ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -160
61—అత్యంత ప్రసిద్ధ ప్రతీకాత్మక హాస్యాత్మక పురాణ నవలా రచయిత-ధామస్ మాన్ -3(చివరిభాగం )
జెర్మనీలో ప్రారంభించిన నాలుగు భాగాల పుస్తకాన్ని పాలస్తీనా ,స్విట్జర్లాండ్ లలో కొనసాగింఛి మాన్ అమెరికాలో పూర్తీ చేశాడు .యాభై వ పడి లో ఒక మ్యూనిచ్ ఆర్టిస్ట్ వచ్చి జీసెస్ కు సంబంధిన ఇతిహాసానికి చిత్రాలు గీయమని ,ముందుమాట రాయమని కోరాడు .పూర్తిగా ధ్యానం తో,అస్థిర ఊహాగానాలతో తానూ బైబిల్ కధలను మళ్ళీ చదివానని ,గోదే చేసిన ’’అతి సాధారణమైన కద చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది అతి తక్కువ లో ఉండిమిగిలినది ఎప్పుడు పూరిద్దామా అనే తహ తహ ఏర్పడింది ‘’అన్నవ్యాఖ్య గుర్తుకొచ్చిందని మాన్ తన ‘’ఎ స్కెచ్ ఆఫ్ మై లైఫ్ ‘’లో రాసుకొన్నాడు .అది తనకు గొప్ప అవకాశమే నని మనిషి మూలాలను వెదికి,అతని సారాంశం ,లక్ష్యాలను తెలియ జేసే మహత్తర కృషి అని అన్నాడు .ఈ జోసెఫ్ పుస్తకానికి బొమ్మలు వేయటానికి 16ఏళ్ళు పట్టింది .మొదటి భాగం ‘’జోసెఫ్ అండ్ హిజ్ బ్రదర్స్ ‘’ఆరేళ్ళతర్వాత 1934లో ప్రింట్ అయింది .ఇదే ఇంగ్లాండ్ లో ‘’ది టేల్స్ ఆఫ్ జాకబ్ ‘’పేరున విడుదలైంది .ఏడాది తర్వాత ‘’ది యాంగ్ జోసెఫ్ ‘’,వచ్చింది తర్వాత ‘’జోసెఫ్ ఇన్ ఈజిప్ట్ ‘’1938లో ముద్రణ పొందింది .’’జోసెఫ్ ది ప్రోవైడేర్’’అనే సంతోషకర భాగం పూర్తిగా అమెరికాలోనే 1944లో రూపు దిద్దుకోన్నది .బైబిల్ కధే అయినా కాలం ,స్థలాలను ఆధునిక దృష్టితో చూపాడు .హాన్స్ కాస్ట్రాప్ లాగా మాన్ కూడా కొత్త అపరి శుద్ధ వాతావరణం లోయువకుడిగా ప్రవేశించాడు .మామూలుగానే యదార్దాన్నీ ప్రతీకల్నీ జోడించాడు .ఇందులో కూడా ఆర్టిస్ట్ ను సమాజం తో అతని పోరాటాన్ని చిత్రించాడు .కలల బేహారి, అందగాడు అయిన జోసెఫ్ ను అతని సోదరులు మోసంచేస్తారు .అతని దార్మికతకు ఈర్ష్యతో బందీ చేస్తే చివరికి విడిపించుకొని మహోన్నతంగా ఎదుగుతాడు .అతని విజయానికి తగిన గుర్తింపు లభించేలోపు ,పూర్వపు ఐతిహాసిక నాయకులలాగానే చనిపోతాడు .జోసెఫ్ అమర ఆర్టిస్ట్ గా విమోచకుడుగా ,ప్రదాత గా ,బాధలను అనుభవిస్తూ నమ్మిన ప్రజలను రక్షించే రక్షకుడుగా మిగిలిపోతాడు .
ఈ నాలుగు భాగాలు విడుదల అవుతున్నప్పుడే మాన్ 1940కి ముందు రాసిన ఫిక్షన్ అంతా అంటే బృహత్ నవలలు కాక మిగిలిన వాటినన్నిటినీ ‘’స్టోరీస్ ఆఫ్ త్రీ డికేడ్స్ ‘’ గా ముద్రించాడు .ఇది కాక గుర్తింపు పొందిన ఫ్రాయిడ్, గోతే , వాగ్నర్ లపై వ్యాస పరమపర అచ్చు వేశాడు .అనేక రాజకీయ పత్రాలను ,’’ది బిలవేడ్ రిటర్న్స్ ‘’ను ,ముసలి గోదే పై ఒక నవల ను చైతన్య స్రవంతి (స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ )లో రాశాడు .ఇది గోదే ఉదయ ధ్యానానికి ప్రతీక .హిందూ నేపధ్యంగా ‘’ది ట్రాన్స్ పోజేడ్ హెడ్స్ ‘’అనే ఫాంటసి ని ,ఒజేస్ ,డేకలాగ్ ల పై ఒక నవలిక ను అల్లాడు .ఇది జోసెఫ్ సాగాకు అను బంధం .73వ ఏట మళ్ళీ గోదే మహాశయుడికి గౌరవాభినందనలు తెలియ జేస్తూ ‘’డాక్టర్ ఫాస్టస్ ‘’రాశాడు .
