ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు – గబ్బిట దుర్గాప్రసాద్

1-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్వేజియన్ మహిళ- మీనా ఇందిరా అదంపూర్

నార్వే దేశం లో మీనా ఇందిరా అదంపూర్1987లో జన్మించింది .ఇరానియన్ వంశానికి చెందింది .ఓస్లో లో ఫాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదివింది .తర్వాతా బోడో లో ఓస్లో లో రెండు చోట్లా ఉన్నది .కొంతకాలం పర్సనల్ అసిస్టంట్ గా పని చేసింది .ప్రస్తుతం ఓస్లో యూని వర్సిటిలో మెడిసిన్ తో పాటు లా కూడా చదువుతోంది .

చిన్ననాటి నుంచే మీనా రాజకీయం లో ఉన్నది .16 ఏళ్ళ వయసులో 2003లో అమెరికన్ ఎంబసీ బయట బ్రహ్మాండమైన భారీ యుద్ధ వ్యతిరేక ప్రదర్శన నిర్వ హించింది .ఆ నాటి రివల్యూషనరి సోషలిస్ట్ పార్టీ ‘’రెడ్ ఎలక్ట్రోరల్ అలయన్స్ ‘’లో చురుకైన కార్య కర్తకాకపోయినా అదంపూర్ ను 2007లో జరిగిన స్థానిక ఎన్నికలో అభ్యర్ధిగా ఉండమని ఆ పార్టీ అభ్యర్ధించింది .అంగీకరించి, నిలబడి,గెలిచి సభ్యురాలైంది .నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆ పార్టీ ఆమెనే పోటీ చేయమని కోరినా చేయలేదు .

ఎన్నో రచనలు చేసిన మీనా పత్రికలకు నిత్యం ఏదో ఒక ఆర్టికల్ రాస్తూనే ఉంటుంది .దగ్సా విసేన్ ,క్లాసీ కామ్పెన్ ,ని తిద్ ఉత్రాడ్ మొదలైన మేగజైన్ లలో ఆమె రాసిన వ్యాసాలు ప్రచురింప బడుతాయి .నార్వేజియన్ సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీ వాళ్ళ ఇమ్మిగ్రేషన్ విధానం పై తీవ్రంగా విరుచుకు పడేది .అలాగే ప్రసార మాధ్యమాలు ఇమ్మిగ్రంట్స్ పై చూపుతున్న పక్ష పాత ధోరణిని నిరసించింది .తరచూ అనేక చర్చలలో పాల్గొని నిర్మోహ మాటం గా తన అభిప్రాయాలను తెలియ జేస్తుంది ఈ యువ కిశోరం .
నార్వే రాణి సొంజా క్రౌన్ ప్రిన్సెస్ మెట్టీ మారిట్ లు ఇద్దరూ అదంపూర్ ఇంటికి ప్రత్యేకంగావచ్చి సందర్శించారు .దీనితో ఆమె జాతీయ స్థాయి గుర్తింపు పొందింది .ప్రఖ్యాత రాజకీయ వేత్త కారల్ హెగెన్ ను ఆదంపూర్ తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించింది ఈ వార్త మరీ సంచలం కలిగించి ఆమె గౌరవం ఎన్నో రెట్లు నార్వే దేశం లో పెరిగిపోయింది .నార్వేజియన్ ఇరానియన్ జర్నలిస్ట్ రాజకీయ నాయకురాలు ,రచయిత్రి .చురుకైన కార్య కర్త అయిన మీనా ఇందిరా అదంపూర్ ‘’యూత్ ఎగైనెస్ట్ రేసిజం ‘’యువ నార్వేజియన్ నాయకురాలు .

2- స్వయం సిద్ధ -సొమాలి –నార్వేజియన్ రచయిత్రి –అమల్ ఆడెన్

అమల్ ఆడెన్ ఉత్తర సొమాలియా లో 1983 లో జన్మించింది .నాలుగో ఏటనే తలిదండ్రులను కోల్పోయి అనాధ అయింది .అక్షర జ్ఞానం లేని ఆ బాలిక ఏడేళ్ళు ‘’వీధి బాలిక ‘’గా అతి నికృష్ట జీవితం గడిపి ఆతర్వాత 1996లో ‘’ఫామిలీ రీ యునిఫికేషన్ ‘’ద్వారా నార్వే దేశం చేరింది .కొత్త సంస్కృతీ లో ప్రవేశించిన ఆమె దాన్ని అర్ధం చేసుకొని అలవాటు పడటానికి సమయం పట్టింది .పిల్లల సంరక్షణ సంస్థ మొదలైన ప్రభుత్వ సంస్థలేవీ ఆమె ను ఆదుకోలేదు . నిస్సహాయురాలిగా .గ్రాన్ లాండ్ జిల్లా ఓస్లో నగరం లో మాదక ద్రవ్యాల మధ్య బతుకు ఈడ్చింది .ఆ నగరం రోడ్లమీదే కాలం గడిపిన అభాగ్యురాలు ఆడెన్ .
ఇవాళ ఆమె స్వయం సిద్దగా ఎదిగి సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ లో ఉంటూ పోలీసు స్కూళ్ళకు ,ఇతర సంస్థలకు పారిశ్రామిక వేత్త గా మారింది .మునిసిపాలిటీలకు ,లెక్చరర్ గా సలహాదారు గా ఉంటోంది .ఆమెకు ఇద్దరు కవల పిల్లలు.2002నుండి ఆమె హోనేఫాస్ లో ఉంటోంది

అమల్ ఆడెన్ 2008 లొ మొదటిపుస్తకం రాసి ప్రచురించింది .అప్పటినుంచి నిరంతరం రచనలు చేస్తూనే ఉంది . ఆమెకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు లభించాయి .అందులో ముఖ్యం గా పేర్కొన దగినది ప్రముఖ ఫ్రెంచ్ రచయిత ఎమిలీ జోలా పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని’’ ఇమ్మిగ్రేషన్ –ఇంటిగ్రేషన్ ‘’ సమస్య మీద రాసిన పుస్తకానికి 2010లో అందు కొన్నది . .నార్వేజియన్ ప్రెస్ కంప్లైంట్స్ కమీషన్ లో ఆడెన్ సబ్సి స్ట్యూట్ మెంబర్ గా ఉంటోంది .2013 నుండి డాగ్ ఆగ్ తిద్ వార్తాపత్రికలో క్రమం తప్పకుండా రాస్తోంది ఈ 32 ఏళ్ళ యువ రచయిత్రి .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.