శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11
26—” విరించి పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం –వినాశం ,కీనా శోభజ తి ధనదో  యాతి నిధనం
వితంద్రీ ,మాహేంద్ర వితతి రపి ,సమ్మిలిత దృశా –మహా సంహారే స్మిన్ ,విహరతి ,సతి ,త్వత్పతి రసౌ ”
తాత్పర్యం –స్వాధి స్టా నదేవతా !మహా ప్రళయం తర్వాతా బ్రహ్మాది దేవత లంతా ,సంహారం పొందుతున్నారు .నీ పతి సదా శివుడు మాత్రం ,విశ్రుమ్ఖలం గా విహరిస్తున్నాడు .ఆది నీ పాతి వ్రత్య మహాత్మ్యమే .దాని వల్లనే నీ పతి లయం కావటం లేదు .
విశేషం –సతీ అంటే సత్ శబ్దం యొక్క స్త్రీ లింగ రూపమే .సత్ రూప పర బ్రహ్మ మైన శివ బ్రహ్మానికి నాశనం లేదని భావం .
27–”జపో జల్పశిల్పం ,సకల మపి ,ముద్రా విరచనా –గథిహ్  ప్రాదక్షిన్య క్రమణ ,మశనా ద్యాహుతి విధిహ్
ప్రణామస్సంవేశ స్సుఖ ,మఖిల మాత్మార్పణ దృశా –సపర్యా పర్యాస్తవ భవతు ,యన్మే విలసితుం  ”
తాత్పర్యం –శర్వాణీ !ఆత్మ సమర్పణ బుద్ధి తో నేను నోటి తో పలికిన మాటలన్నీ  నీ వు నిర్మించినవే .నువ్వు నిర్మించినవే కనుక అవి నీ మంత్ర జపమే .ఈ శరీరం నీవే ఇచ్చావు కనుక ,నేను చేసే హస్త విన్యాసాలన్నీ నీకు చేసే ముద్రా విధానాలుగా నే భావించు .ఎంతటి వివేకమూ వినయమూ శ్రీ భాగవత్పాడులలో ఉన్నాయో దీనితో మనకు అర్ధ మవుతోంది .అంతా ఆమె ఇచ్చింది కనుక తాను కొత్తగా చెప్పేదేమీ లేదని ,తాను చేసే చేష్టలన్నీ ఆమె కైన్కర్యాలే నని గడుసు గా చెప్పారు .నీవు సర్వ వ్యాపివి కనుక నేను చేసే సంచారం అంతా నీకు చేసే ప్రదక్షినమే అనుకో .నా అంగ భంగిమ లన్నీ ,నీకు ప్రనామాలే .నీవే జతరాగ్ని వి కనుక  నేను గ్రహించే అన్న ,పానాదు లన్నీ ,నీ ప్రీతీ కోసం చేసే హోమం గా స్వీకరించు .శబ్ద స్పర్శాడులతో నేను చేసే చేష్ట లన్నీ నీ సపర్యలె అని భావించు .అని అమ్మ ఇచ్చినవన్నీ అమ్మకే సమర్పిస్తున్నానని భావన .
విశేషం –అన్ని అక్ష రాలు ,మాతృకా వర్ణ రూపాలే కనుక పలుకులన్నీ జపంతో సమానాలే అని భావం .హస్త విన్యాసాలన్నీ జపం లో చేసే ముద్రలే .అన్నీ ఆమెకే చెందు తాయి .మాత జథరాజ్ఞి స్వ రూపం .కనుక మనం తిన్నదంతా ఆమెదే .సందేశం అంటే శయనం నీ ముద్రాదులన్నీ ఆత్మ సమర్పణ ద్రుశాలు .ఇదంతా ”సపర్యా పర్యాయం ‘.’భగవద్ గీత లో కూడా ”మన్మనా భవ ,మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు –మమే వేశ్యసి కౌంతేయ  ,ప్రతి జానే ప్రయోజనే ”అన్నాడు శ్రీ కృష్ణ భాగ వాన్ .ఏమి చేసినా ,ఎలా చేసినా ,సర్వం భగ వతికి అర్పణమే .ఇంకేదైనా పూజ చేస్తే ఆది పూజా క్రమం కాదు అని తెలియ జేయటమే .
28–”సుధా మప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం –విపద్యన్తే విశ్వే ,విధి ,శత మఖ ,ముఖాద్యాది విషదః
కరాళం  ,యత్ప్రేళం ,కబలిత వతః కాల కలనా –న శంభో స్తన్మూలం ,తవ ,జనని ,తాటంక మహిమా ”
తాత్పర్యం –మహేశ్వరీ ! దేవత లంతా అమృతం త్రాగి నా ,జరా మృత్యువు లను పొందుతున్నారు .అంతా ప్రళయం లో లయమవుతున్నారు .అయితే కాల కూటవిషాన్ని త్రాగిన నీ భర్త శివుడు ,ప్రళయ కాలం లో కూడా చని పోకుండా  ,కాలానికి అతీతు డై ,మ్రుత్యుమ్జయుడై ఉన్నాడు .దీనికి కారణం నీ చెవి కమ్మల ప్రభావమే .
విశేషం –తాటంకాలు అంటే చెవి కమ్మలు. సౌభాగ్య చిహ్నాలు .ఆమె కమ్మలకు చేటు తెచ్చే శక్తి కాలానికి లేదని అర్ధం .కారణం –కాలానికి ఉత్పత్తి ,స్తితి ,లయాలు శ్రీ దేవి తాటంక నియ తాలు .కనుక ఆమె పాతి  వ్రత్య మహిమ సర్వాతీ శయ  మైనది అని భావం .శ్రీ దేవి కాల సంకర్శిణి .అమే  ను సేవిస్తే, కాల భయం ఉండదు .సతుల పాతివ్రత్యమే పతులకు శ్రీ రామ రక్ష. .అందుకే సువాసినులు మంగళ ప్రద మైన చెవి కమ్మలను, కమ్మర ,ముంగర ,కుంకుమ ,మంగళ సూత్రం సర్వదా కాపాడు కోవాలి అని తెలియ దగిన విషయం. ఇతర దేవతల సౌభాగ్యం నశించేది .భగ వతి సౌభాగ్యం అనశ్వరం .అమృతం తాగిన వారికి కూడా చావు తప్పలేదు .మృత్యు రూపమైన కాల కూటాన్ని భక్షించిన వాడు శివుడు మ్రుత్యున్జయుడైనాడు .దీనికి కారణం కూడా భగ వతి పాతి  వ్రత్యమే .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –29-9-12-కాంప్ –అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.