‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -3
24-నార్యోదీరా దుర్బలా భీర వశ్చ-క్వాస్తే భోగో భీత భీతాను తాను
తస్మాద్దేయం నో భయం భీతి హేతో –ర్వాచ్య స్మాకం వర్తి తవ్యం యువాభ్యాం ‘’
తా-ధైర్యం లేని ,బలహీనులు ,భయపడే ఆడవాళ్ళ తో భోగం ఆనందం ఇవ్వదు.కనుక మా భయం పోగొట్టే ట్లు అభయ మివ్వాలి .మామాటకు కట్టుబడాలి .మేము ఒద్దన్నదాన్ని చేయరాదు ‘’
25-‘’యుష్మత్పాల్యే యుష్మ దంగే ప్రభుత్వం -దత్వా తూష్ణీం స్థేయమద్ధా భవాద్భ్యాం
ఇత్యాదిం తాభ్యాం వరౌఘం గృహీత్వా –నాగా వత్తే తద్గ్రుహేషు ప్రవిస్టే’’
తా-మీ రాజ్యాలమీద ,మీ స్త్రీల పైనా మాకు అధికారం ఇచ్చి మీరు సుఖం పొందండి .మాటతప్పరాదు ‘’అనే షరతులు పెట్టగా మూర్ఖ రాక్షసులు డూడూ బసవన్నల్లాగా తలలూపి ఒప్పుకొనగా కన్యలు వాళ్ళ ఇళ్ళకు చేరారు .
26-‘’రాజా మంత్రీ రాగ వంతౌ ప్రియాభ్యాం –సంబద్ధౌ నో పశ్యత స్స్మాం గణ౦ వా
ఉద్యోగిభ్యో దర్శనం భాషణం వా –దూరా పాంతంహంతహంతేశ మాయా ‘’
తా-ఇలా విష్ణు మాయలో పడి కన్నెల కౌగిలి చెరసాలలో బందీలై రాజు మంత్రీ అన్నిపనులూ వదిలేసి అనుక్షణం రతి కార్యం లోనే నిమగ్నులయ్యారు .
27-ఇత్ధం భూతే దైవ యోగా ద్వ్యతీతా –దుర్విజ్నేయా పంచ శత్యబ్ద కానాం
దేవా నిర్బాదా యజ౦తి స్మ యాగం –హృస్టిం పుష్టిం తుష్టి మా సాధ్య సద్యః ‘’
తా-ఈ కామకేళీ విలాసం 500ఏళ్ళు నిరంతరంగా సాగింది .దేవతలు ఈ రాక్షస బాధ లేకుండా యాగం చేస్తున్నారు .యాగ ఫలంగా సంతోషం శారీరక బలం పొందారు .
28-దంతీం ద్రాణాం వా ఘటా మ్ముక్ఛ టావా-తామిశ్రాణాం వా తతిర్వహ్ని కుండాత్
దూమాలి ర్బ్రహ్మండ మా వ్రుణ్వతీ త్వా –భండాస్యా౦తర్గేహమాప్యావవార ‘’
తా-ఏనుగు మందల్లా ,మబ్బుల గు౦పుల్లా ,చీకటి ప్రోవుల్లా హోమ ధూమ స్తోమం బయల్దేరి బ్రహ్మా౦డమంతా వ్యాపించి భండాసురుని అంతః పురం ప్రవేశించింది .
29కేయం మాయే త్యానూ రేశేన పృస్టో-భీతః కశ్చిన్మంత్రి పుత్రో బభాషే
హిమే శైలే సర్ష యో దివ్య వర్గా –ఇస్టిం కుర్వం త్యేషతద్వాహ్ని కేతుః’’
తా-ఇదేం మాయ అని భండాసురుడు అడిగితె ఒక మంత్రికొడుకు హిమాలయం లో మునులతో కలిసి దేవతలు యజ్ఞం చేస్తున్నారని ,యాగాగ్నిని సూచించే ధ్వజమె ఈ పొగ అని చెప్పాడు .
30-శ్రుణ్వన్నేవం సోట్ట హాసం చ కార –హస్తే హస్తం నిష్పి పేషా రుణాక్షః
ఆహ్వా తవ్యామంత్రిణిస్సైని కాంశ్చ-యామీ దానీం నాశ హేతో రరీణాం’’
తా-ఆ మాటలు విన్న వాడు విపరీతపు నవ్వునవ్వి చప్పట్లు కొట్టి కనులెర్రబడగా మంత్రి సైనికాదులనుసమాయత్త పరచి శత్రు నాశనం చేస్తానుఅని బీరాలు పలికాడు . .
31-సంరబ్ధంతం చేత్ద మా భాష మాణం-సర్వాంణ్యంగా న్యాస్ప్రుశం తీశమాయా
సర్వో పాయై ససాద యంతీ స్వమర్ధం –నోయా తవ్యం భీత భీతే త్ద మూచే ‘’
తా-మహా అటో పం తో యుద్ధానికి బయల్దేరిన వాడిని మాయాకన్య భయం నటిస్తూ వెళ్ళవద్దన్నది .
32-‘’నో భేతవ్యం ఘాస కల్పా న్సురేశాన్ –నిష్పిష్యా గంతాస్మి దేవి క్షణేన
నోనో జేతాస్యాంభువీ త్యూచి వా౦సం-ప్రత్యూచే సాసామయ౦ స్మార యంతీ’’
తా-భయపడద్దు . గడ్డిపరకల్లాంటి దేవతల్ని పిండి చేసి క్షణం లో వచ్చేస్తా .ఈభూమ్మీద మమ్మల్ని జయి౦ చేవాడేవ్వడూ లేడు (అజేతా అంటే మమ్మల్ని’’ జయించని వాడు ఉండడు’’-అని మరో అర్ధం ).అని ధైర్యం చెప్పాడు .ఎడబాటును సహించ నట్లునటిస్తూ ఆమె బాధతో
33-‘’ఆద్యే సంగే సంగరో యో భవన్నౌ –విస్మర్తవ్యో నైవ రాజం స్త్వయాద్య
సత్యం నిత్యం సేవితవ్యం తదర్ధం –నస్టౌ విష్ణోస్తౌ మధుః కైటభశ్చ’’
తా-మన మొదటి పొందులో చేసిన వాగ్దానం మరచిపోవద్దు .అసత్యం ఆడటం వలననే మధు కైటభులు విష్ణువు చేతిలో చచ్చారు .
34-‘’కిం కిం వేత్దం వాదినీం తామతీత్య –ప్రాణాపాయే సంగరః కస్త వేతి
సాకం షడ్భిస్సంబలై స్స ప్రతస్థే-భేరీ భాంభా మారవై ర్దిగ్వి భేదం ‘’
తా- నా ప్రాణాల మీదకొస్తే నీ సంగరం(ప్రతిజ్ఞ ) ఏమిటి అని చీత్కరించి ఆరు రకాల సైన్యాలతో యుద్ధానికి బయల్దేరాడు .
35-చాపే బాణోవా ప్రయాతో త్రయాతః –కిం వక్తవ్యం యజ్వనా మంతరాదిం
ఆవ్రుణ్వ న్యజ్నప్రదేశం నిరాశం కాంస్యోవప్రః కస్చిదావిర్బ భూవ’’
తా-బాణం లాగా రివ్వున యజ్న భూమి చేరాడు .దేవతలకు నోటమాట రాలేదు .అప్పుడు యజ్న ప్రదేశం చుట్టూ ఆకాశం దాకా ఒక కంచు కోట ఏర్పడి కాపాడుతోంది .
36-నో బద్ధం నోన్యస్త మేనం నిరీక్ష్య –ప్రాకారం ధైర్యం సమాపుస్సురే౦ద్రాః
రాక్షస్సైన్యం భీత భీతం దదర్శ –భండో భాండం వా పదా హో జఘాన.’’
తా-పెట్టకుండా కట్టకుండా అప్పటికప్పుడేర్పడిన కంచు కోటను చూసి దేవతలు మహర్షులు ఊరట చెంది సంతోషంగా ఉన్నారు .రాక్షసులు కంగారుతో కకావికలైతే ,భండుడు కాలితో కోటను ఒక తన్ను తన్నాడు .
37-తత్పాదా హత్యా విశీర్ణ స్ససాల -శ్చూర్నీ భూతో భూమి మేవ ప్రపేదే
తస్మిన్దేశే హో బతాన్యః ప్రాభూతః –ప్రాదుర్భూతః పూర్వ వత్కా౦స్య సాలః ‘
తా-వాడికాలి తన్నుతో బ్రద్దలై ముక్కలై పొడి పొడి అయిన కోట క్షణం లో అంతకంటే బలీయంగా మళ్ళీ ఏర్పడింది .
38-భగ్నస్సోపి ప్రాదురాశీ త్తదన్య –స్సోపి ధ్వస్త స్తత్పర స్సద్య ఉత్దః
ఇత్ధం భండ శ్చండ విక్రాంతి రుచ్చ్చై-ర్జాతం జాతం తచ్చతం సంబ భంజ ‘’
తా-వీడు కూల్చేయటం,దాని స్థానం లో మరో కోట మొలవటం ఇట్లా నూరు కోట్ల కోటలు కూలటం మళ్ళీ ఏర్పడటం జరిగింది .
39-‘’హీనోత్సాహో హ్రీణఉచ్చైర్విరావం –కుర్వన్నూచే ధీర వద్దైత్య వీరః
భో భో దేవా ఇష్టి మిస్త్వా సమిస్ట్యా-మా గచ్చద్వం వః కృతిం శ్వో బ్రవీమి ‘’
తా-దమ్ము తగ్గిన దానవుడు సిగ్గుపడి అయినా పౌరుషం చావక వికార చేష్టలతో ‘’మీ ఇష్టం వచ్చినట్లు యాగం ఏడవండి .,అప్పుడు నా మీదకు రండి .రేపు మీపని పడతాను ‘’అన్నాడు .
40-‘’ఇత్యాక్రోశ న్సన్నివృత్తః స్వకీయై –స్సాకం స్వంకం కంపయ న్సత్కిరీటం
ప్రాపద్గేహం కామినీ కామ కామా –క్రా౦త స్వాన్తస్చేతన శ్చాప్య నీశః’’
తా-ఆక్రోశం తో అట్టహాసం చేస్తూ సైన్యం తో మన్మధోద్రేకం తో ఇంటి దారి పట్టాడు భండాసురుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు
