గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
352-స్యేన సందేశకర్త -వయాస్కార ఆర్యన్ నారాయణన్ మూస్ (1841 – 1902)
1841లో జన్మించి 1902 లో మరణించిన వయాస్కార ఆర్యన్ నారాయణన్ కేరళ నంబూద్రి కుటుంబానికి చెందినవాడు .అష్టవైద్యన్ బిరుదుపొందిన ఈకవి ‘’స్యేన సందేశం ,నక్షత్ర వృత్తావలి ,చిత్ర ప్రబంధాలు రాశాడు
353-వ్రతారాధన మాల కర్త -వల్లాన సేరి వాసున్ని మూసద్ (1855 – 1914)
1855 లో పుట్టి 1914 లో 59 వ ఏట మరణించిన వల్లాన సేరి వాసున్ని మూసద్ కేరళ నంబూద్రి కుటుంబం వాడు .విజ్ఞాన చింతామణి ‘’సంస్కృత పత్రిక నడిపాడు .ఈయన రాసిన గ్రంధాలలో వ్రతారాధన మాల ,,సంస్కృత పాఠావలి ,శ్రీ పాదాది కేశ పఞ్చా0గి క ,మాయాస్తవం ,మాన విక్రమ సామూత్రి మహా రాజా చరితం మొదలైనవి ఉన్నాయి .
354-కుల శేఖరీయం కర్త -ఇంచూర్ కేశవన్ నంబూద్రి (1855 – 1932)
కేరళ నంబూద్రి బ్రాహ్మణుడైన ఇంచూర్ కేశవన్ నంబూద్రి1855 లో తిక్క వరూర్ దేశం లో పుట్టి 87 ఏళ్ళు జీవించి 1932 లో మరణించాడు .ఇతని కులశేఖరీయం వీదువంశ చంపు ప్రసిద్ధమైనవి .
355-నివాపాంజలి కర్త -అచ్యుత వాసుదేవ మూసద్ (1895 – 1959)
అచ్యుత వాసుదేవ మూసద్ 1895 లో జన్మించి 1959 లో 69 వ ఏటా చనిపోయాడు .పుఞ్ఞసిరి నంబి శిష్యుడు ,నివాపాంజలి ,మరక్కాధా నాలుక రాశాడు ..
356-ఆమ్నాయ మతానాం కర్త -యెర్కార రామన్ నంబూద్రి (1898 – 1983)
1898 లో జన్మించి 85 ఏళ్ళు జీవించి 1983 లో చనిపోయిన యెర్కార రామన్ నంబూద్రి వేద వేదాంగాలలో నిష్ణాతుడు . అనేక సోమయాగాలు అతిరాత్రాలు నిర్వహించిన ఘనుడు .ఆమ్నాయ మతానాం ,శ్రౌత కర్మ వివేకం గ్రంథ కర్త . 32రోజుల పౌండరీక యజ్ఞం లో సుప్రసిద్ధుడు . 1942-43 లో గురువాయూర్ లో ‘’మురహోమం ‘’దగ్గరుండి జరిపించాడు .సంస్కృతం శాస్త్రాలలో ఆయన పాండిత్యం అపారం .ఒకసారి ‘’కౌశికీయత బ్రాహ్మణం ‘’గడగడా అప్పగించి అందర్నీ ఆశ్చర్య పరచాడు . 1970 లో తిరుపతి దేవస్థానం ఆహ్వానం పై వెళ్లి దీన్ని చదివి రికార్డ్ చేయించాడు .దీంతో జాతీయ ,అంతర్జాతీయ కీర్తి పొందాడు .శ్రౌత స్మార్తాలలో భారత దేశం లో ఆయనదే తుది తీర్పుగా ఉండేది . భారత రాష్ట్రపతి ప్రశంసా పత్రం తోపాటు ‘’వేదార్ధ రత్న ‘’వంటి బిరుదులెన్నో పొందాడు . 22ఏళ్ళ వయసులో శ్రీమతి పార్వతిని వివాహమాడి 4 గురుకుమారులు 5 గురు కుమార్తెలను ఈ దంపతులు సంతానంగా పొందారు . జీవితకాలం లో 99 యాగాలు స్వయంగా చేసి అనేక యాగాలు ఇతరులతో కలిసి నిర్వహించిన యజ్ఞ నిర్వహణ దక్షుడు రామన్ నంబూద్రి
20-7-1983 న ఈ కర్మిష్ఠి రామన్ నంబూద్రి 85 వ ఏట వైకుంఠ మందిరం చేరాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా
—

