాయంతో 1922లో గుంటూరులో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో నక్షత్రకుడు పాత్ర వీరికిష్టమైనది. 1932లో రంగూన్ ఆంధ్రుల ఆహ్వానం పై వెళ్లి కక్కడ కళాశాలలో విద్య ను గురించి ఉపన్యశించి ‘’సత్య హరిశ్చంద్రీయ నాటకం ‘’ప్రదర్శించారు .అక్కడ ‘’కవితా కళానిధి ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించారు తర్వాత కాలంలో చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు. 1942లోచలన చిత్ర సంఘం అతిఘనంగా సన్మానించి ‘’పుంభావ సరస్వతి ‘’బిరుదు నిచ్చి గౌర వించింది వీరు 30 జూన్, 1953 సంవత్సరం కాళహస్తిలో పరమపదించారు బలిజేపల్లి రచనలు • శివానందలహరి శతకం (శంకరుని కృతికి ఆంధ్రీకరణం) • స్వరాజ్య సమస్య (పద్య కృతి) • బ్రహ్మరథం (నవల) • మణి మంజూష (నవల) • బుద్ధిమతీ విలాసము (నాటకము)[1] : శివ భక్తాగ్రేసరుల్లో ఒకరిగా పేరొందిన శిరియాళుని కథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకాన్ని రచించారు. • సత్యహరిశ్చంద్రీయము (నాటకము)[2] • ఉత్తర గోగ్రహణము (నాటకము) • సాత్రాజితీ పరిణయము (నాటకము) • ఉత్తర రాఘవము (భవభూతి రచించిన నాటకానికి ఆంధ్రీకరణం)[3] చిత్ర సమాహారం 1. లవకుశ (1934) (మాటలు, పాటల రచయిత) 2. హరిశ్చంద్ర (1935) (రచయిత) 3. అనసూయ (1936) (రచయిత) 4. మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, మాటల రచయిత) 5. వర విక్రయం (1939) (నటుడు, మాటల రచయిత) 6. భూకైలాస్ (1940) (మాటల రచయిత) 7. విశ్వమోహిని (1940) (మాటల చయిత) 8. బాలనాగమ్మ (1942) (నటుడు, రచయిత) 9. తాసిల్దార్ (1944) (నటుడు, మాటల రచయిత) 10. సీతారామ జననం (1944) (విశ్వామిత్ర)[4] 11. రక్షరేఖ (1949) (నటుడు, కథ, మాటల రచయిత) 12. బ్రహ్మరథం (1947) (నటుడు, కథ, పాటల రచయిత) 13. భీష్మ (1944) (నటుడు) 14. నా చెల్లెలు (1953) 15. మంజరి (1953) (నటుడు, మాటల రచయిత) 16. జీవిత నౌక (1951) (మాటలు, పాటల రచయిత)[5] సత్య హరిశ్చంద్ర ఈ నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. ఉదాహరణకు కొన్ని పద్యాలు: మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్ నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్. బలిజే పల్లి వారి గురించి శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు చెప్పిన విషయం • • దేవులపల్లి రామానుజరావు • • నాటక సంఘాలు, నాటక ప్రదర్శనాలు ఆ రోజులలో యీ రెండు ప్రాంతాల మధ్య స్నేహసంబంధాలు వర్ధిల్లచేసినవి. మైలవరం కంపెనీ, సురభి కంపెనీ మొదలైన నాటక సంఘాలు తెలంగాణ ప్రాంతములోని ముఖ్యపట్టణాలలో నాటక ప్రదర్శనాలు చేస్తుండేవి. సతీసావిత్రి, కృష్ణతులాభారం, సారంగధర, చిత్రనళలీయము మొదలైన నాటకప్రదర్శనాలు జరుగుతుండేవి. చిలకమర్తివారి గయోపాఖ్యానం”, ధర్మవరం కృష్ణమాచార్యులవారి నాటకాలు చాలా ప్రచారంలో ఉండేవి. ప్రతి పల్లెటూల్లో కొందరైనా యీ నాటకాలు చూచిన వారుండేవారు. కపిలవాయి రామనాథశాస్తి, వేమూరి గగ్గయ్య, ఉప్పులూరి సంజీవరావు ప్రభృతులైన నటకుల పేర్లు తెలంగాణలో చదువుకున్న వారందరికి బాగా తెలిసినవే. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు సికిందరాబాదుకు వచ్చి సత్యహరిశ్చంద్ర నాటకం వేసినప్పుడు నేను స్వయంగా చూచినాను. లక్ష్మీకాంతంగారి వద్యవఠన మనోరంజకంగా ఉండేది. ఆయన ఒకటి రెండు సాహిత్యసభలలో ప్రసంగించినట్లు నాకు జ్ఞాపకం. మేము కొంతమంది విద్యార్థులము బలిజేపల్లి లక్ష్మీకాంతంగారిని సికిందరాబాదులో కలుసుకున్నప్పుడు వారు తమ ఉత్తరరామచరిత్రములోని కొన్ని భాగాలు మాకు వినిపించి, తాము అందులో అనువదించిన పద్యాలు మూలంతోపాటు మనోజ్ఞంగా చదివినప్పుడు నా హృదయం కదిలిపోయింది. తరువాత లక్ష్మీకాంతం గారి ‘ఉత్తరరామ చరిత్ర నాటకాన్ని కొని చదివి ఆనందించినాను. నాకు యీ నాటికి భవభూతి ఉత్తరరామ చరిత్ర మూలం చాలా యిష్టమైన రచన. ఇందుకు కారణం ఒకవిధంగా బలిజేపల్లి లక్ష్మీకాంతంగారే అని చెప్పవచ్చును. హైదరాబాదు నేను తొలిసారి 1934 సంవత్సరంలో వచ్చినాను. నిజాం కళాశాలలో నాల్గు సంవత్సరాల విద్యాభ్యాసము – ఈ దశలో ఆంధ్రప్రాంతం నుండి వచ్చిన కొందరు కవిపండితులను సందర్శించే భాగ్యం కలిగినది. ఆ రోజులలో తెలుగు నాటకాలు సికిందరాబాదులో అప్పుడప్పుడు ఆడుతుండేవారు, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనం 1985-36లో కాబోలు జరిగినది. నాటకాన్ని వ్రాసిన బలిజేపల్లి లక్ష్మీకాంతంగారే స్వయంగా అందులో ఒక పాత్రధారి. హాస్టల్‌లోని విద్యార్థులం కొందరం ఆ నాటకాన్ని సికిందరాబాదువెళ్ళి చూచినాము. మరునాడు ఆయనను కళాశాలకు ఆహ్వానించినాము. ఆయన చక్కని ఉపన్యాసము చేసినారు. ఆయన కంఠము ముఖ్యంగా పద్యాన్ని పఠించే పద్ధతి నావంటి వారిని ఎందరినో ఆకర్షించినది. ఆ తరువాత కొన్ని రోజులకు కాబోలు పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు సికిందరాబాదుకు వచ్చినారు. అప్పుడు వారు ఏవో కొన్ని చిక్కులలో ఉండినారని అందుచేత మనస్సు కొంచెం వికలమై ఉండినదని మేము విన్నాము. అయినప్పటికి ఆయనను వెళ్ళి ఆహ్వానించగానే కళాశాలకు వచ్చి మహోపన్యాసం చేసినారు. అంతకుముందు పత్రికలో సాక్షి ఉపన్యాసాలు చదివిన మాకు ఆయన ఆనాడు “నాయనలారా! అని మొదలుపెట్టి ఉపన్యసించగా సరిగా జంఘాలశాస్రి వలెనే ప్రసంగించినట్లు తోచినది. ఆయన కాషాయరంగు ధోవతి, అదే రంగు షర్టు, పూర్తిగా నెరసిన తెల్లని మీసాలు, తెల్లటి క్రాఫు, కొంచెం దుర్చలంగా ఉండే శరీరంతో వేదికమీద నిలిచినారు. మాట్లాడినంతసేపు సభ నిశ్శబ్దంగా ఉండినది. మా ఆచార్యులందరూ వారికి చేయెత్తి నమస్మరించినారు. ఈ దృశ్యాన్ని నేను ఎన్నడూ మరువలేను. తిరుపతి వెంకటకవులను గూర్చి మేము వింటూ ఉండేవారము. ఆయన కుమారులు మరొకరితో కలిసి సత్యదుర్గేశ్వర కవులుగా హైదరాబాదుకు వచ్చి మా కళాశాలలో అవధానం చేసినారు. మనోరంజకంగా అవధానం జరిగినది. ఆ సభకు రాయప్రోలు సుబ్బారావుగారు అధ్యక్షులు. ఆనాడే మొదటిసారి నేను ఆయనను చూడడం జరిగింది. అధ్యక్షోపన్యాసం ఒక పద్యంతో ఆయన ఆరంభించినారు. ఇట్లు ఆరంభించడం ఆయనకు అలవాటు. ఆ పద్యం యింకా నాకు జ్ఞాపకమున్నది. • • పుంభావ సరస్వతి ‘బలిజేపల్లి’ • ఆయన పేరు విన్నంతనే స్ఫురించేది `సత్య హరిశ్చంద్రీయం`. దాని పేరు తలచినంతనే గుర్తుకు వచ్చేది బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. ఆ రెండు పేర్లు అంతలా మిళతమయ్యాయి. కందుకూరి వీరేశలింగం పంతులు నుంచి బలిజేపల్లి లక్ష్మీకాంతం వరకు పద్దెనిమిది మంది `హరిశ్చంద్ర` నాటకాలు రాసినా, బలిజేపల్లి వారి `సత్యహరిశ్చంద్రీయం` ప్రసిద్ధి పొందింది. 1912లో రాసిన ఈ నాటకం అయనకు అపారమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. తిరుపతి వేంకటకవుల `పాండవో ద్యోగం`, చిలకమర్తి లక్ష్మీనరసింహం `గయోపాఖ్యానం` సరసన నిలిచిన నాటకం ఇది. గయోపాఖ్యానం మాదిరిగానే హరిశ్చంద్రీయం నాటకం ఆ రోజుల్లోనే లక్ష ప్రతులు అమ్ముడయ్యాయట. • జానపదులను ఆకర్షించిన నాటకం • నాగరీకులనే కాకుండా జానపదులను కూడా బాగా ఆకర్షించిన నాటకంగా దీనిని చెబుతారు. సన్నివేశ కల్పనలో దానికి అదే సాటి అని, సంభాషణల్లో దానికి మించిన నాటకంలేదని విమర్శకులు అంటారు. ఈ నాటకం ప్రదర్శించని పల్లెకానీ, పట్నం కానీలేదు. కొన్ని సందర్భాలలో ఆయా నాటకాలను పూర్తిగా ప్రదర్శించలేకపోయినప్పటికీ `పాండవోద్యోగం`లో శ్రీకృష్ణ మందిరంలో పడక దృశ్యం, హరిశ్చంద్రుడు కాటికాపరిగా మారిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. భక్తసిరియాళుడి కథా ఇతివృత్తంగా రాసిన `బుద్దిమతీ విలాసం`బలిజేపల్లి వారి తొలి నాటకం.సంస్కృతంలో భవభూతి రచించిన `ఉత్తర రామచరిత` ఆధారంగా రాసిన `ఉత్తరరాఘవం` రెండవ నాటకం. `సాత్రాజితీయం` ఆయన రాసిన మరో నాటకం. అయితే ఇది`సత్యాకృష్ణుల కల్యాణం`గానే ప్రదదర్శితమైంది • నటుడిగా… • బలిజేపల్లి మంచి ఉత్తమ నాటక కర్తే కాక ఉత్తమ నటుడు కూడా. తాను రాసిన నాటకాలలోని కథానాయకుడి పాత్రలను ఆయనే పోషించేవారు. హరిశ్చంద్ర పాత్రను ఎంతో హుందాగా పోషించేవారు. అనంతర నట ప్రముఖులు డీవీ సుబ్బారావు, మల్లాది సూర్యనారాయణ లాంటి వారు ఈ పాత్ర పోషణలో ఆయననే వరవడిగా తీసుకునేవారని చెబుతారు. రంగస్థల మహానటుడు మల్లాది బలిజేపల్లి వారి పద్యాలతో పాటే జాషువా పద్యాలను కలిపి హరిశ్చంద్ర నాటకాన్ని మరింత రక్తింకట్టించేవారు. • కృష్ణపాత్రలో మనోహరం • అలాగే `సాత్రాజితీయం`లోని కృష్ణ పాత్రలో బలిజేపల్లి మనోహరంగా కనిపించే వారట. ఆయన ఎన్ని పాత్రలు ధరించినా `సత్యహరిశ్చంద్ర`లోని నక్షత్రకుడిగా మాత్రం అనితర సాధ్యంగా నటించేవారట. ఆ పాత్రలో ఆయన నిరుపమానంగా ప్రకాశించి చిరకీర్తిని ఆర్జించారు. ఆయన రంగస్థల ప్రదర్శన ఇస్తుంటే ఎంతటి జడివాన కురిసినా ప్రేక్షకులు కదలేవారు కాదు. 1930లో రంగూన్ లో ప్రదర్శితమైన హరిశ్చంద్ర నాటకం అందుకు ఉదాహరణ. • నక్షత్రకుడిలో పరిణామం • హరిశ్చంద్రుడు కాటికాపరిగా వీరబాహువుకు అమ్ముడైపోయిన తరువాత ఆ ధనాన్ని విశ్వామిత్రునికి అందచేయాలని కోరినప్పుడు, అప్పటి వరకు అయిన దానికి కానిదానికి వేధిస్తూ వచ్చిన నక్షత్రకునిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. సర్వం సహా చక్రవర్తి హరిశ్చంద్రుడు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి హీనమైన దాస్యవృత్తికి అంగీకరించి అమ్ముడుపోయిన సన్నివేశంలో నక్షత్రకుడిలో మానవత్వం మేల్కొంటుంది. ఆయనలోని అసలు మనిషి వెలికి వస్తాడు. ఆయనలోని కాఠిన్యం కరిగిపోతుంది. సత్యధర్మరక్షణ కోసం జీవితాన్నే త్యాగం చేసిన హరిశ్చంద్రుడు తన తన గురువు విశ్వామిత్రుడి కంటే ఉన్నతుడనే భావన కలుగుతుంది.ఎంతో విలపిస్తూ హరిశ్చంద్రుడికి వీడ్కోలు పలుకుతున్న నక్షత్రకుడిగా బలిజేపల్లి ప్రదర్శించిన నటన అనన్యసామాన్యం. మహోన్నమైన ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులంతా కన్నీరు మున్నీరయ్యారు. మబ్బులు కమ్మి చినుకులు మొదలై, కుంభవృష్టిగ మారినా ప్రేక్షకులు కదలలేదట. వారి ఉత్సాహాన్ని చూస్తూ వర్షంలోనే నాటకం చివరికంటా సాగింది. • సినీనటుడుగా…. • తెలుగు సినీరంగం ఆయన అఖండ ప్రతిభకు స్వాగతం పలికింది. ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. నటనతో పాటు కొన్ని చిత్రాలకు కథలు, మాటలు, పాటలు అందించారు. హరిశ్చంద్ర,అనసూయ,మళ్లీపెళ్లి,జరాసంధ,భూకైలాస్, వరవిక్రయం, విశ్వమోహిని, బాలనాగమ్మ,తసిల్దార్, బ్రహ్మరథం, రక్షరేఖ, సీతారామజననం, భీష్మ, నా చెల్లెలు, మంజరి, జీవితనౌక లాంటి చిత్రాలు ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనాలు. `వరవిక్రయం`లో ఆయన పోషించిన సింగరాజు లింగరాజు పాత్ర చిరస్మరణీయం. • దేశభక్తుడు • బలిజేపల్లి దేశభక్తుడు,స్యరాజ్య సమరయోధుడు. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేశభక్తి గీతాలతో ఉద్యమాన్ని తేజోవంతం చేసినందుకుఆంగ్లేయుల ప్రభుత్వం రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అంతకుముందు 1922లో చల్లపల్లి రాజావారి సహకారంతో గుంటూరులో `చంద్రిక ముద్రణాలయం` నెలకొల్పారు. • జీవిత విశేషాలు • గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని ఇటిపంపాడులో 1881 డిసెంబర్ 23న జన్మించిన లక్ష్మీకాంతం మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య ఇంటపెరిగారు. మేనత్త సరస్వతమ్మ వద్ద భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. భారత భాగవత రామాయణాల్లో ఆమెకు విశేష పాండిత్యం. మేనల్లుడిని ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నెన్నో కథలు, గాథలు,పురాణ రహస్యాలను బోధించి, భావి కాలంలో ఓ గొప్ప కవి. నటుడి ఆవిర్భావానికి సహకరించారు. అటు అమ్మా నాన్నలు, ఇటు మేనత్త శిక్షణతో బలిజేపల్లి చిన్నతం నుంచే సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పసాగారు. కర్నూలులో మెట్రిక్యులేషన్ పూర్త చేసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం పొందారు. • అధ్యాపకుడిగా ఉద్యోగం • కానీ నచ్చక దానిని వదిలేసి గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేసి అదీ నచ్చక దానినీ వదిలేశారు. ఆయన వైఖరిని చూసి` స్థిరత్వం లేనివాడని, చంచల స్వభావుడని ` బంధువులు, అయినవారు అంటుండేవారు. కానీ ఆయనలో కళాతృష్ణ నాటకరంగవైపునకు నడిపించింది. అర్థరూపాయి ప్రయోజనం లేక పోయినా అరవై మైళ్లు వెళ్లి నాటకం వేయాలన్న సామెత లాంటిది ఆయనలో నాటుకుపోయింది. బలిజేపల్లి పుట్టినప్పుడే అటుఇటుగా ఏర్పాటైన `హిందూ నాటక సమాజం` ఆయనను ఆదరించింది. • ఆచార్య కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి • ప్రముఖ కవి ఆచార్య కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ నాటక సమాజాన్ని స్థాపించారు. సుప్రసిద్ధ నటులు హరి ప్రసాదరావు,కోపెల్ల హనుమంతరావు లాంటి వారు ఈ సంస్థ ద్వారా ఎన్నో పాత్రల్లో నటించారు. స్వరాజ్య సమరంలో గాంధీజీకి ఎంతో ప్రేమాస్పదుడైన దేశభక్తి కొండా వెంకటప్పయ్య ఈ సమాజంలో స్త్రీల పాత్రలు ధరించేవారు. అలాంటి నాటక సమాజం బలిజేపల్లి రాకతో సహస్ర ప్రభల సూర్య బింబంలా మెరిసిపోయిందని నాటక విమర్శకులు చెబుతారు. • ఫస్టు కంపెనీ నాటక సమాజం • అటు తరువాత గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి సత్యహరిశ్చంద్రీయం , ఉత్తర రాఘవాది నాటకాలు అనేకసార్లు ప్రదర్శించారు. రంగూన్ తెలుగువారు ఆయనను `కవితా కళానిధి` బిరుదుతో ఘనంగా సన్మానించుకున్నారు. మద్రాస్ నాట్య కళాపరిషత్ ఆయనకు షష్టిపూర్తి మహోత్సవాన్ని నిర్వహించింది. ఆయనకు వారసుడిగా హరిశ్చంద్ర పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన డీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లక్ష్మీకాంత కవిని `పుంభావ సరస్వతి` బిరుదుతో ఘనంగా సత్కరించారు. • ఆధ్యాత్మిక చింతన, ఆశ్రమ నివాసం • ఆయనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక చింతన జీవితం చివరి ధశలో ఉవ్వెత్తున వెలుగు చూసింది. భౌతిక సుఖాలకు దూరంగా శ్రీకాళహస్తిలో చిన్న ఆశ్రమం లాంటి ఇంటలోగడిపారు.బఐదు వేల పైచిలుకు పద్యాలతో `సుందరకాండ` కావ్యాన్ని రచించారు. కళారంగంలో పరిశ్రమించి, ప్రతి దశలోనూ త్రికరణశుద్ధిగా జీవించిన మహాకవి, నటుడు 72వ ఏట శివైక్యం చెందారు. తెలుగుభాష ఉన్నంత కాలం `హరిశ్చంద్ర` నాటకం, అది ఉన్నంత వరకు బలిజేపల్లి జీవించే ఉంటారు. (ఒంగోలులో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ తెలుగు నాటక సౌధానికి తలమానికంగా నిలిచిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ 23-12-19, సోమవారం సాయంత్రం ఒంగోలులోని సి.వి.యన్ రీడింగ్ రూం లో ‘శ్రీ నాగినేని నరసింహరావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ‘ ఆధ్వర్యంలో జరిగింది. సభకు సంస్థ అధ్యక్షులు మిడసల మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు.ఈసందర్భంగా నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డా.నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ బలిజేపల్లి వారు 1881డిసెంబర్ 23వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా లోని ఇటికంపాడులో ఆదిలక్ష్మమ్మ, నరసింహ శాస్త్రి దంపతులకు జన్మించారని,ఆయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్ళి అక్కడే ఈసందేశాత్మకమైన నాటకం “సత్య హరిశ్చంద్ర” ను రచించారని అన్నారు.అనంతరం రంగస్థల నటులు కనమాల రాఘవులు మాట్లాడుతూ ఈనాటకాన్ని శతాధికకవులు నాటకంగా రాసినప్పటికీ బలిజేపల్లి వారి నాటకమే అజరామరంగా నిలిచిందని పేర్కొన్నారు.కవితాశక్తితో పాటు దేశభక్తి కూడా ఆయనకు ఎక్కువగా ఉందని,ఆయన పద్యాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని డా.నూనె అంకమ్మరావు,కుర్రా ప్రసాద్ బాబులు తెలుపగా,బలిజేపల్లి వారి పద్యాలను రాగయుక్తంగా భువనగిరిబలిజేపల్లి లక్ష్మీకాంత కవి అందించిన హరిశ్చంద్ర నాటకం తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు ప్రేరణ. రంగస్థల కళాకారులు, పద్య, గద్య రచయితలు బలిజేపల్లి పేరును మరిచిపోలేరు. నిత్య సత్యవంతుడు హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి కథ ఆధారంగా బలిజేపల్లి 1912లో ‘హరిశ్చంద్రీయము’ నాటకం తన 31వ యేట రాశారు. ఈ నాటకంలో హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు పాత్రలను లక్ష్మీకాంతమే పోషించారు. ఇందలి పద్య రచన ఒక జలపాతం. పండిత, పామరుల్ని అలరింప జేశాయి. పంటచేలల్లో పనులు చేసుకునే వారి నాలుకలపై సైతం నర్తించాయి. బలిజేపల్లి వారు చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహంతో చిత్ర సీమలోకీ అడుగు పెట్టారు. అనసూయ (1936), జరాసంధ (1938), వరవిక్రయం (1939), భూకైలాస్‌ (1941), బాల నాగమ్మ (1944) వంటి పదికి పైబడిన సినిమాలలో మాటలు, పాటలు, సంభాషణలు వంటివి రాశారు. కొన్ని సినిమాల్లో పాత్రలు వేశారు. శివానందలహరి శతకం, స్వరాజ్య సమస్య పద్య కృతి, బ్రహ్మ రధం, మణి మంజూష నవలలు, బుద్థిమతి విలాసం, ఉత్తర రాఘవీయం నాటకాలు రాశారు. 1923లో చల్లపల్లి రాజా సహకారంతో గుంటూరులో చంద్రిక ముద్రణాలయాన్ని స్థాపించారు. 1926లో ఫస్ట్‌ కంపెనీ పేరిట నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1930లో రంగూన్‌ తెలుగువారు ‘కవితా కళానిధి’ బిరుదుతో సత్కరించారు. 1942లో చలనచిత్ర రంగం ‘పుంభావ సరస్వతి’ బిరుదుతో సన్మానించింది. శేష జీవితాన్ని కాళహస్తిలో గడిపి 1953లో కన్నుమూశారు. మాజీగావర్నార్ బహుభాషా కోవిదుడు డా బూర్గుల రామకృష్ణారావు గారు బలిజే పల్లి గురించి బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి విరచిత ప్రఖ్యాత నాటకం సత్యహరిశ్చంద్రీయము. సత్యనిష్ఠకు నిలిచి దారాసుతులను తనకు తాను అమ్ముడై నిలిచి సత్యహరిశ్చంద్రునిగా పేరు గాంచిన అయోధ్య చక్రవర్తి ఇనవంశోద్భవుడు హరిశ్చంద్రుని కథను నాటకం గా హృద్యంగా మలిచారు బలిజేపల్లి వారు. . ఈ నాటకాన్ని బలిజేపల్లివారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో కారాగారవాస సమయంలో రచించాడు.ఈ నాటకంలో పద్యాలన్నీ అనర్ఘ రత్నాలు. అన్నీ జనాదరణ పొందినవి. అందరి నోటిలో నానేవి. వాటిలో కొన్నిటినే ఎన్నకొనడం తలకి మించిన పని. నాటకంలో కొన్ని పద్యాలను క్రింద పొందుపరచడమైనది. . హరిశ్చంద్రుడు మాతంగ కన్యలను వివాహమాడడానికి నిరకారిస్తూ మత్తేభం అరయన్ వంశము నిల్పనేగద వివాహంబట్టి వైవాహిక స్పురణంబిప్పటికెన్నడోజరిగెసత్పుత్రుండుపుట్టెన్ వయః పరిపాకంబునుదప్పుచున్నయది యీ ప్రాయంబునన్ వర్ణసం కరపుంబెండిలి యేల చుట్టెదవు నాకఠంబునన్ గౌశికా . రాజ్యాన్ని విశ్వామిత్రునికి దానమిస్తూ శార్ధూలం దేవ బ్రాహ్మణమాన్యముల్విడిచిభక్తిన్ సప్తపోధోదివే లావిభ్రాజదఖండభూవలయమెల్లన్ మీకు దానంబుగా భావంబందొకశంకలేకొసగితిన్ బ్రహ్మార్పణంబంచుదే వా విశ్రాంతిగా నేలుకొమ్మింకను నీవాచంద్రతారార్కమున్ . కాశీనగర వర్ణన తేటగీతి భక్తయోగపదన్యాసి వారణాసి – భవదురితశాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీతటసంఖాసివారణాసి – పావనక్షేత్రములవాసి వారణాసి . చంద్రమతిని విక్రయింప చూచుచూ సీ || జవదాటియెఱుగదీయువలీలామంబుపతిమాటరతనాలపైడిమూట అడుగుదప్పియెఱుగదత్తమామలయాజ్ఞకసమానభక్తిదివ్యానురక్తి అణుమాత్రమైనబొంకనుమాటయెఱుగదీకలుషవిహీననవ్వులనైన కోపందెఱుంగదీగుణవితానవితాంతయెఱులంతనిదూఱుచున్నసుంత తేటగీతి || ఈలతాంగిసమస్తభుపాలమకుట – భవ్యమణికాంతిశబలితపాదుడైన సార్వభౌమునిశ్రీహరిశ్చంద్రుభార్య – దాసిగానీపెగొనరయ్యధన్యులార . కొన్ని పద్యాలలో హరిశ్చంద్రుడు వేదాంతం, కాదు జీవన సత్యాలు మనముందు ఆవిష్కరిస్తాడు. అటువంటి పద్యాలు కొన్ని మత్తేభం తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికే సరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం కరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్’ . శార్ధూలం మాయామేయజగంబెనిత్యమనిసంభావించిమోహంబునన్ నాయిల్లాలనినాకుమారుడనిప్రాణంబుండునందాకనెం తోయల్లాడిన యీశరీరమిపుడిందుగట్టెలంగాలుచో నాయిల్లాలునురాదుపుత్రుండును దోడైరాడు తప్పింపగన్ . చీకట రాత్రి వర్ణన సీ || కలవారి ఇండ్ల లోపలి నిధానమునెత్తనరుగుదొంగలకు సిధ్దాంజనంబు మగల గూరుకనిచ్చి తెగి యంటుగాండ్రకైతారాడుకులటలతార్పుగత్తె అలవోకనలతి పిట్టలబట్టివేటాడుపాడుఘూకములకుబాడిపంట మననంబులోనవింపెసలారుశాకినీఢాకినీసతులచుట్టాలసురభి తేటగీతి || రేలతాంగికినల్లని మేలిముసుగు – కమలజాండంబునకునెల్లగన్నుమూత సత్యవిద్రోహిదుర్యశశ్చవికిదోడు – కటికచీకచియలమెదిక్తటములందు కవితా కళానిధి బలిజే పల్లి –శ్రీ సంగనభట్ల కృష్ణయ్య కాలం ఏదైనా, ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళా నాటకం. 20 వ దశకం ఆరంభంలో ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు అనువదించడం, ఆ కథనే నాటకాలుగా రాయడం జరిగింది. నాటకాలలో పద్యాలకు, పాటలకు ప్రాదాన్యత అధికంగా ఇచ్చిన కాలమది. ఈ విధంగా పలువురు రచయితలు అత్యధికంగా రాసి ప్రదర్శనలకు అవకాశం కల్పించిన నాటకం సత్య హరిశ్చంద్ర. అందునా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర నాటకం మిక్కిలి ప్రజాదరణ పొందింది. సత్యహరిశ్చంద్ర నాటకంలోని కమనీయమైన పద్యరత్నాలు ఎందరో నాటక రచయిత లకు సినిమా నిర్మాత దర్శకులకు స్ఫూర్తిని కలిగించిన బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 – జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. “తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్”…‘మాయామేయ జగంబె నిత్యమని సంభావించి’… ‘చతురంభోధి పరీత భూధరణీ రక్షాదక్ష’ … సాగిరావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో… “దళమౌ పయ్యేదలో నడంగియు…లాంటి హరిశ్చంద్ర నాటకంలోని పద్యాల మాధుర్యాన్ని ఒకసారైనా ఆస్వాదించని తెలుగు నాటక అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇవి అన్నీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి విరచిత ‘సత్య హరిశ్చంద్రీయము’ నాటకం లోనివే. హరిశ్చంద్ర చిత్రానికి మాటలూ, పద్యాలూ భార‌తీయ భాషల్లో ‘హరి‌శ్చంద్ర’ నాట‌కా‌నికి ఒక ప్రత్యేక స్థాన‌ముంది.‌ మూకీ యుగంలో నాలుగు సార్లు, టాకీ యుగంలో ఇరవై సార్లు వెండి‌తె‌ర‌ కె‌క్కిన ఒకే ఒక కథ ఇది.‌ 1913లో చల‌న‌చిత్ర పితా‌మ‌హుడు దాదా సాహెబ్‌ ఫాల్కే ‘రాజా హరి‌శ్చంద్ర’ సిని‌మాను పూర్తి‌స్థాయి మూకీ చిత్రంగా మరా‌ఠీలో నిర్మించిన తరవాత అదే కథను ‘సత్య‌వాది రాజా హరి‌శ్చంద్ర’ పేరుతో మరా‌ఠీ‌లోనే 1917లో లఘు‌చి‌త్రంగా నిర్మించారు. ఇదే మూల కథను ‘సత్య‌వాది రాజా హరి‌శ్చంద్ర’ పేరు‌తోనే రుస్తుంజీ ధోతీ‌వాలా కూడా బెంగాలీ భాషలో నిర్మించాడు.‌ తెలు‌గులో 1935లో ఒక‌సారి 1956లో మరొకసారి 1965లో చివ‌రి‌సారి హరి‌శ్చంద్ర సినిమా వచ్చింది.‌ ఇన్ని‌సార్లు ఇదే కథను సిని‌మాగా మల‌చ‌డా‌నికి కారణం ఆ నాటికే ఆ నాటకం ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గని ముద్ర వేయ‌డమే.‌ ఆ నాటక కర్త కవితా కళానిధి బలిజేపల్లి కావడం తెలుగు వాళ్లకు గర్వకారణం. ఆ నాటకంలోని పద్యాలు, సంభాషణలు నాడు వెలుగు వారి నోళ్లలో నిరంతరం నానుతూనే ఉండేవి. అనేక చిత్రాలకు మార్గదర్శి 1935లో తెలుగు తొలిటాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ నిర్మించిన స్టార్‌ ఫిలిం కార్పొ‌రే‌షన్‌ సంస్థ ‘హరి‌శ్చంద్ర’ సినిమాను తెలుగులో నిర్మించినప్పుడు బలి‌జే‌పల్లి నాట‌కాన్ని స్పూర్తిగా తీసుకోవడం గమనార్హం. ఆ చిత్రానికి మాటలు, పాటలు, పద్యాలు బలిజేపల్లి కవే సమకూర్చడం విశేషం. 1936లో అదే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీ అనసూయ’, ‘ధృవ విజయము’ జంట సినిమాలను నిర్మించారు. ఈ చిత్రాల నిర్మాణం కలకత్తాలోనే జరిగింది. ఈ చిత్రాలకు కథ, మాటలు, పాటలు, పద్యాలు రాసేందుకు బలిజేపల్లిని చిత్తజల్లు పుల్లయ్య కలకత్తాకు ఆహ్వానించారు. తెలుగులో వచ్చిన తొలిబాలల చిత్రం ‘ధృవ విజయం’ కావడం విశేషం. సాంఘిక చిత్రాలకూ మాటలు, స్క్రిప్టు 1938లో జయా ఫిలిమ్స్ సంస్థ చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తొలిచిత్రంగా ‘కృష్ణ జరాసంధ’ సినిమాను నిర్మించింది. వేలూరి శివరామశాస్త్రి రచించిన కథకు బలిజేపల్లి పాటలు, పద్యాలు సమకూర్చారు. 1939లో జగదీశ్ ఫిలిమ్స్, అధినేత వై.వి.రావు (యరగుడిపాటి వరదరావు)దర్శకత్వంలో ‘మళ్ళీపెళ్లి’ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు బలిజేపల్లి రాశారు. 1921-23 ప్రాంతాల్లో కాళ్ళకూరి నారాయణరావు వరకట్న పిశాచిని నిరసిస్తూ ‘వరవిక్రయం’ అనే నాటకాన్ని రచించారు. ఆ నాటకానికి బలిజేపల్లి మాటలతోబాటు అందుకు అవసరమైన పాటలు కూడా రచించి మంచి స్క్రిప్టును తయారు చేశారు. పుల్లయ్య కోరికమీద అందులో బలిజేపల్లి పిసినిగొట్టు భూస్వామి ’సింగరాజు లింగరాజు’ పాత్రను పోషించారు. మాటలూ, పాటలూ, కథలు 1940లో బలిజేపల్లి ఎ.వి.ఎం వారు నిర్మించిన ‘భూకైలాస్’, న్యూటన్ స్టూడియో తరఫున వై.వి.రావు నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వమోహిని’ సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. శ్రీజగదీశ్ సంస్థ బ్యానర్ మీద దర్శకనిర్మాత సమర్పించిన రెండవ చిత్రం ‘విశ్వమోహిని’. ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది బలిజేపల్లి లక్ష్మీకాంతం. 1942లో “జీవన్ముక్తి” చిత్రానికి మాటలు పాటలు సమకూర్చిన బలిజేపల్లి ‘రాజగురు’ పాత్రను పోషించారు.బుర్రకథను ఆధారం చేసుకొని బాలనాగమ్మ’ చిత్రాన్ని నిర్మించగా, బలిజేపల్లి అద్భుతమైన కథను సమకూర్చి, దానికి సంభాషణలు, పాటలు రాశారు. ఇందులో బలిజేపల్లి నవభోజరాజు పాత్రను పోషించడం విశేషం. చిత్రాలలో నటన సైతం 1944లో శ్రీజగదీష్ ఫిలిమ్స్ వై.వి.రావు ‘తహసిల్దార్’ అనే చిత్రాన్ని నిర్మించగా బలిజేపల్లి ‘సీతయ్య’, ‘పానకాలు’ అనే రెండు పాత్రలను పోషించారు. బలిజేపల్లి రచించిన నవల ‘బ్రహ్మరథం’ ఆధారంగా 1947లో శ్రీవెంకట్రామా పిక్చర్స్ బ్యానర్ మీద మీర్జాపురం రాజావారు ప్రధమ కానుకగా చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘బ్రహ్మరథం’ చిత్రాన్ని నిర్మించగా, చిత్రానికి కథ, మాటలు, పాటలు బలిజేపల్లి సమకూర్చారు. బలిజేపల్లి కథ, మాటలు, పాటలు సమకూర్చి నటించిన చివరి సినిమా ‘రక్షరేఖ’ (1949). ఆర్. పద్మనాభన్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి, కస్తూరి శివరావు, వంగర వెంకటసుబ్బయ్య, కనకం, గంగారత్నం ముఖ్య తారాగణం. ఇందులో బలిజేపల్లి ప్రతాప మహారాజు పాత్రను పోషించారు. అక్కినేని ఆయన కొడుకు సుధాకరుడుగా నటించారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్ 1881న నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మలకు జన్మించిన బలిజే పల్లి 30 జూన్,1953న కాళహస్తిలో పరమ పదించారు. (డిసెంబర్ 23… బలిజేపల్లి లక్ష్మీకాంతం జయంతి) సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-22-ఉయ్యూరు • • • • , _! • • • • • • •

