— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17
35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్-1
జూడిత్ మార్గేరి టై బెర్గ్ అమెరికాలో కాలి ఫోర్నియా ఆదర్శ ధామం (ఉటోపియ ) అనబడే దియసాఫికల్ సోసైటీ కి కొత్త ప్రపంచకేంద్రం అయిన లోమా లాండ్ లో 16-5-19 02 న జన్మించింది .ఆసోసైటీ కి ప్రపంచాధ్యక్షురాలు కేధరిన్ టి౦గ్లి లోమా లాండ్ ను 1898 లో స్థాపించింది .దీనికి జూడిత్ తలిదంద్రులైన డేనిష్ ఫిలసాఫికల్ దంపతులు మార్జోరి ,ఓలఫ్ టై బెర్గ్ లు సహాయ సహకారాలు అందించారు .1900 లో టింగ్లి ‘’రాజ యోగ స్కూల్ ‘’నుస్థాపించింది .ఆస్కూల్ లో సర్వోన్నత భావనలైన సత్యం న్యాయం విజ్ఞానం విద్యార్ధులకు గొప్పగా బోధించి ఆదర్శ వంతులుగా తీర్చి దిద్దేవారు .బాల్యం నుండి టై బెర్గ్ కు ఆధ్యాత్మిక భావ జాలం ఎక్కువగా ఉండి శ్రద్ధగా నేర్చుకోనేది .మేడం టింగ్లి ఈమెను తన అసలైన రాజయోగినులలో ఒకరు అని మెచ్చుకోనేది .1942 వరకు ఆమె అక్కడే చదివి నేర్చి జీవించింది .అప్పుడే ఆమెకు ప్రముఖ ఓరియెంటలిస్ట్ లు వాల్టర్ ఇవాన్స్ వెంజ్ ,పాల్ బ్రంటన్ లతో పరిచయ మేర్పడింది .
ఫిలసాఫికల్ యూని వర్సిటీలో చదివి జూడిత్ హయ్యర్ మాధమటిక్స్,లాటిన్ గ్రీక్ హీబ్రు జర్మన్ డచ్ ,ఫ్రెంచ్ ,డానిష్ స్వీడిష్ భాషలలో బి ఏ డిగ్రీని ,ఓరియెంటల్ ధాట్ ,ముఖ్య విషయంగా మతం ఫిలాసఫీ లలో ఎం ఏ డిగ్రీ సాధించింది . సేక్రేడ్ స్క్రిప్చర్స్ .,అండ్ యేన్షేంట్ సివిలిజేషన్ లలో బి .ధే,ఎం .ధే.లను బైబిల్ ,కబ్బాల కోణం లో చదివి అందుకొన్నది .1930 లో సంస్కృతాన్ని గోటిఫ్రైడ్ డి పరూకర్ శిష్యరికం లో చదివి సంస్కృతం లో పి .హెచ్. డి.పొందింది .అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ మెంబర్ అయింది . టీన్ ఏజ్ లోనే రాజ యోగ స్కూల్ లో విద్యాబోధన చేసింది .1932 నుండి 35 వరకు అసిస్టంట్ ప్రిన్సిపాల్ గా పని చేసి 1940 లో సంస్కృత ,ఓరియెంటల్ శాఖ కు ముఖ్యాదిపతి అయింది .1935 నుండి 45దియసాఫికల్ యూని వర్సిటి డీన్ఆఫ్ స్టడీస్ గా ,ట్రస్టీ గా సేవలందించింది .దియసాఫికల్ ఫోరం మేగ జైన్ కు 1930 నుంచే అనేక విలువైన వ్యాసాలను రాసి నిర్వహించింది .అందులో ఆమె రాసిన ‘’సేక్రేడ్ టెక్స్ట్ ఆఫ్ ది గుప్త విద్య ‘’అనే వ్యాసం బాగా ఆకర్షించింది .అలాగే ‘’పాసిబిలిటీస్ ఆఫ్ కలియుగ ,హిందూయిజం అండ్ బుద్ధిజం వేర్ ఆర్ యువర్ హాంట్ ఆఫ్ కాన్షస్ నెస్ కూడా ప్రసిద్ధి చెందాయి .డీ పరూకర్ సారధ్యం లో గ్రీకు చైనీఎస్ కబ్బాలిస్టు జోరాస్ట్రియన్ ,హిందూ ,బుద్ధిష్ట్ గ్రంధాలలో దియాసఫీ ,డ్రాయింగ్ ఆధ్యాత్మిక శబ్ద జాలం పై నిఘంటు నిర్మాణానికి జూడిత్ సహకరించింది .అందులో టైబెర్గ్ 2 వేల పదాలను సమకూర్చింది.
