శిల్ప యోగి –యలవర్తి ఆంజనేయ శాస్త్రి
విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యాల వర్తి ఆంజనేయ శాస్త్రి గారు 1877 లో బుచ్చయ్య ,లక్ష్మి దేవమ్మ గార్లకు జన్మించారు .వైదికా చార కుటుంబం వీరిది .యజుర్వేదం లో ప్రశిద్ధ మైన శిల్ప శాస్త్ర నిపుణులు .వీరి గోత్రం సువర్ణ రుషి గోత్రం ..శ్రౌతం లోను ,స్మార్తం లోను ,వీరు మంచి అభినివేశం చూపారు .వేదం లో కొన్ని పన్నాలను నేర్చుకొన్నారు .సంస్కృతాన్ని అభ్యశించి కావ్య నాటకాలన్కారాలను అధ్యయనం చేశారు .తర్కం ,వ్యాకరణం శిల్పం ,వాస్తు శాస్తాల లోతులు తరచి చూశారు .ధర్మ శాస్త్రాలను అవలోడనం చేశారు ..వేదాంతాన్ని క్షుణ్ణం గా నేర్చారు .యోగ శాస్త్రం లో వీరి పాండిత్యం గణ నీయం .అది జన్మాంతర సంస్కారం వల్ల లభించినది గా అందరు భావిస్తారు .ఏ శాస్త్రం తీసుకొన్నా దాన్ని ఆసాంతం చదివి, నిష్ణాతులు అని పించుకోవటం వీరి ప్రజ్ఞ
తెలుగు లో కావలసిన జ్ఞానాన్ని స్వయం గా సాధించుకొన్నారు .సంస్కృతం ,తెలుగు లలో అలవోక గా కవిత్వం చెప్పటం అల వాటైనది. యమ,నియమ ,మొదలైన అష్టాంగ యోగం వీరికి అద్భుతం గా అబ్బింది .గాయత్రీ మంత్రానుష్టానం తో కూడిన తపస్సు అంటే వారికిమహా ఇష్టం .నియమం తప్పకుండా దాన్ని శ్రద్ధా భక్తుల తో అనుష్టించారు .శక్తులు అలవడి నాయి గృహస్త జీవితం గడుపుతూనే ఉదయమే ప్రారంభించి పదకొండు గంటల వరకు తదేక దీక్ష తో అనుష్టానం చేసే వారు .ఆ సమయం లో ఎవ్వరికీ దర్శనం ఇచ్చే వారు కాదు .అంతటి కఠోర దీక్ష వారిది .వారి దీక్ష కు అందరు ముక్కున వ్రేలు వేసుకొనే వారు
వాస్తు శాస్త్రం మీద వీరికి ఉన్న అపార అభిని వేశంతో వాస్తు విషయాలన్నీ సేకరించి ఒక ఉద్గ్రంధం గా‘’వాస్తుపాఠ సంగ్రహం ‘’రాశారు కాని ఆంధ్రుల దురదృష్టమేమో అది ముద్రణకు నోచుకో లేదు .’’సంస్కృత సంధ్యా వందన భాష్యం ‘’రాసి సంధ్యా వందనం మీద అందరికి అభిరుచి ,,అభినివేశం కల్పించారు .’’విశ్వ బ్రహ్మోపనిషత్తులు ‘’ను సంపాదించి , తెలుగు అర్ధం తో దాన్ని ప్రచురించారు .యజుర్వేదం లోని’’విశ్వ బ్రహ్మ సూక్తాది ‘’మంత్రాలను కొన్నిటికి విశేష వ్యాఖ్యానం రాసి ప్రకటించారు .వీరి ప్రతిభకు దర్పణం గా వెలసిన మహా గ్రంధం ‘’దైవజ్న స్మృతి అనే ధర్మ శాస్త్ర గ్రంధం .‘’..జాన పాటి పట్టాభి రామ శాస్త్రి గారికి ,పంచార్షేయులైన విశ్వ బ్రాహ్మణులకు బ్రాహ్మణత్వం పై గుంటూరు న్యాయ స్థానంలో జరిగిన పండిత వివాదం సందర్భం లో ఆంజనేయ శాస్త్రి గారు అయిదు రోజులు శాస్త్ర వాదం చేసి ,,పండిత సాక్ష్యాన్నిచ్చి ,విశ్వ బ్రాహ్మణ బ్రాహ్మణత్వాన్ని నిరూపించి గెలిపించిన వాదనా సామర్ధ్యం గల శాస్త్ర నిపుణులు .
వీరి రెండవ భార్య సుందరమ్మ గారికి జీవనో పాదుల కోసం అవసర మైన సమస్తాన్ని ఆమెకు యేర్పాటు చేసి ,తన యావదాస్తిని ,ఇంటిని సర్వస్వ దక్షిణ గా విశ్వ బ్రాహ్మణ సంస్కృత పా ఠ శాలకు దానం చేస్తూ మరణ శాసనం రాసిన వదాన్యులు .1914లో 37ఏళ్ళ అతి తక్కువ వయసులో మరణించారు .విశ్వ బ్రాహ్మణ కులానికి ఏడు గడ గా ,వెన్నెముక గా నిలిచి వారి శాస్త్ర పరిజ్ఞానానికి ఇతోధికం గా కృషి చేసి శిల్ప శాస్త్రయోగి గా పేరు పొందారు యల వర్తి ఆంజనేయ శాస్త్రి గారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-11-12- ఉయ్యూరు
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
