శ్రీ శైల ద్వార దర్శనం -1
తూర్పు ద్వారం -త్రిపురాంతకం
త్రిపురాంతకం విజయ వాడ ,శ్రీశైలం బస్ మార్గం లో ,శ్రీశైలానికి 80 కి. .మీ .దూరం లో వుంది .ఇక్కడ కుమార గిరి మీద త్రిపురాంతక స్వామి వెలసి వున్నాడు .అమ్మ వారు ”చిదగ్ని కుండ సంభూత అయిన” త్రిపుర సుందరి దేవి” .
ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా లో వుంది .
స్థల పురాణం
మధువు ,కైటభుడు అనే రాక్షస సోదరులుండే వారు .మధు కొడుకు సింహ వక్త్రుడు ,,సింహ శీర్షుడు .కైటభుని కొడుకుసింహ దంతుడు .ఈ ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేసి మెప్పు పొంది ఇనుము ,వెండి ,బంగారు నగరాలను నిర్మించుకొని బల గర్వం తో విజ్రుమ్భించారు .వీళ్ళే త్రిపురాసురులు .దేవతలంతా శివుడి తో మొర పెట్టు కొన్నారు .ఆ ముగ్గురిని చంప టానికి c శివుడు వారికి అభయం ఇచ్చాడు .భూదేవిని రధం గా చేసుకొన్నాడు శివుడు .నాలుగు వేదాలను గుర్రాలుగా ,,మేరు పర్వతం ధనుస్సు గా ,ఆదిశేషుడు అల్లె త్రాడుగా ,క్షీర సాగరం అమ్ముల పొది గా చేసుకొన్నాడు .మన్మధుడు బాణం గా ,దేవత లందర్నీ సైన్యం గా చేసుకొని వారిపై యుద్ధం చేశాడు .అర్ధరాత్రికల్లా త్రిపురాసుర సంహారం చేశాడు మహా దేవుడైన శివుడు .అందుకే త్రిపురాన్తకుడయాడు .అలసి పోయిన శివుడు ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకొన్నాడు .భ్రమ రాంబ ఇక్కడ చిదగ్ని కుండం లో త్రిపురామ్బికా దేవిగా ఆవిర్భవించింది . త్రిపురాంతక స్వామి శిరస్సు పై గంగా ,ఎడమ వైపు పార్వతీ దేవి ,వుంటారు .ఇక్కడి నుంచి కాశీకి శ్రీ శైలానికి సొరంగ మార్గాలున్నాయని అంటారు . స్కందుడైన కుమారస్వామి తారకాసుర సంహారం చేసింది కూడా ఇక్కడే .అందుకే ఇక్కడి కొండకు ”కుమార గిరి ”అనే పేరు వచ్చింది .
సిద్ధులకు ప్రధాన కేంద్రం గా వుండేది .ఇక్కడ సిద్ధేశ్వరుడు ,కన్యా శిద్దేశ్వరుడు ,బాల శిద్దేశ్వరుడు ,ఘంటా సిద్ధేశ్వరుడు ,ఇష్టా సిద్ధేశ్వరుడు ,వ్యోమ సిద్ద్దేశ్వరుడు ,భస్మ సిద్ధేశ్వరుడు ,భిక్షా సిద్ధేశ్వరుడు ,బిల సిద్ధేశ్వరుడు ,పురా సిదేశ్వరుడు ,జల సిద్ధేశ్వరుడు ,దేను సిద్ధేశ్వరుడు మొదలైన పేర్లతో ప్రత్యెక శివ లింగాలున్నాయి .ఇక్కడ తపస్సు చేస్తే సర్వ సిద్ధులు కలుగు తాయని పురాణ ప్రసిద్ధి .అగస్త్యుడు ,అత్రి ,వసిష్టుడు మొదలైన మహర్షులు తపస్సు చేసిన పుణ్య భూమి ఇది .కపిలుడు మొదలైన సిద్ధ ఋషులు నివసించిన క్షేత్రం .జ్యోతిర్నిలయం గా ప్రసిద్ధి చెందింది .
ఇక్కడ అనేక వనాలు శిఖరాలు నదులు ,తీర్దాలు ,శివ లింగాలు ,అనేక దేవతా మూర్తులు వున్నట్లు ప్రతీతి ”.శ్రీ పర్వత ఖండం ” లో దీని ప్రశస్తి బాగా వర్ణించ బడింది .ఇక్కడ 15 రోజులు తపస్సు చేస్తే చాలు పునర్జన్మ ఉండదని అంటారు .
కాశీ తో సమాన మైన క్షేత్రం .ఇక్కడి ఆలయం పెన్నా నది ఒడ్డున వుంది .ఇక్కడ ”దివ్య సిద్ధ వటం” అనే విశాల మైన మర్రి చెట్టు వుంది .దీని కింద చిన్ముద్ర తో దక్షిణా మూర్తి వున్నాడు .మర్రి చెట్టు ను తాకితేనే సర్వ పాపాలు పోతాయనే నమ్మిక వుంది .
బాలబ్రహ్మ ,కుమార బ్రహ్మ ,అర్క బ్రహ్మ ,వీర బ్రహ్మ ,విశ్వ బ్రహ్మ ,తారక బ్రహ్మ ,గరుడ బ్రహ్మ ,స్వర్గ బ్రహ్మ ,పద్మ బ్రహ్మ అనే తొమ్మిది బ్రాహ్మల ఆలయాలున్నాయి .బాల బ్రహ్మేశ్వరాలయం లో ఆగ్నేయ మూల ”శ్రీ జోగులాంబా దేవి ”నెల కోని వుంది .అష్టాదశ శక్తి పీతాలలో అందరి అమ్మ వారాలు ప్రత్యెక దేవాలయాలుంటే ,ఇక్కడ జాగు లంబ కు ప్రత్యెక ఆలయం లేక పోవటం విచిత్రం .
నిత్యనాద సిద్ధుడు అనే ఆయన రాసిన ”రస రత్నాకరం ”లోను ,భైరవ కవి రాసిన ”ఆనంద కంథము ”అనే గ్రంధం లోను బ్రహ్మేశ్వరాలాయానికి నైరుతి దిక్కున చింత చెట్ల మధ్య కుండం లో” జోగు లాంబ ”వుందని చెప్పబడి వుంది .పురా వస్తు త్రవ్వ కాలలో అక్కడ శిధిల మైన ఆలయం వున్నట్లు కనుగొన్నారు
.శ్రీ శైలం డాం కట్టి నప్పుడు అలంపురం జోగులాంబ ఆలయం మునిగి పోకుండా ఎత్తైన గోడ కట్టారు .ఈ క్షేత్రాన్ని బాగా అభి వృద్ధి చేసిన వారిలో స్వర్గీయ గడియారం రామ కృష్ణ గారు అతి ముఖ్యులు .వారు వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద చిరివాడ లో వారింట్లో వుండి విద్య నేర్చారు .తన జీవిత చరిత్ర ను రాసుకొన్నారు .జోగులాంబ స్వరూపం
జోగులాంబా దేవి శవం ఆసనం గా కలిగి ,వ్రేలాడే స్తనాలతో ,వికృత మైన భయంకరమైన కన్నులతో ,నాలుగు చేతులతో ,మెడలో కపాల మాలతో ,దిగంబరం గా ,ఊర్ధ్వ కేశాలతో ,తల మీద బల్లి కపాలం ,గుడ్లగూబ ,మండ్ర గబ్బ కలిగి అతి భయంకరం గా కనిపిస్తుంది .అందుకనే సూటిగా చూడకుండా ,ప్రక్కల నుంచి ఆమెను దర్శిస్తారు .శరన్నవ రాత్రి ఉత్స వాలు బాగా జరుగు తాయి .
సృష్టికిపూర్వం బ్రహ్మ శివుడి గురించి తపస్సు చేశాడు .ఆయన అనుగ్రహం తో ”బాల బ్రహ్మేశ్వరుడు ”అయాడు .బ్రహ్మేశ్వరుడిని పూజిస్తే బ్రహ్మ పదం లభిస్తుందని కధ .జమదగ్ని ,పరశు రాముడు ఇక్కడ తపస్సు చేసినట్లుంది .ఇక్కడి ఆలయాలను ‘రస సిద్ధుడు ”అనే అతను కట్టించాడు .ఆతడు శివుని అనుగ్రహం వల్ల జన్మించాడు .అలంపురం లో తపస్సు చేసి సిద్ధి పొంది ,జోగులాంబ ,బ్రహ్మేశారుడు ,పార్వతి గణపతి ,భైరవ దేవత లను పూజించి రస సిద్ధిపొంది , ,”పరుస వేది ని సాధించాడు .నవబ్రహ్మాలయాలను ,వీరభద్ర ,జోగులాంబ ,కలకలేశ్వర ,భైరవ ,దుర్గా ది ఆలయాలు నిర్మించాడు .
విలసతుడు అనే రాజు ఇతని వద్ద వున్న పరుస వేది ని పొందాలన్న ఆశతో ఇతనిపైకి దండెత్తాడు .రససిద్ధుడు బాల బ్రహ్మేశ్వరుని లో లీనమైనాడు .విలసతుడు రాజ్య భ్రస్తుడై ,తిండిలేక అడవుల వెంట తిరుగుతూ లేడిని వేటాడి మాంసం తెమ్మని ఒక భిల్లున్ని పంపాడు .ఒక లేడి కనిపించింది .దాని మీద బాణం వేయబోతుంటే ,తన బిడ్డకు పాలిచ్చి వచ్చే దాకా ఆగమని కోరింది .పిల్లకు పాలు ఇచ్చి వచ్చి మాట నిలుపు కొంది లేడి .రాజు ఇంతలో అక్కడికి వచ్చాడు .ఆలయాలను ధ్వంసం చేసినందుకు లేడి అతన్ని నిందించింది .రాజు తనకు ప్రాయశ్చిత్తం చెప్పమని దాన్ని ప్రాధేయ పడ్డాడు .బాల బ్రహ్మేశ్వర ఆలయం స్తంభాల మీద ,రస సిద్ధుని కధ ,తన కధ ,విలసతుని కధ చిత్రిస్తే పాపం నుండి విముక్తి కల్గు తుందని లేడి చెప్పింది .రాజు అలాగే చేసి విముక్తుడయాడు .
ఈ క్షేత్రాన్ని దర్శించి అభివృద్ధి చేసిన వారిలో ఇక్ష్వాకు రాజు రుద్ర పురుష దత్తుడు ,బాదామి చాళుక్యులు ,రెండవ పులకేసి ,విజయాదిత్య చాళుక్య సార్వ భౌముడు ,రాష్ట్ర కూటులు ,కళ్యాణ చాలక్యులు ,త్రిభువన మల్ల విక్ర మాదిత్యుడు రాణి మల్లా దేవి ,ఆహవ మల్లుడు ,కాకతి ప్రతాప రుద్రుడు ,కృష్ణ దేవ రాయలు మొదలైన వారున్నారు 
నవ బ్రహ్మాలయం శిల్ప కళా విరాజితం .అన్ని కాలాల శిల్ప కళా దర్శనం ఇస్తున్దిక్కడ .
ఇక్కడ జమదగ్ని మహర్షి భార్య ,పరశురాముని తల్లి అయిన ”రేణుకా దేవి ”విగ్రహం కూడా పూజలు అందు కొంటోంది ..
