స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ

 స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ

   విజయవాడ లో ఈ నెల ఒకటవ తేది నుండి పదకొండవ తేది వరకు 24వ పుస్తక మహోత్సవం జరుగుతోంది .నిన్న అంటే ఎనిమిదో తారీఖు మంగళ వారం సాయంత్రం నేను చూడ టానికి వెళ్లాను .నాకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కొన్న తర్వాత‘’నండూరి రామ్మోహన రావు వేదిక ‘’పై జరిగిన సాహిత్య కార్యక్రమాలను చూశాను .మొదట బాల సాహిత్యం పై జరిగిన సభకు గ్రందాలయోద్యమ వృద్దు శ్రీ వెలగా వెంకటప్పయ్య అధ్యక్షత వహించగా విజయవాడ ఆకాశ వాణి ఇన్చార్జి డైరెక్టర్ శ్రీమతి మున్జలూరి కృష్ణ కుమారి,శ్రీ తుర్ల పాటి కుటుంబరావు  వగైరాలు వక్తలు గా పాల్గొన్నారు .బాల సాహిత్యం అనుకోన్నంతగా రావటం లేదని ,చదివే వారు తగ్గి పోయారని అందరు అన్నారు ..తుర్ల పాటి మాట్లాడుతూ అయిదు సి.లు పిల్లల్ని నాశనం చేస్తున్నాయన్నారు అవి సినిమా ,క్రికెట్ ,చానెల్ ,కంప్యుటర్ ,కార్టూన్ లని చెప్పారు .నేషనల్ బుక్ ట్రస్ట్ అధినేత కూడా సభలో పాల్గొన్నారు ..దీని తర్వాత జరిగిన సభ చిరస్మరణీయం గా ఉంది.

24 వ పుస్తక ప్రదర్సన విజయవాడ

                       సాహితీ మేరువు తిరుమల రామ చంద్ర

            తిరుమల రామ చంద్ర గారి శత జయంతిని పురస్కరించుకొని గొప్ప సభ జరిగింది .దీనికి అధ్యక్షత వహించింది రామ చంద్ర గారి కుమారుడు శేష సాయి గారు .వక్తలుగా రామ చంద్ర గారి అమ్మాయి ఆముక్త మాల్యద ,శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారి కుమార్తె ప్రఖ్యాత రచయితా విశ్లేషకు రాలు సప్త గిరి చానల్ కు ఎన్నో ఎపి సోడ్లులను నిర్మించిన శ్రీ మతి పుట్ట పర్తి నాగ పద్మిని గార్లు .రామ చంద్ర గారి పెద్దమ్మాయిరజని  ని కూడా ఆహ్వానించారు కాని ఆమె రాలేక పోయింది .