మొదటి సంస్కృత రచనలు
టై బెర్గ్ ఋగ్వేదం నుండి ‘’హైమ్స్ టు ది ఆరిజిన్ ఆఫ్ దివరల్డ్ ‘’ ముందుగా రాసింది .1946 లో చార్లెస్ జాన్స్టన్ అనువాద రచన ‘’Crest jewel of Wisdom ‘’ ‘’(వివేక చూడామణి )ను వరుస క్రమం లో అమర్చి ముందుమాట రాసి తన సంపాదకత్వం లో వెలువరించింది .’’విస్డం రెలిజియన్ ‘’కు సంస్కృత కీ రాసింది .ఇందులో మత ,దియసఫికల్ తంత్ర శాస్త్రాలలోని 50 0 సంస్కృత పదాలను సేకరించి కూర్చింది .ఇదే ఆమె సంస్కృత సాహిత్య మందిర నిర్మాణానికి శంకు స్థాపన గా నిలిచింది .అంతవరకూ ఇండియా తో సహా ప్రపంచం లోని మరే దేశం లోనూ ఎవ్వరూ కూడా జూడిత్ లాగా సంస్కృతాన్ని లీనో టైప్ చేసిన వారు లేరు .దియసాఫికల్ యూని వర్సిటి ప్రెస్ లో చీఫ్ లీనో టైప్ ఆపరేటర్ జాఫ్రి బాబోర్కా తో కలిసి ప్రాచీన దేవనాగర లిపి కి మొదటి సారిగా కీ బోర్డ్ తయారు చేసింది .దీనికోసం కొన్ని డజన్ల మాత్రికలు (మాట్రిక్స్ ) ఉపయోగించింది .సంస్కృత పదాలలో ఆధ్యాత్మిక అర్ధం గోచరిస్తుంది.మానవ మనస్తత్వ పరిణామంగా ప్రపంచ స్థితిని వ్యక్త పరచేవిగా ఉంటె వీటి ఇంగ్లీష్ పదాలు తప్పుడు అర్ధం లో మూఢత్వాన్ని సూచి౦ చేవిగా అసలైన అర్ధాన్ని తెలియ జేసేవిగా ఉండవు .1941 లో టై బెర్గ్ తన లీనో టైప్ తో ‘’ఫస్ట్ లెసన్స్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ‘’మొదటి ముద్రణ చేసింది .ఇది 1851 లో జేమ్స్ బాల౦టైన్ తయారుచేసిన గ్రామర్ కు ఇది రివిజన్ .దీన్నిలోవా స్టేట్ యూని వర్సిటి కి చెందిన లారెన్స్ ఏ వేర్ తో కలిసి రూపొందించింది .జీవితకాలం దీన్ని మూడు సార్లు మార్పులు చేర్పులూ చేసి 1950 ,1961 ,1977 లలో ప్రచురించింది .
శ్రీ అరవి౦దులతో సమావేశం
19 4 6 లో కాలిఫోర్నియా దియసాఫికల్ సొసైటీలో అభిప్రాయ భేదాలు రావటం తో జూడిత్ డీన్ ,ట్రస్టీ పదవులకు రాజీనామా చేసింది . దక్షిణ కాలిఫోర్నియా యూని వర్సిటిలో కొంతకాలం బోధన చేసి కాలిఫోర్నియా లోని గ్లెండేల్ లో సంస్కృత కేంద్రాన్నీ ,బుక్ షాప్ ను ప్రారంభించింది .దీనిలో భారతీయ ఫిలాసఫీ ,మతం భాషలు ,సంస్కృతులను బోధించింది .యూని వర్సిటీలలో ,వివిధ సంస్థలలో ఉపన్యాసాలిస్తూ తన గౌరవాన్ని ,వివిధ భాషా వేత్తలతో పరిచయాలను బాగా పెంచుకొన్నది .1946 లో ఇండియాలోని బెనారస్ యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా ఉన్న డా సర్వేపల్లి రాధాకృష్ణన్ అమృత గంగా ప్రవాహ ఉపన్యాసాన్ని సదరన్ కాలి ఫోర్నియా లో విని ,ప్రభావితురాలై బెనారస్ హిందూ యూని వర్సిటి లో సంస్కృత రిసెర్చ్ స్కాలర్ గా చేరటానికి దరఖాస్తుపంపుతూ ‘’సంస్కృత భాషలోని మహోన్నతః వేదాంత మత విషయాలను వ్యాప్తి చేయటానికి ,ఈ భావనలతో పాశ్చాత్యుల ఫిలాసఫీ పై అసలైన,సంపూర్ణమైన దివ్య కాంతి ప్రసరింప జేయటానికి జీవిత మంతా త్యాగం చేస్తాను ‘’అని తెలియ బరచింది .తన కొద్ది జీతం ,లెక్చర్ల వలన సంపాదించిన కొంచెం సొమ్ము తో అతి సాధారణ జీవన విధానం తో ‘’ నిస్వార్ధంగా పనిలోనే అభి వృద్ధి ఉందని నమ్మి ముందుకు సాగే వారికి సహాయం తప్పక లభిస్తుంది ‘’అని నమ్మి ముందడుగు వేసింది .బెనారస్ యూని వర్సిటిలోని ‘’ఓరియెంటల్ విభాగం ‘’లో మూడేళ్ళ స్కాలర్షిప్ తో పాటు ‘’ఆలిండియా ఆర్య ధర్మసేవా సంఘం ‘’లో గౌరవ సభ్యత్వం కూడా లభించింది .
