గురజాడ కన్యా శుల్కం —3

                గురజాడ కన్యా శుల్కం —3
                          ”చూసే కల్లున్నవారికి ,చూడగల మనసున్న వారికి ,కన్యాశుల్కం techni కలర్ లో కనిపిస్తుంది .అదొక అక్షయ తూఈరం .తరగని పంట .in between lines చాలా వుంది వ్యవహారభాషను రంయాతిరమ్యం గా మలచిన శిల్పం .ఈ క్ర్శిలో సంఘోద్ధరను మించి సాహిత్యోద్ధారణ జరిగింది ”అంటారు ప్రఖ్యాత రచయిత ,పత్రికా సంపాదకులు స్వర్గీయ పురాణం సుబ్రహ్మణ్యశర్మ  .1915 లో గురజాడచని పోయినా   1915 తర్వాతే జీవించటం ప్రారంభించాడు  అన్నారు కృష్ణ శాస్త్రి గారు .”వాడుకభాష కు ఇంతటి గౌరవం సంపాదించి పెట్టింది గురజాడే .కులాలకూ ,మనః ప్రవృత్తులకు చెందిన ఎందరో వ్యక్తులు నిత్యజీవితం లో తాము ఎలామాట్లాడుతారో అలాగే కన్యాశుల్కం లో మాట్లాడతారు .కృత్రిమత కన్పించాడు .అందుకే కాన్యాశుల్క రచనకు ప్రేరకమైన భాషా సంస్కరణ సృష్టి ఆ నాటకం లో
మహోనాహం గా వుంది .”అంటాడు ఆరాధనా భావంతో శ్రీ శ్రీ.
                                                                 పాత్రల మనో విశ్లేషణ —గిరీశం
                 ఇంత గొప్ప నాటకం ఇంత చిరస్మరణీయం గా నిలిచింది అంటే పాత్రలన్నీ సజీవాలై వుండటం వల్లే .వాటికి ఒక లక్ష్య నిర్దేశం ,గమ్యం వుండటం సామాజిక స్థితిని ప్రతిబిమ్బించటం ఆ పాత్రలు ఎలా ప్రవర్తిన్చాయో చూద్దాం .పాత్రల స్వభావం తెలియజేసే విధం గా పేర్లు పెట్టాడు గురజాడ .పీనాసితనం మూర్తీభవించిన వాడిని లుబ్ధావధానులు అనీ ,చాన్దాసం కోపం ఉద్రేకం వున్న వాడిని అగ్నిహోత్రావధాని అనీ ,కరణపు తెలివితేటలున్న లితిగతిఒన్ చక్రవర్తికి రామప్ప పంతులు ,ఆయన చేతిలో మోసపోయిన మీనాక్షి ,అమాయకత్వానికి మారు పేరైన బుచ్చమ్మ ,కుహనా సంస్కరణ వాది గిరీశం మంచి మాట కారీ అందర్నీ రేమోతే కంట్రోల్ తో ఆడించిన మధురవాణి ,పేర్లన్నీ తగినట్లు పెట్టాడు .ఆ పాత్రలే నేటికీ మనకు సమాజం లో కనిపిస్తున్నాయి ఆనాడే పోలీసులు కొట్టే దెబ్బల సంగతి చెపాడు గురజాడ .అవి ఈనాడూ ,వికృతం గా మారి ,థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ .లూ ,లాకప్ మరణాలు ఎన్కౌంటర్లు గా మార్పు చెందాయి .”నేషనల్ కాంగ్రెస్ గురించి లెచ్తురె ఇస్తూ ,వాళ్ల వోరి హెడ్ కానిస్తాబుల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు అని అడుగుతాడు పోలీసు .ఈనాడు కూడా వ్యవస్థకు వ్యతిరేకం గా మాట్లాడిన వాడి గతి అంతే కదా .నూరేళ్ళు దాటినా తీరు లో మార్పు లేదు .కన్యాశుల్కం పోయింది కాని వరకట్నం దాని స్థానం లో రాజ్యమేలుతోంది .అప్పుడు ,ఇప్పుడు ఈ బాధలకు గురి అయింది స్త్రీ ఏ. కనుకనే కాలాన్ని దాటి కన్యాశుల్కనాటకం బతుకు తోంది .
                        కన్యాశుల్క నాటకం లో కధానాయకుడు లేదు .కాని గిరీశమే అందరి మనసుల్ని లాగేసే పాత్ర .సమాజం లోని కపట ప్రవర్తనకు ,కుహనా సంస్కర్తలకు నాయకులకు సజీవ ప్రతీక  .మొదటి స్సీన్ లోనే దర్శనం ఇస్తాడు .తనను తాను పరిచయం చేసుకుంటాడు .సంస్కరణ ఉద్యమాలలో ఫలితాన్ని సొంతానికి వాడుకునే ”ఆశాధభూతి ‘గిరేశం .బొంకులదిబ్బ దగ్గర పరిచయమవుతాడు మనకు .ఇరవై రూపాయలు డాన్సింగ్ గాళ్ కోసం ఖర్చుపెట్టిన వేశ్యాలోలుడు .పోతకూల్లమ్మకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే సిద్ధహస్తుడు ..”వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసిన జులాయి  .శిష్యుడు వెంకటేశానికి పాఠాలు చెప్పకుండా చుట్టకాల్చటం నేర్పిన కొంటె గురువు .ఒకరకం గా గిరీశానికి miniyeture వెంకటేశం .గిరీశం శిష్యరికం లో అబ్బిన దుర్వ్యసనాలు ,అగ్రహారపు జిద్దుతనం పోత పోసిన విగ్రహం వాడు .బ్కదుద్ధాయిలా కన్పించినా అవసరం వస్తే గురువుకి     మించిన శిష్యుడే .  ఇలాంటి శిష్యుల్ని తయారు చేసిన కపట సంస్కర్తల నిజ స్వరూపాన్ని గిరీశం గా మనకు ముందే పరిచయం చేసి జాగ్రత్త అని చెప్పకనే చెప్పాడు .”బుచ్చమ్మ లాంటి యంగ్ విడోలు సమాజం లో ఉండాలంటే విదోమారేజీలు జరపాలి ట .ఈ ఉద్యమం నడపాలంటే ఇన్ఫాంట్ మారేజీలూ ఉండాలట .”విధవా వివాహమే నాగరకతకు నిగ్గు అయితే బాల్యవివాహాలు లేకపోతే నాగరకత ఆగిపోతుందట ”అని మోకాలికి బట్టతలకు ముడివేసి వాదిస్తాడు .ఇదో కొత్త discovery . ”కన్యాశుల్కం లేని మారేజీ ఈ భూప్రపంచం లో లేదు అని వెంకటేశం తో వాదిస్తాడు .బుద్ధిని నాలుకను ఎలాగయినా మలచగల నేర్పరి .
             ”లుబ్దావధాన్లు ముసిలాడు .బంగారప్పిచ్చికాసు .రెండేళ్లలో బాల్చీ తన్నేస్తాడు .దాంతో నీ చెల్లెలు రిచ్ విడో అవుతుంది నువ్వు పెద్దవదివై దానికి విదోమారేజి చేసి శాశ్వతమైన కీర్తి సంపాదించవచ్చు ”అని వెంకటేశానికి క్లాస్స్ పీకుతాడు .”The widow ”అనే కవిత లో తనభావాలను ఆవిష్కరిస్తాడు .
తన అమర ప్రేమను వెల్లడిస్తాడుi.చివరలో I love the widow however she be –married again or single be ‘
”ఈ విడో బ్యూటీ చొస్తే ఏమీ తోచకుండా వుంది .అయితే ఇది చెప్పినత్లుఅల్ల వశమయ్యేది కాదు .పాథ దస్తాలెం పనికి రావటం లేదు .నా experience ,శృంగార చేష్టలు ,గుడ్డిగావ్వంత కోడా పనిచేయటం లేదు .దీనికి లవ్ సిగ్నల్స్ రామ రామా ఏమీ తెలియవు .దీన్ని చూసిందగ్గర్నుంచి టౌన్ లవ్ అన్నా డాన్సింగ్ గాళ్ ఆ అసహ్యం వేస్తోంది .మధురవానికీ ఈ మనిషికీ కంపారిజన్ ఉందా ?అది రంగు వేసిన గాజు పూసా .ఇది ప్యూర్ డయమండ్ .దీనిని చెదగోత్తతానికి ప్రయత్నం చెయ్యకూడదు .చేసినా సాగేది కాదు .కనుక కొత్తదారీ ,కొంత న్యాయమైన దారీ తొక్కాలి .homely is the best way . మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకొని పోయి విడో మారేజీ చేసుకుంటే నట్టాయినా కీర్తి సుఖం దక్కుతాయి ”’అని పాచిక వేస్తాడు .ఆమెను వివాహం చేసుకోవటం వల్ల వచ్చే లాభాలు ,నష్టాలు బెరీఎజు వేసుకొంటాడు .ఇకాడే నిజమైన స్సంస్కర్త హృదయాన్ని ఆవిష్కరించాడు .”బుచ్చమ్మ లాంటి అమాయకపు పిలను ఒప్పించి పెళ్లాడితే మజా ప్రయోజకత్వం కానీ రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకదితోనో దూదేకులాదితోనో లేచిపోవటానికి సిద్ధం గా వున్న దండుమున్దల్ని పెళ్ళాడడం విడో మారేజీ అనిపించుకోదు ..అది దొంగముండా మారేజీ ”అదీ గిరీశం ఆదర్శం .మహోన్నతాభిప్రాయం ,చమత్కారంకూడా .ఈ మాటలతోనే బుచ్చమ్మ అతని వలలో పడింది .అందుకే గిరీశాన్ని ఒక లవబుల్ స్కౌంద్రల్ అన్నారు .అప్పారావు గారి ఊహకు మించి పెరిగిపోయాదన్నారు .”Gireesham must have taken the author imself by storm and argued and bluffed his way into the drama ‘అని తేల్చారు ప్రముఖ విమర్శకులు శ్రీ ఎస్ .వై .ఏం స్వామి .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.