శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –9

  శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –9
21–”తటిల్లెఖా తన్వీం ,తపన శశి వైశ్వానర మయీం –విషన్నానాం ,షన్నా మప్యుపరి కమలానాం తవ కలాం
మహా పద్మాటవ్యం ,మ్రుదిత మలమాయేన మనసా –మహాన్తః పశ్యంతో దదతి ,పరమాహ్లాద లహరీం ”.
తాత్పర్యం –హ్లాదినీ !మెరుపు తీగ లాగా సూక్ష్మమై ,పొడవైనదై,ఆజ్ఞా మొద లైన పన్నెండు వరకు క్షణ విలాసనం కలిగి,సూర్య ,చంద్రాగ్ని సార మైన ది అయిన ,పరాఖ్య ఐన నీ కళను ,ఆరు పద్మాల పై ,సహస్రారం అనే మహా పద్మ వనం లో కూర్చున్న దాన్ని ,అవిద్యా మొద లైన అహంకారాలు ,మాయ లేని మనసు తో ధ్యానించే సజ్జనులు పరమా నంద ప్రవాహ మయులై విల సిల్లు తున్నారు .
విశేషం –ఇది ఉత్తమాధి కారు లైన సాధకుల లక్షణం .కింది నుండి పైకి ,విద్యా పంచాదశాక్షరాలను ఒక దానితో ఒకటి లయం అవుతూ ,15వదిఅయిన మూడు బిందువులతో కూడిన త్రికోణం లో లీన మయ్యే ధ్యాన విధానం ఇప్పుడు చెప్పబడినది అంతా .బిందు త్రయం ,సోమ ,సూర్య ,అనలాత్మకం .సూర్యుడు అగ్ని లో ,అగ్ని చంద్రుని లో ,సోముడు ”స” తో కూడిన పదార్ధ కళ లో ( సకారానికి హకారం లో )లీనం కాగా ,సాధకుడు శివ శక్తి మేళ వింపు లో సదా శివుని లో ఐక్యమై ,జీవన్ముక్తుడు అవుతున్నాడు.
శ్రీ దేవి నే ”తపన ,శశి ,వైశ్వానర మయీ ”అంటారు .సోమసూర్య అగ్ని లయాత్మకం అని భావం .అంటే అవన్నీ ఆ పర దేవతే అని అర్ధం .వారికి విడి గా ప్రత్యెక మైన ఉనికి లేదు అని భావన .”షన్నాం ఉపరికమలానాం విషన్నాం”అంటే ఆరు కమలాల పైన ఆసీన అయిన అమ్మవారు .సహస్రార ,పద్మా రూఢ ,పరాకార రూపా ,చంద్ర కళా అయిన శ్రీ దేవి ని ధ్యానించి ,బ్రహ్మానందాన్ని పొందుతున్నారు సాధకులు .
22—” భవానీ త్వం ,దాసీ మయి ,వితర దృష్టిం స కరుణా –మితి స్తోతుం ,వాంచన్ ,కధ యతి ,భవానీ ,త్వ మితియః
తదేవత్వం .తస్మై ,దిశసి ,నిజ సాయుజ్య పదవీం –ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదం ”
తాత్పర్యం –కరుణా మయీ !నీ కరుణా కటాక్షం నా పై ప్రస రింప చెయ్యమని ఎవరు స్తోత్రం చేస్తారో ,నిన్ను ”భవానీ – నీవు ”అనే రెండు మాటలు అనే లోపే బ్రహ్మా ,విష్ణు మొద లైన దేవతల కిరీటాల మణు లతో ,నీరాజనం చేయ బడే నీ పాద పద్మాలు కలది అయిన సాయుజ్య పదవిని వానికి అనుగ్రహిస్తావు .అంత త్వరగా నీ అనుగ్రహం నిన్ను నమ్మిన వారికి కలుగుతుంది .
విశేషం –”త్వం ”అంటే త్వమేవాహం అనే మహా వాక్య ప్రయోగమే .అంటే జప ,తపాల కంటే ,తాదాత్మ్యం అనే సంభావనే ఫలితాన్నిస్తుంది .బ్రమాదులు కూడా పాదార్చకులు గా ఉంది ,సాయుజ్య లాభం లేకుండా ,నిల్చి ఉన్నారని భావం .సకల మనో రధాలను శ్రీ దేవియే అనుగ్ర హిస్తుంది .పరమాత్మ లోకం చేరతానని సా లోక్య ముక్తి అంటారు .సన్నిధి లోకి చేరటం సామీప్య ముక్తి .పరమాత్మ తో సమాన రూపం పొందటం సా రూప్య ముక్తి .పర మాత్మ లో ఐక్యం అవటం సాయుజ్య ముక్తి .
ద్వైతులకు సామీప్య ముక్తి ఉత్తమం .వశిష్టా ద్వైతులకు సారూప్య ముక్తి శ్రేష్టం .అద్వైతులకు సాయుజ్యమే ముక్తి మోక్షం .దీనినే శ్రీ శంకరులు” శివా నంద లహరి ”లో వివరించారు ”సాలోక్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే –సామీప్యం ,శివ భక్తీ దుర్య జనతా సాంగత్య సంభాషణే–సారూప్యం ,చ ,చరా చరాత్మక ,తను ధ్యానే ,భవానీ పతేహ్  –సాయుజ్యం  ,మమ చిత్ర మత్రా భవతి స్వామిన్ ,క్రుతార్దో స్మ్రుహం ”.
సశేషం –27-9-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –9

  1. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
    http://www.logili.com/

    మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
    review@logili.com

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.