కధక చక్ర వర్తి ఓ హెన్రి
అద్భుతమైన కధలను రాసి రాసిలోనూ ,వాసిలోను అద్వితీ యడ ని పించుకోన్నవాడు ,కదను అంతం చేయటం లో ప్రత్యెక శైలిని ప్రదర్శించిన వాడు అమెరికా కు చెందిన ఓ హెన్ర్ర్ర్రిఅ సలు పేరు”విలియం సిడ్నీ పోర్టర్ ”.. నార్త్ కెరొలినా లో 1862 లో పుట్టాడు . చిన్నప్పుడే తల్లి చని పోవటం తో తండ్రీ తమ్ముడితో మేనత్త దగ్గ్గ్సరకు చేరాడు . అయిదేళ్ళ వయసు నుండే కధలు రాయటం ప్రారంభించాడు . ”లినా ”అనే ప్రైవేట్ టీచర్ ఇతనికి కధలు చెప్పటం అలవాటు చేసింది . . .ద్రగ్గిస్త్ గా ఫార్మసిస్ట్ గా పని చేశాడు . 1882-84 మధ్య బంధువుల ఇళ్ళల్లో ,స్నేహితుల దగ్గరా గడిపాడు . కార్టూనిస్ట్ గా ,హాస్య రచయిత గా పని చేశాడు . 1884-86మధ్య కాలం లో టెక్సాస్ రాష్ట్రం లోని ఆస్టిన్ లో చిన్న ఉద్యోగం చేశాడు .కధలు రాస్తూనే ఉన్నాడు .
ఆస్టిన్ లో యువకుడిగా పోర్టర్ ఒ. హేన్ర్రి చిత్రం (portrait)
1887-89 కాలం లో ”Athol Estes ”అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు . టెక్సాస్ లోని లాండ్ ఆఫీస్ లో ఉద్యోగించాడు . కొడుకు పుట్టి పోయాడు . కూతురు మార్గరెట్ పుట్టింది . భార్య అనారోగ్యం తో బాధ పడింది . ఉద్యోగం ఊడింది . ఆస్టిన్ లోని ఫస్ట్ నేషనల్ బాంక్ లో ఉద్యోగం వస్తే చేశాడు . బాంక్ లో టే ల్లార్ గా పని చేస్తూ కధలు రాశాడు ,ప్రచురించాడు . ”the rolling stone ” అనే వార పత్రిక నిర్వహించాడు . బాంక్ ఖాతాలలో తేడాలు రావటం వల్ల ఉద్యోగం హుష్ కాకి అయింది . దీనికి కారణం బాంక్ ఉద్యోగం చేస్తూ కధలు రాస్తూ పని పై శ్రద్ధ చూపక పోవటమే . మనిషి చాలా నిజాయితీ పరుడు ,మంచి వాడు ..కొర్తు కేసుల్లో తిరగాల్సి వచ్చేది దీనికోసం .
తర్వాత హూస్టన్ వచ్చాడు . ”హూస్టన్ పోస్ట్ ”అనే పత్రికకు ఎడిటర్ అయ్యాడు .1896లో న్యు ఆర్లియాన్స్ కు చేరాడు . అక్కడి నుండి ”హోండూరస్ ”కు వెళ్ళాడు . బాంకి కేసు ను ముందు మూసేశారు .తరువాత మళ్ళీ తిరుగ దొడారు . అపరాధి అని తేల్చారు ఇతను అప్పీల్ కు వెడితే తిరస్కరించారు . 1898-1900 మధ్య ఒహాయో జైలు లో ప్రిజనర్ నంబర్ 30664 గా ఉన్నాడు . జైలు లోనే పన్నెండు కధలు రాశాడు . పిట్స్ బర్గ్ చేరుకొన్నాడు . 1902 లో తన కధలను ”ఓ హెన్రి ”పేరుతొ రాశాడు సిడ్నీ పోర్టర్. అప్పటి నుంచి ఆ పేరే స్తిరపడి పోయింది . 1903 లో న్యు యార్క్ లోని ”sunday world weekly ”కి 100కధలకు పైగా ఒ్ఎన్రి పేరుతొ రాశాడు . గొప్ప పేరు వచ్చింది . రా సిన వన్నీ మాణి క్యాలే అని పించాయి .
1904 లో ”కాబెజేస్ అండ్ కింగ్స్ ”అనే కదా సంపుటిని వెలువరించాడు . 1906 లో ”the four million ”అనే ఇరవై అయిదు కధల సంపుటి ని ప్రచురించాడు . వీటితో ప్రపంచ ప్రఖ్యాత కదా రచయితా అయిపోయాడు .కధక చక్ర వర్తి అని పించుకొన్నాడు . 1907 లో తన బాల్య స్నేహితురాలు ”సారా లిండ్ సే కోల్మన్ ”అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు . భార్య ,కూతురు తానూ జీవనం సాగించారు . అనారోగ్యం తో బాధ పడుతున్నా ఏడు కదా సంకలనాలు ప్రచురించాడు . 48 సంవత్సరాలే బ్రతికి 1910 జూన్ ఐదో తేదీన ఈ మహా కధకుడు తీవ్ర అనారోగ్యం తో మహా ప్రస్తానం చెందాడు . మొత్తం మీద 300 కధలు రాశాడు .ప్రపంచ ప్రసిద్ధ మహా కధకుల సరసన స్తానం సంపాదించు కొన్న డు ఒ. హెన్ర్ర్ర్రి చని పోయిన తర్వాత కూడా హెన్రి కధలు ,ఇతర రచనలు అయిదు సంపుటాలు గా వేలు వడ్డాయి . ”o.Henri was one of the world’s most popular writers of short fiction ” కనుకనే ఒ. హెన్రి -”ఓహో హెన్రి ”అని పించుకొన్నాడు .
సశేషం —
13-9-2002 శుక్రవారం నాటి అమెరికా డైరీ నుండి
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –13-7-13-ఉయ్యూరు

