అమెరికా లో జర్మన్ హవా -8
1732-1800 కాలం లో జర్మన్ వార్తా పత్రికలు 38 మాత్రమె ఉండేవి .1848-60 మధ్య జర్మన్ అమెరికన్ పేపర్లు వచ్చాయి .జర్మ పేపర్లు 266 అయాయి .ఇన్ని పెరగటానికి కారణం ‘’ఫార్టీ యైటర్లె ‘1860 లో సెయింట్ లూయీస్ లో ఏడు మాత్రమె జర్మన్ డైలీ పేపర్లున్దేవి .నలభై ఎనిమిది వాళ్ళు Die Waage ,Anzazer ,dest westens పత్రిక లలో స్టాఫ్ గా చేరి పని చేశారు .చివరికి యాంటి స్లేవరి పేపర్లు గా మారాయి .చార్లెస్ నాస్ట్ అనే ఫార్టీ యైటర్-‘’ఫాదర్ ఆఫ్ పొలిటకల్ కార్టూనిస్ట్ ‘’అయాడు .ఆయనే డెమొక్రాటిక్ పార్టీ వారికి ‘’గాడిద ను ‘’రిపబ్లిక్ పార్టీ వారికి ‘’ఏనుగు ‘’ను‘’మస్కట్స్‘’గా వేశాడు .ottoman mergan thaler లినో టైప్ కనీ పెట్టి ,ఆటో మేటిక్ టైప్ సెట్టింగ్ కు ఆద్యుడైనాడు .ఇదంతా 1886 july 3న. ఈ మార్పుthe newyork tribune లోప్రారంభ మైంది .1894 లో 800 ఉన్న జర్మన్ పబ్లికేషన్లు క్రమం గా తగ్గాయి .1910-20కాలం లో 234కు పడి పోయాయి .
1920 లో సెన్సస్ ప్రకారం జర్మన్ మైగ్రేషన్ 25.3% కు తగ్గింది .1923 లో సుప్రీం కోర్టు జర్మన్ భాష నిషేధాన్ని రద్దు చేసింది .1919 లో ఆల్కహాల్ తయారు చేయటాన్ని 18 వ సవరణ ను రద్దు చేసింది .దీనికి జర్మన్లు ఆర్ధికం గా బాగు పడటమే కారణం .దేశం లోని బ్రూవేరీలు అన్నీ జర్మన్లవే .1920 ఎన్నికలు కొంత మార్పు తెచ్చాయి .జర్మన్లు ఉడ్రో విల్సన్ నిల బెట్టిన వాడిని కాకుండా ప్రత్యర్ధి ,జర్మన్ అమెరికన్ లీగ్ బలపరచిన ‘’హార్దిన్గ్స్ కు వోట్లు వేశారు .ఆ తర్వాతా ఏడాది చికాగో లో రాడికల్ బర్జేర్ బాండ్ పార్టి హార్దిన్గ్స్ జర్మన్లకు కృతజ్ఞతలు చెప్పాలని కోరింది .అయితే దీని సంఖ్యా బలం తగ్గి పోయింది .
ప్రపంచ యుద్ధం లో జర్మని లో 18లక్షల జర్మన్లు చని పోయారు .ఆర్ధికం గా జెర్మని దెబ్బతింది .జర్మన్ మారక ద్రవ్యం మార్క్ పతన మైంది ఎందరో జ్యూలు జర్మని వదిలి ఇతర దేశాలకు పారి పోయారు .అక్కడ ఉన్న వాళ్ళను చంపేశారు హిట్లర్ అనుయాయులు .హిట్లర్ పార్టి national socialist german worker’s party (naji )పార్టి ఏర్పడి జ్యూలను ,జిప్సీలను ,స్లావ్స్ ను మొదలైన ఆర్యేతరులను జర్మని నుండి తరిమేసి ప్రక్షాలన చేస్తా మన్నారు .నాజీ సభ్యులు అమెరికా వచ్చి ప్రచారం చేశారు .డెట్రాయిట్ లో 1934లో tuetonia association ను ఏర్పరచారు .అమెరికా సిటీ లలో అయిదు వందల మంది సభ్యులు చేరారు .హిట్లర్ గెలిస్తే జర్మని వెళ్లి పోవాలని వీరు ప్రచారం చేశారు .అయితే వీరి సంస్థ ఎవరినీ ఆకర్షించలేక చతికిల బడింది .1936 లో జర్మన్ అమెరికన్ బండ్ ఏర్పడి తనను తాను ‘’బొంద‘’పెట్టుకోంది.1930 లెక్కల ప్రకారం జర్మన్ అమెరికన్ లలో డెబ్భై శాతం వారికి ఇంటర్నేషనల్ నాజీయిజం మీద నమ్మకం లేదని రుజువైంది .ఇరవై శాతం మంది నాజీలకు పూర్తిగా వ్యతి రేకం అని చెప్పారు .బండ్ సభ్యుల సంఖ్య పాతిక వేల కు మించ లేదు .వీరికి రేడియో టెలివిజన్లు కొంత తోడ్పడ్డాయి .బండ్ లీడర్ fritz kuhn అనే వాడు ఫండ్స్ తినేశాడని ఆరోపణ వచ్చి ,విచారణ జరిపించి జైల్లో పెట్టారు .
1933 లో యూదులు జర్మన్ స్టోర్సు లను ,జర్మన్ వస్తువులను బహిష్క రించారు .నాజీల అక్రమాలను ముక్త కంథం తో అందరు నిరశించారు .అయిదు వందల మంది synagogues యూదుల స్టోర్సు లను తగుల బెట్టారు .వేలాది యూదులను కొట్టి బాధించారు .ప్రెసిడెంట్ –జర్మన్ రాయ బారి ని వెనక్కి పంపించే శాడు .సరి హద్దుల్ని మూయిన్చేశాడు stewben society .మొదటి సారిగా నాజీల దుర్మార్గాలను ఖండించింది .జర్మన్ పత్రిక లన్ని ‘’చీకటి బలగాన్ని ‘’ఈస డించింది .1941లో జర్మన్,అమెరికన్లు loyal Americans german descent ‘’ ను ఏర్పరచి అమెరికా కు ,ప్రజాస్వామ్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఊగిస లాట ధోరణికి స్వస్తి పలికారు . 1942జనవరిstewbern news paper ‘’అంతా అమెరికా యుద్ధాన్ని బల పరుస్తూ రాసింది .ఇక్కడి జర్మన్లంతా అమెరికన్ జాతీయ స్రవంతి లో చేరి పోయారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

