భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

పుపుల్ జయకర్ ఉత్తర ప్రదేశ్ ఇటావాలో 1915 లో జన్మించింది తండ్రి భారత సివిల్ సర్వీస్ ఆఫీసర్ .ఉదారవాది అయిన మేధావి . తల్లి గుజరాత్ లోని సూరత్ బ్రాహ్మణ కుటుంబస్త్రీ .ఇక్కడే జయకర్ చిన్నతనం కొంతకాలం గడిచింది .తండ్రి ఉద్యోగం వలన కుటుంబం చాలా ప్రదేశాలలో ఉండాల్సి వచ్చి అక్కడి కళా సంస్కృతుల అవగాహన ఆమెకు కలిగింది . 11వ ఏట బెనారస్ వెళ్లి అనిబిసెంట్ స్థాపించిన ధియసాఫికల్ స్కూల్ లో చేరింది .భారత స్వాతంత్రోద్యమం లో బీసెంట్ అనిర్వచనీయ పాత్ర పోషించిందని మనకు తెలుసు .ఆమె నడిపిన ‘’హోమ్ రూల్ లీగ్ ‘’చిరస్మరణీయం . .తండ్రికిఅలాహాబాద్ బదిలీ అయినందున అక్కడ ఆయనకు మోతీలాల్ నెహ్రు తో గాఢ పరిచయమేర్పడి ఆమెకు నెహ్రు కుటుంబం తో సన్నిహితమయి ఇందిరా గాంధీతికి మంచి స్నేహితురాలైంది . 1936 లో లండన్ వెళ్లి బెడ్ ఫోర్డ్ కాలేజీలో చేరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ అయి ఇండియా కు తిరిగి వచ్చి బారిస్టర్ మన్ మోహన్ జయకర్ ను వివాహమాడి బొంబాయిలో స్థిరపడింది .
బొంబాయి లో ‘’ట్రాయ్ కార్ట్ ‘’అనే ఇంగ్లిష్ మేగజైన్ నడిపింది .దీనిలో ప్రఖ్యాత చిత్రఙకారులు జెమిని రాయి ఎఫ్ ఏం హుసేన్ లు చిత్రాలు గీసేవారు .రాజకీయాలలో దిగి 1940 లో ‘’కస్తూరి బాయ్ ట్రస్ట్ ‘’నిర్వాహకురాలు మృదులా సారాభాయ్ కి అసిస్టెంట్ అయింది .తర్వాత ప్రధాని నెహ్రు ఆధ్వర్యం లో ఉన్న ప్లానింగ్ కమిషన్ లోని స్త్రీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీగా ఉద్యోగం పొందింది .అప్పుడే ప్రఖ్యాత దార్శనికుడు జిడ్డు .కృష్ణ మూర్తితో పరిచయమై ఆమె ఆలోచనా సరణినే మార్చేసింది . భారతీయ చేనేత పరిశ్రమ ను పూర్తిగా అవగాహన చేసుకొన్నది .జౌళి పరిశ్రమ మంత్రి ఆధ్వర్యం లో ఆమె మద్రాస్ బీసెంట్ నగర్ లో ‘’వీవర్స్ వె ల్ఫేర్ సెంటర్ ‘’ఏర్పాటు చేసింది .

ఇందిరా గాంధీ ప్రధాని అయ్యాక 1966 లో జయకర్ ను సంస్కృతికసలహారు గా నియమించింది .తర్వాత హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్ లూమ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ ,చైర్ పెర్సన్ కూడా అయింది .ఆ తర్వాత ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డు చార్ పర్సన్ గా మూడేళ్లు పని చేసింది .లండన్ ,పారిస్ ,అమెరికా లలో అనేక నెలల పాటు నిర్వచించబడిన ‘’ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ‘’కు ఆమె సూత్రధారి పాత్రధారి అయి భారతీయ కళా సంస్క్రుతులకు విశ్వ వ్యాప్తి కలిగించింది .ప్రధాని రాజీవ్ గాంధీ కాలం లో ‘’అప్నా ఉత్సవ్ ‘’లకు కూడా ఆమె ప్రధానికి సాంస్కృతిక సలహాదారుగా గా కేబినెట్ మంత్రి హోదా లో ఉన్నది . 1982 లో జయకర్ ‘’ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ‘’కు వైస్ ఛాన్సలర్ అయింది .ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ కు కూడా వైస్ చైర్మన్ గా ఉంది .ఈ పదవులు నిర్వహిస్తూనే ప్రధాని కి భారతీయ సంప్రదాయ ,సాంస్కృతిక వనరుల శాఖకు సలహాదారుగా ఉన్నది .ఇవన్నీ ఆమె సమర్ధతకు భారతీయ కళాసాంస్కృతుల పట్ల జయకర్ కున్న మక్కువ ఆరాధనలు ,వాటిని ప్రపంచ వ్యాప్తం చేయటం లో ఆమె చూపిన చొరవ కృషికి నిదర్శనం .తన స్నేహితురాలు ,ప్రధాని ఇందిరా గాంధీ సూచన మేరకు జయకర్ 1984 లో ‘’ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ హెరిటేజ్ ‘’స్థాపించింది .

బెంగాల్ లోని ‘’హంగ్రీ జెనరేషన్ ‘’అనే సాహిత్య ఉద్యమానికి పుపుల్ జయకర్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ,1961 లో ఆ సాహిత్యకారులు విచారణ విషయం లో గొప్ప సహకారమందించింది .ఇండియా ,అమెరికా ఇంగ్లాండ్ ,లాటిన్ అమెరికా వంటి పలుచోట్ల ఉన్న జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ కు జీవితకాల సేవలు అందించింది .ఆంద్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లా మదనపల్లి లోని ‘’రిషీ వాలీ స్కూల్ ‘’స్థాపన నిర్వహణలో ఆమెది గణనీయ పాత్ర .ఆమె విద్య విజ్ఞాన కళా సాంస్కృతులఆరాధనకు అభినందనగా ఆమె పేర దేశం లో ఎన్నో విద్యాలయాలు వెలిశాయి .

1937 లో జయకర్ మన్మోహన్ జయకర్ అనే బారిస్టర్ ను వివాహమాడిందని ముందే చెప్పుకున్నాం ఆయన 1972 లో చనిపోయాడు వీరి ఏకైక కుమార్తె ‘’రాధికా హెర్ బెర్జెర్ ‘’ రిషీ వాలీ స్కూల్ అధ్యక్షురాలై నిర్వహణ బాధ్యతలు చేబట్టింది .విలువలతో కూడిన విద్య నందించుటయే ఈ విద్యాలయ లక్ష్యం .కృష్ణ మూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యం లో పూనా దగ్గర రాజగురునగర్ లో సహ్యాద్రి స్కూల్ ,వారణాసిలో రాజఘాట్ బీసెంట్ స్కూల్ ,కథక్ డాన్స్ స్కూల్ మొదలైనవి నిర్వహిస్తున్నది

పుపుల్ జయకర్ ‘’జిడ్డు కృష్ణ మూర్తి జీవిత చరిత్ర ‘’ఇంగ్లిష్ లో రాసింది దీనికి మంచి పేరొచ్చింది .మరోపుస్తకం ‘’ఇందిరా గాంధీ -యాన్ ఇంటిమేట్ బయాగ్రఫీ ‘’ కూడా ప్రసిద్ధమైంది .ఇందిరా గాంధీ తనకు ఆపరేషన్ బ్లు స్టార్ వలన ప్రాణగండం ఉందని ముందుగానే ఊహించి చెప్పిందని జయకర్ తెలియ జేసింది .ఆమెరాసిన ఇతర పుస్తకాలు – గాడ్ ఈజ్ నాట్ ఎ ఫుల్ స్టాప్ -కథా సంపుటి ,టెక్స్టైల్స్ అండ్ ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా ,యాన్ ఎర్డ్రెన్ డ్రమ్ ,ది ఎర్త్ మదర్ ,ఫైర్ ఇన్ ది మైండ్ -డైలాగ్స్ విత్ జె.కృష్ణ మూర్తి మొదలైనవి .

పుపుల్ జయకర్ 29-3-1997 న 82 వ ఏట మరణించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.