నాదారి తీరు -5 శ్రీ శైల సందర్శనం –టీచర్ ట్రెయినింగ్ -సైన్సు మేస్టర్ గా ఉద్యోగం

నాదారి తీరు -5

         శ్రీ శైల సందర్శనం –టీచర్ ట్రెయినింగ్ -సైన్సు మేస్టర్ గా ఉద్యోగం

                   రాజమండ్రి ట్రెయినింగ్   

  బందరు హిందూ కాలేజి ,విశాఖ మెడికల్ కాలేజీ లలో దిమాన్స్త్రేటర్ ఉద్యోగాలతో 1962 వరకు సరి పోయింది . రాజ మండ్రి ప్రభుత్వ ట్రేయినింగ  కాలేజి లో చేరటానికి అప్లికేషన్ పెట్టాను సీటు వచ్చింది .సైన్సు లెక్కలు తీసుకొన్నాను .ఆయేడాదే షార్తెండ్ బి.యి.డి.కూడా వచ్చింది హాస్టల్ లో ఉన్నాను చాలా సరదాగా గదడి చింది నా రూమ్ మేట్ రెడ్ది గారు గుంటూర్ జిల్లా వాడు నాకంటే పెద్ద వాడు సరదాగా ఉండే వాడు నాగేంద్ర నాద్ అనే కాకినాడ కుర్రాడు నేను బాబాయ్ అని పిలుచుకొనే వాళ్ళం .ఏం.ఏ.పాల్ పొట్టమీద పాడుకొనే వాణ్ని నీల కంఠం ,అమరావతికి చెందిన సుబ్బారావు గారు చందోలుకు చెందిన వేదాంతం కృష్ణ మూర్తిఅనే విష్ణ్వాలయ అర్చకుడు , పిట్ల వాని పాలానికి చెందినా సుబ్బయ్య అనే శివాలయ పూజారి బాగా కలిసి ఉండే వాళ్ళం కలిసి సినిమాలు చూసి ముచ్చటలు చెప్పుకొనే వాళ్ళం బాబాయ్ అనే ఒకర్నొకరు పిలుచుకొనే వాళ్ళం .నాగేంద్ర మహాదోస్తి .కాలేజి లో విశాలాక్షి అనే అమ్మాయిమల్లంపల్లి  సోమశేఖర శర్మ  గారి మేనకోడలు బాగా పరిచయం . అక్కడ సుబ్బమ్మ అనే అమ్మాయి ని మా వాళ్ళంతా పిన్ని అని నన్ను సరదా చేసే వారు హబిబుల్లా గారు ప్రిన్సిపాల్ .కరెంట్ టాపిక్స్ బాగా చెప్పే వారు .రాజు గారు కొత్తగా వచ్చారు అయన మాకు ఇంచార్జి .బేసిక్ ఎద్యుకేషన్ చెప్పే వారు .వీర భద్ర రావు .లెక్కల హెడ్ ఆయనంటే హడలు దువ్వూరి సూర్యనారాయణ గారు లెక్కలు బాగా చెప్పేవారు ఈయనంటే అందరికి ఆప్యాయత వీరు తర్వాతా బందరు త్రేయింగ్ కాలేజి ప్రిన్సిపాల్ అయ్యారు కలిసి మాట్లాడాం చాలా అనలిటికల్ గా బోధించే వారు .నాని పంతులు గారు చాల తేలిగ్గా ప్రతి దాన్ని తీసుకొనే వారు .స్సిన్సు లో నటరాజ్ అనే అరవాయన గొప్ప పేరు ప్రతిష్టలున్నవారు బాగా చెప్పే వారు అప్పారావు గారు హెడ్ ఆయన్ను ‘’చేమ్బిస్త్రీ ‘’అనే వాళ్ళం ఆయన పాంటు కోటు బాగా నలిగి చెంబుతో ఇస్త్రీ చేసి నట్లున్దేవి .ఒక లేడీ లెక్చరర్ బాగా చెప్పేవారు ప్రాక్టికల్స్ ఆమె చూసే వారు .