1947 జూన్ లో బెనారస్ యూని వర్సిటి లో చేరి ,ఎం ఏ .కు ‘’ వేద మత మంత్రాల ‘’ను ధిసీస్ విషయంగా ఎంచుకోన్నది .మానవాళి అత్యున్నత పవిత్ర గ్రంధాలపై 25 ఏళ్ళ అధ్యయనం ,17 ఏళ్ళ సంస్క్రుతాధ్యయనం చేసిన టై బెర్గ్ కు వేద ప్రాచీనత ,ప్రామాన్యతపై ఇంకా తెలియాల్సిన లోతైనమహత్తర విషయాలెన్నో ఉండి పోయాయని ,వేదాలపై పాశ్చాత్యుల అభి ప్రాయాలన్నీ ‘’నాన్సెన్స్ ‘’అనీ అన్నది .కాని ఆమె తీసుకొన్న విషయానికి మార్గ దర్శకం చేసే వారెవరూ ఆసమయం లో లభించకపోవటం వలన పాపం ఆమె పరిశోధన అంశాన్నే మార్చుకోమని సలహా ఇచ్చింది బెనారస్ హిందూ యూని వర్సిటి .
ఈ విషయం తెలిసినప్రొఫెసర్ అరవింద బసు ఆమెను కారిడార్ లోకి తీసుకొని వెళ్లి ఆమెతో ఆమెకు మార్గ దర్శకత్వం చేయగల మహితాత్ముడున్నాడని ,అప్పటికి ఇంకా ప్రచురింపబడని ,వ్రాత ప్రతిగానే ఉన్నఅప్పటికే విప్లవ రాజకీయాలనుండి విరమించుకొని ,అనేక మార్మిక భావాల ప్రభావితుడై పాండి చేరిలో ఆశ్రమం స్థాపించి ఉంటున్న శ్రీ అరవిందుల రచన ‘’ది సీక్రెట్స్ ఆఫ్ వేద ‘’ను ఆమె కిచ్చాడు .ఆ రాత్రి అంతా దాన్ని తదేక దీక్షతో చదివి జూడిత్ టై బెర్గ్ మర్నాడు ఉదయం బసు ను కలిసి ‘’సత్యాన్వేషణ లో నాకు సరైన మార్గమే లభించి,నా జీవిత ధ్యేయం నెరవేర బోతోంది ‘’అన్నది. ఆయన సలహాపై అరవిందుల దర్శనానికి అనుమతి కోరుతూ జాబు రాసింది .
పాండిచేరి అరవిందాశ్రమం నుండి ఆమెను రెండు నెలలు ఆశ్రమం లో గడపటానికి అనుమతి రాగా 1947 శరదృతువు కాలం లో వెళ్లి నవంబర్ 24 న అరవిందుల నాలుగు రోజుల ఏకాంత వాస దీక్షా విరమణ రోజులలో ఆయన దర్శనం చేసి అక్కడే అందరి చేత’’ మదర్ ‘’ అని పిలువడే ఫ్రెంచ్ దేశీయురాలు మిర్రా ఆల్ఫస్సా తో పరిచయం పొంది,ఆధ్యాత్మిక అనుభూతికి లోనై తనలో ఏదో విద్యుత్ శక్తి ప్రవహించి ‘దైవత్వ భావన ‘’కలిగింది .అప్పుడే ‘’నా ఆత్మ స్వరూపం ఏమిటో తెలిసింది ‘’అని చెప్పింది .రహస్యంగా మదర్ ను కలిసి తనకు ఆధ్యాత్మిక నామం ప్రసాదించమని కోరగా అరవిందులు అనుగ్రహించి ‘’జ్యోతి ప్రియ ‘’(కాంతి ప్రేమికురాలు )నామం ప్రసాదించారు
బెనారస్ తిరిగి వచ్చి తన చదువు కోన సాగిస్తూ సంస్కృత హిందీ పాళీ ,గీత ,ఉపనిషత్తులు ,బ్రహ్మ సూత్రాలు వేదం లోని వేదాంత విషయాలు ఆధునిక భారతీయ ఆలోచనలు పై ఎం ఏ కోర్సు చదివి,1949 మార్చి లో ‘’భారతీయ మతం ,తత్వ శాస్త్రం ‘’లో ఫస్ట్ క్లాస్ ఎం ఏ డిగ్రీ పొందింది .ఈ విషయం మాతారవి౦దులకు కృతజ్ఞతా పూర్వక లేఖ రాసి తెలియ జేసింది .
ఎందరో భారతీయ తత్వ వేత్తలు ,యోగ మాస్టర్లు టైబెర్గ్ కున్న భారతీయ భావాలకు అవగాహనకు ,భారతీయ సంస్కృతిపై ఉన్న మక్కువకు ముక్కున వేలేసుకొని ఆశ్చర్య పోయి హృదయ పూర్వకం గా అభినందించారు .మహాత్మా గాంధి ,మౌలానా ఆజాద్ ,జి గోకక్ ,బి ఎల్ ఆత్రేయ ,ఆనందమయి మా ,రమణ మహర్షి శ్రీ రామ దాస్ ,కృష్ణ ప్రేమ ,అరవిందాశ్రమం లో కపాలి స్వామి ఇంద్ర సేన్, శిసిర్ మిత్ర ,పృథ్వి సింగ్ ,స్వాతంత్ర సమార యోధులు నళినీ కాంత గుప్త ,ఏ బి పురాని వంటి ప్రముఖులు ఎందరో జూడిత్ నుమనస్పూర్తిగా ప్రశంసించి ఆశీర్వదించారు .ఆమె అరుణాశ్రమం వెళ్లి రమణ మహర్షిని దర్శించి ఒక వార౦ అక్కడ ఉన్నది .మహర్షి ఆమెతో ‘’నీకు ఇది వరకే అంతా తెలుసు అని నీకు తెలియదు ‘’అన్నారు .స్వామి శివానంద తో ఆమె కు ఆధ్యాత్మిక సత్సంబంధ ఉంది .ఆయన ప్రేరణతో 1948 లో జరిగిన ‘’వరల్డ్ యూని వర్సిటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ‘’కు భారత దేశం తరఫున ప్రాతి నిధ్యం వహించింది .రాధాకృష్ణన్ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్టడీస్ యూనియన్ ‘’కుమొదతిఅధ్యక్షు రాలై ఆయన చేత ‘’అంతర్జాతీయ అవగాహనకు జూడిత్ అసలైన శక్తి ‘’అని ప్రశంస పొందింది .ప్రొఫెసర్ టి ఆర్ వి మూర్తి ‘’నువ్వే ఇప్పుడు ప్రాచ్య పాశ్చాత్య .ఆధ్యాత్మిక భావ సమైక్యాన్ని సాధించగల సర్వ సమర్దు రాలవు అనే నమ్మకం కలిగింది ‘’అన్నాడు .
1949 శిశిరం లోమళ్ళీ పాండిచేరి వెళ్లి ఆరునెలలు అరవిందుని అంతే వాసినిగా ఉన్నది .ఇండియాలో ఉన్న రెండేళ్ళ కాలం లో అమెరికాలోఉన్న ఆధ్యాత్మిక అన్వేషకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉంది .కొందరు దీన్ని యోగాకు విరుద్ధం అని విమర్శించగా మదర్ ను సలహా అడిగింది .’’నీ లాంటి వారు ప్రజలతో కలిసి పని చేయక పోతే భగవానుని దైవీ భావనలు ఎలా వ్యాప్తి చెందుతాయి ?’అయినా నువ్వు చాలాకాలం క్రితమే నీ మార్గాన్ని ఎంచుకొన్నావు ‘’అని సమాదానమిచ్చింది మదర్ .1950 ఫిబ్రవరి 21 న చివరి సారిగా శ్రీ అరవి౦దులను దర్శించి తన అనుభవాన్నిఈ విధంగా రికార్డ్ చేసింది ‘’ Vast deep calm with a mighty wisdom … his consciousness seemed infinite … such currents!”[27]
‘ సశేషం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-18-10-16 –ఉయ్యూరు
