సిన్క్లైర్ రచనా ప్రభావం

సిన్క్లైర్ రచనా ప్రభావం 
అప్ టాన్ సిన్క్లైర్ రచన లు చాలా మందిని ప్రభావితం చేశాయి .జర్మన్ రచయిత   ఆల్బర్ట్ ఐన్స్టీన్ ,తామ స్ మాన్ ప్రముఖ నాటక రచయిత బెర్నార్డ్ షా లు చదివి ఆనందించి ఆయన్ను ఇరవై వ శతాబ్దపు రాజ కీయమార్గ దర్శి అన్నారు . అవి నీతి సామ్రాజ్యపు కూకటి వేళ్ళ ను పెకలించే విశ్వ ప్రయత్నం చేశాడు .దానితో కళ వళ పడిన రాజ కీయ పెద్దలు తప్పులు దిద్దుకొనే ప్రయత్నాలు చేశారు కంటి తుడుపు గా నైనా .జంగిల్ నవల కు ప్రభావితులైన వారు ”చికాగో ఇస్ అవర్స్ ”అనే నమ్మక మైన అభిప్రాయానికి వచ్చారు .ధనస్వామ్యాన్ని అన్ని కొణాల్లోనుంచి చూసి ,చూపించాడు .అబ్బా ! ఇంత దరిద్ర స్తితి లో మనం ఉన్నామా ? అని ముక్కున వేలు వేసుకోనేట్లు చేశాడు .ఈ అవినీతి కధలు చదవలేక ,వినలేక ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ సిన్క్లైర్ రచనలు అచ్చు వేస్తున్న పబ్లిషర్ కు ”అయ్యా ! మీ సిన్క్లైర్ ను ఇంటికి వేళ్ళ మనండి .కాసేపు నా దేశాన్ని నన్ను హాయిగా పాలించు కొనివ్వ మనండి ”అని రాయాల్సి వచ్చింది .అదీ రచన ప్రభావం అంటే .తాను చెడిపోయిన ఆహార పదార్ధాల విషయం లో జాగ్రత్తలు తీసుకొంటున్నానని ,అక్కడి పరిస్తితులు సిన్క్లైర్ చెప్పి నంత దారుణం గా లేవని సంజాయిషీ ఇచ్చుకొన్నాడు పాపం .
న్యు జెర్సి లోని సిన్క్లైర్ అతని బృందం ”హేలికాన్ హిల్ ”లో ”academy of engle wood ”అనే సంస్థను ఏర్పరచి సమావేశం జరిపితే ఎందరెందరో మేధావులు రచయితలు ఆలోచనా పరులు స్త్రీ ,పురుషులు హాజరైనారు .శాకా హారం యొక్క విశేషాలను అందరు ప్రత్యక్షం గా అనుభవించి తెలుసుకొన్నారు .బీన్సు బంగాళా దుంప ,టర్నిప్పులు ,ప్రూన్లు ,ఉప్పు లేని క్రకేర్లు (ఎడ్యు కేటర్స్ )టిని బల వార్ధక ఆహారము అని   తెలుసుకొన్నారు . సిన్క్లైర్ లెవిస్ అనే కుర్రాడు మిగిలిన విద్యార్ధులుపాల్గొని ఆనందించారు . .అదంతా ”ఫ్రీ  లవ్ సొసైటీ ”లాంటిది అన్నారు కొందరు .కాని దాని విషయం అందరికి తెలిసి ఎందరో పెద్దల్ని ఆకర్షించింది .అందులో విలియం జేమ్స్ ,ఏమ్మా గోల్డ్ మాన్ ,జాన్ డ్యుయీ వంటి వారున్నారు .ఫ్రాయిడ్ ప్రభావం బాగా ఉన్న కాలం లో సిన్క్లైర్” డయటింగ్ ”ను ,హోమియో పతి వైద్యాన్ని వ్యాప్తి చేశాడు .”ఫాష్టింగ్ ”ప్రయోజనాన్ని తెలియ జేశాడు . .ఇలా చేయ టానికి” గట్ స్  ”ఉండాలి .అవి పుష్కలం గా ఉన్న వాడు ఆయన .
యే ప్రతీక శక్తుల్ని ఏది రించాడో అవే ఆయన్ను నిర్వీర్యుడిని చేసే ప్రయత్నాలూ చేశాయి .ఆయన జంగిల్ నవల పది హేడు భాషల్లో కి అనువాదం పొందింది అంటే ప్రపంచ వ్యాప్తం గా దాని ప్రభావం ఏమిటో తెలుస్తోంది .పారిశ్రామిక అమెరికా లో ఉన్న బాధలు ఆందోళనలు వ్యధలు అన్నీ అర్ధమయేట్లు చేసింది .ఆయన చేసిన ఆరోపణలు అన్నీ యదార్ధాలే నని పరిశీలన లో తేలిన విషయాలే .చికాగో లోని మాంసం పాకెట్లు తయారు చేసే చోట జరిగే అవి నీతి ని బయట పెట్టాడు .దీన్ని చదివిన ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ చికాగో కు ఒక కమీషన్ ను పంపి ఎంక్వైరీ చేయించాడు .అదీ పబ్లిక్ బాగా విరుచుకు పడిన తర్వాతే .అదీ సిన్క్లైర్ ప్రభావం .మన రచయిత ఊరు కొంటాడా ? తన స్వంత డబ్బు ఖర్చు చేసి ఒక ప్రైవేట్ కమిటీ ని పంపి అక్కడి అధ్వాన్న స్తితులను అధ్యయ నం చేయించాడు . .అతను రాసిన వన్నీ  యదార్ధాలే అని అన్ని కమీషన్లు నిర్ధారించాయి .అదీ ఆయన సాధించిన నైతిక విజయం .ఆ కాలం అంతా” muckraaking ”అని పేరు తెచ్చుకోంది .ఇవన్నీ గమనించిన బిజినెస్ వర్గం, మేధావి వర్గాన్ని నియంత్రణ చేసే ప్రయత్నాలెన్నో చేసింది .అయినా పబ్లిక్ డిమాండ్ ముందు ఓటమి పాలైంది .
ఆయన రచనలలో మానవులు జంతువుల కంటే కొద్ది నయం అన్నట్లు గా ఉంటుంది .రాసే టప్పుడు ఆయన కళ్ళ వెంట కన్నీళ్లు దారా పాతం గా కారి పోయేవి .చలించి పోయే వాడు .ఆయన రాసిన నలభై ఏళ్ల తర్వాత అమెరికా ప్రజలు బిజినెస్ వర్గా లను ఎదిరించి వాటి పై తమ కంట్రోల్ ను సాధించే ప్రయత్నం చేశారు. స్టాక్ యార్డ్ ప్రజలకు న్యాయం జరిగింది .ఆయన నినదించిన సామాజిక న్యాయం ప్రపంచ ఘోష గ విని పించింది .అమెరికా జనం ఎదుర్కొన్న పరిస్తితుల తో బాటు వలస వచ్చిన వారి బాగోగుల విషయం మీదా రాశాడు .వారి సమస్యలను ఫోకస్ చేశాడు .వీరికి తమ మత స్వేచ్చ లేదని ,కుటుంబం గురించిన అభిప్రాయాలకు విలువ నివ్వటం లేదని ,వారి సాంస్కృతిక విషయాల పై నియంత్రణ ఉందని ,తమ సంగీతాన్ని తాము పాడుకొనే స్వేచ్చ లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు .ఒక ఆటవిక రాజ్యం లో ఉన్న భావం కలుగుతోందని చెప్పాడు .కనుక ప్రజాస్వామ్యాన్ని కొత్త  వాతావరణానికి అల వాటు పడేట్లు చేయాలన్నది ఆయన దృష్టి .మనిషి” ఒక మూక మనిషి” గా మార రాదని సిన్క్లైర్ అన్నాడు .
సిన్క్లైర్ మనిషి సామర్ధ్యాన్ని ,కష్ట పడి పని చేసే విధా నాన్ని మెచ్చాడు .పని లో శక్తినంతటిని వినియోగించాలని అలసత్వం పనికి రాదనీ కార్మికులకూ చెప్పాడు .ఇళ్ళ లోని అసౌకర్యాలను డ్రెయినేజి ని అభి వృద్ధి పరచాల్సిన ఆవ సారాన్ని ఆయన రచనలో వీలున్న చోటల్లా చెప్పి ప్రభుత్వ దృష్టి లో పడేశాడు .ఆరోగ్య వంత మైన ఇళ్ళ నిర్మాణాన్ని కోరాడు .నాలుగు రూముల ఫ్లాట్ లను ఎర్పరచాలన్నాడు .ఇరుగు పొరుగు లు కలిసి సౌభాగ్యం గా జీవించాలని చెప్పాడు .ఇళ్లకు ,ఆఫీసులకు పరిశుద్ధ మైన తాగు నీటిని అందించాలని .ప్రతి మూల నీటి టాప్ ఉండాలని సూచించాడు .వీటన్ని ఫలితం గా1905 చికాగో మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో చికాగో ఫెడ రేషన్ ఆఫ్ లేబర్ ఇమ్మిగ్రంట్ వర్కర్లు ,స్టాక్ యార్డ్ డిస్ట్రిక్ట్ లోని కార్మికులు బల పరచిన ఐరిష్ అమెరికన్ ”ఎడ్వార్డ్ డాన్నే” గెలుపొందాడు .ఇది ఆయన రచన లకు ఘన విజయమే .
అందరికి సమాన ఆవ కాశాలు అన్నది సిన్క్లైర్ నిరంతర నినాదం .”meat packing industry ”ని ఆధునీకరించాలనే ఆయన పట్టు దల విజయం సాధించింది .జబ్బు చేసిన పశువులను వేరే ఉంచాలని,వధీం చే ప్రదేశాలు వేరుగా ఉండాలని ఎలుకలను చంపటానికి విషాన్ని ప్రయోగిస్తున్నప్పుడు ఆ ఎలుకలు మంచి మాంసం మీద తిరిగితే ప్రమాదం అనే ఆన్నీ ఆయనే చెప్పాల్సి వచ్చింది .కో ఆపరేటివ్ కామన్ వెళ్త ను సెల్ఫ్ గవర్నింగ్ కమ్మ్యునిటి ల ద్వారా సాధించాలని కోరాడు .అమలు చేయ టానికి వీలున్న పద్ధతులన్నీ నేర్పాడు. కొన్ని చోట్ల గ్రీకుల ”ఆదర్శ వాదం ”కనీ పించ వచ్చు .”the soul of man under socialism ”గురించి చెప్పి, మనిషి తనకోసమే కాక ఇతరుల కోసమూ జీవించటం నేర్చుకోవాలని హితవు చెప్పాడు .కార్మికుల క్షేమం కోసం వర్క్ ఇన్స్పెక్టర్లు ,వారి పై సూపెర్వైజర్ల అవసరాన్ని తెలియ జెప్పాడు .అవన్నీ ఇప్పుడు అమలు లోకి వచ్చాయి .
చికాగో లోని meat cutters ,butchers అందరు ఆఫ్రో అమెరికన్లే ఉండే వారు .వారి పని సామర్ధ్యం మెరుగ్గా లేదని భావించి రాశాడు .వాళ్ళు సమ్మె చేస్తే సమర్దించటానికి  తట పటాయించాడు .వారికి ”మాబ్ ష్టిగ్మా” ఉందన్నాడు .ఇది చివరికి జాతి సమస్య గా తయారయింది .తెల్ల వారు నల్ల వారిని దీపపు స్తంభాలకు కట్టేసే వారు .ఇవన్నీ  గ్రహించి చివరికీ వారికి మద్దతు నిచ్చాడు .నల్ల వారందరూ యూనియన్లలో చేరి సంఘీభావంప్రకటించారు .సమస్యల సాధనకు ఆది బాగా తోడ్పడింది .అనేక ఆందోళనల ఫలితం గా1980 లో మాంసం కార్మికుల .వేతనం గంటకు 18డాలర్లు అయింది .ఇదే అప్పటికి అమెరికా లో అత్యధిక వేతనం .
ఇప్పటికీ ఇమ్మిగ్రంట్స్  కు రక్షణ కరువు గ ఉందని అనుకొంటారు .2006లో న్యూయార్క్ గవర్నర్ మూడు బిల్లు ల పై సంతకాలు పెట్టాడు .వాటి వల్ల రిఫ్రిజి రేటర్లు ,పో లీసులు ,విష వాయువులున్నచోట  పని చేసే వారు” గ్రౌండ్డ్ జీరో ”దగ్గర పని చేసే వారందరికి లాభాలు చేకూరాయి .అయినా జబ్బు తో ఉన్న ఇమ్మిగ్రెంట్స్ విషయం ఎవరికీ పట్టలేదు .సిన్క్లైర్” జంగిల్ నవల” రాసి వందేల్లయిన తర్వాతా కూడా O.S.H.A..సంస్థ చీఫ్ మాట్లాడుతూ ”ఇంకా ఈ విషయం లో చేయాల్సింది ఎంతో మిగిలి పోయింది ”అని బాధ పడ్డాడు .”cantinental harass ment” విషయం లో ఆడ వాళ్ళు భయ పడటాన్నీ ఆయన చిత్రించాడు మగబాస్ ఆడ వారి పట్ల అసభ్య ప్రవర్తన ను నిరశించాడు .దీనిపై రిపోర్ట్ ఇవ్వ టానికి ఆడ వారు భయ పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు .ఆయనద్రుస్ష్టి కి రాని  సమస్య లేదు అంటే అతి శయోక్తి కాదు .బాల కార్మిక వ్యవస్థ పై రాశాడు .బనానా లలో del monte ,chiquita ,dole రకాలు ప్రసిద్ధ మైనవి .ఇవి ఈక్వెడార్ నుండి అమెరికా కు వస్తాయి .వీటిపై స్టిక్కర్లు అంటించే పనిని ఈక్వెడార్ లో బాల కార్మికులే చేస్తారట .ఎని మిదేల్ల లోపు పిల్లలు పని చేస్తారు వీరికి పన్నెండు గంటల పనికి 4.72డాలర్లు మాత్రమె ఇస్తారట .బాలుర శక్తిని యెట్లా పిండి పారేస్తున్నారో తెలిపే విషయం ఇది .మామూలు వేతనం లో ఇది నలభై శాతం కంటే తక్కువత .మక్ డోనాల్డ్ తయారు చేసే ప్లాస్టిక్ ఆట వస్తువులలు పని లో బాల కార్మికులకు పద్నాలుగు గంటల పనికి గాను గంటకు ముప్ఫై సెంట్లు మాత్రమె ఇస్తారట .ఇది ప్రపంచ వ్యాప్తం గా ఉన్న సమస్యే .దీనికి అంతు దరీ లేదు .ఇన్ని సమస్యలను తన నవలలో పాత్రల ద్వారా చెప్పాడు .రూజ్ వెల్ట్ సిన్క్లైర్ ను కసురుకొన్నా ఈయన చెప్పినదానికి పరిష్కారం ఆలోచించాడు .ఆయన తర్వాతా వచ్చిన ప్రెసిడెంట్లు సిన్క్లైర్ ను గొప్పగా అభి మానించి సమస్యలను తెలుసుకొని ఆయన మాటలకు అత్యంత విలువ నిచ్చారు .ఈ విధం గా ప్రజా సమస్యలను ఫోకస్ చేసి పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించిన ప్రజా రచయిత అప్ టాన్ సిం క్లైర్ .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.