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -4

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -4

రాలిన పువ్వు కావ్యం మొదట్లో కవి కుమారన్ ఆశన్ ‘’సుందరపుష్పమా !ఒకప్పుడు రాణీ లాగా మహోజ్వలంగా ప్రకాశించావు –ఇప్పుడు కాంతి విహీనమై ధూళి లో పొర్లుతున్నావ్ –ఈ లోకం లో భాగ్యం చపలమైంది –సౌందర్యం అశాశ్వతం ‘’అంటాడు. పువ్వు బాల్యాన్ని –‘’లత ప్రేమతో నిన్నుకన్నది –మృదువైన ఆకుల గుండెలో హత్తుకొని –ప్రియంగా పెంచి పెద్ద చేసింది –మందసమీరాలు నీకు జోలపాడాయి .’’యవ్వనం లోపువ్వు –‘’కొత్తగా పుట్టుకొచ్చిన చిరునవ్వు నీ బుగ్గలపై మెరుస్తోంది –ఎవరైనా సరే క్షణం నిల్చి నీ సోయగాన్ని ఆరాధిస్తారు ‘’మొదట్లో రాణి అని సంబోధించి ఇప్పుడు తరుణీ లలామగా భావన చేశాడు .ఈ లావణ్యవతికి ఎందఱో ప్రియులున్నారు .కానీ ముదురు నీలం రంగు కీటకాన్ని ఎంపిక చేసుకొని అతడితో ఆనందాబ్ది లో తేలియాడింది .ఈ ఆనందం ఎక్కువకాలం నిలవక పువ్వు రాలిపోయింది .ప్రియుడు దాని చుట్టూ తిరుగుతూ రోదిస్తున్నాడు .’’మృత్యువు  నీపై నిర్దయహస్తాలు సాచి నీ పరిమళ భరిత శ్వాసను ఘనీభవింప జేసింది ‘’అని దుఃఖించాడు .’’నువ్వు రాలిపోవటం చూసి చిన్న చిన్న సాలీడులు నీకు మృదువైన పట్టుతో శవ వస్త్రం అల్లాయి –మంచు ముత్యాలతో దండ వేసింది –చుక్కలు మంచు బొట్లుగా కన్నీరు కార్చాయి –చెట్టుపై పిచ్చుకలు కిందికి దిగి నీ చుట్టూ ప్రదక్షిణాలు చేశాయి ‘’అని బాధపడ్డాడు .చివరికి ‘’మంచి వాళ్ళకే మృత్యువు త్వరగా ఆసన్నమౌతుందేమో ‘’అని వేదన చెందాడు .మరణం లేని ఆత్మ శరీరాన్ని ఆశ్రయిస్తుంది-అది ఆకారం దాల్చినా –అనంతమైన దైవ శక్తివల్లనే ‘’అని ముగిస్తాడు .