ఎనభై ఏళ్ళు వచ్చాయి మాన్ కు .’’బ్లాక్ స్వాన్ ‘’రాసి ప్రచురించి అభిమానుల్ని ఆశ్చర్య పరచాడు .ఇదిఒక మధ్య వయసు స్త్రీ జననేంద్రియ (గైనలాజికల్ )కద.ఆమెకు బహిస్టు ఆగిపోయినాక తనకొడుకు కంటే కాస్త పెద్ద వాడైన ఒక యువకుడితో ప్రేమలో పడుతుంది .కలలు కంటుంది .పూర్తీ ప్రేమ పిచ్చిలో పడిన ఆమెకు కేన్సర్ వచ్చిందని తెలుస్తుంది .ఈ అత్యధిక వేదనా భరిత కధను పేరడీ జోడించి రాశాడు .మాన్ తప్పులన్నీ అతని స్టైల్ కు ముడి పెట్టబడి ఉన్నాయి .జర్మనీ సంగీతకారుడు వాగ్నర్ వాద్య ఘోషలాగా మాన్ మాటల ఘోష ఉంటుంది .లేక జార్గాన్ ను మరొక ఆర్ట్ కు జత చేసినట్లు ఉంటుంది అంటారు .రంగు మీద రంగు హద్ది హడ లెత్తి స్తాడు అంటారు .సంక్షిప్తతా ప్రతిభ లేనివాడు మాన్ .చిన్నకధల్లో కూడా లాగుడు స్వభావం జాస్తి .అతని ప్రతీకలూ భారంగా ప్రాముఖ్యంగా ఉంటాయి .నడక మందంగా ఉంటుంది . విడిపోయిన జర్మనీని కలిపే ప్రయత్నం చేస్తూ 1952లో స్విట్జర్ లాండ్ వెళ్ళాడు .అకస్మాత్తుగా జ్యూరిచ్ లో జబ్బు చేసింది .అక్కడే రక్తం గడ్డ కట్టి ఎనభై వ ఏట 12-8-1955న మహా రచయితా మాన్ మహా మానవునిలో కలిసిపోయాడు . .’’ఉత్తమ మానవ సంప్రదాయ దూత ‘’(హెరాల్డ్ ఆఫ్ ది బెస్ట్ ట్రెడిషన్ ఆఫ్ హ్యుమానిటి)గా మాన్ ను అందరూ అభినందించారు .
యాదృచ్చికంగా మాన్ మరణించిన నెల తర్వాత ఆయన ‘’గేయేస్ట్ నవల ముద్రణ జరిగింది .30ఏళ్ళకు పైగా ఈ కద ఆయన మనసులో ఉంది .మరణానంతరం ‘’కన్ఫెషన్స్ ఆఫ్ ఫెలిక్స్ క్రల్,కాన్ఫిడెన్స్ మాన్ ‘’1955లో వచ్చాయి .ఇది వినోదాత్మక నవలగానే కాకుండా అ యుగపు గొప్పసాహస రౌడీ నవల గా గుర్తింపు పొందింది .సగం పారడి ,సగం అపహాస్యజ్ఞానంతో రాణించింది.ఆర్టిస్ట్ యాక్టర్ అడ్వెంచర్ మాత్రమేకాదు ఆయన జీవించిన కాలానికి విమర్శనాత్మక చిత్రం అది .
1929 లో సాహిత్యం లో మాన్ కు నోబెల్ బహుమతినిచ్చారు . డాస్టవస్కి పై రాసిన వ్యాసం లో మాన్ ఫ్రెడరిక్ నీట్స్అనుభవించిన బాధలతో పోల్చాడు .నీట్జే ప్రభావం మాన్ పై చాలా ఉంది .మొదటి ప్రపంచ యుద్ధం లో కైజేర్ విల్హాం కన్జర్వేటిజాన్ని ను బలపరచి లిబరల్స్ పై నిప్పులు చెరిగాడు .కొత్త జర్మన్ వీమర్ రిపబ్లిక్ కు మద్దతు ఇవ్వమని మేధావులను కోరాడు .బీతొవెన్ సంగీతం పై ప్రసంగించాడు .క్రమంగా మాన్ భావాలు లిబరల్ లెఫ్ట్ నుంచి ప్రజాస్వామ్యం వైపు మళ్ళాయి .నాజీయిజాన్ని వ్యతిరేకించమని పనివారలకు ప్రబోధించాడు .నాజీలకు వ్యతిరేకంగా ఎన్నో రేడియో ప్రసంగాలు చేశాడు .దాదాపు 60కి పైగా మాన్ గ్రంధాలు రాశాడు .
Mann’s style is finely wrought and full of resources, enriched by humour, irony, and parody; his composition is subtle and many-layered, brilliantly realistic on one level and yet reaching to deeper levels of symbolism. His works lack simplicity, and his tendency to set his characters at a distance by his own ironical view of them has sometimes laid him open to the charge of lack of heart. He was, however, aware that simplicity and sentiment lend themselves to manipulation by ideological and political powers, and the sometimes elaborate sophistication of his works cannot hide from the discerning reader his underlying impassioned and tender solicitude for mankind.
అన్నది యెన్ సైక్లో పీడియా బ్రిటాన్నికా . Mann demanded “a compact between the conservative culture-idea and revolutionary social thought: to put it pointedly … an understanding between Greece and Moscow.” At the same time he defended the standpoint that one should establish a dialogue between Karl Marx and Friedrich Hölderlin, because a social democracy must go hand in hand with cultural education and the development of society..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు
