పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’
యువ కిశోరం మహేష్ బాబు కమల హసన్ కుమార్తె శృతి హసన్ జంటగా దూసుకొచ్చిన ‘’శ్రీమంతుడు ‘’సినిమాకు నేను మా మనవడు చరణ్ కిందటి ఆదివారం 6 వ తేదీ మాటనీ కి వెళ్లి ఉయ్యూరు లో చూశాము .బాల్కనీ ఫుల్లు ,కింద సీట్లలో జనం నిల్లు .ఆశ్చర్యం వేసింది .శ్రీమంతుడిని శ్రీమంతులే పోషిస్తున్నారని పించింది . మా దియేటర్ లోపం కొంత ఉన్నమాట వాస్తవం . తెర బూజులు వేలాడుతున్నట్లు కూడా ఉండటం వాస్తవం మాటినీ అవటం మరి కొంత ఇబ్బంది . అయినా మా వూరు కనుక చూశాను .జగపతిబాబు రాజేంద్ర ప్రసాద్ వంటి హేమా హేమీలున్నారు .దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ .కదవండటం డైరెక్ట్ చేయటం కొరటాల శివ .
ఆ వూళ్ళో అభివృద్ధికి అడ్డుపడే ముఠాను ఎదుర్కోలేక తండ్రి జగపతి బాబు బయటికి వచ్చేసి కోట్లు సంపాదించి కొడుకూ తనలాగానే కోట్లు కూడ బెట్టాలని ఆశిస్తాడు. కాని దీనికి వ్యతిరేకం కొడుకు మహేష్ . ఆలోచనలే వేరు .ఇంట్లో ఎవరూ అతన్ని సమర్ధించరు .మరో సోషల్ వర్కర్ శృతి తో కలిసి రూరల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో ఉంటాడు .ఇద్దరూ దగ్గరౌతారు .అకస్మాత్తుగా ‘’దేవర కోట ‘’గ్రామం అధికార దెయ్యాల కోటగా మారి జనం ఏదీ అందకా అన్నీ విలనీ ముఠా చేతికే అందుతుంటే . ఊరు వదిలి వలస పోతూ ఉంటారు . నారాయణ రావు అనే మాస్టారు రాజేంద్రప్రసాద్ అందర్నీ వెళ్ళిపోకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు .కాని ఫలించదు . మహేష్ కి ఈ విషయం తెలిసి గ్రామాన్ని దత్తత తీసుకొని చెక్ బుక్ చేత్తో పట్టుకొని తిరుగుతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సైకిల్ మీద విలాసంగా తిరుగుతూ అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాగా నిమిషాల్లో గ్రామం లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు .రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో గృహకల్లోలాలేర్పడి అందర్నీ ఊరు వదిలి వెళ్ళ వద్దని చెప్పిన వాడే విలనీ దుశ్చర్యలకు ఆగలేక తానూ వెళ్లి పోయే ప్రయత్నం లో ఉంటాడు .అంతకు ముందు జగపతి బాబు వచ్చి ఊరు మారిపోయినా విలన్ల దొంగ దెబ్బ తో గాయపడ్డ కొడుకు మహేష్ ను ఆ వూరు వదిలి పెట్టి తనతో రమ్మంటే వెళ్ళిపోయి .కోట్లు కూడా బెట్టినా మనసులో ఆ ఊరే జ్ఞాపకం వచ్చి మళ్ళీ అందర్నీ ఒప్పించి సమయానికి ఇక్కడికి చేరి గ్రామాన్ని కాపాడతాడు . ఇదీ కద .చంద్రబాబు ఆదర్శానికి రూపం . ఇది చూడటానికి వినటానికీ బాగానే ఉంది .కాని సాధ్యా సాధ్యాలే మనకు ముక్కు మీద వేలు వేయిస్తాయి .
విలన్లు బలవంతులు క్రూరులు .ఆయుధ సంపత్తి ఉన్నవారు. వాళ్ళను ఏ ఆయుధం లేకుండా పాంటు షర్ట్ నలగా కుండా చేతి దెబ్బలతో దెబ్బకి పదిమందిని లేపేస్తూ ,వారిని పీటీ దెబ్బ కొడతాడు మైండ్ బ్లాక్ అయి వాళ్ళు దొంగ దెబ్బ తీస్తుంటారు .వాళ్లకు అదే పని ఇతనికి ఇదే పని . మహేష్ బాబు ఫైట్ చేస్తుంటే కొంగ బకాసురులతో చేస్తున్నట్లనిపించింది .శ్రుతితో కలిసి డాన్సులు చేస్తుంటే రెండు కొంగలు చేస్తున్నట్లుంది నాకు మాత్రం అది దియేటర్ ,లెన్స్ లోపం కావచ్చేమో . సాగదీసి సాగదీసి ‘’రామా రామా రామా ‘’పాట హిట్ చేశాడు దేవిశ్రీ .మరేపాటా మనసుకు పట్టదు. అర్ధవంతంగానూ లేదు .నాకు అనిపిస్తుంది ఇలాంటి హీరోలకోసం మ్యూజిక్ డైరెక్టర్లు మాధుర్యమైన పాటలు చెయ్యకుండా మోత పాటలతో గంతులతో సంగీతానికి చేటు తెస్తున్నారేమో నని .
పేదలకోసం కోట్లాను కోట్లు మంచినీళ్ళ ప్రాయం గా ఖర్చు పెట్టిన హీరో సినిమా చూడటానికి మధ్య ,దిగువ తరగతి ప్రేక్షకులు రాక పోవటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు . శ్రీమంతులే శ్రీమంతుడు ను పోషిస్తున్నారనిపించి బాధేసింది . ‘’తాతా!సినిమా యెట్లా ఉంది?’’అని అడిగాడు హాలు లోంచి బయటికోస్తున్నమామనవడు ‘’ఏముందిరా .రెండుకొంగల ఎగురుడు ,డాన్సు.ఊళ్ళో అందరూ ఎదురు తిరిగి బుద్ధి చెప్పలేక పొతే ఒక బక్క కుర్రాడు బట్టలు నలక్కుండా విలన్లను చితక్కోట్టటం నీ లాంటి వాళ్లకు బాగుంటుంది కాని నాకు కాదు ‘’అన్నాను ‘’తాతా! నువ్వెప్పుడూ ఇంతే .నీకేదీ నచ్చదు. ఏదో ఒక వంక పెడతావు ‘’అన్నాడు .మరి వాడి దృష్టిలో అంతేకదా .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-15-ఉయ్యూరు

