గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు
మాధవ అనే పేరుగల విద్యారన్యులు శ్రింగేరి పీఠాది పతులు.విజయనగర సామ్రాజ్య సంస్థాపకులుగా కీర్తి గడించారు .హరి హర బ్బుక్క రాయలను ప్రేరేపించి విజయనగర రాజ్య స్థాపన చేసి రాజులను చేశారు .రాజ్య పాలనలో సాలహా లిస్తూ రాజ గురువు అనిపించుకొన్నారు .అందుకే వారికి ‘’కర్నాటక సింహాసన స్థాపనా చార్య ‘’అని పేరు వచ్చింది .ఆయన సాయన శ్రీమతుల కుమారుడు భారద్వాజ గోత్రీకులు .న్యాయ ,వేదాన్తాలపై అద్భుత రచనలు చేసి మార్గ దర్శకం చేశారు .అనంత మహా విజ్ఞాని .వేదాలపై విద్యారణ్య భాష్యం పరమ ప్రామాణికం .విద్యారణ్య విరచిత ‘’దేవ్యపరాద స్తోత్రం ‘’అనన్య సదృశం .అందులో వారి కవితా ప్రభ మహాద్భుతంగా ఆవిష్కరింప బడింది .వారు రాసిన’’ శ్రీ శంకర విజయం ‘’అన్తాకు ముందు వచ్చిన శంకర భగవత్పాదుల చరిత్రలన్నిటినీ పరాస్తం చేసి అనన్య సదృశంగా పరమోత్క్రుస్తంగా ఉంది నేటికీ అందరికీ ప్రమాణ గ్రంధం గా ఉంది .83ఏళ్ళ సార్ధక జీవితం గడిపిన విద్యా రన్య స్వామి 1387లో శంకర సాన్నిధ్యం చేరారు .
విద్యారన్యులు ‘’పరాశర మాదవీయం ..,’’సర్వ దర్శన సంగ్రహం ‘’భారతీయ దేదాంత కరదీపికలు .సర్వేపల్లి రాదా కృష్ణ పండితుడు వీటిని పరామర్శిస్తూ అందులో పదారు రకాలైన సిద్ధాంతాలను క్రమ ఆరోహణ క్రమం లో వివరించారని అవి అద్వైత మత భావ వ్యాప్తికి తోడ్పడ్డాయని తెలియ జేశారు .అవే చార్వాక మతం, బౌద్ధమతం ,జైనమతం ,పూర్ణ ప్రజ్న,నకులీశ పాశుపతం ,శైవం ,ప్రత్యభిజ్న(కాశ్మీరశైవం ),రసేశ్వరం ,వైశేషికం ,అక్షపాదలేక న్యాయం ,జైమినీయం ,పాణినీయం ,సాంఖ్య ,పతంజల యోగం ,ఆది శంకరుల వేదాంతం .సర్వ దర్శన సంగ్రహం లో ఈ పదహారు లేవుకాని వాటి మొత్తం సారం అంతా శంకరాద్వైతం లో నే ఉందని తెలియ జేశారు .ఒక్కొక్కమతాన్ని విడివిడిగా సమీక్షించి వాటి లోని డొల్లతనాన్ని బయట పెట్టాడు .లోకాయత లేక భౌతిక వాదం గురించి ఇంకెక్కడా లేని సమాచారం సర్వ దర్శన సారం లో ఉంది .
విద్యారన్యుల మరోగ్రంధం ‘’పంచ దశి ‘’.అద్వైత వేదాంత సారం అంతా ఇందులో నిక్షిప్తం చేశారు .పది హీను అధ్యాయాల గ్రంధం .వివేక ,దీప ,ఆనంద అనే మూడు భాగాలుగా ఉంటుంది ,’’మాధవీయ శంకర విజయం’’ అనేది సంక్షిప్తశంకర విజయం .ఇది ఆది శంకరాచార్యులైన శంకర భగవత్పాదుల జీవిత చరిత్ర .మీమాంస సూత్రాలకు భాష్యం కూడా రాశారు .పదహారు ఏళ్ళు శృంగేరి పీఠాదిపత్యం నిర్వహించి విద్యారణ్య స్వామి సిద్ధి చెందారు .ఆయనది ఒక శకం .అద్వైతానికి ఆయన ఎత్తిన పతాక .
విద్యారన్యుల వారి తమ్ముడు సాయనుడు మొదటి బుక్క ,రెండవ హరిహరుల మంత్రి .ఆయనకొడుకులు కంపన సంగీత గాయకుడు .మయనుడు కవి .సింగన వేద పండితుడు .సాయన 1378లోచనిపోయాడు . వేదాలపై భాష్యం రాశాడు .’’సుభాషిత సుధా నిధి ‘’లో చక్కని నీతులు చెప్పాడు .పది అధ్యాయాల ‘’అల౦కారసుదానిది’’ రాశాడు .
స్వామి మరో తమ్ముడు భోగనాధుడు రెండవ సంగమ రాజు సమకాలీనుడు .మహా గొప్పకవి .రామోల్లాసం ,త్రిపుర విజయం ,శృంగార మంజరి ,ఉదాహరణ మాల ,మహా గణపతి స్తోత్రం, గౌరీనాధ స్తోత్రం రాశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-15-ఉయ్యూరు