           తిరుమల శేష సాయి మాట్లాడుతూ తమ తండ్రి గారు అనుక్షణంసాహిత్యానికి అంకితమై పని చేశారని పొట్టకూటి కోసం ఆయన చేబట్టని ఉద్యోగం లేదని వారి ‘’హంపీ నుండి హరప్పా దాకా ‘’పుస్తకం లో ఆయన కలుసుకొన్న వివిధ వ్యక్తుల ప్రభా వాలను వివరించారని ఎక్కడ వసతి దొరికితే అక్కడ ఉన్నారని కష్టాలకు బాగా అలవాటు పడ్డ జీవితం ఆయనది అన్నారు .ఒక సారి పంజాబ్ లో ఒక సిక్కు గృహస్తు ఇంట్లో రామ చంద్ర బస చేసి నప్పుడు వారు ఆవ  తో చేసిన మిఠాయి ఆయనకు పెట్టారని దాన్ని తిని ఎలా తయారు చేశారో తెలుసుకోన్నారని తాను ఇదివరకే ఆవ తో స్వీట్లు చేస్తారని రాసిన దాన్ని గురువు మాన వల్లి రామ క్రిష్నయ్య గారు కాదని ఆక్షేపించారని వెంటనే ఆ ఇంటి వారి నడిగి వారుపెంచిన  ఆవ మొలకలను గురువు గారికి పోస్ట్ లో పంచ్పించారని చెప్పారు .ఏదైనా తనకు కాని కుటుంబ సభ్యులకు కాని కష్టం వస్తే ‘’ఇంకెంతకాలం రా ‘’ఆరు నెలల్లో ‘’అన్నీ సర్దుకుంటాయి రా ‘’అని అందర్ని ఓదార్చే వారని ఆరునెలల గడువు తో ఆయన సంతృప్తి చెందే వారని తెలియ జేశారు .రామ చంద్ర సుమారు 75దాకా పుస్తకాలు రాశారని ,గమ్యం లేని జీవితమే చాలా భాగం గడిపి చివరకు ప్రాకృత భాషా ధ్యయనాన్ని చేసి ఒక సుస్తిర స్థానం సంపాదిన్చుకోన్నారని చెప్పారు .అవన్నీ ముద్రణ పొంది యేన లేని కీర్తిని తెచ్చాయన్నారు ..ఆయన ను ఎవరైనా  ఏది నీకు ఇష్టం అంటే ‘’ఆకలి ‘’అనే వారని ,ఎంత సంపాదించినా ఆ రోజుల్లో వచ్చే జీతాలు కడుపు నింప లేక పోయాయని అందుకనే ఆకలి అనే వారని చెప్పారు .ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీరు కారింది ఈ మాట వింటుంటే ..తామంతా తమిళ దేశం లో నె పుట్టి పెరిగినా తమ ఇంట్లో చక్క గా తెలుగే మాట్లాడుకోవటం తమ తండ్రి గారిచ్చిన సంస్కారం అన్నారు .ఒక తెలుగు బహిరంగ సభలో పాల్గొనడం అందునా తెలుగు లోనే మాట్లాడటం తనకు లభించిన మహత్తర అవకాశం అని పొంగి పోయారు .నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ..సాయి గారు చక్కని తెలుగులో ప్రసంగించి తమ హృదయాన్ని బాగా ఆవిష్కరించారు .

తిరుమల రామ చంద్ర గారి అమ్మాయి శ్రీ మతి ఆముక్త మాల్యద తండ్రి తో తనకున్న జ్ఞాపకాలను నేమరేసుకొన్నారు .రాత్రి ఏ వేళచూసినా రామ చంద్ర గారు ఏదో చదువుతూనో రాస్తూనో కని పించే వారని జీవితం బోర్ గా ఉంటోందని తాము అన్నప్పుడల్లా ‘’బోర్ కే బోర్ కొట్టేట్లు ప్రవర్తిన్చాలమ్మా ‘’అని సలహా చెప్పేవారని చెప్పారు .ఎంత దూరమైనా కాలి నడకనే వెళ్ళే వారని ,వాహనాల్లో వెళ్ళటానికి ఇష్టపడే వారు కాదని అన్నారు .తమ తండ్రి గారి మీద ఇంతటి ఆప్యాయతా ,ఆదరణా ,ఆరాధనా ఇక్కడి వారు చూపిస్తున్నందుకు తామెంతో గర్వ  పడుతున్నామని,అంతటి తండ్రికి సంతానం అయి నందుకు గర్వం గా ఉండని  , చెమ్మగిల్లిన నయనాలతో ఆముక్త మాల్యద అన్నారు .

           శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని అద్భుత ప్రసంగాన్ని చేశారు .తమ ‘’అయ్య’’పుట్ట పర్తి వారిని ,చిన్నయ్య అని తాను ఆప్యాయంగా పిలుచుకొనే ‘’తిరుమల రామ చంద్ర ను తెలుగు సాహిత్యం లో రెండు మేరు పర్వతాలనీ రెండు మహా సాహితీ సిన్దువులని పేర్కొన్నారు .ఇద్దరు జీవితం లో నిలకడ లేని జీవితాలనే గడిపారని రామ చంద్ర గారి తల్లి గారు బంధు జనం ఆయన్ను అతి గారాబం గా ,అతి ప్రేమ గా పెంచారని ,చూశారని అది ఆయనకు వెగటు పుట్టి వారికి దూరం గా వెళ్ళి పోయి స్వతంత్ర జీవనం సాగించారని చెప్పారు .తమ అయ్య దీనికి విరుద్ధం అని ఆయన తల్లి గారు చిన్నతనం లోనే చని పోవటం వల్ల ఆదరించే వారు లేక ఇంటికి దూరమయ్యారని ,స్వేచ్చా , ,విసృమ్ఖలత తో కొంత ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు .నారాయణా చార్యులు గారు కూడా అనేక సాహితీ ప్రక్రియలు చేబట్టి అనేక పోకడలు పోయి ,దేనిలోనూ స్తిరం గా ఉండలేక పోయారని చివరికి భక్తి ఒంట బట్టి దాని అంతు చూశారని తులసీ రామాయణాన్ని రాసి మంచి పేరు తెచ్చుకోన్నారని ,ఆచార్యుల వారి సకలోహ సర్వస్వమే ‘’శివ తాండవం ‘’అని అది వారి ‘’మాగ్నం ఓపస్ ‘’అయిందని దానితో వెనక్కి తిరిగి చూడలేదని ,ఆయన భాషా పాండిత్యం అందరికిరికి అబ్బుర పరచేదని ,పీఠాది పతులప్రశంశాల నందు కొని అనేక భాషలలో అపార పాండిత్యాన్ని సాధించి ‘’సరస్వతీ పుత్రులు ‘’అని పించుకోన్నారని గుర్తు చేశారు .ఈ ఇద్దరు మొదట్లో ను చివర్లోను ఒకే పద్ధతిలో చరించటం యాదృచ్చికం అన్నారు .రామ చంద్ర గారు ఏదైనా కొత్త విషయం కని పిస్తే దాన్ని నేర్చుకొనే దాకా వదిలి పెట్టరని అన్నారు .ఒక సారి కాశీ లో ఒక అస్సామీ ఆయన కలప వ్యాపారం లో మెళకువలు నేర్పుతాను అని చెప్పి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటికి వెళ్ళిన వాడు నేల రోజులకీ పత్తా లేక పోతే ,ఆ నేల రోజులు ఆయన కోసం నిరీక్షిస్తూ తినటానికి తిండి కూడా లేక రెండు పూటలా కడుపు నిండా గంగా జలాన్ని త్రాగి బ్రతికిన పిచ్చి మారాజు చిన్నయ్య అనీ చెప్పారు .ఈ మాట అంటుంటే ఆమె కళ్ళు దారా పాతం గా కన్నీరు వర్షించాయి .అన్నీ తెలుసుకోవాలనే తపనతో ఒక సరి ‘’కొంచెం మందు ‘’కూడా పుచ్చుకోన్నారని,ఇది తెలిసిన గురువు గారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ‘’పెళ్ళాం ,పిల్లా పీచు ,సంసారం ఉన్న వాడివి ,ఇలా సాహసాలు చేస్తే బతుకులు  బజారు పాలౌతాయి జాగ్రత్త ‘’అని హెచ్చరించారని అప్పటి నుండి ఇలాంటి సాహసాలు చెయ్య లేదని గుర్తు చేశారు                    .         

