రుడ్యార్డ్ కిప్లింగ్
.ఈ పేరు వినగానే ఆయన ప్రసిద్ధ రచన ‘’ది జంగిల్ బుక్ ‘’తప్పక గుర్తొస్తుంది . రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 డిసెంబర్ 30న ఇండియా లోని బొంబాయి లో జన్మించాడు . తల్లి ఆలీస్ ,తండ్రి జాన్ లాక్ వుడ్ కిప్లింగ్ . 1882-87 మధ్య కాలం లో లాహోర్ లో ‘’ది సివిల్ అండ్ మిలిటరీ గెజెట్ ‘’లో పని చేశాడు . తర్వాత అలహా బాద్ లో ‘’ది పయనీర్ ‘’పత్రికకు పని చేశాడు .1888 లో ‘’ఫెయిర్ టేల్స్ ఫ్రం ది హిల్స్ ‘’రాసి ప్రచురించాడు . ‘’అండర్ ది దియోడార్స్ ,’’’’ది ఫాంటం రిక్షా ‘’లను రాసి ముద్రించాడు . 1889 లో లండన్ ,జపాన్ ,అమెరిక లలో పర్య టించాడు . sea to see ‘’రచన పూర్తీ చేశాడు .
1891 లో ‘’life’s handicap ‘’ప్రచురించాడు . దక్షిణ ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ లలో పర్యటన జరిపి మళ్ళీ ఇండియాకు చేరాడు .1892 లో ‘’coroline Balestier ‘’,the naulakkaa ,barrack room and ballads ‘’ప్రచురించాడు .1894 లో కిప్ప్లింగ్ కు గొప్ప పేరు తెచ్చి పెట్టిన ‘’the jungle book ‘’రాసి ముద్రించాడు . 1899 లో అమెరికా చేరాడు . 1900 -08 మధ్యలో ఏడాది కోఆ సారి ఆఫ్రికా కు వెళ్లి వచ్చాడు . 1903 లో ‘’five nations ‘’అనే కవితా సంపుటిని తెచ్చాడు .1907లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందాడు . అతి చిన్న వయసులో ,అందునా ప్రోజు లో నోబెల్ బహుమానం పొందిన మొదటి బ్రిటిష్ రచయిత అని పించుకొన్నాడు . 1913 లో ఈజిప్ట్ వెళ్ళాడు . 1915 లో కొడుకు బల వన్మరణం చెందాడు .1927 లో బ్రెజిల్ వెస్టిండీస్ వెళ్ళాడు 1936 జనవరి 18న లంద్సన్ లో కిప్లింగ్ మరణించాడు .
ఆయన చిత్రించిన చిత్రాలు
రుడ్యార్డ్ కిప్ప్లింగ్ రాసుకొన్న స్వీయ జీవిత చరిత్ర ‘’some thing of my life ‘’1937 లో మరణానంతరం వెలువడింది . కిప్లింగ్ రాసిన ‘’కిం ‘’నవల అతని మాస్టర్ పీస్ అని పేరు పొందింది . ఇది’’epic of the American consciousness ‘’అని పించు కొంది.వాల్ట్ విట్మన్ ,రాసిన లీవ్స్ ఆఫ్ గ్రాస్ ,మేల్విల్లీ రాసిన మోబి డిక్ ,మార్క్ ట్వేన్ రాసిన హకల్ బేరి ఫెన్ లసరసన నిలువ దగిన రచన గా కిప్ప్లింగ్ నవల ‘’కిం ‘’ను యెంచుతారు . ‘’my soul drew one area to the great soul which is beyond all things . I saw nothing for ,I was all things ,having reached the ‘’great soul ‘’.అని ఈ నవలలో కిం చేత కిప్ప్లింగ్ అని పిస్తాడు .అందుకే కిం అనే వాడు కిప్ప్లింగ్ యొక్క భావాలకు సంపూర్ణ ప్రతినిధి అని పిస్తుంది ..ఒక రకం గా ఇది ‘’being and becoming ‘’గురించిన కద . ఇందులో విషయం ,నిర్మాణం కలిసి పోయి ఉన్నాయి . ఆత్మ ను తెలుసుకోవాలనే తాపత్రయం కనీ పిస్తుంది ఇందులో . అందుకే ‘’ఫస్ట్ రేట్ బుక్ ‘’ అంటారు . అస్తిత్వం కోసం అన్వేషణ ఉన్న నవల .రుడ్యార్డ్ ను ఇరవయ్యవ శతాబ్దపు ”బ్రిటిష్ ఇమ్పీరియలిజంకు ప్రాఫెట్ ”అన్నాడు జార్జి ఆర్వెల్ అనే ప్రఖ్యాత విమర్శకుడు కాలాన్ని బట్టి రాజకీయం మార్చాడు కిప్ప్లింగ్ . బ్రిటిష్ ప్రబుత్వ ఆస్తానకవి గా ”కిట్ హుడ్ ”కు ప్రతిపాదనలు చేస్తే తిరస్కరించాడు సున్నితం గా కిప్ప్లింగ్ అనేక వివాదాత్మక విషయాలను ప్రకతిన్చాదాయన .ఇమ్పీరియలిజమ్ అంతమయ్యాక కిప్ప్లింగే అసాధారణ రచయితా అని పించాడు .
కిప్ప్లింగ్ రాసిన జంగిల్ టేల్స్ స్ప్పూర్తితో స్కౌట్ వ్యవస్తాపకుడు బాడెన్ పావెల్”ఉల్ఫ్ క్లబ్స్ ”లాంటివి యెర్పరచాదు.
17-9-2002 మంగళ వారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-13- ఉయ్యూరు