       బేసిక్ కాంప్ అని వారం రోజులు రాజు గారు బ్రహ్మాండం గా నిర్వ హించారు .డ్రామాలు ,పాటలు డాన్సులు హడావిడి .నేనూ ఏలూరి పాటి అనంత రామయ్య గారు ప్రతాపరుద్రీయం నాటకం లో యుగంధరుని గా ఆయన కింద సేవకుడిగా వేషంవేశాను . .నేనూ విశాలాక్షీ పాటలు పాడాం  ఆమె చాలా కాలం ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపింది .తన గోడు నాతో వెల్ల బుచ్చుకోనేది ఆమె అక్క వరలక్ష్మి కూడా మా తో ట్రెయినింగ్ అయింది ఇంటికి ఒకటి రెండు సార్లు వెళ్లాను ..అక్కడ ఉండగానే చైనా యుద్ధం రావటం నేను దేశ భక్తీ గీతాలు రాసి ఆంద్ర ప్రభకు పంపటం అవి అచ్చు అవటం జరి గింది అలా గే జాగృతి వార పత్రిక లోనో రాసే వాడిని .రాజ మందరి ఆర్ట్స్ కాలేజి లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్య క్రమాలు జరిగితే దేశం లోని ప్ప్రసిద్ధ కవులు పండితులు ,నటులు కళా కారులు రచయితలు వచ్చారు అక్కడి నుండి మా ట్రెయినింగ్ కాలేజీకి వచ్చారు అందర్నీ ఒక్క చోట చూడటం మరువ లేని అనుభూతి .శ్రీ కాశీ కృష్ణా చార్యులు గారిని కుర్చీలో కూర్చో పెట్టి మేడ మీదకు మెట్ల మీదు గా మోసుకొని వెళ్లాం నా జన్మ చరితార్ధం అని పించింది .రాజు గారు బలే డిసిప్లిన్ మెయింటేన్ చేసే వారు .చివరి రోజు కాంప్ ఫైర్..బాగా జరిగింది నేను రాజు గారిని అభి నందిస్తూ మాట్లాడాను ఆయన తర్వాతా గుడి వాడ కు గెజిటెడ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా వచ్చారు .ఆ రోజులు గుర్తు చేసుకోన్నాం చాలా నిర్దుష్టం గా నిజాయితీ గా ఉండే వారు వివాహం కాలేదు ప్రొమోషన్ రావాల్సిన వారే అకస్మాత్తు గా చని పోయారు సైన్సు ఎక్సి బిషన్ ను న భూతో అన్నట్లు జరిపించారు .హాస్టల్ భోజనం బానే ఉండేది .నాకు ఒక సారి విపరీతం గా బంక విరోచనాలు వారం రోజులు వచ్చాయి డాక్టర్ ను చూపించి మందు వదినా తగ్గలేదు ఇది హాస్టల్ వంతాయన గమనించి నేను సరిగ్గా అన్నం తినక పోవటానికి కారణం అడిగి గసగసాల రసం తీసి ఇచ్చి తగ మన్నాడు వెంటనే కట్టింది .హాయిగా ఉన్నాను పేరయ్య అనే లాయర్ మాతో ట్రెయిన్ అయాడు ఒంగోలు యాస .నేల్లోరు నుండి అప్పారావు ఆయన రూమ్ మేట చాలా బెఫర్వాగా ఉండే వారు సిగరెట్లు బాగా పీల్చే వారు .వీర భద్ర రావు అనే ఆయన డి.యి.వో.సేలేక్తేడ్ కాండిడేట్ మాతో ట్రెయిన్ అయ్యాడు .అందరం ఉదయం హాస్టల్ బావి నీళ్ళు తోడి పోసుకొంటూ స్నానం చేసే వాళ్ళం జాన్ అనే క్రిస్టియన్ ఉండేవాడు .రమణ మూర్తి గారు అనే పెద్దాయన హాస్టల్ కు లీడర్ గా ఉండే వారు చౌదరి పాండురంగారావు ,చెన్నారావు లు మా కృష్ణా జిల్లా మిత్రులు వారు నాతో పాటు త్రేయింగ్ అయి స్సిన్సు మాస్త్రాలు గా చేరి హెడ్ మాస్తార్లయ్యారు చెన్నా రావు లెక్కల వాడు .పాల్ కూడా .నాగేంద్ర సైన్సువాడే సుబ్బయ్య ,సుబ్బారావు సోషల్ .జగన్నాధా చారి లెక్కలు .అతను పశ్చిమ గోదావరి జిల్లా పరిషద్ లో చేరాడు ఒకటి రెండు సార్లు కలిశాడు .కృష్ణ మూర్తి గుంటూరు జిల్లా పరిషద్ .రెండు మూడు సార్లు కలుసుకొన్నాం చందోలుకు ఒక సారి వెళ్లాను పిట్ల వాని పాలెం కు కూడా సుబ్బయ్య ఘంటసాల లో అక్కడంమాయితో వివాహమైతే వెళ్లాను .సుబ్బారావు గారు కొద్ది కాలానికే చని పోయారు .కృష్ణ మూర్తి తో జాబులు జవాబులు చాలా కాలం జరిపాను .