   ప్రణయ కావ్యాలు

1-నళిని –అంటే తామరపువ్వుల సమూహం –ప్రతీకవాదం ఉన్నకావ్యం .మళయాళ  సాహితీ వేత్తలు  ఆశాన్ ను ‘’స్నేహ గాయకన్ ‘’అంటారు.ప్లేటోనిక్ లవ్ ఉంటుంది .మానవ జీవిత భావా వేశాలతో రాసినా ఆయనలో  సాంస్క్రుతికత పోలేదు –దైవేచ్చ ఎవరికీ తెలీదు –జీవితం బుద్బుదప్రాయం ‘’

 గృహస్తు

1911లో తల్లి చనిపోతే స్మ్రుతి గీతం రాశాడు .డా పల్పు మేనమామ  కుమారు రైటర్ గారి కుటుంబం కూడా ఆశాన్ ను ఆత్మీయుడిగా చూసింది .రైటర్ భార్యకు ఇతనికవిత్వం చాలా ఇష్టం .వీరి అమ్మాయి ఒకప్పుడు ఈయన శిష్యురాలు భానుమతి. ఈయన 45వ ఏట 17 ఏళ్ళ ఆ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకొన్నాడు .ఈవిషయాన్ని కవిత్వపరంగా ‘’తరుణం వచ్చినప్పుడు –పాదులోనో చెట్టు పైననో  -ఉన్న లతలుకూడా –ఒకరికోసం ఆగవు –వాటంతట అవే వికాసం పొందుతాయి ‘’అన్నాడు .వీరి వివాహం ప్రేమ వివాహం ఒకరిపై ఒకరికి వల్లమాలిన ఆపేక్ష ఆరాధనా ఉన్నాయి .నారాయణ గురు స్వామికి విషయం తెలిపిఆశీస్సులు కోరాడు సమాధానం రాలేదు .

  కొత్తకాపురం సవ్యంగా సాగుతోంది .కానీ యోగం సభ్యులు ఈయనపై దుష్ప్రచారం చేశారు .దీనిపై ‘’గ్రామ వృక్షం పై కోకిల ‘’అనే ఖండ కావ్యం రాశాడు –‘’నీ పాటలు రోజూ వింటూ వృక్షం ఆకులు నిండిన కాండాలతో ఎంతో విస్తరించింది ‘’అంటూ ఈకవికోయిన 15ఏళ్ళు తనకుల వృక్షానికి చేసిన సేవలన్నీ రాశిగా పోశాడు కవిత్వం లో .యోగం 16వ వార్దికోత్సవం లో కార్యదర్శిగా తప్పుకొంటున్నానని  ప్రకటించాడు .తప్పని సరై  ఆమోదించారు .కాని కులం వారు వదలలేదు ఆయన్నే ఉండమన్నారు 17  వార్షికానికీ ఆయనే ఉన్నాడు .1917లో ఆయన పెన్షన్ 30రూపాయలు

 ప్రరోదనం, సీత  

దాంపత్య సౌఖ్యం అనుభవిస్తూ ,సంఘ కార్యదర్శిగా తప్పుకొని రెండు పెద్దకావ్యాలు –ప్రరోదనం ,అనే స్మ్రుతికావ్యం, సీత రాశాడు ఆశాన్ . ప్రరోదనం ను మనసారా అభినందించారు.ఇది మహాకవి ఎ ఆర్ రాజవర్మన్ కవి మరణం పై రాసిన ఎలిజీ .ఇతని నళిని కావ్యానికి వర్మరాసిన పరిచయ వాక్యాలు అమోఘమైనవి .రాజరాజ వర్మ పార్ధివ దేహం చితిపై కాలుతుంటే తిరువాన్కూర్ మలబార్ కొచ్చిన్ ప్రాంతాలు దేవతలై దిగి వస్తున్నట్లు మనకవి చిత్రించాడు .కైరళి అంటే కేరళభాషను ఓదార్చటానికి సరస్వతీదేవి కూడా వచ్చిందన్నాడు .తర్వాత ఇదంతా ఊహాగానం అని తెలుసుకొని జీవన్మరణాలగురించి చర్చించాడు .ఈ కావ్యం లో నియోక్లాసిక్ శబ్దాలంకారాలున్నాయి .మనోహర ఆత్మాశ్రయ కవిత్వం ఆవిర్భవించింది .మళయాళ సాహిత్య స్మృతి కావ్యాలలో ఇది మాణిక్యం వంటిది –‘’వాగ్దేవికింకితమైపోయాడు –అలసట ఎరుగని మేధావి –ఆయన బంగారు పాళీ ఎండిపోలేదు –ఎన్నో కాన్కలు భూషణాలు అమర్చాడు –సిద్ధాంతం లో ఆచరణలో అద్భుతాలు సాధించాడు –నిజంగా కవి రాజరాజ వర్మ ఆయన’’అన్నాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అస్సాం మహిళా విమోచనోద్యమ నాయకురాలు,నవలాకారిణి -చంద్రప్రభ సైకియాని-విహంగ -ఫిబ్రవరి

అస్సాం లో కామరూప్ జిల్లాలో డోయి సింగిరి గ్రామం లో చంద్ర ప్రియా మజుందార్ గా చంద్రప్రభ సైకియాని 16-3-1901న పదకొండు మంది సంతానం లో ఏడవ పిల్ల గా జన్మించింది .చెల్లెలు రజని ప్రియా సైకియాని తో కలిసి ,మోకాళ్ళ లోతు బురదలో నడిచి బాలుర స్కూల్ లో చదవటానికి రోజూ వెళ్ళేది .ప్రభ పట్టుదల గ్రహించి, స్కూళ్ళ ఇన్స్పెక్టర్ చంద్రప్రభకు నాగోవా మిషన్ స్కూల్ లో స్కాలర్షిప్ మంజూరు చేశాడు .అక్కడ హాస్టల్ లో చేరాలంటే క్రిష్టియానిటి తీసుకోవాలనే నిబంధనపై చంద్రప్రభ తీవ్ర నిరసన తెలిపి ఉద్యమం చేయగా ,చివరికి అధికారులు లొంగి వచ్చి ఆమె ను హాస్టల్ లో చేర్చుకొన్నారు .

స్కూల్ వదలగానే రోజూ స్కూల్ దగ్గరలో ఉన్న ఒక షెడ్ లో నిరక్షరాస్యులైన పిల్లలకు తాను స్కూల్ లో నేర్చుకొన్నది అంతా బోధించేది .హాస్టల్ సూపరి౦ టెండ్ హిందూ విద్యార్ధులపై వివక్షత చూపడం పై ధైర్యంగా నిరసన ,అసమ్మతి తెలియ జేసి,తన సాంఘిక సంస్కరణాభిలాషను మొదటి సారిగా తెలిపింది.తర్వాత తనకంటే వయసులో చాలాపెద్ద వాడైన వాడికిచ్చి పెళ్లి చేయాలని తలిదండ్రులు భావిస్తే ధైర్యంగా తిరస్కరించి తన వ్యక్తిత్వాన్ని చాటింది .దండీనాథ్ కాలితా అనే అస్సామీ రచయిత తో పరిచయమై .ప్రేమ తో ఒకటై,ఫలితంగా గర్భం దాల్చి ,అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా ,జీవితాంతం అవివాహితగా నే ఉండిపోయింది .నాటి సాంఘిక పరిస్థితులలో తనకొడుకును పెంచటానికి చాలా వ్యతిరేకతకు లోనై ,ఆతర్వాత తేజపూర్ కు చేరి, అక్కడి సాంఘిక సాంస్కృతిక నాయకులైన చంద్రనాథ శర్మ ,ఒమియో కుమార దాస్,జ్యోతి ప్రసాద్ అగర్వాల్ ,లాఖిందర్ శర్మ ల ప్రోత్సాహం పొందింది .

నాగోం లో స్కూల్ టీచర్ గా జీవితం ప్రారంభించిన చంద్రప్రభ తేజపూర్ ము నిసిపల్ ఎలిమెంటరి స్కూల్ హెడ్ మిస్ట్రెగా ఎదిగింది .1918లో తేజపూర్ లో జరిగిన అఖిలభారత క్షాత్ర సమ్మేళనం లో ,ఏకైక మహిళా ప్రతినిధిగా హాజరై అశేష జనాన్ని ఉద్దేశించి ధైర్యంగా’’ నల్లమందు ‘’ కు బానిసలౌతున్న వారిని రక్షించటానికి ప్రభుత్వం నల్లమందుపై నిషేదం పెట్టాలని ఎలుగెత్తి చాటింది .

క్రమంగా జాతీయ భావాలు అలవర్చుకొని గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని ,తేజపూర్ మహిళలలో చైతన్యం కలిగించింది .1925లో నాగోం లో జరిగిన అస్సాం సాహిత్య సభకు ఆహ్వానం అందుకొని ,మహిళా సభ్యులు వేరుగా ఒక కంచె లాంటి ప్రదేశం లో ఉండటం చూసి వారిని ఆ హద్దులు దాటి ముందుకువచ్చి అందరితో కలిసి కూర్చోమని ప్రబోధిందిచగా , వారంతా ఆమాట పాటించి ఉవ్వెత్తున దూకి వచ్చి అందరిలో కలిసిపోయి కూర్చుని ఆనందాన్ని పొందారు . తర్వాత కైజర్ పారా స్కూల్ లో టీచర్ గా చేరి ,గౌహతిలో జరుగుతున్న నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్ళటానికి అధికారులు పర్మిషన్ తిరస్కరిస్తే,ఉద్యోగానికి రిజైన్ చేసి హాజరైంది .1926లో అస్సాం ప్రాదేశిక్ మహిళా సమితి స్థాపించి బాల్యవివాహాలు బహుళ వివాహాలు ,దేవాలయాలలో స్త్రీలను అనుమతించకపోవటం ,మహిళా విద్య ,మహిళాసాధికారత ,స్వయం ఉపాధి మొదలైన సాంఘిక విషయాలలోస్త్రీ జాతికి న్యాయం చేయటానికి తీవ్ర కృషి చేసింది .ఆమె కృషి ఫలించి గౌహతి దగ్గర హజో లో ఉన్న హయగ్రీవ మాధవ దేవాలయం లో మొట్టమొదటిసారిగా మహిళా భక్తులకు ప్రవేశం లభించింది .

జాతీయ సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్న చంద్ర ప్రభను 1930లో ,1943లో అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.1947 ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక ఆమె సోషలిస్ట్ పార్టీలో చేరి నచ్చక మళ్ళీకాంగ్రెస్ లో చేరి ,1957అసెంబ్లీ ఎన్నికలలోపోటీ చేసి ఓడిపోయింది .ఆమె కొడుకు అతుల్ సైకియా అసెంబ్లీకి ఆతర్వాత ఎన్నికయ్యాడు .

చంద్రప్రభ సైకియాని స్థానిక మాగజైన్ బాహి లో 17వ ఏట మొదటి కథను 1918లో రాసింది .ఆతర్వాత వరుసగా ‘’పితృభిత’’-పితృగృహం ,సిఫాయి బిద్రోహత్-సిపాయీ తిరుగుబాటు ,దిల్లీర్ సింహాసన్ –ఢిల్లీ సింహాసనం ,కవి ఆనవ ఘోష్ నవలలు రాసింది .అభిజాత్రి అనే మహిళా పత్రికకు ఏడేళ్ళు ఎడిటర్ గా పని చేసింది .అఖిలభారత అస్సాం రైతు సభకు అధ్యక్షత వహించింది .1972లో భారత ప్రభుత్వం చంద్రప్రభకు మరణానంతర పద్మశ్రీ పురస్కారం అందించిగౌరవించి౦ది .ఆమె గౌరవార్ధం కేంద్ర ప్రభుత్వం 2002లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .

అస్సా౦మహిళాచైతన్యం కోసం హక్కులకోసం విద్యా వ్యాప్తికోసం ఉద్యమించి సాధించిన చంద్రప్రభాసైకియాని 72వ పుట్టిన రోజు న 16-3-1972న మరణించింది .గౌహతిలోని కామరూప్ లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కు ఆమె పేరుపెట్టి గౌరవించారు .తేజపూర్ లో’’ చంద్రప్రభా సైకియాని సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీ’’ ను 2009లో ఈశాన్యరాష్ట్రాలలో మహిళా విద్యా వ్యాప్తికోసం నెలకొల్పారు .ఆమె జీవిత చరిత్రను ప్రముఖ అస్సామీ నవలారచయిత హోమేన్ బోర్గోహైన్ భార్య నిరుపమా బోర్గో హైన్ ‘’అభియాత్రి –వన్ లైఫ్ -మెని రివర్స్’’నవలగాఅస్సామీభాష లో రాసింది .దీనిని ఇంగ్లీష్ లోకి ప్రదీపో బోర్గాహాని అనువాదం చేసి ముద్రిస్తే, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభిచింది .

-గబ్బిట దుర్గాప్రసా

Posted in సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక మళయా కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -3

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -3

    .డా.పల్పు బెంగుళూరులో ఉంటున్నాడు .ఒక విద్యార్ధికి అయ్యే అన్ని ఖర్చులు భరించి విద్యనేర్పిస్తానని స్వామి తో  అనగా కుమారన్ ను అప్పగించారు స్వామి కుమారన్ ను అక్కడే ఉంచి చిదంబరం మధుర మొదలైన క్షేత్ర సందర్శనానికి వెళ్ళారు.ఆయన్ను ఆ  కుటుంబ సభ్యులు తమ ఇంటిలోని వాడుగా భావించారు .22వ ఏట చామరాజ సంస్కృత కాలేజిలో చేరాడు .హిందువులకు మాత్రమె ప్రవేశం లింగాయతులకూ కూడా ప్రవేశం లేదు .మైసూర్ రాజ్య దివాన్ శేషాద్రి అయ్యర్ డా పల్పుకు బాగా పరిచయం ఉండటమే కారణం .ఈయన ఒక్కడే అప్పుడు బ్రాహ్మణేతర విద్యార్ధి .ఈయన చేరటాన్ని చాలామంది వ్యతిరేకించారు .క్రమంగా వ్యతిరేకత తగ్గింది.నెలకు  రూపాయి ఉపకార వేతనమిస్తున్నారు .నీల కంఠీయం అధ్యయనం చేశాడు .మూడేళ్ళు చదివి తర్క శాస్త్రం ఐచ్చికం గా తీసుకొని న్యాయ విద్వాన్ పరీక్షకు తయారయ్యాడు .మూడు నెలలకొకసారి జరిగే పరీక్షలలో ప్రధముడుగా వచ్చేవాడు .ఫైనల్ పరీక్షలో కూడా అతడే వస్తాడని భావించి మిగిలిన వారు అసూయతో ఆందోళన చేశారు .చివరకు దివాన్ ఆతడిని కాలేజి నుంచి తీసి వేయక తప్పలేదు .అప్పుడే బెంగుళూర్ లో ప్లేగు వ్యాపించింది .విద్యాలయాలు మూసేశారు .పల్పు విదేశాలకు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాడు .తన స్నేహితుడు నంజు౦ డరావు కు ఆశాన్ ను అప్పగించి వెళ్ళాడు .ఈయన వద్దే ఉండిపోయాడు.

  ఆశాన్ మద్రాస్ లో ఒక పండితుడి వద్ద చదువుతూ ఆరు నెలలున్నాడు .ఇది పల్పు కు నచ్చక ఆయన్ను పై చదువులకు కలకత్తా పంపాడు .నెలనెలా అతనికి నంజుండ పది రూపాయలు పంపే ఏర్పాటు. రావు గారికి ఇతని వినయ విధేయతలు నచ్చి మరో మూడు రూపాయలు కలిపి 13రూపాయలు పంపేవాడు ఈ డబ్బంతా పల్పు తీరుస్తాడు ఆయనకు అదీ కండిషన్ .కలకత్తాలో సంస్కృత కళాశాలలో చేరి న్యాయశాస్త్రం తీసుకొన్నాడు .వ్యాకరణం కవిత్వం క్లాసులకూ హాజరయేవాడు తర్క తీర్ధ పరీక్షకు రెండేళ్ళు చదివాడు .రోజుకు 20గంటలు చదువులో గడిపేవాడు .గురువు కామాఖ్యనాద తర్క వాగీశన్ ఇతనిపైఅభిమానం తో సంస్కృత కవితా  రచన చేయమని సలహా ఇచ్చేవాడు.రాసే సమయం దొరికేదికాదు .కానీ మళయాళ పత్రిక లకు ‘’ఒరువంగ దేశికన్ ‘’అంటే ఒక బెంగాలీవిద్యార్ధి  అనే పేరుతొ రచనలు రాసేవాడు .

  కలకత్తాలో 1900లో ప్లేగు వలన కూడా ఫైనల్ పరీక్ష రాయలేకపోయాడు.కాలేజీలు మూసేస్తే నగరం వదిలేయాల్సి వచ్చి,బెంగుళూరు వెళ్లి డా పల్పుతోకలిసి తిరువనంతపురం చేరాడు .కేరళవదిలి వెళ్ళిన అయిదేళ్ళుఆయన కరీర్ లో నిష్ప్రయోజకమే అయింది .కానే బెంగాలీ కన్నడ తమిళ సాహిత్యాలలో గొప్ప పరిచయం కలిగింది . సంస్కృత ఆంగ్లాలలో  కృషిచేసే అవకాశం కలిగింది  .ఆశాన్ కలకత్తాలో ఉండగా  రవీంద్ర నాథ టాగూర్  వయసు 40.ఆయన కాల్పనిక కవితలు అప్పటికే విస్తృతంగా ప్రచారమయ్యాయి .బెంగాలీ సాహిత్యం పై కాలనికోద్యమ ప్రభావం బలంగా ఉంది .టాగూర్ పై’’ దివ్యకోకిలం ‘’ కవితరాసి తన ఆరాధన వ్యక్తం చేశాడు .దీన్ని 1922లో టాగూర్ కేరళ వచ్చినప్పుడు చదివి వినిపించి సమర్పించాడు .సంస్కృతం లో ‘’స్వాగత పంచకం ‘’రాసి టాగూర్ ఆల్వే లోనిఅద్వైతాశ్రమం సందర్శించినప్పుడు సమర్పించాడు .షెల్లీ కీట్స్ బ్రౌనింగ్ కవితలన్నీ పరామర్శించాడు .

  గరిసప్ప నది గురించి ఆశాన్ ఒక కావ్యఖండిక రాశాడు .పల్పును ఆయన కుటుంబాన్ని ఇక్కడే కలుసుకొన్నాడు .ఇది బెంగుళూరు వదిలిన 11ఏళ్లకు జరిగింది .కావ్యఖండికలో ఇదొక మధురస్మృతి .కలకత్తాలో ఒక బ్రాహ్మనణులింట్లో అద్దేకుండేవాడు.ఆకకుటుంబానికి  అతనంటే మహా ఇష్టం .కలకత్తా వదిలేటప్పుడు ఆకుటుంబం అంతా స్టేషన్ కు వచ్చి వీడ్కోలు చెప్పి ,రైలు కనుమరుగయ్యెవరకుఅలా చూస్తూనే ఉన్నారు వాళ్ళు .కొంతకాలం అక్కడే ఉంటె ఒక బెంగాలీ అమ్మాయిని తప్పక పెళ్లి చేసుకొనే వాడిని అని చెప్పేవాడు ఆశాన్ .

  కులం పిలిచింది

కలకత్తా వదిలి27వ ఏట  కేరళచేరి మళ్ళీ నారాయణ గురు ఆశ్రమ లో ఉన్నాడు .1902 లో ‘’నారాయణ ధర్మ పరిపాలనా యోగం ‘’సంస్థ ను రిజిస్టర్ చేశారు .స్వామి అధ్యక్షులు డా పల్పుఉపాధ్యక్షుడు ఆశాన్ కార్యదర్శిగా అందరూ ఏక గ్రీవంగా ఎన్నుకొన్నారు.కార్యాలయం త్రివేండ్రం లో పెట్టారు .ఆశాన్ తన శక్తియుక్తులన్నీ ధారపోసి కొద్దికాలం లోనే సంస్థను అన్ని విధాలా అభి వృద్ధి చేశాడు  .జీవితమంతా తన ఈజవ కుల అభి వృద్ధికి అంకితం చేయాలని భావించాడు .మత సాంఘిక విద్యా విషయాలపై సంస్థ దృష్టి కేంద్రీకరించింది .తనకులం వారు మూక ఉమ్మడిగా ఇతర మతాలలో చేరటం పల్పు,ఆశాన్ జీర్ణించుకోలేక పోయారు .’’తీయాలు తీయాలుగా ‘’ఉంటూ తలెత్తుకు తిరగాలి అని ప్రబోధించారు .సంస్థ ఆరవ వార్షిక సభలో పల్పుఅధ్యక్షోపన్యాసం లో 20వ వార్షిక సభలో ఆశాన్ అధ్యక్షోపన్యాసం లో ఈ విషయమే నొక్కి వక్కాణించారు .

