అమెరికా లో జర్మన్ హవా –9
అమెరికా అభ్యున్నతి లో జర్మన్ల భాగస్వామ్యం
అమెరికా లో 18వ శతాబ్దం లో ‘’లాగ్ కేబిన్లు ‘’నిర్మించిన మొదటి వారు జర్మన్లె .ఇవి విస్కాన్సిన్ లోని మంచు లోను ,టెక్సాస్ లోని దుమ్మును తట్టుకొన గలిగేవి .19 వ శతాబ్దం లో జర్మన్లు క్రిస్మస్ సందర్భం గా క్రిస్మస్ ట్రీ లను ,శాంతా క్లాస్ లను ఏర్పరచారు .పిక్నిక్ ఫూడ్స్ ను తయారు చేసిన వాళ్ళూ జర్మన్లె .frankfurters ,hum burgers saurkrant ,potato salad లు జర్మన్లవే .ఇలా జర్మనీ సంప్రదాయం అమెరికాది గా మారి పోయింది
జాన్ పీటర్ జిన్జేర్ .
1730 లో తన పదమూడవ ఏట న్యు యార్క్ చేరిన జాన్ పీటర్ జిన్జేర్ ‘’పాలన్తిన్ ‘’సాంప్రదాయం వాడు .ఫ్రీ స్పీచ్ కు ఆద్యుడు .అనాధ గా అమెరికా చేరి ,విలియం బ్రాడ్ ఫోర్డ్ లో అప్రెంటిస్ గా పని చేసి ,న్యూయార్క్ లోని మొదటి వార్తా పత్రిక న్యు యార్క్ గెజిట్ ను ప్రచురించాడు .జిన్జేర్ క్రమం గా ఎదిగి కాలని మొదటి స్వతంత్ర జర్నల్ ‘’న్యు యార్క్ వీక్లి జర్నల్ ‘’ను తెచ్చాడు .అంతకు ముందు వరకు ఆ పేపర్ బ్రిటీష రాజు మొదటి జార్జి దయా దాక్షిణ్యా ల పై బతికింది .ఇప్పుడు స్వతంత్ర పత్రిక .స్వేచ్చగా ,తీవ్రం గా అందులో రాజకీయాలను రాశాడు జిన్జేర్ .’’cosby నితీవ్రం గా విమర్శించే వాడు .ఆఫీసర్లను గాడిదలు ,కుక్కలు అన్నాడు .కోపం వచ్చిన గవర్నర్ కాస్బిపై కోర్టు లో కేసు వేశాడు .ఇతని తరఫున లాయర్గా ఆండ్రు హామిల్టన్ పని చేశాడు .’’ప్రభుత్వాన్ని విమర్శించటం ,లొసుగులు చెప్పటం అమెరికా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ‘’అని వాదించాడు .జడ్జి ఇతని వాదన నమ్మి కేసు కొట్టేశాడు .ఈ విధం గా అమెరికా లో పత్రికా స్వాతంత్ర్యం బల పడింది .అందరు జిన్జేర్ ను మెచ్చారు .జర్మన్ అమెరికన్ రచయిత ‘’హెన్రీ లూయిస్ మెకెన్ ‘’అది నిజం గా పత్రికా శక్తి అన్నాడు .18 36 లో బాల్టిమోర్ వెళ్లి తండ్రి తనకు బహుమానం గా ఇచ్చిన ప్రింటింగ్ ప్రెస్ ను ,టైప్ అక్షరాల బూజును దులిపాడు .ఆ తర్వాట్హ మెకెన్ మార్నింగ్ హెరాల్డ్ లో చేరి నిజాయితీ తెలివి తేటల తో రచనలు చేస్తూ అమెరికన్ జర్న లిస్టు లకు ఆదర్శం అయాడు .1924 లో ‘’అమెరికన్ మెర్కురీ ‘’అనే పేపర్ ను నడిపాడు .ప్రజాస్వామ్యం ,వేదాంతం ,మతం ,కవిత్వం జ్ఞాపకాల మీద పుస్తకాలు రాశాడు .