                చిన్నయ్యకు తమ అయ్యగారి ‘’శివ తాండవం ‘’అంటే మహా ప్రీతీ అని అయ్య పాడగా అనేక సార్లు విన్నా తను కనిపించి నప్పుడల్లా తనతో ఒక్క సారైనా పాడించుకోకుండా ఉండే వారు కాదని చెప్పి అందులో నుండి కొంత భాగంఅద్భుతం గా పాడి మంత్ర ముగ్ధుల్ని చేశారు .ఆశైలి అనితర సాధ్యం అని గుర్తు చేశారు .  ఇది వారి సాహితీ మిత్రత్వానికి గొప్ప చిహ్నమని అన్నారు .తిరుమలకు ,పుట్టపర్తి వారికి ఇద్దరికీ విశ్వనాధ సత్యనారాయణ గారు అమిత అరాధ్యులని వారిని గురించి ప్రసంగం లేకుండా వారిద్దరూ ఉండలేరని గుర్తు చేసుకొన్నారు .వారిద్దరి రచనల్లో విశ్వనాధ వారి ప్రస్తావన చాలా చోట్ల కని పించటం విశేషం అన్నారు .విశ్వనాధకు తమ అయ్యకు జరిగే వాదోప వాదాల్లో తమ తల్లి గారు మధ్య వర్తిత్వం వహించటం ,ఆమె తీర్పును వారిద్దరూ గౌరవించటం తనకు తెలుసుననీ అన్నారు .తన రచనలకు రామ చంద్ర ఎంతో సహకారం అందించారని ముఖ్యం గా తుంగ భద్రా నదీ పావనోదకాలలో అనేక ఔషధ గుణాలున్నాయని తాను విని వాటిని వివరించమంటే చిన్నయ్య చక్కగా కూర్చుని తాను రాసుకొన్న నోట్సు దగ్గర పెట్టుకొని బోధించి మార్గ దర్శనం చేశారని ఆ రుణాన్ని తానేన్నటికి తీర్చు కోలేని రుణ గ్రస్తను అని  అన్నారు .అలాగే తాను హిందీ ,తెలుగు రామాయణాల తులనాత్మక పరిశీలన చేసి సీతా దేవి పాత్ర పై ప్రత్యెక ద్రుష్టి తో రిసెర్చ్ రచన చేస్తున్నప్పుడు పుట్ట పర్తి  వారు హిందీ రామాయణాల సారాంశాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి నంతా తేలిగా వివరించి తన శ్రమ తగ్గించారని చెప్పారు .

        శాలి వాహన గాదా సప్త శతి ,బసవేశ్వర పురాణం అయ్యను చిన్నయ్యను గొప్పగా ప్రభావితం చేశాయని ,రామ చంద్ర గారి హంపీ నుండి హరప్పా వరకు అనే జీవిత చరిత్ర రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘’ఓల్గా సె గంగా ‘’కు ఏమా త్రం తక్కువ కాదని ఎన్నో చారిత్రాత్మక ,ఆధ్యాత్మిక సాంఘిక భౌతిక ,రాజకీయ పరిస్తితులను కళ్ళ కు కట్టి నట్లు రాసి, చిన్నయ్య గొప్ప సాహితీ ప్రస్తానం సాగించారని మనల్ని వారితో పాటు తిప్పుతూ ఆ ప్రదేశాలను మనుష్యులను చూపిస్తూ అనుభూతి కలిగిస్తూ విజ్ఞానం పంచుతూ సాగే మహా రచన అని వివ రించారు .చిన్నయ్యకు కనీసం షష్టి పూర్తీ కాని సప్తతి కాని ,సహస్ర మాస చందనోత్సవం కాని జరక్క పోవటం ఎవరూ దానికి పూనుకోక పోవటం  తనకు ఆశ్చర్యాన్ని బాధను కల్గిన్చాయని ఒక  సాహితీ మేరువు కు మనమిచ్చే మర్యాద ఇదేనా ‘అని ఆమె ఏడ్చేసి ప్రేక్షకులకు కన్నీరు తెప్పించారు .ఈ సభలో పాల్గొనడం తన అదృష్టమని బెజవాడ తో తనకు ఎంతో ఆత్మీయ అను బంధం ఉందని చెప్పారు .’’మన లిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’సాహితీ సుగాతుని స్వగతం ‘’‘’మొదలైన తిరుమల వారి రచనలన్నీ ఎంతో లోతైన పరిశోధనా ,పరిశీలన తో రాసిన రిసెర్చ్ వర్క్ లాంటివే నని అవి సులభ శైలిలో రాసి చదువరులకు మనస్సుకు హత్తు కోనేట్లు చేసిన వారి నేర్పుకు జోహార్లు అని ప్రసంగాన్ని గద్గద కంఠం తో ముగించి అందరి ప్రశంశలను అందు కొన్నారు శ్రీ మతి నాగ పద్మిని .నా మటుకు నేను ఒక గొప్ప అను భూతి ని పొందాను .రామ చంద్ర గారన్నా ,పుట్ట పర్తి  వారన్నా అమిత ఆరాధన ఉన్న వాడిని .నాకు గొప్ప మానసికా నందాన్నిచ్చింది ఈ సభ .జనాన్ని కదిలించి రామ చంద్ర పై మహా భిమానాన్ని పెంచి సార్ధక మైంది .ఈ సభలో అమెరికా నివాసి అక్కడ తెలుగు భాషా సంస్కృతులకు సేవ చేసిన తొలి తరం తెలుగు సేవకుడు ,నిత్యం ఏదో రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురిస్తూ హాస్యానికి పెద్ద పీట,వేసినవాడు , తానా ,ఆటా లకు సలహాదారు గా ఉండి వాటి వైభవానికి తోడ్పడుతూ ,తానూ అమెరికా నుండి వచ్చి ఒక సారి హైదరా బాద్ లో ‘’ప్రపంచ తెలుగు సభలు ‘’నిర్వహించి బాపు ,రమణ ల స్నేహ షష్టి పూర్తిని ఆ సభల్లో నిర్వ్హహించి ఘన సన్మానం చేసిన హూస్టన్ నివాసి శ్రీ చిట్టెన్ రాజు కూడా ఉండటం ఆయన నాగ పద్మినిని మనసారా కొనియాడటం ముచ్చటగా ఉంది .ఇండియాలో చిట్టెన్ రాజు గారి కార్యక్రమాలకు చేదోడు వాదోడు గా ఉంటూ తన స్వంత కార్యక్రమాలను చేబడుతున్న శ్రీ వంశీ రామ రాజు కూడా సభలో ఉన్నారు