         అప్పడు వరద రావు హోటల్ కు మంచి పేరు టిఫిన్ బాగా ఉండేది పంచవటి అనే హోటల్ లో పేపర్ అట్టు అని చాలా పల్చగా చేత అంత ఉండేది అందరు అక్కడికెళ్ళి అదే తినే వారు వరద రాజు కాఫీ త్రాగే వారు .మార్కండేయ స్వామి దేవాలయ దర్శనం బానే చేసే వాళ్ళం అప్పుడు రైలు గోదావరి స్టేషన్ లో ఎక్కి అక్కడే దిగే వాళ్ళం హాస్టల్ దీనికి దగ్గర గా ఉండేది .గోదావరికి వరదలు వచ్చాయి చాలా భీభత్సం గా వచ్చాయి .గోదావరి ఉధృతాన్ని అప్పుడే చూడటం మొదటి సారి ఆంధ్రా పేపర్ మిల్ చూశాను .

             సాయంత్రం పూట గోదావరి ఒడ్డుకు చేరి కబుర్లు చెప్పుకొనే వాళ్ళం చిన్న పడవ లో లంకలకు వెళ్లి కూర్చుని వచ్చే వాళ్ళం శ్రీ కృష్ణా ర్జున యుద్ధం సినిమా పరీక్షల ముందు వచ్చినా అందరం కలిసి వెళ్లి చూశాం .మంచి మార్కులతో బి యి.డి.పాస్ అయ్యాను .కష్టానికి తగిన ప్రతి ఫలం లభించింది .ఇక ఉద్యోగం వేట .రాజ మండ్రి స్టేషన్ లో అక్కినేనిని ఒక సారి చూశాను