  సంస్థ కార్యదర్శిగా కేరళ అంటా తిరిగి సొసైటీలు నెలకొల్పి ఉపన్యాసాలిచ్చి  విభేదాలు  తొలగించి క్షణం తీరికా లేకుండా గడిపాడు ఆశాన్ .దీనితోపాటు వివేకోదయం పత్రిక సంపాదకత్వం ,ప్రచురణ బాధ్యతా ఆయనపైనే పెట్టారు . ఈ పత్రిక ను ‘’ఈజవ గెజిట్ ‘’అని ఆప్యాయంగా గౌరవంగా పిలిచేవారు .మొదటిసంచిక 1904లో వెలువడింది .కేరళ సాహితీ ప్రియులకు ఈపత్రిక గొప్ప వేదికగా మారింది .సాహిత్య సాంఘిక రాజకీయ రంగాలలో ఈ పత్రిక చిరస్మరణీయ కృషి చేసింది .యోగం సంస్థ వార్షిక సమావేశాలలో రెండు పారిశ్రామిక ప్రదర్శనలు కూడాపల్పుఆలోచనపై  ఏర్పాటు చేయించేవాడు ఆశాన్ . మొదటి సభ కొల్లాంలో 1904లో,రెండవది కన్నూరులో  జరిగాయి .

  కవితా రచనలు

యోగం కార్యదర్శి కాకముందే ఆశాన్ సౌందర్యలహరి అనువాదం శివస్తోత్రమాల ,మేఘసందేశం –అసంపూర్ణం ,విచిత్ర విజయం నాటకం ,ప్రబోధ చంద్రోదయం అనువాదం రాశాడు .విచిత్ర విజయం 1902 సెప్టెంబర్ 19ప్రారంభించాడు ఎప్పుడు పూర్తీ చేశాడో తెలియదు .జనంలో బాగా ప్రచారమైనా ప్రచురించటానికిఇష్ట పడ లేదాయన .మరణానంతరం  ప్రచురితమైంది .దీనికి ప్రచీనగాథ ఆధారం .రాలిన పూవు కావ్యం తో కవితా జగత్తులో కాలుపెట్టాడు .రసజ్ఞులను పులకి౦ప జేసింది .41శ్లోకాలున్నాయి .ఆధునిక మళయాళ చరిత్రలో ఇదొక మహత్తర సంఘటన . మార్కొత్ కుమారన్ నిర్వహించే ‘’మితవాది ‘’పత్రికలో ప్రచురితాలై విశేషంగా ఆకర్షించిన శ్లోకాలివి .సి ఎస్ సుబ్రహ్మణ్య పొట్టి దీనికి రాసిన ముందు మాటలు మహా గొప్పగా కావ్యవిలువను మరింత పెంచేవిగా ఉన్నాయి .సాహిత్య రాజపోషకుడు కేరళవర్మ తమ్పురాన్ ‘’పాఠ్య గ్రంధంగా ‘’నిర్ణయించటానికి తోడ్పడ్డాడు .వీణపూవుకావ్యం మళయాళ కవిత్వం లో గొప్ప మార్పు తెచ్చింది ఆరాధనీయమైంది .నూతన శైలికి నా౦దిపలికింది .నవ్యత్వం మార్దవం సున్నితత్వం తో దూసుకు పోయిన కావ్యం ఇది .రాలిన పూవుపైరాసిన కావ్యం. ఆ భావనే నూతనం .మనకరుణ కూడా కోస్తున్నపూలు చెప్పే మనోవ్యధపై లఘు కావ్యం రాశారు కదా . శ్రీ పాల్ఘాట్ లో 1908లో కొన్ని నెలలు నిర్బంధం లో ఉన్నప్పుడు దీన్ని రాశానని ఆశాన్ చెప్పాడు .విశేషాలు తర్వాత తెలుసుకొందాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-2-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -2

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -2

  స్వామి ,చిన్నస్వామి

ఈజవ కులానికి ప్రభుత్వ పాఠశాలలో స్థానం కల్పించాలనీ ,ఉద్యోగాలివ్వాలని 13వేల మంది ఈజవలు సంతకాలు చేసి 1896లో తిరువాన్ కూర్ మహారాజాకు ఒక అర్జీ సమర్పించారు .కానీ వారికి ఆ కోరికలేదనీ ఎవరో కావాలని సృష్టించి ఆ లేఖ పంపారని భావించి రాజు తిరస్కరించాడు .ఇలాంటి సమయం లో నారాయణ గురు అనే సంస్కర్త వారిని ఉద్ధరించటానికి ఆవిర్భవించాడు .ఆయన 1856లో పుట్టి 1928లో 72వఏటచనిపోయారు .ఆయన క్షేత్రం మతం ఒక్కటే కాదు విద్యా ,సాంఘిక విషయాలలోనూ ఆయనవి విశేష దృక్పధాలు .ఆయన ఈజవ కులానికి చెందినా, అణచబడిన అనేక కులాల ఉన్నతి కోసం శ్రమించాడు .హిందూమతంలో శూద్రులకు సన్యాస హక్కు లేదు .ఇంకా తక్కువ కులాల సంగతి చెప్పక్కర్లేదు .ఆయన ఈజవకులకు అనేక దేవాలయాలలో ప్రవేశం కల్పి౦పజేశాడు .పులయలకు, హరిజనులనే నిమ్న జాతులకూ ఆలయ ప్రవేశం కల్పించాడు .ఒక శివాలయం లో ఆయన శివ ప్రతిష్ట చేస్తే వ్యతిరేకించిన వారిని ‘’నేను ఈజవ శివుని ప్రతిష్టించాను బ్రాహ్మణ శివుడిని కాదు ‘’అని చెప్పి నోరు మూయించాడు .మానవుడికి ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు నారాయణ గురు .సంఘంలోని మూఢ నమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసిన సంస్కర్త .ప్రశాంతంగా నిరాడంబరంగా వ్యవహరించే క్రాంతి వీరుడు .మానవాకారం లో చెక్కి రూపొందించిన సౌమ్య స్వాభావం లాగా ఉండేవాడు .అందుకే అందరూ ఆయన్ను ‘’స్వామి ‘’అని మహా గౌరవంగా పిలిచేవారు .

  15-5-1903లో ‘’శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం ‘’అనే సంస్థ ఆయన ఆశీస్సులతో ప్రారంభమైంది .చెల్లా  చెదరైన నిమ్న జాతులను సమైక్యపరచి వారికీ సాంఘిక ఆర్ధిక విముక్తి కల్గి౦చటమే ఈసంస్థ ధ్యేయం .1928లో నారాయణ గురు సమాధి చెందేవరకు25ఏళ్ళు ఆయనే అధ్యక్షుడుగా ఉన్నాడు .సుమారు యాభై ఏళ్ళక్రితం ఈజవ కులం లో పట్టభద్రులు కనీసం అయిదు మంది కూడా లేరు .ఈ సంస్థ అనేక పాఠశాలలు కాలేజీలు నిర్వహించి న ఫలితంగా బాగా చదివి ఉన్నతోద్యోగాలలో ఉన్నవారు చాలామంది తయారైనారు. ఇదంతా నారాయణ గురు ప్రసాదమే .

  నారాయణ గురు దక్షత దీక్షత కలవారిని ఎంపిక చేసి తన ఉద్యమానికి బలం చేకూర్చారు. అలాంటివారిలో ఆశాన్ ఒకడు .మొదటి సారి ఆయన్ను కలిసినప్పుడు ఈయన వయసు 18.ఆయనది 36.ఆశాన్ లో గోప్పవ్యక్తిత్వాన్ని ఆయన గమనించాడు .వారిద్దరూ రామకృష్ణ వివేకానందులవంటి వారు .ఈ కలయిక కేరళ అభ్యున్నతికి పలువిధాల తోడ్పడింది .కుమారన్ చదువు 18వయసులోనే ఆగిపోగా స్వంతంగా అధ్యయనం చేసి విద్యనేర్చాడు .సంస్కృతం పై పట్టు సాధించాడు .తమిళం లోనూ నిష్ణాతుడయ్యాడు .మలయాళం లో సుబ్రహ్మణ్య విలాసం భక్తవిలాపం వంటి భక్తిప్రధాన కావ్య ఖండికలు రాశాడు .కుమరన్ యవ్వనం లో రాసినవి చదివించుకొని గురు మహా సంతోషపడేవాడు.శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వద్దని హితవు చెప్పాడు .

  కుమరన్ పిల్లలకు సంస్కృతం నేర్పేవాడు .అప్పుడే ‘’ఆశాన్ ‘’పేరు వచ్చింది .ఆశాన్ అంటే మాష్టారు .లేక ఆచార్యుడు .దీనితో’’ కుమారన్ ఆశాన్ ‘’అయ్యాడు .శిష్యుడిని చూడటానికి గురు అతని స్వగ్రామం వెళ్ళేవాడు అప్పుడప్పుడు .ఆశన్ ఏకాంతం కోరుకొని నిర్జన ప్రదేశాలలో ధ్యానమగ్నమయ్యేవాడు ‘ఆయన చామన చాయగా బలంగా పొట్టిగా తలలావుగా గుండ్రంగా,ఉంగరాలజుట్టు మెరిసే కళ్ళతోఉండేవాడు  .నడక హుందాతనాన్నీ ,ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేది . స్వామి ఈయన్ను అరువిప్పురం లో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించగా  అన్నీ వదిలేసి వెళ్లి మూడేళ్ళు ఆశ్రమంలో ఉన్నాడు ఆశాన్ .అరువిప్పుం అంటే నది వొడ్డు.జనావాసాలు లేని అరణ్యప్రాంతం .ప్రకృతి రామణీయకత మహాహ్లాదంగా ఉండి ఏకాగ్రతకు ధ్యానానికి అనువుగా ఉంటుంది .స్వామి వలన గోప్పతీర్ధయాత్రాస్థలం గా మారింది .స్వామి 1885లో ఇక్కడికి వచ్చినా మూడేళ్ళ  తర్వాతకాని అరాధనాకేంద్రంగా మారలేదు .స్వామితో కలిసి ఆశాన్ గ్రామాలో పర్యటిస్తూ ,ప్రజలకు ఆధ్యాత్మిక సాంఘిక విషయాలు బోధించే వాడు .అక్కడక్కడ ఆరాధనా మందిరాలు నెలకొల్పారు .స్వామి వారి సాహచర్యంతో ఆశన్ లో యోగిలక్షణాలు ఏర్పడ్డాయి .’’చిన్నస్వామి’’ అని పిలువబడ్డాడు .ఒకసారి ఆయన అన్న, మేనమామ ఇక్కడికి వచ్చారు అది శివరాత్రి .స్వామి హాలులో గంభీరంగా కూర్చున్నారు .ప్రక్కనే కమారన్ ఉన్నాడు .తనవారిని తనకు పరిచయం లేనివారిగా చూశాడు .అతని తల్లి బెంగపెట్టుకొందనీ స్వామి అనుమతిస్తే అతడిని ఇంటికి తీసుకు  వెడతామని చెప్పారు అతని ఇష్టం అన్నారు స్వామి .ఈయనలో స్పందన లేదు .చివరికి స్వామి ఓనం పండుగనాడు కుమరన్ ఇంటికి వస్తాడని వారికి నచ్చచేప్పిపంపించేశారు .అలాగేమిత్రునితో కలిసి  వెళ్ళాడు .ఇద్దరూ ఇంటి బయటే కూర్చున్నారు లోపలి రమ్మంటే స్నేహితుడినికూడా ఇంట్లోకి అనుమతిస్తే వస్తానన్నాడు .తండ్రి  సంతోషంగా ఆహ్వాని౦చి  వారితోపాటు కూర్చుని భోజనం చేశాడు .తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు .

   ఆశ్రమం లో ఉన్న మూడేళ్ళు కుమారన్ ఎంతోఅధ్యయనం చేసి శిక్షణ పొందాడు .వేదాంత గ్రంధాలన్నీ నేర్చాడు .యోగాభ్యాసం చేశాడు స్వామికి ఆంతరంగిక శిష్యుడయయాడు .ఇక్కడ ఉన్నప్పుడు శివస్తోత్రమాల రచించాడు ఆశన్ .

       విశాల దృష్టి

విజ్ఞానమే మహత్తర శక్తి అన్నది నారాయణగురు మోటో.పెద్ద గుడులు కాక చిన్న గుడులు నిర్మిస్తూ ప్రజల్ని విద్యావంతుల్నిచేయాలన్నది ఆయన ధ్యేయం .అతడిని దీనికి ఉపయోగించుకోవాలని స్వామి భావన .ఈజవ కులం లో స్వామి చిన్నస్వామి అతి ముఖ్యులు .వీరిద్దరి నుండి విడదీయరాని మూడవ వ్యక్తీ డా పి.పల్పు.ఈయనా అదే కులస్తుడు తిరువనంతరపురవాసి .ఇక్కడికి వచ్చి స్వామికి తన శక్తియుక్తులు ధారపోసి ఆయన మహోద్యమంలో భాగస్వామి అయ్యాడు స్వామికంటే నాలుగేళ్ళు పెద్ద .తిరువనంతపురం ఇంగ్లీష్ స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉన్న ఇంగ్లీష్ వాడిద్వారా ఎఫ్.ఏ.పరీక్షకు సమానమైన పరీక్ష పాసై వైద్య పాఠశాలలో చేరటానికి ప్రయత్నించి యోగ్యతలున్నా ప్రవేశం పొందలేకపోయాడు .నిరుత్సాహపడకుండా మద్రాస్ వెళ్లి ఎల్ఎంఎ సి .డిగ్రీ పొంది ,తిరిగి వచ్చి ఉద్యోగ  పొందలేక ,మైసూర్ స్టేట్ లో ఆరోగ్యశాఖాధికారిగా ,లింఫ్ ఇంష్టి ట్యూట్  డైరెక్టర్ గా చేశాడు .ఆకాలం లోనే నెలకు వెయ్యిరూపాయలు జీతం .అయినాస్వంతరాష్ట్రం కేరళలో ఆయనకు ఉద్యోగం రాకపోవటం ఆశ్చర్యమే కులాదిపతులు ఆయనను హీనకుల సంజాతుడుగా భావించటమే దీనికి కారణం .మేధావి కార్యసాధకుడు అయినా డా .పల్పు కు తగిన గుర్తింపు గౌరవం రాలేదు .ఈజవ స్మారక సంస్థకు బీజం వేసింది ఈయనే .నారాయణగురు సంస్థకూ పునాదులు   వేసింది కూడా ఈయనే .అంతటి వ్యూహ రచనా నిపుణుడు డా పల్పు.స్వామిఅనే నారాయణ గురు , చిన్నస్వామి అనే కుమరన్ ,డా పల్పు త్రయం ఈజవ కులానికి చేసిన సేవ వారిని తీర్చిదిద్దిన తీరు చిరస్మరణీయం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-22-ఉయ్యూరు .

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్

మిగిలిన ఇద్దర్లో వల్లత్తోళ్ నారాయణ మీనన్ ,ఉల్ళూర్ పరమేశ్వర్ అయ్యర్ ఉన్నారు .జీవితతత్వం లో సమస్యలను ఎదుర్కోవటం లో కుమారన్ ఆశన్ లో అద్వితీయ ప్రాచ్యపాశ్చాత్య సమ్మేళనం కనిపిస్తుంది .మహాకవి ఆశాన్ గొప్ప వ్యవహార వేత్త ,వ్యవస్థా నిర్మాత. శ్రీ నారాయణ గురు ప్రియ శిష్యుడు కూడా .కేరళలో వెనుకబడిన ఈజర్ కుల ఉద్దారకుడు .ఎసెన్ డిపి యోగాన్ని వ్యవస్థీకరించి ఆ సంఘానికి 17ఏళ్ళు కార్యదర్శిగా సేవలందించాడు .దళితులలో పాతుకుపోయిన జడత్వాన్ని ,మాంద్యాన్ని నిర్మూలించి వారిలో గొప్ప సాంఘిక చైతన్యం కల్పించాడు .సాంఘిక సాహిత్య క్షేత్రాలలో విప్లవ బీజాలు నాటాడు .సృజనలో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు . ఈ మహాకవిపై కే ఎం జార్జి మలయాళం లో రాసిన జీవిత చరిత్రకు శ్రీ డి రామలింగం తెలుగులోకి అనువదించగా ,సాహిత్య అకాడమి 1975లో ప్రచురించింది.వెల రెండున్నర రూపాయలు .ముఖ చిత్ర రచన సత్యజిత్ రే .

  ప్రారంభ దశ

 1892లో స్వామి వివేకానంద కేరళను సందర్శించి అక్కడి పరిస్థితులు పరిశీలించి ‘’కేరళ దేశం నిజం గా పిచ్చి ఆసుపత్రి ‘’లా ఉంది అని వ్యాఖ్యానించారు .నిజంగానే అప్పుడు కేరళలో సాంఘిక నిమ్నోత్తతాలు పరమ రోతగా ఉన్నాయి .బ్రాహ్మణ హరిజనులమధ్య అనేక కులాలు ,వాటిలో తెగలు ,శాఖలు ఉన్నాయి వెనుకబడిన కులాలు షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలు పెద్ద విభాగాలు .కేరళలో ఈజవ లేక తీయ అనే కులం ముఖ్యమైనది .దీన్ని వెనుక బడ్డ కులం లో చేర్చారు .గత నాలుగు శతాబ్దాలలో దాని బడుగుతనం అదృశ్యమైంది .వివేకానందుడు వచ్చినప్పుడు అది బాగా వెనుక బడిన కులం .కుమరన్ ఆశాన్ ఈ కులానికి చెందినవాడు .

  తిరువనంత పురానికి ఉత్తరాన 30కిలోమీటర్లదూరం లో కాయిక్కర ఒక కుగ్రామం.దానికి ఒకవైపు సముద్రం మరో వైపు అంజు సరస్సు ఉన్నాయి .ఎటుచూసినా తెల్లని ఇసుక .లెక్కలేనన్ని కొబ్బరి చెట్లు .ఈజవ కులం ఉండే పల్లె అది .కుమారన్ ఇక్కడ జన్మించక పోయిఉంటే ఆ వూరి పేరు ఎవరికీతెలియకుండా పోయేది .ఇప్పుడు ఆమహాకవి స్మృతి చిహ్నంగా కేరాఫ్ అడ్రస్ గా ఉంది .కుమారన్ ఆశాన్ ఇక్కడే 12-4-1873న మళయాళ శకం లో మేషం (మేడం)1048చైత్ర పౌర్ణమినాడు జన్మించాడు  .చాలా శుభప్రదమైన రోజు .తండ్రి నారాయణ్ కొబ్బరి నార, చిప్పల వ్యాపారి.సంగీతాభిమాని ,తమిళ ,మళయాలాలలో  బాగానే ప్రవేశమున్నవాడు .గ్రామాభి వృద్ధిలో పాల్గొనేవాడు .ప్రాధమిక పాఠశాల ప్రారంభానికి ఆయనే కారకుడు .ఆశన్ తల్లి కాళియమ్మ .అందరూ కొచ్చుపెణ్ణు అని ఆత్మీయంగా పిలిచేవారు .చదువు లేదుకాని పురాణాలన్నీ తెలుసు .వాటిని పిల్లలకు చెప్పేది .తోమ్మన్ విళాకం వారి ఆడపడుచు .దైవభక్తి, దయాగుణం ఆమెకు సహజాతాలు .ఈ దంపతుల రెండవ కుమారుడే కుమారన్ ఆశాన్ .

  తలిదండ్రులు చనిపోయాక అన్నగారే కుటుంబ బాధ్యత తీసుకొన్నాడు .తమ్ముడు జీవితాంతం బ్రహ్మ చారిగా ఉండిపోయాడు .మిగిలినసోదరులు గోవిందన్ శేఖరన్ ఉపాధ్యాయులు .కుడి ప్పడి కూళం  అంటే వీధి బడిలోనే మొదటి చదువు .కొబ్బరాకులతో గుడి సెకట్టి అందులో  బడిపెట్టేవారు .సుమారు 30 మంది పిల్లలకు ఒకడే పంతులు .రాయటం,చదవటం చిన్న చిన్న లెక్కలు చేయటం నేర్పేవారు .పలకా బలపాలు లేవు .పంతులుకు వెనక్కి ఆని కూర్చునే పీట ఉంటుంది .బెత్తం రాసే గంటం ,జాజి చెక్క పెట్టె ఉండేవి .తాటాకులపై అక్షరాలూ రాసేవారు .ముందు పోసిన ఇసుకపై చూపుడు వ్రేళ్ళతో పిల్లలు అక్షరాలూ దిద్దేవారు .మాటలు రాసేవారు .అక్షరాలూ మాటలు ,అంకెలు  ఎక్కాలు నేర్చుకొనేవారు వీధిబడిలో .                         ఇలాంటి వీధిబడిలో ఏడవ ఏట కుమారన్ చేరాడు  .చదువు చెప్పే పంతులుగారికి వైద్యం జ్యోతిషం మంత్ర విద్య వచ్చు .

  ఒక ఏడాది వీధిబడిలో చదివి సంస్కృత పండితుడు ప్రఖ్యాత వైద్యుడు కొచ్చురామన్ వైద్యర్ కు శిష్యుడయ్యాడు ఆశాన్ .ఆయన వద్ద అమరకోశం ,సిద్ధరూపం శ్రీ రామోదంతం ,కృష్ణ విలాస ,రఘు వంశాలను చదువుకొన్నాడు మాఘకావ్యం లో కొంత నేర్చాడు .వైద్యం బాగా లాభించటం చేత గురువు ఉపాధ్యాయ వృత్తి మానేసి గొప్ప వైద్యుడుగా స్థిరపడ్డాడు .దీనితో ఈయన చదువు మూలబడింది ఒక ఏడాది .ఈయన తండ్రి ఇతర గ్రామపెద్దలతోకలిసి గ్రామం లో ఒక ప్రాధమిక పాఠశాల పెట్టటానికి అనుమతి సంపాదించారు .అందుకని కుమారన్ కుప్రభుత్వ బడిలో చదివే వీలు కలిగింది .మూడేళ్ళు చదివి 14వ ఏటమంచిమార్కులతో పాసయ్యాడు. అతడిని అక్కడే ఉపాధ్యాయుడిగా నియమించారు .కానీ 18 ఏళ్ళు వస్తేతప్ప ప్రభుత్వ పంతులుగా పనిచేయటానికి వీల్లేదు .అందుకని  ఈ ఉద్యోగం తాత్కాలికమే అయింది .

 కనుక ఒక టోకు వ్యాపారి వద్ద గుమాస్తాగా చేరాడు కుమారన్ .దృష్టి చదువు మీదే కనుక ఎక్కువకాలం పని చేయలేదు .పుస్తకాలు చదవటమే వ్యసనమై పోయింది .తండ్రి తనకు సాయ పడమనే వాడు .ఎదురుతిరిగి చెప్పకుండా ఇల్లువదిలి తాతగారింట్లో మకాం పెట్టాడు .తల్లి వెళ్లి బతిమాలినా రాలేదు .టోకు వ్యాపారే అతని తండ్రిని ఒప్పించి కొత్తగా పెట్టిన ‘’విజ్ఞాన సందాయినీ ‘’అనే సంస్కృత పాఠ శాలలో 16 వ ఏటచేర్పించాడు .ఇతనికున్నఆర్ధిక స్థితి  అభిరుచి గుర్తి౦చి  ఉపాధ్యాయుడు ఫీజు పుచ్చుకోలేదు .

  కొంచెం పోట్టిగాబలంగా ఉండే కుమారన్ ఆకతాయికూడా .ఈతలో మేటి .చెరువులో సముద్రం లో సునాయాసంగా ఈదే వాడు .చేపలు పట్టటం హాబీ .సంస్కృత బడిలో శ్లోకాలు బాగా నేర్చాడు, రాసేవాడుకూడా .బహు గ్రంథకర్త కుంజీ కుట్టన్ తమ్బురాన్ కవి మొదట కవిభారతం రాసి  కేరళ ముఖ్యకవులను మహాభారత పాత్రలుగా పరిచయం చేశాడు .కానీప్రసిద్ధి చెందిన  చాలామంది ఈజవ కవులున్నా  విస్మరించాడు .మహోన్నతకవి మూలూరు పద్మనాభ ఫనిక్కర్ ను కూడా వదిలేశాడు .ఈ అన్యాయం గమనించిన మనకవి ఆశాన్ ‘’కవి రామాయణం ‘’రాయాలని నిశ్చయించాడు .తాను  రాయాల్సిన కవుల ఔన్నత్యాన్ని ప్రక టించటమే కాక  ‘’ కే ఎం కుమారన్’’ కవి ప్రసక్తి కూడా చేర్చాడు .ఆ కవి వేరేవరోకాదు తానె .అప్పుడు ఆయన ఆపేరుతోనే వ్యవహిరి౦పబడే వాడు .తనను తానూ చెప్పుకొని ఆకవిని’’ గవయ ‘’ అనే వానర ప్రముఖుడి గా పేర్కొని వేళాకోళం చేశాడు .తనను తానె వేళాకోళం చేసుకొని నవ్వుకోగల ఆరోగ్య హాస్యాన్ని సృష్టించాడు .

  విజ్ఞాన సందాయిని ని  సుప్రసిద్ధ సంస్కృతకవి ఉపాధ్యాయుడు మనంపూర్ గోవిందన్ ఆశాన్ నడిపేవాడు .ఒక్క ఏడాదిలో మన ఆశాన్ మాఘం, నైషధం శాకుంతలం క్షుణ్ణంగా నేర్చాడు. కువలయానందం అనే అలంకార శాస్త్రాన్నీ మధించాడు .అక్కడ శ్లోక రచన నిత్యాభ్యాసంగా ఉండేది .గంటలో 20శ్లోకాలు రాసే వాడు కుమారన్ .ఇవే కాక వల్లీ వివాహం అనే జానపద కావ్యం ఉషాపరిణయం నాటకమూ రచించాడు .దీన్ని చాలాసార్లు ప్రదర్శించారు .ఇదంతా నూనూగు మీసాల నూత్న యవ్వనం లో చేసిన ఫీట్లు .రెండేళ్ళు చదువు చెప్పి గురువుగారు ఇక అతడు తన దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీలేదని చెప్పగా ,నమస్కారం పెట్టి వచ్చేశాడు ఆశాన్ .వయసు 18మాత్రమె అప్పుడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 47,48

        మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 47,48

47.48-అనిశెట్టి ,పినిశెట్టి

47-అనిసెట్టి సుబ్బారావు (1922-1981), ఆగ్నివీణ ఫేంస్వాతంత్ర్య సమరయోధుడు,-అనిశెట్టి సుబ్బారావు

, తెలుగు సినిమా రచయిత, ప్రగతిశీల కవి, నాటక కర్త.

నాటకరంగ ప్రవేశం
1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించారు ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), గాలిమేడలు[2] [3](1949 డిసెంబరు), శాంతి4, మా ఊరు (1954) చెప్పుకోదగినవి. సుబ్బారావు కొన్నాళ్ళు ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. 1942లో, 1944లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. కమ్యూనిజం వైపు ఆకర్షితుడై తన నాటకాల ద్వారా ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు

సినీరంగ ప్రస్థాన
1955లో రచయితగా తెలుగు సినీరంగంలో అడుగుపెట్టారు. సుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ ‘నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించారు.

అనిసెట్టి పుట్టింది ఆగర్భ శ్రీమంతుల ఇంట్లోనే గాని అతడు తన చుట్టూ వున్న ఆగర్భ దరిద్రుల ఆర్తనాదాలనే విన్నారు. తండ్రి కోటి లింగం కోటికి పడగెత్తగల శ్రీమంతులు. నరసరావుపేటలోనూ, చిలకలూరిపేటలోనూ ఆయిల్‌ మిల్లులు, ఇరవై లారీలు ఉండేవి. తండ్రికి మిల్లులోని పనివాళ్ళు ఒకసారి సమ్మె చేస్తే అనిసెట్టి ఆ కార్మికుల పక్షమే వహించి తండ్రికి కోపం తెప్పించారు. 1941 నాటికి గుంటూరు హిందూ కళాశాలలో బి.ఎ. పట్టా పుచ్చుకొన్న అనిసెట్టిని అతని తండ్రి ‘లా’ చదవడానికి మద్రాసు పంపించాడు.

సినిమాలు
ప్రియురాలు (1952)

   పెంపుడు కొడుకు (1953)

   నిరుపేదలు (1954)

   పరివర్తన (1954 సినిమా)

   వదినగారి గాజులు (1955)

   కనకతార (1956)

   కుటుంబ గౌరవం (1957)

   భలే బావ (1957)

   దైవబలం (1959)

   కార్మిక విజయం (1960)

   పతివ్రత (1960)

   భట్టి విక్రమార్క (1960)

   శ్రీకృష్ణపాండవయుద్ధం (1960)

   కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం (1961)

   జేబు దొంగ (1961)

   పాప పరిహారం (1961)

   సీత (1961)

   స్త్రీ హృదయం (1961)

   పవిత్ర ప్రేమ (1962)

   రక్తసంబంధం (1962)

   తోబుట్టువులు (1963)

   దొంగ నోట్లు (1963)

   సోమవార వ్రత మహాత్మ్యం (1963)

   ఆదర్శ సోదరులు (1964)

   కలియుగ భీముడు (1964)

   గుడిగంటలు (1964)

   దొంగను పట్టిన దొర (1964)

   మాస్టారమ్మాయి (1964)

   అందీ అందని ప్రేమ (1965)

   భీమ ప్రతిజ్ఞ (1965)

   కన్నెపిల్ల (1966)

   సర్వర్ సుందరం (1966)

   శ్రీకృష్ణ మహిమ (1967)

   నువ్వే (1967)

   భార్య (1968)

   కన్నుల పండుగ (1969)

   పంచ కళ్యాణి దొంగల రాణి (1969)

   ప్రేమ మనసులు (1969)

   రాజ్యకాంక్ష (1969)

   బలరామ శ్రీకృష్ణ కథ (1970)

   అనుభవించు రాజా అనుభవించు (1974)

   జన్మహక్కు (1980)

    అనిశెట్టి కొంతకాలం మద్రాస్ లా కాలేజిలో ,తర్వాత 1946లో విశాఖ లో ఆంధ్రా యూని వర్సిటిలో ఎం ఎ లో చేరారు కానీ పూర్తీ చేయలేదు .శిల్ప ద్రుష్టికలకవి అనిశెట్టి ఈయన ఆగ్నివీణ అందర్నీ బాగా ఆకర్షించింది ..సినిమాలలో డబ్బింగ్ చిత్రాల రచయితగా ప్రవేశించారు .1942 ఆగస్ట్ లో జరిగిన విద్యార్ధుల సమ్మెకు నాయకత్వం వహించారు .ఈ ఉద్యమానికి చెందినా కరపత్రం రాసినందుకు 1942లో మద్రాస్ లో అరెస్ట్ చేశారు రెండేళ్ళు జైలు శిఖా అనుభవించారు  ఆయన రాసిన రక్తాక్షరాలు ,,మా వూరు ,అనిశెట్టి నాటికలు బాగా ప్రచారంయ్యాయి.శాంతిఅనే చాయానాటకం ఇతర భారతీయ భాషలలోకి అనువాదం చెందింది .ప్రజాశక్తి పత్రిక కు కొంతకాలం సంపాదకత్వం వహించారు .60వ ఏట అనిసెట్టి సుబ్బారావు మరణించారు .

   అభ్యుదయ కవిత్వం లోఅనిశెట్టి అగ్ని వీణ చిరస్మరనీయమైనది –‘’భయం భయం బ్రతుకు భయం ,-అన్నా మనకీ లోకం పన్నిన పద్మవ్యూహం –ఆశలతో బతుకు లీడ్చే ఆస్థి పంజరాలు మనం –ఆవేదన హితమయ్యెఆశా జీవులం మనం .-గతమంటే కారు వెగటు రేపంటే తగని భయం ‘’అని సామాన్యుని దుర్భర స్థితిని ,నిస్సహాయతను రమణీయంగా వర్ణించారు .ఆయన గీతాలలో ‘’ఎవరిపిల్లలోయ్ మీరు ‘’అత్యుత్తమ గీతం అంటారు –‘’ఈ లోకపు శాసనాలు ఎంగిలాకులిస్తాయ్ –ఇనుప కమ్ములిస్తాయ్ ‘’అనిరోద్దుమీద బ్రిద్జికిండా స్టేషన్ లో దుమ్మూ ధూళీ మధ్య తిరిగే పశివారిని గూర్చి జాలితో పలికిన వేదన ఇది .భావతీవ్రతను వెలువరించటం లో అనిశెట్టి కి ఒక ప్రత్యేకత ఉంది .ఆయన గీతాలు ధారాశుద్ధితో గుండెల్ని చీల్చుకుపోతాయి .సినిమాపాటలూ అలానే ఉంటాయి .తత్వ దృష్టి కవితా ప్రీతి ఆయనకు వెన్నతో పెట్టినవి .గుండెలోని ఆవేశానికి ఆవేదనకుకాక శిల్పపరంగా ఒకరూపం కట్టించటానికి  ఎక్కువగా రాయత్నించాడని ఆవంత్ససోమసుందర్ చెప్పారు .ఇతడి ఆగ్నివీణ ముట్టుకుంటే రోష విస్ఫులింగాలు కోపాలనం వీరాగ్ని జ్వాలలు  వెళ్ళగక్కటం చూస్తాం అన్నారు సోమసుందర్ .

48-పల్లెపడుచు నాటక ఫేం-పినిశెట్టి శ్రీరామమూర్తి

తెలుగు నాటక, సినిమా రచయిత, దర్శకులు.

జనన౦
వీరు తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు.

రచనా ప్రస్థానం
చిన్ననాటి నుండి నాటక రచన, ప్రదర్శనలలో కృషిచేశారు. 1944 సంవత్సరంలో ‘ఆదర్శ నాట్యమండలి’ని స్థాపించారు. ఆదర్శజ్యోతి అనే నాటకం రాసి, ప్రదర్శించి ప్రశంసలు పొందారు. వీరు రాసిన ఇతర నాటకాలు ‘కులం లేని పిల్ల’,[1] ‘పల్లె పడుచు’, ‘అన్నా చెల్లెలు’ అనేక నాటక సమాజాల వారు దేశమంతటా ప్రదర్శించారు. స్త్రీ పాత్ర లేకుండా రాసిన ‘ఆడది’ నాటిన వేయికి పైగా ప్రదర్శనలు ఇవ్వబడి చరిత్ర సృష్టించింది. అదే విధంగా ‘పంజరంలో పక్షులు’, ‘రిక్షావాడు’, ‘సాగరయ్య సంసారం’ కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. ‘పల్లెపడుచు’ నాటకాన్ని సినిమాగా బోళ్ల సుబ్బారావు నిర్మించడంతో సినీ రచయితగా పినిశెట్టి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. ‘రాజూ- పేద’ చిత్రానికి వీరు సమకూర్చిన సంభాషణలు అత్యంత సహజంగా, శక్తివంతంగా సాగి అలరించటంతో వీరి ప్రస్థానం జయప్రదంగా ప్రారంభమైంది. సంతానం, ఇలవేల్పు, సిరిసంపదలు, ధర్మపత్ని, పిన్ని, జరిగిన కథ -వంటి 60పైగా చిత్రాలకు రచన చేశారు. వీరు ‘చిలకాగోరింక’, ‘గృహలక్ష్మి’ చిత్రాల్లో హాస్యపాత్రలు కూడా పోషించారు.

వీరి కుమారులు ఈనాటి మేటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి, ఛాయాగ్రహకుడు రాము పినిశెట్టి. వీరి మనవడు ఆది పినిశెట్టి వర్ధమాన నటునిగా కొనసాగుతున్నారు

సినిమాలు
గడసరి అత్త సొగసరి కోడలు (1981) (కథ, మాటలు)

   చిన్ననాటి కలలు (1975) (మాటలు)

   ఆస్తికోసం (1975) (కథ)

   రామాలయం (1971)(మాటలు)

   బంగారు గాజులు (1968) (మాటలు)

   పంతాలు పట్టింపులు (1968) (మాటలు)

   కలిసొచ్చిన అదృష్టం (1968)(మాటలు)

   అత్తగారు కొత్తకోడలు (1968) (కథ)

   వీలునామా (1965) (మాటలు)

   నిత్య కళ్యాణం పచ్చ తోరణం (1960) (కథ, మాటలు, దర్శకత్వం)

   సంతానం (1955) (మాటలు)

   పరివర్తన (1954) ('అన్నా చెల్లెలు' నవల)

   పల్లె పడుచు (1954)

   రాజు-పేద (1954) (మాటలు)

    మంచి ప్రతిభఉన్న పినిశెట్టిశ్రీరామమూర్తి యాభై ఏళ్ళు నిండకుండానే మరణించటం శోచనీయం .

     తాతినేని ప్రకాశరావు గారు దర్శకత్వం వహించిన జనతా వారి పరివర్తన సినిమాకు పినిశెట్టి శ్రీరామమూర్తి సంభాషణలు మనిశెట్టి పాటలు రాశారు

    పినిశెట్టి నిత్యకళ్యాణం పచ్చతోరణం సినిమా తీస్తూ అందులో ఒక ముఖ్యపాత్రను గుమ్మడి గారిని వేయమని కోరితే హాస్యం దుష్టత్వం ఉన్న ఆపాత్రకు సీస్ ఆర్ సరిపోతారు ఆయనతో వేయించమని చెప్పారట .అలానే చేశారు పినిశెట్టి .’’నాటకాలనుంచి వచ్చి సినిమా లకు తగినట్లు అభినయశైలిని మార్చుకొన్న సియేస్ ఆర్ మాడ్యులేషన్ ,ఉచ్చారణ శైలి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండు ‘’అని చక్రపాణి గుమ్మదిగారితో తరచుగా చెప్పేవారని గుమ్మడి ఉవాచ .

     సశేషం

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 46 · 46-ప్రజారచయిత,దర్శకుడు- జంపన



    మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 46

    46-ప్రజారచయిత,దర్శకుడు- జంపన

    జంపన చంద్రశేఖరరావు ప్రముఖ ప్రజా రచయిత, తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత.

    వీరు ఏలూరులో జన్మించి, విద్యాభ్యాసం చేసి, తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. అక్కడి సి.ఆర్.రెడ్డి కళాశాలలో కొంతకాలం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరు చెన్నైకి మకాం మార్చి నవలా రచలను చేశారు. కొవ్వలి లక్ష్మీనరసింహారావు నవలలు రైళ్ళలో విపరీతంగా ఖర్చవడం చూసి వీరి పద్ధతిలో తానూ అలాంటి నవలలను ఎక్కువగా రాశారు. ఆరోజుల్లో కొవ్వలి, జంపన నవలలను చదవని వారు అరుదు. వీరు రాసిన నవలలలో ఎవరి పెళ్లాం? (1940), నల్లకళ్ల అమ్మాయి (1947), వెంకటేశ్వర మహాత్మ్యం, ఊర్వశి అనే నాటకం (1948), ఆకలి అనే ఖండకావ్య సంపుటి ముఖ్యమైనవి. వీరు అపరాధ పరిశోధన నవలలు అనేకం రాశారు. స్త్రీ పురుష సంబంధాలు, వివాహ సమస్యలు వీరి రచనలలో ప్రాధాన్యం వహించిన అంశాలు. సరళమైన భాష, ఉత్కంఠభరితమైన కథాకథన విధానం వీరి రచనలకు ప్రజాదరణ చేకూర్చాయి.

    వీరు 1953లో చెన్నైలో హృద్రోగంతో పరమపదించారు.

చిత్రాలు[మార్చు]
భట్టి విక్రమార్క (1960) (దర్శకుడు)

    హరిశ్చంద్ర (1960) (దర్శకుడు)

    కృష్ణలీల (1959) (దర్శకుడు)

    మేనరికం (1954) (నిర్మాత, దర్శకుడు)

    వాలి సుగ్రీవ (1950) (దర్శకుడు)

      ఇరవై వ శతాబ్ది ప్రారంభం లో కొత్త పాథకులను అలరించే తేలిక నవలలు విస్తృతంగా రాసి ,ప్రజలలో గ్రంధ పతనాసక్తి పెంపొందించిన ప్రజా రచయితా జంపన చంద్ర శేఖరరావు .వీరి తర్వాత కొవ్వలి నరసింహారావు .వీరిని ప్లాట్ఫారం రచయితలనేవారు .అంటే కాలక్షేపం బటాణీలవంటి పుస్తకాలు రాసేవారని అభిప్రాయం ఆ రకంగా నైనా పుస్తకం చదవాలనే కొరికి తీర్చిన వారు .జంపన ఏలూరులో పుట్టి అక్కడే చదివి తెలుగు లో ఎం ఎ చేశారు .ఏలూరు సి ఆర్ రెడ్డి ఆలేజిలో లెక్చరర్ గా పని చేశారు .ఎవరి పెళ్ళాం ,నళ్ళకళ్ళ అమ్మాయి మొదలైన నవలలు ,వెంకటేశ్వర మహాత్మ్యం ,ఊర్వశి నాటకాలు ,ఆకలి అనే ఖండకావ్య సంపుటి జంపన రాశారు .జంపన –కొవ్వలి జంట రచనలపైఆకాలం వారికీ విపరీతమైన క్రేజు ఉండేది .డిటెక్టివ్ నవలలూ రాశారు జంపన .స్త్రీపురుష సంబంధాలు వివాహ సమస్య వీరి రచనల ఇతి వృత్తాలు సరళ మైన భాష సస్స్పెంస్ తో కధనంవీరి ప్రత్యేకత .

      తర్వాత మకాం మద్రాస్ కు మార్చి సినిమాలకు మాటలు రాసి ఆతర్వాత దర్శకులుగా పని చేశారు .

     1960లో జంపన దర్శకత్వం వహించిన భట్టి విక్రమార్క చిత్రం లో అంజలి రామారావు ,రేలంగి మొదలైన వారు ముఖ్యనటులు  విక్రమార్క,ప్రభావతి అంటే రామారావు అంజలీ దేవి గార్ల సౌందర్యం అంతా తనివి తీరా చూసి ఆస్వాదించాల్సిన సినిమా అనిసెట్టి రచన ,పెండ్యాల సంగీతం  ఘంటసాల సుశీల గానం సినిమాకు మరింత వన్నె తెచ్చాయి .ప్రతి ఫ్రేం అత్యద్భుతం కనులవిందు .ఆది ఇరానీ ఫోటోగ్రఫీ కి జోహార్లు .నెలరాజా వెన్నెలరాజా ,కొమ్ములు తిరిగిన మొగవాళ్ళు కొంగు తగిలితే పోలేరు ,సత్యాయా గురుడా నిత్యామయా మొదలైన పాటలు ఎన్నిసార్లు విన్నా వినబుద్ధి అవుతాయి .

      రాజ్యం పిక్చర్స్ హరిశ్చంద్ర లో రంగారావు లక్ష్మీ రాజ్యం గుమ్మడి మొదలైన వాళ్ళు నటించగా జంపన డైరెక్ట్ చేశారు .మాటలు జంపన పాటలు జంపన ,కొసరాజు రాశారు పద్యాలు బలిజేపల్లి,జాషువా గార్లవి .  సుసర్ల సంగీతం కమల్ ఘోష్ చాయాగ్రహణం .నృత్యం వెంపటి సత్యం లతో క్లాసిక్ సినిమా గా తీశారు జంపన ఆయన దర్శకత్వ సామర్ధ్యానికి ఈ రెండు సినిమాలు నిలువుటద్దాలు .కృష్ణ లీలలు రాజ్యం పిక్చర్స్ నిర్మించగా జంపన డైరెక్ట్ చేశారు రంగారావు ,గుమ్మడి శ్రీరంజని ,.సంగీతం సుసర్ల ఫోటోగ్రఫీ ఎం ఎ రెహ్మాన్ .ఆరుద్ర ,కొసరాజు సదాశివ బ్రహ్మ౦ లు మాటలు పాటలు .అద్భుతమైన సినిమాగగా  జంపన తీర్చిదిద్దారు .రంగారావు గారి కంసపాత్ర చిరస్మరణీయం .బాలకృష్ణుని లీలలు పరమాకర్షణీయం .మెలో డ్రామా బాగా పండించారు .1964లో వచ్చిన మేనరికం సినిమాకు నిర్మాత దర్శకుడు జంపన .పెండ్యాల మ్యూజిక్ ,నారాయణరావు జి వరలక్ష్మి సావిత్రి వగైరాలున్నారు .పెద్దగా ఆడిన సినిమాకాదు .1960లో వచ్చిన అశోకా వారి వాలి సుగ్రీవ సినిమా కు కవి ,జంపన డైరెక్టర్ .ఎస్ వరలక్ష్మి జి వరలక్ష్మి శ్రీరంజని ,రాజారావు ఏవి సుబ్బారావు మొదలైనవారు నటులు .సంగీతం రాజేశ్వరరావు పెంచలయ్య ఘంటసాల ,పెండ్యాల ,వేణు .ఇదీ బాగా ఆడిన సినిమా కాదేమో . జంపన దర్శకత్వ  ప్రతిభ అంతా భట్టి, , కృష్ణలీలలు లో దర్శనమిస్తుంది .పరవశింప జేస్తుంది .

      సశేషం

    మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

సకలకళా సరస్వతి అనసూయా కులకర్ణి

సకలకళా సరస్వతి అనసూయా కులకర్ణి

అనసూయ కులకర్ణి ప్రముఖ సంగీత విద్వాంసురాలు, తెలుగు సినిమా నేపథ్య గాయని. లలిత కళల పట్ల మక్కువ చూపనివారుండరు. ఆకర్షణగా మొదలైన ఆసక్తిని అభ్యాసం ద్వారా అవలోకన చేసుకుని అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అనసూయా కులకర్ణి . అంతటితో ఆగక వివిధ దేశాల్లో విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.

చలన చిత్ర ప్రవేశం
కర్ణాటక సంగీతంలో గాన కళారత్న ఆర్‌.ఆర్‌.కేశవమూర్తి శిష్యరికంలో ఓనమాలు దిద్దిన అనసూయ, 1952వ సంవత్సరంలో బెంగుళూరు ఆల్‌ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నై మ్యూజిక్‌ అకాడమీ నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకోవడం విశేషం. ప్రముఖ గురువు మైసూర్‌ టి.చౌడయ్య వద్ద కూడా కొంతకాలం శిష్యరికం చేశారు. ఆమె గాన మాధుర్యానికి ఆకర్షితులై ప్రముఖ సినీ దర్శకులు ఎం.వి.సుబ్బయ్యనాయుడు 1961లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.

కుటుంబ జీవితం[మార్చు]
వివాహానంతరం ఆమెకు భర్తతో పాటు దేశ విదేశాలు తిరిగి చూడడం, అక్కడి సంగీత రీతులు, సంగీత వాద్యాలను తెలుసుకునే అవకాశం లభించింది. అదే ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. 1964లో భర్త ఉద్యోగ రీత్యా కాబూల్‌కు మారడంతో అక్కడి ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ సరంగ్‌ శిష్యరికంతో హిందూస్తానీ సంగీతం అభ్యసించే సదవకాశం ఆమెకు దొరికింది. ఉస్తాద్‌ తన ప్రియ శిష్యురాలికి స్వరమండలం ‌ అనే తంత్రీవాద్యాన్ని కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. సంగీత వాద్యాలను సేకరించాలనే తన ఆలోచనకు నాంది పలికింది గురువుగారు బహూకరించిన ఆ తంత్రీవాద్యమే అంటారు అనసూయ. కాబూల్‌లో కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత భర్తతో కలిసి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, కెన్యా, పపువా న్యూ గినియా, ఉగాండా, మంగోలియా, ఇథియోపియా, భూటాన్‌, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఆదేశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులతో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నో యూనివర్శిటీలలో ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం కింద సంగీతం నేర్పించారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ …. వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.

ప్రతి వాద్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తేవడం ఓ ఎత్తైతే దాన్ని పాడవకుండా భద్రపరచడం మరో ఎత్తు. ఇది నిజంగా ఓ సవాలు అంటారు అనసూయ. ఇండోనేషియాలో ఆమె మొదటిసారిగా అంగ్‌క్లంగ్‌ను (వెదురుబొంగులను వరుసక్రమంలో బిగించిన చట్రం. చూడడానికి జైలోఫోల్‌ (కర్రముక్కల సంగీతపు పెట్టె) మాదిరిగా ఉండే అతిపెద్ద వాద్యం) చూశారు. అది పూర్తిగా ఒక పెద్ద గదిని ఆక్రమించేది. పైగా దానిలో స్వరాలు పలికించడానికి వాద్యకారులు ముందుకు వెనుకకు పరుగెత్తవలసి వచ్చేది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో గాయనీ గాయకులు నిలబడడం, పరుగెత్తడం వంటివి లేకుండా కూర్చొని ప్రేక్షకులు చూసి ఆనందించేలా ఆలపిస్తారు.

ఆ విధంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంలో కూడా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రేక్షకులు వినగల్గేలా ఎందుకు ప్రదర్శించకూడదు? అనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా జరగాలంటే మొదటగా ఆ పరికరం పరిమాణం తగ్గించాలి. ఆ పనిని అంగ్‌క్లంగ్‌ వాద్య నిపుణుల సహకారంతో చేయాలని ఆమె భావించారు. ధ్వని, మాధుర్యం, స్వరస్థానాలలో ఏ మాత్రం మార్పు లేకుండా దాని పరిమాణం తగ్గించడంలో ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. పునరుద్ధరించిన ఆ వాద్యానికి ‘అంగ్‌క్రంగ్‌’ అనే పేరునిచ్చారు. అక్టోబర్‌ 24న తన ఇద్దరు కుమారులు, దినేష్‌ (మృదంగం), ఉమేష్‌ (ఘటం) వాద్య సహకారంతో ఇండోనేషియా దూరదర్శన్‌లో కర్ణాటక సంగీత ప్రదర్శన ఇచ్చారు. తర్వాత పెర్త్‌ నగరంలో జరిగిన హిందూమహాసముద్ర ఉత్సవంలో (ఓషన్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఆర్ట్‌) ఆమెను ఇండోనేషియా ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది.

కళారంగంలో ముందడుగు
పపువా న్యూ గినియాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాకు చెందిన సంగీతవాద్య ప్రదర్శన ఇవ్వడమంటే సాధారణ విషయం కాదు. అతికొద్ది కాలంలోనే అంగ్‌క్లంగ్‌తో ఒక గంట కచేరీ చేయగలిగేంతగా ఆ వాద్యంపై పట్టు సాధించారు అనసూయ. భారతదేశం లోనే కాక ఇతర దేశాలలోనూ ప్రపంచ సంగీత సాధనాల గురించి ప్రదర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. సందర్శకులంతా ఈ వాద్యాలను పవర్‌ పాయింట్‌ స్లైడ్స్‌లో వాయించి చూపితే బాగుంటుందని కోరడంతో ఆమె తన దగ్గరున్న వాద్యాలను స్వయంగా ప్రదర్శించి చూపాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపడం వల్ల ప్రేక్షకులు ఆ వాద్యనాదంలో పూర్తిగా లీనమవగల్గుతారు. ఏది ఎలా ఉన్నా ప్రతిసారీ ఈ విలువైన వాద్యాలను కదిలించడం సాధ్యంకాదు కదా! ఇదంతా ఎప్పటికి సాధ్యపడుతుందో! అంటారు అనసూయ సాలోచనగా.

మరొక శ్లాఘనీయమైన అంశం ఏమిటంటే అనసూయ గౌరవార్థం బెంగళూరులోని పలు సంస్థలకు, మలేషియాలోని ఒక సంస్థకు ఆమె పేరు పెట్టారు. అనసూయ ఎన్నో టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొనడమే కాకుండా ఎన్నో పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశారు. 2001 వ సంవత్సరంలో అన్నామలై యూనివర్శిటీ నుంచి కర్ణాటక సంగీతం లో ఆమె డాక్టరేట్‌ అందుకున్నారు. 2008వ సంవత్సరంలో అంగ్‌క్లంగ్‌ వాద్యంలో భారతీయ శాస్త్రీయ సంగీతబాణీలో పలికించినందుకు గాను ఆమె పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేశారు.

అదే సంవత్సరం అక్టోబర్‌ 24 న ఐరాస దినోత్సవం సందర్భంగా 90 నిమిషాల పాటు దాదాపు 20 సంగీత వాద్యాలను ఒక సహచరుని సాయంతో పరిచయం చేస్తూ ప్రదర్శించారు. ఆ ప్రదర్శన యవనికలోని నృపతుంగరోడ్‌లో జరిగింది. అనసూయ మాత్రం సంగీత వాద్యాల సేకరణ, వాటిని వాయించే విధానం, ముఖ్యంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంపై తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించారు. మొదట నేను సేకరించిన వాద్యాలను మొదటి అంతస్తులో భద్రపరిచేదాన్ని. కానీ క్రమంగా సేకరణ వాద్యాలు ఎక్కువయ్యాయి. దాంతో రెండవ అంతస్తు కూడా నిర్మించి, రెండు అంతస్తుల్లోనూ అరలు, బీరువాలు డిజైన్‌ చేసి ప్రదర్శనకు వీలుగా తయారుచేశాము. కానీ ఇప్పుడు ఈ రెండు అంతస్తులు కూడా నిండిపొయ్యాయి అని నవ్వుతూ చెప్తారు అనసూయ. మొత్తంగా ఇప్పటికి ఆమె సేకరించిన సంగీత వాద్యాల సంఖ్య అక్షరాలా 300. అంగ్‌క్లంగ్‌ కళాకారిణిగా ఆమె ‘కర్ణాటక కళాశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.

నేను ఇక ఎక్కువ కాలం పాడలేననేది నిజం. అయినప్పటికీ పాడగలిగిన విద్వాంసులకు ఏ మాత్రం కొరతలేదు. కానీ అంగ్‌క్లంగ్‌పై శాస్త్రీయ సంగీతాన్ని పలికించగల ఏకైక కళాకారిణిని మాత్రం నేనే అని సగర్వంగా చెప్తారు అనసూయ.

లలిత కళల పట్ల మక్కువ చూపనివారుండరు. ఆకర్షణగా మొదలైన ఆసక్తిని అభ్యాసం ద్వారా అవలోకన చేసుకుని అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అనసూయా కులకర్ణి. అంతటితో ఆగక వివిధ దేశాల్లో విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.

కర్ణాటక సంగీతంలో గాన కళారత్న ఆర్‌.ఆర్‌.కేశవమూర్తి శిష్యరికంలో ఓనమాలు దిద్దిన అనసూయ, 1952వ సంవత్సరంలో బెంగుళూరు ఆల్‌ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నరు మ్యూజిక్‌ అకాడమీ నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకోవడం విశేషం. ప్రముఖ గురువు మైసూర్‌ టి.చౌడయ్య వద్ద కూడా కొంతకాలం శిష్యరికం చేశారు. ఆమె గాన మాధుర్యానికి ఆకర్షితులై ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు 1961లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.

వివాహానంతరం ఆమెకు భర్తతో పాటు దేశ విదేశాలు తిరిగి చూడడం, అక్కడి సంగీత రీతులు, సంగీత వాద్యాలను తెలుసుకునే అవకాశం లభించింది. అదే ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. 1964లో భర్త ఉద్యోగ రీత్యా కాబూల్‌కు మారడంతో అక్కడి ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ సరంగ్‌ శిష్యరికంతో హిందూస్తానీ సంగీతం అభ్యసించే సదవకాశం ఆమెకు దొరికింది. ఉస్తాద్‌ తన ప్రియ శిష్యురాలికి స్వరమండలం ‌ అనే తంత్రీవాద్యాన్ని కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. సంగీత వాద్యాలను సేకరించాలనే తన ఆలోచనకు నాంది పలికింది గురువుగారు బహూకరించిన ఆ తంత్రీవాద్యమే అంటారు అనసూయ. కాబూల్‌లో కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత భర్తతో కలిసి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, కెన్యా, పపువా న్యూ గినియా, ఉగాండా, మంగోలియా, ఇథియోపియా, భూటాన్‌, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఆదేశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులతో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నో యూనివర్శిటీలలో ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం కింద సంగీతం నేర్పించారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ …. వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.

ప్రతి వాద్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తేవడం ఓ ఎత్తైతే దాన్ని పాడవకుండా భద్రపరచడం మరో ఎత్తు. ఇది నిజంగా ఓ సవాలు అంటారు అనసూయ. ఇండోనేషియాలో ఆమె మొదటిసారిగా అంగ్‌క్లంగ్‌ను (వెదురుబొంగులను వరుసక్రమంలో బిగించిన చట్రం. చూడడానికి జైెలోఫోల్‌ (కర్రముక్కల సంగీతపు పెట్టె) మాదిరిగా ఉండే అతిపెద్ద వాద్యం) చూశారు. అది పూర్తిగా ఒక పెద్ద గదిని ఆక్రమించేది. పైగా దానిలో స్వరాలు పలికించడానికి వాద్యకారులు ముందుకు వెనుకకు పరుగెత్తవలసి వచ్చేది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో గాయనీ గాయకులు నిలబడడం, పరుగెత్తడం వంటివి లేకుండా కూర్చొని ప్రేక్షకులు చూసి ఆనందించేలా ఆలపిస్తారు.

ఆ విధంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంలో కూడా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రేక్షకులు వినగల్గేలా ఎందుకు ప్రదర్శించకూడదు? అనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా జరగాలంటే మొదటగా ఆ పరికరం పరిమాణం తగ్గించాలి. ఆ పనిని అంగ్‌క్లంగ్‌ వాద్య నిపుణుల సహకారంతో చేయాలని ఆమె భావించారు. ధ్వని, మాధుర్యం, స్వరస్థానాలలో ఏ మాత్రం మార్పు లేకుండా దాని పరిమాణం తగ్గించడంలో ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. పునరుద్ధరించిన ఆ వాద్యానికి ‘అంగ్‌క్రంగ్‌’ అనే పేరునిచ్చారు. అక్టోబరు 24న తన ఇద్దరు కుమారులు, దినేష్‌ (మృదంగం), ఉమేష్‌ (ఘటం) వాద్య సహకారంతో ఇండోనేషియా దూరదర్శన్‌లో కర్ణాటక సంగీత ప్రదర్శన ఇచ్చారు. తర్వాత పెర్త్‌ నగరంలో జరిగిన హిందూమహాసముద్ర ఉత్సవంలో (ఓషన్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఆర్ట్‌) ఆమెను ఇండోనేషియా ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది.

పపువా న్యూ గినియాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాకు చెందిన సంగీతవాద్య ప్రదర్శన ఇవ్వడమంటే సాధారణ విషయం కాదు. అతికొద్ది కాలంలోనే అంగ్‌క్లంగ్‌తో ఒక గంట కచేరీ చేయగలిగేంతగా ఆ వాద్యంపై పట్టు సాధించారు అనసూయ. భారతదేశంలోనే కాక ఇతర దేశాలలోనూ ప్రపంచ సంగీత సాధనాల గురించి ప్రదర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. సందర్శకులంతా ఈ వాద్యాలను పవర్‌ పాయింట్‌ స్లైడ్స్‌లో వాయించి చూపితే బాగుంటుందని కోరడంతో ఆమె తన దగ్గరున్న వాద్యాలను స్వయంగా ప్రదర్శించి చూపాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపడం వల్ల ప్రేక్షకులు ఆ వాద్యనాదంలో పూర్తిగా లీనమవగల్గుతారు. ఏది ఎలా ఉన్నా ప్రతిసారీ ఈ విలువైన వాద్యాలను కదిలించడం సాధ్యంకాదు కదా! ఇదంతా ఎప్పటికి సాధ్యపడుతుందో! అంటారు అనసూయ సాలోచనగా.

మరొక శ్లాఘనీయమైన అంశం ఏమిటంటే అనసూయ గౌరవార్థం బెంగళూరులోని పలు సంస్థలకు, మలేషియాలోని ఒక సంస్థకు ఆమె పేరు పెట్టారు. అనసూయ ఎన్నో టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొనడమే కాకుండా ఎన్నో పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశారు. 2001 వ సంవత్సరంలో అన్నామలై యూనివర్శిటీ నుంచి కర్ణాటక సంగీతంలో ఆమె డాక్టరేట్‌ అందుకున్నారు. 2008వ సంవత్సరంలో అంగ్‌క్లంగ్‌ వాద్యంలో భారతీయ శాస్త్రీయ సంగీతబాణీలో పలికించినందుకు గాను ఆమె పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేశారు.

అదే సంవత్సరం అక్టోబర్‌ 24న ఐరాస దినోత్సవం సందర్భంగా 90 నిమిషాల పాటు దాదాపు 20 సంగీత వాద్యాలను ఒక సహచరుని సాయంతో పరిచయం చేస్తూ ప్రదర్శించారు. ఆ ప్రదర్శన యవనికలోని నృపతుంగరోడ్‌లో జరిగింది. అనసూయ మాత్రం సంగీత వాద్యాల సేకరణ, వాటిని వాయించే విధానం, ముఖ్యంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంపై తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించారు. మొదట నేను సేకరించిన వాద్యాలను మొదటి అంతస్తులో భద్రపరిచేదాన్ని. కానీ క్రమంగా సేకరణ వాద్యాలు ఎక్కువయ్యాయి. దాంతో రెండవ అంతస్తు కూడా నిర్మించి, రెండు అంతస్తుల్లోనూ అరలు, బీరువాలు డిజైన్‌ చేసి ప్రదర్శనకు వీలుగా తయారుచేశాము. కానీ ఇప్పుడు ఈ రెండు అంతస్తులు కూడా నిండిపొయ్యాయి అని నవ్వుతూ చెప్తారు అనసూయ. మొత్తంగా ఇప్పటికి ఆమె సేకరించిన సంగీత వాద్యాల సంఖ్య అక్షరాలా 300. అంగ్‌క్లంగ్‌ కళాకారిణిగా ఆమె ‘కర్ణాటక కళాశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.

అనసూయా కులకర్ణి జీవితం ఎందరెందరికో మార్గదర్శకమైంది. తమకు కావలసింది ఏమిటో కచ్చితంగా తెలుసుకొని, అదే దిశగా పయనించి లక్ష్యాన్ని చేరుకుని తాము ఎంతో సాధించామని పొంగిపోయేవారు కొందరైతే, లక్ష్యసాధనలో అవరోధాలకు జడిసి, తమ జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లి, ఏమీ సాధించలేక పరిస్థితులను నిందిస్తూ కూర్చొనేవారు మరికొందరు. కానీ అనసూయ జీవితంలో తనకు ఎదురైన అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుని ప్రపంచ సంగీత రంగాన్నే తన జీవితంగా మలచుకొని ఆరు పదుల వయసులో కూడా పరిస్థితులతో ఎలాంటి రాజీ పడకుండా సాగిస్తున్న పయనాన్ని హర్షించకుండా ఉండలేం. నేను ఇక ఎక్కువ కాలం పాడలేననేది నిజం. అయినప్పటికీ పాడగలిగిన విద్వాంసులకు ఏ మాత్రం కొరతలేదు. కానీ అంగ్‌క్లంగ్‌పై శాస్త్రీయ సంగీతాన్ని పలికించగల ఏకైక కళాకారిణిని మాత్రం నేనే అని సగర్వంగా చెప్తారు అనసూయ

నేటి జనరేషన్’లో పురుషులతోబాటు సమానంగా మహిళలు కూడా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే! కానీ దశాబ్దాల క్రితం అలా వుండేదికాదు. ఏ రంగంలోనైనా రాణించాలన్నా సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అటువంటి సమయంలో కూడా కొందరు మహిళామణులు ఆత్మస్థైర్యంతో ముందడుగువేసి నలుగురికి ఆదర్శంగా నిలిచినవారున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాము అందరికంటే తక్కువకాదంటూ అన్నిరంగాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోగలిగారు. అటువంటివారిలో అనసూయ కులకర్ణి కూడా ఒకరు.

అనసూయ ప్రముఖ సంగీత విధ్వాంసురాలు, తెలుగు సినిమా నేపధ్య గాయని. లలితకళల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగిన ఈమె.. అందులో అభ్యాసం పొంది అవలోకన చేసుకున్నారు. అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు.. విదేశాల్లో సైతం విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.

జీవిత విశేషాలు :

బాల్యంనుంచే సంగీతంపై ఎక్కువ ఆసక్తిని కనబరిచిన ఈమెను ఆమె తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు. అందులో భాగంగానే ఆమెకు సంగీతరంగంలోనే ప్రత్యేక శిక్షణను కల్పించారు. అలా వారి ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలోగాన కళారత్న ఆర్‌.ఆర్‌.కేశవమూర్తి శిష్యరికంలో ఆమె ఓనమాలు దిద్దింది. అనంతరం 1952లో బెంగుళూరు ఆల్‌ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నై మ్యూజిక్‌ అకాడమీ నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకొని, విశేషంగా నిలిచింది. ఆనాడు ఆమె గానమాధుర్యానికి ఆకర్షితులైన ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు.. 1961లో అతను తెరకెక్కించిన ‘భక్తప్రహ్లాద’ చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.

వివాహం చేసుకున్న తర్వాత దేశవిదేశాలు తిరిగిన ఈమెకు.. అక్కడి సంగీత వాతావరణాన్ని తెలుసుకోవడంతో ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. ఉద్యోగరీత్యా భర్త మారిన ప్రదేశాల్ల ప్రముఖ సంగీత కళాకారుల దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం ఆమెకు లభించింది. ఆ విధంగా శిక్షణ తీసుకున్న ఆమె ఆయా ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ… వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-21-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45

45-నర్తన శాల సినీ నిర్మాత -లక్ష్మీ రాజ్యం

   సి.లక్ష్మీరాజ్యం (1922 - 1987) తెలుగు సినిమా, రంగస్థల నటి, నిర్మాత. 1922లో విజయవాడ[ఆధారం చూపాలి]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన శ్రీకృష్ణ లీలలు సినిమాలో బాలనటిగా నటించారు  లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించారు . రెండు చిత్రాలలో ఎన్టీ రామారావు సరసన హీరోయిన్‌గా నటించారు . ఈమె 1941లో తెనాలికి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి కె.శ్రీధరరావును వివాహమాడారు సి.లక్ష్మీరాజ్యం కర్నూలు జిల్లాలోని ఆవుకు గ్రామంలో, 1922లో జన్మించారు.[1]



   చిన్నతనంలో తన చిన్నాన్న నరసింహం దగ్గర సంగీతం నేర్చుకున్నారు. యుక్తవయసులో హరికథలు చెప్పాలనే మక్కువతో సాలూరు రాజేశ్వరరావు వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. ఈమెకు హరికథా కళాకారిణి కావాలన్న లక్ష్యం ఉండేది. మేనమామ వెంకటరామయ్యతో పాటు పువ్వుల సూరిబాబు నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు.[2] తరువాత పులిపాటి వెంకటేశ్వర్లు, పువ్వుల రామతిలకం వారి సమాజంలో ప్రవేశించి కొన్ని పాత్రలు ధరించారు. ఈమె తులాభారంలో నళిని, చింతామణిలో చిత్ర మొదలగు పాత్రలు ఎంతో చలాకీగా పోషించేవారు.

   వీరు 1951లో రాజ్యం పిక్చర్స్ అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి నందమూరి తారక రామారావుతో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన నర్తనశాల. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళారు. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో హరిశ్చంద్ర, శ్రీకృష్ణ లీలలు, శకుంతల, దాసి, రంగేళి రాజా, మగాడు ఉన్నాయి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.

   ఈమె భర్త శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన మద్రాసులోని తమ స్వగృహములో మరణించాడు.[3]

   చిత్ర సమాహారం

నర్తనశాల (1963)
శ్రీకృష్ణ లీలలు (1959)
సామ్రాట్ విక్రమార్క (1968)
హరిశ్చంద్ర
రాజు-పేద (1954)
దాసి (1952)
ఆకాశరాజు (1951)
అగ్నిపరీక్ష (1951) – సుశీల
పరమానందయ్య శిష్యుల కథ – లీలావతి
సంసారం (1950) – మంజుల
ద్రోహి (1948) – సీత
నారద నారది (1946)
త్యాగయ్య (1946)
ఇది మా కథ (1946)
పంతులమ్మ (1943)
ఇల్లాలు (1940)
అమ్మ (1939)
శ్రీకృష్ణ లీలలు (1935)
కృష్ణ తులాభారం (1935)
రాజ్య దాసి చ్చితాన్ని ఉత్తమమయినదిగా నిర్మించకలిగ నందులకు అ భినందనీయులం, “సంసారం? చితని ర్మాతలలో ఒకరైన రంగనాధదాస్‌ శారు తొముగడించిన అపారానుభావం *దాసి, చచ్నితమును సర్వాంగ సుందరం గా నిర్మించడానికి ఉపయోగించుకో కలిగారు, కధ పొందిక్క నడక సహాజం-గాన్కు బహుచక్క గా నున్నది, (పతి సన్ని వేశము జీవితంలోని వా స్పవికతను చి తించేదిగా నొప్పింది, ఉ త్తీమలక్ష్యాలన్యు అదర్శా అను అనేకఘట్లాలలో (_పబోధించబడినవి, చ్యితము చూడను చూడను ఆసక్తి యినువుడిస్తుందంటే ఆళ ఏరో రం “కాదు, . ఓకచాస్‌ీ (పనికత్త్రై తన యజమాని కుటుంబ (శేయస్సు దృష్ట్యా ఆడినమాట తప్పకుండా, అఘండత్యా గాలు వేసింది, ఈసందర్భంలో తన భర్తకు, బిడ్డల దూరమయింది. ఇల్లు వాకిలి సర స్వాన్ని వదిలేసి దిక్కు లేనిపక్షీలాగ అఆలమటించి చివరకు తను తనభర్శ, బిడ్దలం ఒకచోట చరి అనంద భా పన్చాలు రాలుస్తారు, నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే వివిధ ‘సమ స్యలం, వ్య కులు వారి తరహాలు, లోకం పోకడ వాల “శహుజం గా చతించబడనవి, ఈ చ్మితంలోని భూమికలు చక్కగా నిర్వహించ బడీనవి, (శీ,మతి లక్ష్మీ రాజ్యం, యన్‌, టి, రామా రావుగారలు చక్కా గా నటీంచారు, “= ఇందులో హోాస్యరసం సయితం శివరావు ‘లేలంగి “గారలం సవహాజంగా పోసింవారుః స్ట సంగీతం మనో జ్ఞం గా నున్నది, ఈచిత్రం నిశషమెన (పజాదరణ పొందగలఅదను టకు సందేహము లేదు, దర్శకుడు (శ్రీరంగనాధదాస్‌ గారికి చక్కని భవిస్యత్తు కలదని యాచి.త్రం రుజువు చేసేంది, రాజ్యం పిక్చర్‌ చారు యింకా ఆఅసేక ఉట తము అటే చిళతాలను నిర్మించగలరని అశిస్తు న్నాము,

   కొంతమంది వ్యక్తులు తమ జీవితకాలం లో ఎలా సతమతమౌటారో ,ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారో ,ఎంత కృషి చేసి పైకోస్తారో ,ఈ నాటి నటీనటులకు ఎలాంటి సామర్ధ్యాలు ఉండాలో లక్ష్మీ రాజ్యం ను చూస్తె తెలుస్తుంది .ఒక రోజు సుప్రసిద్ధ రంగస్థల నటిగా ,మరో రోజు సుప్రసిద్ధ చలన చిత్ర నటిగా ,ఆ తర్వాత నిర్మాతగా ,దియేటర్ యజమానురాలుగా సుమారు 55ఏళ్ళు కళారంగం లో తన జీవితాన్ని గడిపిన కీర్తి ఆమెది .

    చిన్నతనం లోనే సంగీతం పినతండ్రి నరసింహం గారి వద్ద నేర్చారు .హరికధలు చెప్పాలన్న మక్కువతో సాలూరు రాజేశ్వరరావు గారి వద్ద హరికదాగానం నేర్చుకొన్నారు .మేనమామ వెంకటరామయ్య కళాకారుడు కావటం తో ఆయనతో పాటు సూరిబాబు గారి నాటక సమాజం లో చేరి ఊరూరూ తిరిగి నాటకాలు ప్రదర్శించారు .ఈ నాటకాలలో  స్త్రీపాత్రలు అత్యుదాత్తం గా పోషించారు ...తర్వాత పులిపాటి వెంకటేశ్వర్లు ,పువ్వుల రామ తిలకం గార్లతో కలిసి తులాభారం లో నళిని ,చింతామణిలో చిత్ర వంటి చలాకీ పాత్రలు పోషించారు .ఆనాటి ప్రముఖ రంగస్థల నటుల౦దరితోనూ నటించిన అనుభవం ఆమె గారిది .చాలాకాలం బెజవాడ లో ,తెనాలిలో ఉంటూ అనేక పాత్రలు ధరించారు .

     రంగస్థలం అనుభవంతో మొదటి సారిగా 1935లో కృష్ణ సినిమాలో రాధగా ,1936లో మాయాబజార్ లో సత్యభామగా ,1940లో కాల చక్రం సినిమాలో సూరి బాబు గారి ప్రక్కన హీరోయిన్ గా నటించారు .ఈ చిత్రాలు కొన్ని హిట్ ,కొన్ని ఫట్ అవటంతో సినిమాల్లో సుస్థిరత రాలేదు .తర్వాత గూడవల్లి రామబ్రహ్మ గారి ఆహ్వానం తో మద్రాస్ వెళ్లి 1940లో ఇల్లాలు చిత్రం లో నటించి అఖండమైన కీర్తి సాధించారు తర్వాత స్వయంగా నిర్మాతగా మారి సినిమాలుతీసి సూపర్ హిట్ కొట్టారు .నర్తన శాల చిత్రానికి జకార్తా అవార్డ్ రాగా జకార్తా వేల్లిస్వీకరించారు .

     సశేషం

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-22-ఉయ్యూరు 
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -43

మనమరపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -43

 43-నట యోగి లింగమూర్తి -2

— _ నేతి పరమేశ్వర శర్మ MOHINI  1999

 ముదిగొండ లింగమూర్తి అంత పొడగరి కాదు – అంత పొట్టికాదు. అంత లావూకాదు, అంత సన్నమూకాకుండా సమతూకంగా ఉండేవారు. ఎప్పుడూ తెల్లటి ధోవతి పింజపోసి కట్టి మెడపట్టీలేని తెల్లని లాళ్ళీ ధరించి ఉండేవారు. ఈ తెలుపునకుతోడు పల్చని నలుపు తెలుపు శిరోజాలు! నెమ్మదిగా మాట్లాడే స్వభావం. జ నెమన్ముదిలోనూ కరకరలాడే కంఠస్వరం! చిరుగాలికి కూడా చలించే లెతాకు నంటి మనస్తత్వం! ఈ లక్షణాలన్ని కలబోసి కన్సించేవారు ‘  లింగమూర్తి 1908 అక్టోబర్‌ 10వ తేదీన ‘ఆంధధ్రాప్యారిస్‌’ని పిలిచే తెనాలి పట్టణంలో జన్మించారు. వీరు ఉద్భటారాధ్య వంశీకులు, తెలంగాణాలోని దేవరకొండ తాలూకా ముదిగొండ [గ్రామం ఈ వంశీకుల జన్మస్థలం. పందొమ్మిదవ శతాబ్దంలో ఈ వంశీకులు కొందరు తెనాలి వచ్చి స్టరపడ్డారని తెలుస్తోంది. ఆ వంశంలోనివారే లింగమూర్తిగారు. తెనాలి తాలూకా హైస్కూల్ట్‌ విద్యాభ్యాసం జరిగింది. స్కూల్‌ ఫైనల్‌ వరకు చదివారు. అదే కాలంలో ఆ పాఠశాలలోనే గోవిందరాజుల సుబ్బారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, అబ్బూరి రామకృష్ణారావు, లక్కరాజు విజయగోపాలరావు, పెద్దిభొట్ల చలపతి, పల్లలమర్రి సుందరరామయ్య మొదలైన మహానటులందరూ చదివారు. అందరూ కలిసి పాఠశాల నాటకాల్లో పాల్గొన్నారు. హైస్కూల్‌ వదిలిన తర్యాత పూర్వ విద్యార్థుల నాటక సంఘమంటూ ఒకటి నెలకొల్సి నాటకాలు ప్రదర్శించారు. విరంతా పెరిగి నటులుగా రూపుదిద్దుకొంటున్న సమయంలోనే కొడవటిగంటి కుటుంబరావు, గుడిపాటి వెంకటచలం, మాధవపెద్ది బుచ్చి సుందరరామయ్య శా త్రిపురనేని గోపీచంద్‌, మునిమాణిక్యం నరసింహారావు, త్రిపురారిభట్ల విరరాఘవస్యామి మొదలైన కవులు సాహిత్వసేవ చేస్తూ ఉండేవారు. లింగమూర్తిగారి పూర్వీకుల్లో గాయకులుగాని, నటులుగాని, ఉన్నట్టు దాఖలాలు కన్సంచడము లేదు. కానీ వారు జన్మత: నటులు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ, కాలక్షేపం చేయకుండా, నాటకరంగంలోకి వచ్చారు. ఆం(ధ్రదేశంలో పేరెన్నికగన్న శ్రీ రామవిలాస సభలో వీరుకూడా ఆదిలోనే ప్రవేశించారు. ఆ సభవారు ప్రదర్శించిన (ప్రతాపరుద్రీయం నాటకంలో పడవవానివేషం మొదలు యుగంధరుని పాత్రవరకూ సుమారు పదిరకాలైన పాత్రలు ధరించి ప్రశంసలు పొందారు. “నివు రమ్యాలోకన కలిగిఉండే ఒక్క గడ్డిపరకముదనే రత్నఖచితమైనట్టి అద్భుత సౌధాన్ని వ్యక్తపరచగలవు. కాని నీలో ఆ రమ్యాల్‌ కన లేనప్పుడు మాత్రం ఒక్క గడ్డిపరకే ఆ అద్భుత సౌధాన్ని దాచివేస్తుంది” అంటూ ఒక జపాన్‌ ఆచార్యుని సూక్తిని శ్రీ సంజీవ్‌దేవ్‌ రూపారూపాల నేతన [గ్రంథంలో ఉట౦కించారు. ఈ సూం్త లింగమూర్తిగార్కి సరిగ్గా అతికిపోతుంది. కన్యాశుల్కం నాటకం శ్రీరామ విలాససభవారు అద్భుతంగా ప్రదర్శించెవారు. అందులో రామప్తు పంతులు వేషం మొదట్లో తంగిరాల ఆంజనేయులుగారు (మాష్టర్‌ అంజి) ధరించారు. వీరు అకాల మరణం చెందారు. కన్యాశుల్కం నాటకానికి విఘాతం ఏర్పడింది. అటువంటి క్తిష్టపరిస్టితుల్లో లింగమూర్తిగారు రామప్ప పంతులు పాత్రను స్వకరించి మాష్టర్‌ అంబికి సమ ఉబ్జీగా పోషించి ప్రశంసలు పొందారు. వీరు ప్రారంభంలో రామప్ప పంతులు వేషానికి తలపాగా ధరించేవారు. (ప్రేక్షకులు తలపాగాకు నిరసన తెలియజేస్తే వారి అభిరుచిననుసరించి తలపాగా తొలగించి ‘జులపాలు’ జుట్టుతో అభినయించారు. ఈ సందర్భంలో ఒక సన్నివేశం వివరిస్తాను. ఒక సందర్భంల్‌ మధురవాణితో మాట్లాడి తలుపువేసుకొని జా(గ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ రంగంలోనుండి నిష్కమించే సమయంలో మధురవాణిపై అనుమానం, అంతలోనే వృద్ద రసికత్వం చూపుతూ చేసే అభినయానికి ప్రేక్షకులు ముగ్గులై హర్షధ్యానాలతో హోరెత్తించేవారు. ఈ విధంగా అనేక సన్నివేశాలలో అద్భుతంగా నటించి అజరామరమైన కీర్తిని సంపాదించుకున్నారు. కొంతకాలం న్థానం నరసింహారావుగారి సమాజంలోనూ, మరికొంతకాలం సి.యస్‌,ఆర్‌. ఆంజనేయులుగారు ప్రదర్శించిన భక్తతుకారాం, పతితపావన జ్‌. నాటకాలలోనూ వివిధ పాత్రలుపోషించారు. స్పష్టమైన వాచకం, పాత్రోచితమైన వేషం, హద్దులు మీరని ఆంగికాభినయంతో ‘ప్రతిపాత్రనూ రసరంజితంచేసి (ప్రేక్షకులకు రసానుభూతిని కల్షించెవారు. అందుక్షేపేక్షకులు ఏరిని ‘క్యారెక్షర్‌ యాక్టరోగా అభిమానించారు. ఆ రోజుల్లో ప్రదర్శించే నాటకాల్లో మల్డాది గోవిందశాసస్త్రి, ఏలేశ్వరపు కుటుంబళా’స్త్రి, బెల్లంకొండ సుబ్బారావు, కళ్యాణం రఘురామయ్య, యస్‌.పి. లక్ష్మణస్వామి, మాష్టర్‌ కళ్యాణి, జొన్నవిత్తుల శేషగిరి, టి. రామకృష్ణశాస్త్రి ప. సూరిబాబు, మొదలైన వారంతా అద్భుతంగా పద్యాలు పాడి వేషాన్ని రక్తి కట్టించేవారు. ఇందరు మహాగాయకులు, నటుల మధ్య కేవలం డైలాగ్స్‌  చెబుతూ (పైక్షకుల అభిమానాన్ని లింగమూర్తిగారు పొందారంటే వారి నటనా సామర్ధ్యాన్ని మనం గమణంచవచ్చు,. ఆమా “భి విధంగా కేవలం ‘ సంఖభాషకులు చెప్పేనటులను ఆరోజుల్లో “ప్రోజ్‌ యాక్టర్స్‌” అని పిలిచెవారు. గోవిందరాజులు సుబ్బారావు, బసవరాజు సుబ్బారావు, డాక్టర్‌ చంద్రమౌళి సత్యనారాయణ, వంగర వెంకట సుబ్బయ్య, లింగమూర్తి మొదలైన వారందరూ (ప్రోజ్‌యాక్టర్స్‌గా చలామణి అయ్యారు. జౌత్సాహిక నాటక సమాజాలవారు వీరిని నాటకం రిహార్సల్స్‌ చూడటానికి ఆహ్యానిస్తూఉండేవారు. పెద్దనటుడ్ని అనే గర్యం లేకుండా రిహార్సల్స్‌ చూడటానికి వచ్చేవారు. వచ్చినవారు రిహార్సల్స్‌ చేసే ప్రదేశంలో కూర్చోకుండా చాటుగా కూర్చుని నాటకం ఆసాంతం విని మనోనేత్రంతో చూసి నాటకంలోని లోటుపాట్లను క్షుజ్మంగా వివరించేవారు. రిహార్సల్స్‌ చూసేఎరి ప్రత్యేక  పద్దతి గురించి ఆరోజుల్లో విశేషంగా చెప్పుకునేవారు. ఇక వీరి సినిమా జీవితం పరిశీలిస్తే… 1937 సం॥ ఏరి సినిమా జీవితానికి నాంది పలికింది. ప్రథమ దర్శనం తుకారాంలో గోస్వామి పాత్ర. కానీ వాహినీవారి వందేమాతరం (1939)లో డాక్టర్‌ పాత్ర అద్భుతంగా పోషించి వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత స్వర్గసీమ, సుమంగళి, దేవత, భక్తమాల, నారద-నారది, సువర్షమాల, ధర్మాంగద, వేమన, పెద్దమనుషులు, త్యాగయ్య, నా ఇల్టురామదాసు, ఆమ్మరుసు పాండవ వనవాసం మొదలైన ఎనఖై సినిమాలలో వైవిధ్యంగల పా(త్రలెన్నో ధరించారు. ధరించిన పాత్రలన్ని పండించారు. ‘వేమన’లొ అభిరామయ్య పాత్ర, ‘త్యాగయ్య’లో జపేశన్‌ పాత్ర, ‘పాండవ వనవాసం”లో శకునిపాత్ర, ‘పోతనిలో అజామిళిని పాత్ర “నభూతో నభవిష్యతి” అన్నట్టు నటించి, నటునిగా విశ్వరూపం చూపారు. “పెద్దమనుషులు’ సినిమాలో రామదాసు పాత్ర”, ‘పాండవ వనవాసం’ లో శకునిపాత్ర నటనాపరంగా భిన్నధృవాలైన పాత్రలు. ఆ పాత్రలు రెండింటిని పోల్చుకుని సమీక్షిస్తే వారి నటనలోని లోతుపాతుల్ని, నటనా నైపుణ్యాన్ని మనం గమనించవచ్చు. సారథీవారి ‘పంతులమ్మ’ (దర్శకుడు శ్రీ గూడవల్లి రామబ్రహ్మం)లో ఒక ‘టిపికల్‌ పాత్ర పోషిం ప్రజాభిమానాన్ని, విమర్శకుల (ప్రశంశల్ని పొందారు. పోతన, స్వర్గసీమ సినిమాలలో నటించడమేగాక ఆ చిత్రాలకు, (ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కూడా పనిచేశారు. సాధనావారి ‘సంసారం’ సినిమాకు కొంతవరకు దర్శకత్వం వహించి, విరమించుకున్నారు. 1949 సం॥లో ఉత్తమ నటునిగా ఎంపికై తన సత్తాని నిరూపించుకున్నారని చిత్రకళ పత్రిక (1949)లో ప్రముఖంగా ప్రచురించారు. సినిమా టెక్నీషియన్స్‌ ఎసోసియేషన్‌కు కార్యదర్శిగా కొంతకాలం పనిచేసారు. ఎరు సహనటులను మనస్సూర్తిగా ప్రేమించేవారు. 1957 సం॥లో సన్మాన సంఘానికి కార్యదర్శిగా ఉండి మద్రాసుల్‌ స్టానంవారిని వ్‌ ఘనంగా సత్కరించారు. ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్యగారు, లింగమూర్తిగారు జీవికా జీవులు. నాగయ్యగార్ని ఎంతో ఆప్యాయంగా ‘బావా’ అంటూ పిలిచేవారు. భక్తపోతన వేషానికి నాగయ్యగారు పనికివస్తారా? పనికిరారా? అన్న సందిగ సమయంలో లింగమూర్తిగారు కె.వి.రెడ్డిగారికి ధైర్యంచెప్పి నాగయ్యగారినే ఖాయం చేయించారు. “భక్త పోతన షూటింగ్‌ మొదటిరోజు రానేవచ్చింది. ఆరోజు ఉదయమే, (క్రాఫింగ్‌ తీయించి, స్నానం చేయించి స్టూడియోలోని మేకప్‌రూమ్‌కు తీసుకొని వెళ్తాను… ఒక గంటలో వేషం పూర్తి అయింది. ఆయన ముఖంలోకి మూసాను. మా నాగయ్యకాదు. ఆ రూపమే లేదు. ఎదొ కొత్తతేజం కనబడింది. నా వళ్లు జలదరించింది.” అంటూ ఆనాటి “పోతన” గురించి తర్వాత చెప్పారు లింగమూర్తి గారు. పోతన సినిమూ అఖండ విజయం సాదించింద్‌. నాగయ్యగారిలో భక్త పోతనను చూసే మహద్భాగ్యం ఆం(ధ్ర(ప్రజలకు కలిగించినవారు లింగమూర్తిగారేనని ఎందరికి తెలుసు? కపటము, ఈర్ష్య ఎరుగని మహోన్నత వ్యక్తిని లింగమూర్తిగారిలో చూడవచ్చు. సినిమా నటునిగా పేరు (ప్రఖ్యాతులు సంపాదించిన తరువాత కూడా నాకి ఉన్నతికి కారణమైన నాటకరంగాన్ని విస్మరించలేదు. అవకాశం లభించినపుడల్లా రంగస్థలంపై నటిస్తూనే వచ్చారు. పెడతోవలు పడ్డున్లు నాటకరంగాన్ని, నటుల్ని నిర్మొహమాటంగా విమర్శించేవారు. రంగస్థలం అభివృద్దికి ఎంతగానో పాటుపడ్డారు. నాటక రంగంలోనేకాదు, సినిమారంగంలోకూడా క్యారెక్టర్‌ యాక్టర్‌ అనిపించుకున్న బహుకొద్దిమందిల్‌ లింగమూర్తిగారిదే అగ్రస్థానం! ఎపా(త్ర ధరించినా లింగమూర్తిగారు కనబడేవారుకాదు. పాత్ర కనబడేది. నాటకరచయితగా కూడా లింగమూర్తిగారు పేరు పొందారు. వెంకన్న కాపురం, పెళ్లిచూపులు, త్యాగం మొదలైన కొన్ని నాటికలు కూడా రించారు. వెంకన్న కాపురం నాటికను ఒక దశాబ్దంపాటు ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని సమాజాలవారు (ప్రదర్శించారు. ఆరోజుల్లో ప్రతి పరిషత్తులోనూ, వెంకన్నకాపురం నాటిక ఉండాల్సిందే! బహుమతులు గెల్బుకోవాల్సిందే!! “నాటకరంగంమీద ఏకాగ్రతతో పాత్రలో లీనమై పాత్ర జొచిత్యం గ్రహించి, పోషణ చేసుకుంటూ నటించే నటునికి, ఆ అనుభవంలో ఉత్తీర్ణుడై తరించే మార్గం అలవడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా ఉపకరిస్తుంది. రంగస్థలం ఒకో దేవాలయం లాగా అందుకు ఉపయోగపడుతుంది. ఆత్మకు మోక్షాన్ని కలిగించే మార్గాల్లో ఇదొకటి (బళ్లారి రాఘవ). సరిగ్గా ఇదే దృక్సృథంతొ లింగమూర్తిగారు నాటకరంగ జీవితమంతా గడిపారు. మానవజీవితం ఎప్పుడూ ఒకేరకంగా ఉండదు. జీవనగమనంలో ఎత్తుపల్టాలు, వెలుగు నీడలు చాలా సహజం. 1974లో వారి అర్జాంగి కైవల్యం పొందారు. ఆ సంఘటన లింగమూర్తిగారి జివనగమ్యాన్ని మార్చివెసింది. నటరాజుని మనసా, వాచా, కర్మణా విశ్శసెంచిన, ఉవాసించిన ఆ నటరత్నం నాటకరంగాన్ని ఏడ్‌, ఆథ్యాత్మిక చింతనాపరులైనారు. సత్యాన్వేషణల్‌ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. శేషజీవితాన్ని కాశీపుణ్యక్షేత్రంలో విశ్వేశ్వరుని సన్నిధిలోగడిపి, అక్కడే లింగైక్యం చెందారు.    

-ముదిగొండ లింగమూర్తి గారి వెంకన్న కాపురం (1958) నాటిక ఆంధ్రదేశంలో విసృతంగా ప్రదర్శించబడిన నాటికలలో యిదొకటి

‘యోగి వేమన’

లింగమూర్తి :- అభిరామ్.

ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ నాగయ్య గూర్చే చెబుతుంటారు. వంకాయకూర బాగుంటే నాణ్యమైన వంకాయల్నీ, వంటమనిషిని మెచ్చుకుంటాంగానీ – ఉప్పూ, కారాల్ని మెచ్చుకోం. కానీ అవి లేకుండా కూరే లేదు. కానీ వాటికి అంత గుర్తింపు ఉండదు. అందుకే – చిత్తూరు నాగయ్య అనే మర్రిచెట్టు ఇతర పాత్రధారుల ప్రతిభని కప్పెట్టేసిందని సినిమా రెండోసారి చూస్తేగానీ తెలీదు.

అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి నటన సూపర్బ్. చాలా సహజంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నాగయ్యకి పోటీగా తట్టుకుని నిలబడ్డాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నాకు మహామంత్రి తిమ్మరసు, పాండవ వనవాసం సినిమాల్లోని ‘దుష్ట’ లింగమూర్తి తెలుసు. ‘సాత్విక’ లింగమూర్తి తెలీదు.

‘పెళ్లిచేసిచూడు’ లో దొరస్వామి కూడా నాకిట్లాంటి షాకే ఇచ్చాడు. ఈ పాత సినిమాలు చూస్తుంటే క్రమంగా నాకొక విషయం అర్ధమవుతుంది. పాతతరం నటులైన లింగమూర్తి, దొరస్వామి వంటి గొప్ప ప్రతిభావంతులని మనకి తెలీదు. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు ఒకటో, రెండో చూసి ఏదో సాదాసీదా సపోర్టింగ్ ఆర్టిస్టుల్లే అనుకుంటాం.. కానీ కాదు.

 పౌరాణికాల్లోనే కాకుండా, సాంఘికాలలో కూడా జిత్తులమారి వేషాలను వేసి మెప్పించడంలో తనకంటూ ఒక స్టానాన్ని సంపాదించుకున్నారు. ఆ రోజుల్లొ ఈ తరహా పాత్రలు పోషించడంలో సి.ఎస్‌.ఆర్‌., ముదిగొండ లింగమూర్తి ధూళిపాళ పెర్టు ప్రధానంగా వినిపించేవి. లింగమూర్తి కళ్ళలో క్రౌర్యం (ప్రదర్శించడంలో నేర్పరి.ర్యం (ప్రదర్శించడంలో నేర్పరి.


నాగయ్య గారి అవసాన దశ లో
 నర్సింగ్‌ హోంలో (ప్రవేశించవలసి వచ్చింది. మూ[త్రవ్యాధి త్మీవతరంగా ఉందని (గ్రహించిన డాక్రర్లు ఆయన్ను అడయార్‌లోని వి, హెచ్‌. ఎస్‌, సెంటర్‌కు చేర్చారు. మృత్యుదేవతతో ఆయన రెండు గంటలసేపు భీషణ సమరం సలిపారు. ఆయన అవసాన దళ సమీపిస్తున్నదని తెలుసుకోని మృత్యుశయ్య దగ్గిర ఉన్న యీ రచయిత, ఢీ) ముదిగొండ లింగమూర్తి “రఘుపతి రాఘవ రాజారాం” గీతం పొడుతోంపే ఆ మహోసటుడు, కళాతపస్వి శాశ్వతంగా కన్ను మూశారు,

  రోంగస్థలంమోది పాత్ర తెరలోని పాతృతో మాటాడడం ఖండచూళిక, ఉదా॥ “వెంకన్న కాపురం”! నాటకంలో రంగస్గలంమోది వెంకన్న తెరోలోపలి భార్యతో సంభాషించడం.

ముదిగొండ లింగమూర్తి మొదలైన ప్రసిద్దనటులు ఉద్భ దించారు. వీరు (ప్రదద్శించిన నాటకాలు (ప్రతాపరుద్రీయం, కన్యా శుల్కం, బొబ్బిలి, రోషనార బాగా పేరు సంపొదించాయి. స్థానం నరసింహారావుగారు స్తీ పొత్రలు ధరించి ఆంధ్ర దేశంలో అపూర్వమైన పేరు ప్రఖ్యాతుల్ని గడించారు. అలాగే మాధవపెద్ద వెంకటరామయ్యగారు ఉత్తమ నటుడుగా క్రీర్తింపబడ్తారు.

 సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-22-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

27-  హేత్వాభాస హాస్యం

27-  హేత్వాభాస హాస్యం

హేతువుకానిదాన్ని హేతువుగా చెప్పటం లో వచ్చే వికృతే హేత్వాభాసం .ఉదాహరణ  మునిమాణిక్యంగారిస్వానుభావమే –‘’గుంటూరులో జట్కా ఎక్కాను గుర్రం పెళ్లినడక నడుస్తోంది ‘హుషారుగా నడవటం లేదేమిటి అనిఅడిగారు .జట్కా ఆతను ‘’బండిలో మీ రోక్కరే కదండీ బరువు లేదు బరువు లేకపోతె గుర్రానికి  హుషారురు రాదు ‘’అని సోప్ పెట్టాడు .’’.దారిలో వీధిదీపాలు సరిగ్గా కాంతిగా వెలగటం లేదు .దీపాలు అలా ఏడ్పు మొహాలతో ఉన్నాయేం అని అతన్ని అడిగితె ‘’ఎండాకాలం కదా మండు  టెండలకు మనుషులే ఆర్చుకు పోతున్నారుదీ.పాలు ఏడుస్తూ ఉండటం లో విచిత్రమేము౦ది సారూ ‘’అన్నాడు .

మరో ఉదాహరణ కూడా మాష్టారిదే .కుంపటి రాజెయ్యటానికి మాష్టారు పాత రైల్వే గైడ్ కాగితాలు చింపి అంటిస్తున్నారు .అవి మండటం లేదు .కా౦త౦  గారిని  అవి ఎందుకు మండటం లేదని అడిగితె ‘’రైల్వే గైడ్ కాగితాలుకదా మండవు ‘’అన్నారట .దానికే దీనికీ సంబంధమే లేదు .

  మాష్టారి స్నేహితుడి కొడుకు బాగా చదివి బర్మా వగైరా తిరిగివచ్చి బాగా ఆర్జించినవాడే  .పెళ్లి వయసు వచ్చినా పెళ్ళికాలేదు .ఈ విషయం మాస్టారు కా౦త౦ గారితో అన్నారు ‘’చూస్తూ చూస్తోఆఅబ్బాయికి పిల్లననెవరిస్తారండీ ‘’అన్నారామె .ఎందుకివ్వరు  అనిఅడిగితే ‘’బర్మా వెళ్లోచ్చినచ్చినవాడికి చూస్తూ చూస్తూ పిల్లను ఎవరు కట్ట బెడతారండీ మరీ చోద్యం కాపోతే’’అంటూ తలవిసురుతూ చెప్పారట .బర్మా వెడితే పిల్లనివ్వరా అంటే ‘’ఇవ్వరండీ ‘’అని తెగేసి చెప్పారట .ఇందులో హేతువు లేకపోవటమే హేత్వాభాసం .మాస్టారు వదలకుండా ‘’ఆ అబ్బాయి బర్మా వెళ్ళిన సంగతి ఎవరికీ తెలుసు?’’అనగా ‘’బర్మాకాకపోతే ఏదో పాడు దేశానికి వెళ్లి వచ్చి ఉంటాడు .పెద్దపెద్ద అ౦గలేసి నడుస్తాడు కనుక బర్మా వెళ్ళే ఉంటాడు. అందుకే పిల్లనివ్వరు ‘’ఇలా కారణం కాని దాన్ని కారణం ఉన్నట్లుగా చెబితే నవ్వు రాకేం చేస్తుంది?

  మరో ఎక్సా౦పుల్ ఆయనే చెప్పారు .రాఘవయ్య మాష్టారు ఒక ఏడాది స్కూల్లో పని చేశారు .మరో ఏడుఇవ్వాలావద్దా అనే ప్రశ్న వచ్చింది .ఇవ్వకూడదని ఒక కమిటీ మెంబర్ గట్టిగా వాదించాడు .ఎందుకు అని మిగిలిన మెంబర్లు అడిగితె ‘’ఆయన సామర్ధ్యం సంగతి నేను ఆలోచించలేదు .హెడ్మాష్టారికంటే ఆయన ఎత్తరి మనిషి చూస్తూ చూస్తూ ఎలా ఇస్తాం .తనకంటే పొడవు మనిషితో హెడ్ గారు ఎలా పని చేయించగాలరండీ .అదేకాదు ఆయన సంతకం  హేడ్మాష్టారి సంతకం కంటే పొడుగు .పొడుగు సంతకం చేసే వాడితో పని చేయించటం ఎవరికైనా కష్టం కాదటండీ మరీ చోద్యం కాకపొతే ‘’అని చెప్పాడట .మోకాలికీ బోడి గుండుకు ముడి వేయటం అంటారుదీన్ని మనవాళ్ళు .

  ఇలాంటి వాదనలను ఇంగ్లీష్ లో ‘’నాన్ సెక్వి టూర్ ‘’అంటారని మునిమాణిక్యం గారువాచ .  మన పూర్వ చాటువులలో కొన్ని ఉదాహరణలిచ్చారు సార్.వీటిలో భావాశ్రయహాస్యం ఉంటుంది అన్నారు .విష్ణుమూర్తి పట్టుబట్ట లే తప్ప నూలు బట్టలు ఎందుకు కట్టడు?’’దీనికి కారణం చెప్పాడోకాయన .నూలువైతే రోజూ చాకలికేసి ఉతికించి కట్టాలి .ఒక్కోసారి బట్టలు తేకపోతేవాడితోపోట్లాడాలి .ఆ బాధలు భరించలేక పట్టు పీతాంబరాలే కడతాడు అన్నాడు ..ఇలాంటి హేత్వాభాసాలను తర్క శాస్త్రం లో ‘’హేతు విపర్యాస హేత్వాభాసం ‘’-The fallacy of the false cause ‘’అంటారు అని మునిమాణిక్యం వారి వివరణ .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment