శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –8

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –8
18–”తను చ్చాయాయాభిస్తే ,,తరుణ తరణి శ్రీ సరణిభిహ్ –దివం సర్వా ముర్వీ ,మరు మణి ,నిమగ్నానాం స్మరతియః
భవ్యన్త్యస్య త్రస్య ద్వహన హరిణ శాలీన నయనాః –సహోర్వస్యః కతి కతి న గీర్వాణ గణికాః”
తాత్పర్యం –ఉమా దేవీ !ఉదయ సంధ్య లోని ఎరుపు రంగు తో ,నీ శరీర కాంతి ఈ భూమిని ,ఆకాశాన్నీ అరుణిమ గా భావించి ,ఎవరు ధ్యానిస్తారో ,వారికి అప్సరస స్త్రీలు వశమవుతారు .ఊర్వశిని విష్ణువు తొడల నుండి (ఊరువు )సృష్టించాడని ఐతిహ్యం .
19–”ముఖం బిందుం కృత్యా కుచయుగ మదన్యస్థా తదధో –హరార్ధం ధ్యాయే ద్యో హర మహిషి ,తే ,మన్మధ కలాం
ససద్య స్సంక్షోభం ,నయతి ,వనితా ,ఇత్యతి లఘు –త్రిలోకీ మప్యాసు భ్రమ యతి ,రవీందు స్థనయుగాం .”
తాత్పర్యం –శ్రీ చక్ర వాసినీ !ముఖాన్ని బిందు స్థానం లో కల్పించి ,దానికి క్రిందుగా ,స్థన యుగ్మాన్ని చేసి ,దానికి క్రింద శివుని శరీరం లో సగం అయిన శక్తిని అంటే త్రికోణం గా భావించి ,దాని లో నీ కామ బీజాన్ని (క్లీం )ఎవడు ధ్యానిస్తాడో వాడు స్త్రీల మనసుల్నిరంజింప జేస్తాడు .ఎందుకంటె -సూర్య చంద్రులే చనులు గా ఉన్న స్వర్గ ,మర్త్య ,పాతాళ లోకాలను భ్రమ తో నువ్వు మోహ పెడుతున్తావు .
విశేషం –క్లీం అనేది మన్మధ బీజం గా చెబుతారు .దీన్ని ధ్యానిస్తే కావలసిన స్త్రీ భార్య గా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది .బిందువు ముఖం .దాని కింద స్థానాలు .దాని కింద యోని ని అదో ముఖం గా ధ్యానించాలి .తురీయ స్వరూపం ”ఈం ”దీన్ని జపించే టప్పుడు పై బొట్టు రవి అంటే సూర్యునిగా ,కింది బొట్టు చంద్ర ,అగ్నులు గా (కుచాలు )భావించాలి .రవి రూపం గా ఉన్న బిందువే ముఖం .కిందివి రెండు స్థానాలు .”హ” కారార్ధం యోని రూపం లో ఉంటుందనిఅక్షర నిపుణులు అంటారు .” హ ”అంటే సంస్కృతం లోని హకారం .హ కారం శివ వాచికం గా చెబుతారు .హకారార్ధమే ”ఏ”-ఇది పార్వతీ వాచకం గా భావన చేస్తారు .”శివ ”లోని”వ్ శ్”తీసేస్తే మిగిలేవి ఇ,అ .ఈ రెండు కలిస్తే” ఏ”ఏర్పడుతుంది .ఇదే సంస్కృతం లోని త్రికోణా కృతి .
20—”కిరంతీ మంగేభ్యః కిరణ నికురంబామృత రసం –హ్రుదిత్వా ,మాధత్తే,హిమ కర ,శిలా మూర్తి మవయవః
ససర్పాణాం ,దర్పం ,శమయతి ,శాకున్తాధిప ఇవ –జ్వర ప్లష్టాన్ ,దృష్ట్యా ,సుఖ యతి ,సుధా సార సిరయాః”
తాత్పర్యం –శివ మనోహరీ !నీ సర్వ అవయవాల నుండి ,స్రవించే కిరణాలు అమృతాన్ని వర్షించే ,చంద్ర కాంత మణి మయం గా ఎవడు ధ్యానిస్తాడో,అతడు గరుత్మంతుని లాగ ,అన్ని రకాల పాములనుండి వచ్చే విష బాధలను పొగొట్ట గల సమర్దుడౌతాడు .జ్వరం తో ఉన్న వారికి అమృత ధార గా తన శీతల స్పర్శ తో బాధను తొలగించి సుఖం ఇవ్వగలుగు తాడు .
ఈ విధం గా ఆరు నెలలు ధ్యానిస్తే గరుత్మంతుని తో సమాన మవుతాడని శాస్త్రం .దృష్టి చేత లోకాన్ని ఆకర్షిస్తాడు .చూపులతో స్త్రీ లను వశం చేసుకో గలుగు తాడు .సర్పాదుల వల్ల భయాన్ని పొగొట్టగల  సమర్దుడౌ తాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-9-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.