.స్కాంద పురాణం లో దీని వివరణ వుంది .ఇక్కడి రుద్ర ధార లో స్నానం చేసి ఉమా మహేశ్వర స్వామి ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని శ్రీ శైల ఖండం లో వుంది .ఇక్కడ అయిదు తీర్దాలున్నాయి కనుక మహా తీర్ధం అనే పేరు వచ్చింది .అవి రుద్ర ధార ,విష్ణుదార ,బ్రహ్మ ధార ఇంద్ర ధార ,దేవ ధార .పాల్కురికి సోమనాధుడు పండితా రాధ్య చరిత్ర లో ఇక్కడ మహేశ్వరం ,గుప్త మహేశ్వరం ,చరుకేశ్వరం ,సంధ్యేశ్వరం ,గరుదేశ్వరం ,కాలహ్రదేశ్వరం ,పాపవినాశం ,గనేశ్వరం ,దేవహ్రదేశ్వరం ,సిద్దేశ్వరం,నీలహ్రదం అనే పద కొండు తీర్దాలున్నట్లు రాశాడు .కొండ పై
నుంచి దూకే జల ధారలను రుద్ర దార ,భస్మ ధార ,గౌరీ కుండం ,పాప నాశనం గా చెప్పాడు .ఉమామహేశ్వర స్వామి

ఉమామహేశ్వరలింగం స్వయంభు లింగం .కింది నుండి ,సుమారు 500 అడుగుల ఎత్తున కొండ చివర ఒక మహా శీలా బయటికి వచ్చింది .దానికిందనే ఉమా మహేశ్వరుడు వెలిశాడు .ఆ తర్వాత ఆ మహా శిలనే పై కప్పు గా చేసి ఆలయం నిర్మించారు .గర్భాలయాన్ని ఆనుకొని ఉమాదేవి ఆలయం వుంది .దేవతా మూర్తుల ముందు శిలతో నిర్మించిన ”శ్రీ చక్రం ”వుండటం విశేషం.మహిషాసుర మర్దిని నందీశ్వర విగ్రహాలున్నాయి ,సంక్రాంతికి మూడు రోజుల బ్రహ్మోత్స వాలు జరుగు తాయి 
ఇప్పుడు మూలలో వున్న ద్వారాల దగ్గరకు వెళ్దాం
ఆగ్నేయ ద్వారం -సోమశిల
దీనికి ”స్కంద సోమేశ్వరం ”అని కూడా పేరు .నెల్లూరు ,కడప మధ్య నల్లమల లో పెన్నా తీర్సం లో వుంది .
స్కందుడు అనే రుషి ఇక్కడ తపస్సు చేసి పెద్ద లింగాన్ని ప్రతిష్టించాలని తెచ్చి సోమ గుండం గట్టున పెట్టి స్నానం చేయటానికి సోమ తీర్ధం లో దిగాడు .సోమేశ్వరుడు ప్రత్యక్షమై ,నాడు .
ఆ లింగం అక్కడే ప్రతిస్టించాడు .అమ్మ వారు కామాక్షీ దేవి
నైరుతి ద్వారం -పుష్ప గిరి
దీనికి’ ప్రసూనా చలం” అనే పేరు .కడప జిల్లా లో ఉత్తర పినాకినీ నదీ తీరాన వున్న క్షేత్రం .
గరుత్మంతుడు అమృత భాండం తెస్తుంటే ,అందులోంచి ఒక బిందువు పుష్ప గిరి లోని సరస్సు లో పడింది .ఆ నీరు తాగిన వారందరికీ చావు ,పుట్టుక లేకుండా సుఖ సంతోషాలతో వున్నారు .
త్రిమూర్తులకు తెలిసి ఈ సరస్సును పూడ్చేయమని దేవతలను ఆజ్ఞా పించారు .వాయుదేవుడు ఎన్ని కొండ రాళ్ళను తెచ్చి అందులో వేసినా ,పూడి పోలేదు .చివరికి హను మంతుడు లక్ష్మీ దేవి ని పూజించి ,ఒక పెద్ద కొండను అందులోకి విసిరేశాడు .
అది కూడా మునగ కుండా పువ్వు లాగా తేలింది .అది చూసినా పున్దరీకుడనే రాజు దానికి ”పుష్ప గిరి ”అని పేరు పెట్టాడు .హరి హరుడు కొండను తొక్కి పడితే అది నిలిచింది .
ఈ కొండ పై ఆదికేశవ స్వామి ,సంతాన మల్లేశ్వరుడు ,లక్ష్మీదేవి ,తోక లేని హనుమంతుడు విగ్రహాలున్నాయి ఉమా మహేశ్వర ,నంది విగ్రహాలు దర్శనీయం.ఇక్కదిదేవతా విగ్రహాలను జనమేజయుడు ప్రతిష్టించినట్లు ఇతిహ్యం .
మనకున్న పీఠాలలో పుష్ప గిరి పీఠం ఒక్కటే” అసలు సిసలు తెలుగు పీఠం ”.
వాయువ్య ద్వారం -సంగమేశ్వరం
ఇక్కడ కృష్ణా నది అతి విశాలం గా సముద్రం లా గా కనిపిస్తుంది .కర్నూలు జిల్లా నది కొట్కూరు కు దగ్గరలో వున్న క్షేత్రం .దీనికి ”నివృత్తి సంగమేశ్వరం ”అని పేరు .
కృష్ణ ,వేణి ,తుంగ, భద్ర ,భీమ ,రది ,,మాల భవ నాశిని అనే ఏడు నదులు ఈ క్షేత్ర నాధుడైన సంగామేశ్వరున్ని సేవిన్కాతానికి ఇక్కడికి చేరాయట .ఇక్కడే దక్ష యజ్ఞం సందర్భం గా తండ్రి చేత అవమానం పొందిన దాక్షాయిని తన శరీరాన్ని నివృత్తి చేసుకోవా టం వల్ల నివృత్తి సంగ మేశ్వరం అనే పేరొచ్చింది .
గ్రహణం రోజున సప్త సాగరాలు అన్ని తీర్దాలు ఇక్కడికి చేరుతాయని ,అప్పుడు ఏఎ సప్త సింధు లో స్నానం చేస్తే సర్వ తీర్ద్ సర్వసాగర స్నాన ఫలితం లభిస్తుందని నమ్మకం .
వసిష్ఠ మహర్షి శాపం వల్ల ”కల్మాష పాడుదు ”అనే రాజు ,రాక్షస రూపం పొందాడు .అతడు వసిష్టుని వంద మంది కొడుకుల్ని చంపి బ్రహ్మ హత్యా పాతకం
తెచ్చుకొన్నాడు .విశ్వామిత్రుడు అతనిపాపాలన్ని పోగొట్టి ,తాను ఆ పాపాలకు బలి అయాడు .ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది .ఇక్కడికి వచ్చి సంగమేశ్వరం లో స్నానం చేసి గాయత్రి జపం చేసి శివుడిని ప్రతిష్ఠిస్తే పాపాలు పోయాయట .విశ్వామిత్ర గుహ ఇక్కడ వుంది .శాండిల్య మహర్షి ఇక్కడే తపస్సు చేసి అంగ వైకల్యాన్ని పోగొట్టు కొన్నాడు .విశ్వామిత్ర గుహకు దగ్గరలో వసిష్టుడు ప్రతిష్టించిన నృసింహ స్వామి విగ్రహంవుంది .సప్త సోమేశ్వరులున్నారు .కపిల మహర్షి ప్రతిష్టించిన శివ లింగం వుంది .ధర్మా రాజు భీముడు ప్రతిష్టించిన లింగాలు వున్నాయి .
అయితె ఇదంతా పూర్వ వైభవమే .శ్రీశైలం డాం కట్టటం వల్ల ఇదంతా మునిగి పోయింది .సంగామేశ్వరాలయాన్ని ఇక్కడి నుంచి తర లించి అలంపురం లో నిర్మించారు
ఈశాన్య ద్వారం -ఏలేశ్వరం
మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఏలేశ్వర క్షేత్రం వుంది .ఒకప్పుడు మహా పట్టణం .అనేక దండయాత్రల వల్ల నిర్జనం అయింది నాగార్జున సాగర్ ముంపు వల్ల ఆనవాలు కోల్పోయింది .ఏలేశ్వర స్వామి కాత్యాయినీ ,హాటకేశ్వారి దేవేరులతో విలసిల్లె క్షేత్రం . అష్ట భైరవ ,నవ దుర్గ ,నవ నార సింహ ప్రతిమలున్నాయి . .నదికి ఎడమ వైపు వున్న మల్లికార్జున గుట్ట పై రెండుఆలయాలున్నాయి .ఇక్కడి గుహలో ఇప్పటకీ సిద్ధులు వున్నారని నమ్మకం వుంది . ఈ ఆలయాన్ని కూడా సాగర్ దగ్గర స్తూపం వద్దకు తరలించి అక్కడ పునర్నిర్మించారు . .
పంచ మఠాలు
శ్రీశైలం లో ఆలయానికి వాయువ్యం గా 100 మీటర్ల దూరం లో,”ఘంటా మఠం ”వుంది .
ఇదే బ్రహ్మం గారి మఠం .ఆయన ఇక్కడ తపస్సు చేశారని కధనం.దీని పక్కనే ఆరుముఖాలున్న విగ్రహం వుంది .ముందు మూడు ,వెనుక మూడు ముఖాలున్డటం ప్రత్యేకత .ఇది గాయత్రీ దేవి విగ్రహం గా బావిస్తారు .దీనికి ముందు ఎప్పుడూ నీరు ఊరే ఘంటా తీర్ధంవున్సి ఇక్కడి కుండం ,దానిపై వేలాడే గంటా వున్నాయి .షణ్ముఖ కుమారస్వామి విగ్రహం ముచ్చట గా వుంటుంది . 
దీనికి కొంచెం దూరం లో నల్ల రాయి మీద బీజాక్షరాలు రాసి వున్న యంత్రం వుంది .శాంతి మల్లయ్య అనే అతను ఇక్కడ మఠం లో వుంటూవిభూతి తయారు చేసి భక్తులకు ఉచితం గా ఇచ్చే వాడు .అందుకే ఆపేరు .ఇప్పుడిది లేదు
దీనికి దగ్గరలో రుద్రాక్ష మఠం వుంది .ఇక్కడి శివలింగానికి రుద్రాక్ష లతో పూజించటంవల్ల ఆపేరు వచ్చి ఉండచ్చు .మల్లి శంకరస్వామి అనే మహనీయుడు మేలి రకం రుద్రాక్షలు తెప్పించి భక్తులకిచ్చి ,ఆశీర్వ దించే వాడట .
దీనికి పైన ఎత్తున పది అడుగుల పుట్ట,అందులో.పదకొండు అడుగుల సర్పం వుంది .అనాదిగా ఇది ఇక్కడే వుంది .
ఇక్కడే వున్న” శివలింగానికి జటా జూటం ,రుద్రాక్ష మాల” వుండటం విశేషం .
దీనికి దగర లో సారంగధర మఠం వుంది దీనికి చుట్టూ ఎత్తైన ప్రాకారం వుంది ..కుడి వైపున నేలలో పెద్ద గుహ వుంది .తపస్సు కు అనుకూలం ..సారంగేశ్వరుడు అనే మహర్షి దీన్ని నిర్మించాడు .నందీశ్వర శివ లింగాలు నల్ల రాతి తో చెక్క బడి నాయి .
ఈ మఠానికి ఎదురుగా కపాల భైరవ స్వామి ఆలయం వుంది .
ఇవి శ్రీశైల ద్వార ,మఠా విశేషాలు
శ్రీ శైల యాత్ర సర్వం సంపూర్ణం
”సంధ్యా రంభ విజ్రుమ్భితం శృతి శిరస్థానాంత రా దిష్టితం
సప్రేమ భ్రమ రాభి రామ మసక్రుత్సద్వాసనా శోభితం
భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం ,గుణా విష్క్రుతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ”.( శ్రీ శంకారాచార్య విరచిత- ”శివానంద లహరి”)
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18 -02 -12 .
శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


పుష్పగిరి గుడి ఫోటో చాలా బాగుంది. నే కాపీ తీసేసుకున్నా 🙂
LikeLike