1918 లో ‘’ది అమెరికన్ లాంగ్వేజ్ ‘’పత్రిక వచ్చింది ఉచ్చారణ లో వచ్చిన మార్పుల దశలను చర్చించాడు .వేలాది మాటలు అమెరికా శబ్ద ప్రపంచం లో ఎలా చేరాయో వివ రించాడు .ఇది ఇప్పుడు పాతదే అని పించినా అమెరికా భాషోద్యమానికి కర దీపిక గా నిలిచింది .
విజ్ఞాన శాస్త్రం
విజ్ఞాన శాస్త్రం లో ను జర్మన్ల పాత్ర గణ నీయం గా ఉంది ఫార్టీ యైటర్ల లో ఒక డైన ‘’అబ్రహాం జాకోబి‘’జర్మన్ల మొదటి వైద్యుడు .అడవుల రక్షణ ,అప్పటి దాకా అమెరికన్ల కు తెలీదు .బేరన్ హార్డ్ ఎడ్వార్డ్ 1876 లో వచ్చాకనే వీటి పై శ్రద్ధ వహించారు .ఆంత్రో పాలజి ణి సరదా గా ప్రారంభించి దానికి ఒక స్తాయి కల్పించింది జర్మన్లె .’’ఫ్రాంజ్ బాస్ ‘’అనే జర్మన్1888లో వచ్చి దీన్ని పూర్తీ స్తాయి శాస్త్రం గా మలిచాడు .అతని శిష్యులే కొలంబియా వర్సిటి లోని ‘’రూత్ బెనెడిక్ట్ ,మార్గ రేట్ మీడ్ ‘’ లు
కార్ల్ షుజ్జ్
1850 లో వచ్చిన ‘’కార్ల్ షుర్జ్ ‘’బానిస వ్యతి రేక తను బోధించాడు .ఫిలడెల్ఫియా లో ‘’ఫిమేల్ అంటి స్లేవరి సొసైటి ణి ఏర్పరచాడు 1856 .లో బానిస వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రం చేశాడు .మూడేళ్ళ తర్వాత ‘’ట్రూ అమెరికనిజం‘’భావం తో జాతీయ ప్రాధాన్యత పొందాడు .బోస్టన్ లోని ఫాన్విల్ హాల్ లో ఇచ్చిన ఉద్వేగ పూరిత ఉపన్యాసం లో ‘’ఈ దేశ చరిత్ర లో నీతి తో కూడిన ప్రభావ వంత మైన నిర్ణయాత్మక విధానం ఇదే ‘’అని ప్రకటించాడు .న్యాయం ,స్వాతంత్రం కోసం పాటు పడ్డాడు .యాభై ఏళ్ళ తర్వాతజర్మని లో ఐక్య ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి నందుకు సంతోషించాడు .1848లో షుర్జ్ స్విస్ దేశానికి పారి పోవాల్సి వచ్చింది .