                         సరస భారతికి ప్రశంశ

         సభ అయి పోగానే నేను నాగ పద్మిని గారి దగ్గరకు వెళ్ళి చాలా గొప్ప స్పూర్తి వంతమైన ప్రసంగం చేశారని అభి నందించి నా పేరు చెప్పగానే ‘’అమ్మమ్మా !మీరా దుర్గా ప్రసాద్ గారు ఎంత బాగా సరసభారతి బ్లాగ్ నిర్వ హిస్తున్నారండీ .నేను ఎప్పుడూ చదువుతూనే ఉంటాను ‘’అని మనస్పూర్తిగా ప్రశంశించి పక్కనే ఉన్న చిట్టెన్ రాజు గారితో ప్రత్యేకం గా ‘’వీరు దుర్గా ప్రసాద్ గారు సరస భారతి అనే బ్లాగ్ ను మహా గొప్ప గా నిర్వ హిస్తున్నారు ‘’అని ఆయనకు చెప్పటం ఆయన ఆనందం గా తన చేతుల్లోకి నా చేతులు తీసుకొని అభి నందించటం నాకు చిరస్మరణీయం .సరసభారతి నాగ పద్మిని గారి లాంటి వారిని అమితం గా ఆకర్షించి అభిమానుల్ని చేసి నందుకు మహదానందం గా ఉంది .మా ప్రక్కనే ‘’ప్రజాసాహితి’’ సంపాదకులు శ్రీ కొత్త పల్లి రవి బాబు ,ఆకాశ వాణి లో నాటక విభాగం లో చాలా కాలం పని చేసి అనేక నాటకాలను నిర్వహించిన శ్రీ పాండురంగ కూడా ఉండి ఆమె పొగడ్తను విని ఆనందించారు .’సరసభారాతికి నిన్న ఒక చారిత్రాత్మక మైన రోజు అని భావిస్తూ –సెలవ్

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.