                            శ్రీశైల సందర్శనం

     వేసవి సెలవల్లో గురజాడ ఆయన ,నీలగిరి కాఫీ స్టోర్స్యజమాని శ్రీశైలం వెళ్తూ వస్తారా అని అడిగారు మా అమ్మ తో చెప్పాను .ఆమె బయటికి ఇప్పటి దాకా రాలేదు సరే వెళ్దాం అంది ఆయనే ప్రయాణం ఏర్పాట్లు చేశారు బెజవాడ కృష్ణ లంక లో వారమ్మాయి ఇంటికి వెళ్లి రాత్రి పడుకోన్నాం మర్నాడు ఉదయం గుంటూరు వెళ్లాం అక్కడ దేవస్థానం వారి బస్సు ఒక్కటే అప్పుడు ఉంది దానిలో ఎక్కి ఆయన ఫామిలి మేమిద్దర్సం శ్రీ శైలం వెళ్లాం మా బస్సు లోనే గోపా రాజు రామ చంద్ర రావు గారు అంటే సర్వోదయనాయకులు గో.రా.గారు కూడా ఉన్నారు .ఆయన గురించి అయన అతి వాద  పద్ధతుల గురించి ప్పటికే విని ఉన్నాను .పంచ ,ఉత్తరీయం.చొక్కా లేదు సాదా సీదా గా ఉన్నారు .దిగేదాకా మాట్లాడుతూనే ఉన్నారు .నెహ్రు ఈ మధ్యనే అక్కడికి వచ్చి వెళ్లి నట్లు చెప్పుకున్నారు .శ్రీ శైలం లో మాకు దేవస్థానంరూములు ఇచ్చారు పంతులు గారి  కుటుంబం ఒక గదిలో ,మా అమ్మా నేను ఒక దాన్లో ఉన్నాము .అమ్మ వంట చేసేది మల్లికార్జున స్వామి ధూళి దర్శనం చేశాం .దారిలో శిఖర దర్శనం కూడా చేయించారు .వసతి బాగా ఉంది రెండు పూటలా దైవ దర్శనం .అదే మొదటి సారి నేను రావటం ఒక సారి సాక్షి గణపతి దేవాలయానికి వెళ్లాం .అక్కడి నుంచి ఇంటికి రావటానికి అప్పుడు అంతా చెట్లు ,పుట్టలు దారి తప్పాం దాదాపు అడవి మధ్యలోకి వెళ్లాం .అప్పుడు ఒక చెంచు అతను కనీ పించి మమ్మల్ని సరైన మార్గం లో ప్రవేశ పెట్టాడు .నిజం గా మల్లికార్జున స్వామి యేఆ రూపం లో వచ్చి దారి చూపాడని అమ్మా నేను అనుకొన్నాం ..పాతాళగంగ కు నడిచిమోకాలి లోతు  మెట్లు దిగి కృష్ణా స్నానం ఉదయంపూట చేసే వాళ్ళం .నాన్న గారికి అమ్మ హిరణ్య శ్రాద్దం పెట్టించింది నాచేత .శ్రీ శీలం లో ప్రసాద శర్మ మేస్టారి తమ్ముడు ఇంజినీర్ ఉంటె ఒక రోజు వాళ్ళింటికి వెళ్లాం భోజనం పెట్టి మర్యాద చేశారు .దాదాపు పది రోజులున్నాం .శ్రీ శైలం లో భ్రమ రాంబా మల్లి కార్జున స్వాముల దర్శనం మహానందం గా ఉండేది అప్పుడు కరివేన వారి సత్రం ఉందొ లేదో తెలీదు .

               శ్రీ శైలం నుండి ఘాట్ రోడ్డు మీదు గా మహా నంది వెళ్లాం .గురజాడ వారు అక్కడే ఉండి పోయారు .ఒక గదిలో ఉన్నాం ఇక్కడా వంట చేసుకోవటమే .అక్కడి జలకుండం లో స్నానం దివ్యాను భూతి .అడుగున ఉన్న ఇసుక స్పటికం లా ఉంటుంది సూది వేసినా కనీ ప్పిస్తుంది ఎక్కడో కొండల్లో నుంచి జల ధార ఇక్కడ ఆలయం ముదుకు నంది ముఖం లో నుంచి జాలు వారుతుంది ఆ స్నానం ఒక సారి చేస్తే తృప్తి కలుగదు మళ్ళీ మళ్ళీ రావాలని పిస్తుంది ఆ నీటి తో అరటి ,కొబ్బరి తోటలు వరి పంట పండిస్తారు .మహా నందీశ్వర దర్శనం సర్వపుణ్య ప్రదం .మూడు రోజులు సుమారుగా ఉంది గుంటూర్ మీదు గా ఉయ్యూరు చేరాం .

 

                       కృష్ణా జిల్లా పరిషత్ లో ఉద్యోగం

          ఇంటికి వచ్చే సరికి కృష్ణా జిల్లా పరిషత్ వారు మేమిదివరకే పంపిన అప్లికేషన్లుబట్టి ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిసింది నాతో బాటు ట్రెయినింగ్ పొందిన కొందరు ఉద్యోగాల్లో చేరారు ప్రసాద శర్మ మేష్టారు ఒక రోజు ఇంటికి వచ్చి నాతో వేరే అప్లికేషన్ రాయించి జిల్లా పరిషత్ కు పంపించే ఏర్పాటు చేశారు నాలుగు రోజుల తర్వాతా ఆయనబందరు వెళ్లి నప్పుడు నా పోస్టింగ్ ఆర్డర్లు రెడీ గా ఉంటె ,తీసుకొని వచ్చి నన్ను వెంటనే జాయిన్ అవమన్నారు .అమావాస్య నాడు నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్సు మేస్తర్ గా 19-8-1963 న జాయిన్ అయాను అప్పుడు హెడ్ మాస్ద్తారు తూమాటికోటేశ్వర రావు గారు .చాలా ఆప్యాయం గా ఉండే వారు .నేనంటే మహా గౌరవం గా ఉండే వారు సరుకును బట్టి విలువఇచ్చే మనిషి . .ఆయన అమ్మాయి ప్రభావతి పదోక్లాస్ చదువుతోంది .కొడుకు రామ కృష్ణ ఎనిమిదిలో ఉన్నాడు .

                            ప్రభావతి తో పెళ్లి

                 నాకు మోపిదేవిలో పని చేస్తుండగానే మా అమ్మ చెల్లెలి కూతురు తూటుపల్లి పద్మావతమ్మ ,సూర్య ప్రకాశశాస్త్రి గార్ల కుమార్తె ప్రభావతి తో 21-2-19 64 న ఏలూరు దగ్గర వేల్పు చర్ల లో వివాహం జరిగింది.నా భార్య మా అమ్మ చెల్లెలి మనుమరాలు .మా మేన మామ కుదిర్చిన సంబంధమిది .నేనెవర్నీ పెళ్లి చూపులు చూడ లేదు ఈవిదడని చూడటం,ఒప్పుకోవటం, పెళ్లి జరగటం జరిగి పోయింది .సరిగ్గా ఈ రోజుకు మా దంపతుల వివాహం జరిగి 49 ఏళ్ళు దాటి యాభయ్యవ ఏడాది లో కి వచ్చాం . ‘’మా దంపతుల వివాహ అర్ధ శతాబ్ది ‘’ అన్న మాట .మా వివాహం అజరిగిన కొద్ది రోజులకే శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి కల్యాణాన్ని మా దంపతులతో చేయించారు అప్పుడు మాతో పాటు హైస్కూల్ లో పని చేస్తున్న శ్రీ లోల్లా బాలకృష్ణ మూర్తి గారు అనే సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయులు ఆయన్ను హెడ్ మాస్టర్ తో సహా అందరు ‘’గురువు గారు ‘’అనే వారు .ఆలయం వ్యవహారాలు చూసే వారు వరుసగా నెల రోజులు కళ్యాణాలు జరిపించారాయన .మాకు మొదటిది ఎంతో అదృష్ట వంతులం అను కొన్నాం .అందుకనే ఈ అర్ధ శతాబ్ది వివాహ వేడుక రోజున మోపి దేవి వెళ్లి స్వామిని దర్శించి మా దంపతులం అభిషేకం చేయించాం.పనిలో పనిగా శ్రీ కాకుళం కూడా వెళ్లి శ్రీకకులేశ్వరుని కులేశ్వర స్వామి అయిన ఆంధ్ర మహా విష్ణు సందర్శనమూ చేశాం .ఇవాళ ముందుగా మా సువర్చలన్జనేయ స్వామిని దర్శించే ఈ క్షేత్రాలకు వెళ్ళాం .ఇదో దివ్యాను భూతి అని పించింది

        సశేషం

 

 

               మీ –గబ్బిట దుర్గా ప్రాసాద్ -21-2-2013

.  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.