1852 లో మళ్ళీ న్యు యార్క్ వచ్చిన షుజ్ ‘’father land is so close to me ‘’అన్నాడు .భార్య మార్గరేట్ మేయర్ తో కలిసి వాటర్ టౌన్ ,విస్కాన్సిన్ లలో పర్య తించాడు .ఆమె ఈ రెండు చోట్లా కిన్దర్ గార్టెన్ స్కూళ్ళ ను ప్రారంభించింది .ఇవే మొదటి కిండర్ స్కూళ్ళు .ఆయన ఇంగ్లీష్ బోధిస్తూ ,ళా ప్రాక్టీస్ చేశాడు .అప్పుడే ఇల్లినాయిస్ రిప్రేజెంటటివ్ అయిన అబ్రహాం లింకన్ కూడా సభ్యుడై ,కొత్తగా పెట్టిన రిపబ్లికన్ పార్టి లో చేరాడు .లింకన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావటానికి షుజ్జ్ తీవ్రం గా ప్రచారం చేశాడు ‘’ I made Lincon President ‘’అని మిత్రుడికి గర్వం గా జాబు రాశాడు .అంటే తాను లింకన్ కు ప్రజా బలం చేకూర్చ టానికి ,బానిసత్వ వేళ్ళను పెకలించటానికి తోత్పడిణా నని తన జాబు లో సారాంశం గా చెప్పాడు .ప్రెసిడెంట్ లింకన్ షు జ్జ్ ను స్పెయిన్ కు రాయ బారిని చేసి కృతజ్ఞత చూపాడు .1862ఆ పదవిని వదిలి పెట్టి ,సివిల్ వార్ లో విదేశీ జోక్యం లేకుండా చేయటానికి ఏమి చెయ్యాలి అన్న దాని పై ప్రెసిడెంట్ కు సలహా దారు గా ఉన్నాడు .దాన్ని తిరస్కరిస్తే brigadier general of volunteer union troops అయాడు .
1865 లో ప్రెసిడెంట్ లింకన్ హత్య షుజ్ కెరీర్ ను మార్చేసింది .లింకన్ తర్వాతి ప్రెసిడెంట్ ఆండ్రు జాన్సన్ పద్ధతి నచ్చక వాషింగ్ టన్ వదిలి సెయింట్ లూయిస్ చేరి westliche post ‘’కు ఎడిటర్ గా పని చేసి జర్నలిజం లో స్తిర పడి పోయాడు .1869 లో మళ్ళీ రాజకీయ ప్రవేశం చేశాడు .సెనేట కు ఎన్నికైన మొదటి జర్మన్ అని పించుకొన్నాడు .born citizenఅయి మిస్సోరి నుంచి 1875 లో సెనేటర్ గా ఎన్నికయాడు .అమెరికా స్వాతంత్రానికి వెన్నెముక అయాడు .కరేబియన్ సముద్రం లో అమెరికా విస్తరణ కు తోడ్పడ్డాడు .అమెరికన్ ఇండియన్స్ పై వివక్ష ను నిర శించాడు షుజ్జ్ .
ప్రెసిడెంట్ రూథర్ ఫోర్డ్ బి.హేయిస్ –కాలినక్ట్ లో సెక్రెటరి ఆఫ్ ది ఇంటీరియర్ గా పని చేసి సెనేటర్ గా సమర్ధత చూపాడు .బ్యూరో ఆఫ్ ఇండియన్ అఫైర్స్ ,,యంగ్ ఇండియన్స్ కు ,విద్య కు ,అరణ్య ,భూ సంపద పరి రక్షణ కు గొప్ప కృషి చేశాడు .ప్రఖ్యాత అ రచయిత మార్క్ ట్వేన్ ఈయన స్నేహితుడే .అతని మరణాన్నివిని మార్క్ ట్వేన్ ‘గొప్పగా ఆయన్ను విశ్లేషించాడు .మార్క్ ట్వేన్ అనే పేరు తనకు ఎలా వచ్చిందో అందులో తెలిపాడు .షుజ్జ్ ను ‘’పోలిటికల్ చాన్నేల్ ఫౌండర్ ‘’అని కీర్తించాడు .అతని నిజాయితీ దేశభక్తి దీక్ష ,గౌరవం ,దూసుకు పోయే తత్త్వం అంటే తనకు మహా ఇష్టం అని అభి వర్ణించాడు .తాను రాజకీయం గా షుజ్ తో కలిసి ప్రయాణం చేయ లేక పోయానని బాధ పడ్డాడు .అయితే తాను యే మాత్రం సంకోచించ కుండా షుజ్ అను అనుసరించాను అని గర్వం గా చెప్పుకొన్నాడు మార్క్ ట్వేన్ .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –8-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

