ఆలంకారిక ఆనంద నందనం -5

ఆలంకారిక ఆనంద నందనం -5

సరసభారతి సాహితీ బంధువులకు ‘’అలంకారిక ఆనంద నందనం ‘’రెండవ ప్రత్యేక సమావేశానికి స్వాగతం . మొదటి సమావేశం అర్ధవంతంగా మీ అందరి సహకారం తో రస సిద్ధాంతకర్త  భరత ముని ,అలంకార ఆవిష్కర్త భామహా ,గుణా విష్కర్త వచన వాచో విధేయుడు దండి మహాశయులు తమ హృదయాలను విప్పి మనకు ఆనందనందన అనుభూతిని కలిగించారు .ఈ రెండవ సమావేశానికి ధ్వని సిద్ధాంతకర్త ఆనంద వర్ధనాచార్యులవారిని ఆధ్యక్షం వహించి తమ సిద్ధాంత వివరణ చేయవలసినది గా ,వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తూ  రీతి సిదాంతకర్త వామనులను ,ఛందశ్శాస్త్ర వేత్త రాజశేఖరులను తమతమ సిద్ధాంతావిష్కరణ చేయవలసినదిగా వేదిక నలంకరించవలసినదిగా  ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాను .

ఆనంద వర్ధనుడు -చాలా మంచి కార్యక్రమం సరసభారతి నిర్వహిస్తున్నందుకు అభినందనలు . నా ధ్వని .సిద్ధాంతాన్ని ఏమాత్రం సవ్వడి అంటే ధ్వని చేయకుండా సావధాన చిత్తులై ఆలకించమనవి ..నేను కశ్యప మహర్షి ప్రదేశం ,శారద దేశం .అయినకాశ్మీర దేశ వాసిని .క్రీశ. 9వ శతాబ్ది ప్రథమార్ధం వాడిని కవితా సౌందర్య రహస్యాన్ని ఆకళింపు చేసుకోవటానికి ఉపయోగపడే ధ్వన్యాలోకం అనే గ్రంధం రాశాను .రసజ్ఞుడనని సాహిత్య విమర్శకులలో ప్రజ్ఞావంతుడనని అంటారు అది అభిమానం తో అనేమాట ..నేను శ్లోక రూపం లో రాసిన వాటిని కా రిక లు అన్నాను  .వీటికి వచనం లో ఇచ్చిన వ్యాఖ్యానాన్ని వృత్తి అంటారు .ఈ రెండిటినీ నేనే రాశాను సందేహం లేదు .బుద్ధి కుశలతో విమర్శించటం ,కవిత్వాన్ని సరిగా అవగాహన చేసుకోవటం కొద్దీ మందికే సాధ్యమైన విద్య అన్నాను ..వ్యాకరణ పాండిత్యం నిఘంటు పరిచయం ఆ సామర్ద్యాన్నివ్వదు . విమర్శ సృజనాత్మక విద్య .విమర్శించే నేర్పు అసాధారణమైనది .నిజానికి ఈ రెండూ ఒకే శక్తికున్న రెండు రూపాలు . ఆదర్శ విమర్శకుడికి భావనాశక్తి అంటే ప్రతిభ ,రసజ్ఞత సామాన్య లక్షణం అందుకనే ఆదర్శ విమర్శకుడిని సహృదయుడు ,రసికుడు అంటారు .కవి కావ్యాన్ని సృష్టిస్తే ,విమర్శకుడు తన భావనా శక్తితో దాన్ని పునర్నిర్మిస్తాడు .కనుక అభిరుచి ఉన్న సహృదయులు మాత్రమే కావ్యాత్మను అవగాహన చేసుకొని దాని అందాన్ని విశ్లేషించగలుగుతారు ..కవితా సౌందర్య చర్చలో వేదాంతులకు స్థానం ,వాదించే అర్హత ఉండదు… అందుకే నా ధ్వన్యాలోకానికి ‘’సహృదయ లోకం ‘’అనే పేరు . .నా తర్వాత ప్రసంగాలు వరుసగా చేయవలసిందిగా వామన ,రాజశేఖర సోదరులను కోరుతున్నాను .

వామనుడు – ఆనంద వర్ధనులు అదక్షతన జరిగే ఈ అలంకారిక సభలో పాల్గొనటం నా అదృష్టం .నేనుకూడా కాశ్మీర శారదా దేవి అనుగ్రహ పాత్రుడనే .7  వ శతాబ్ది వాడిని .ఆయనకంటే సుమారు రెండు శతాబ్దాలు ముందువాడిని . .కావ్యాలంకారం అనే గ్రంధం సూత్ర శైలిలో రాశాను .నేనే దీనికి ;;కవి ప్రియ’’వ్యాఖ్యానమూ రాశాను ఇతరకవులపద్యాలు నా పద్యాలు ఉదాహరణగా ఇచ్చాను గ్రంధాన్ని సంప్రదాయ పద్ధతిలో అధికారణాలుగా విభజించాను ..దీనిలో అయిదు అధికారణాలున్నాయి అధికారణాలను 12అధ్యాయాలుగా విభజన చేశాను .మొత్తం 317 శ్లోకాలున్నాయి ..నేను ‘’రీతి ;;కి ప్రాధాన్యమిచ్చాను .కావ్య శరీరాన్ని గురించి స్థూలంగా చెప్పి అలంకార శాస్త్రాధ్యయనం అవసరాన్ని  దాన్ని చదివి అర్ధం చేసుకోవటానికి కావాల్సిన అర్హతను,సహాయకాల గురించి  చర్చించాను .మొదటి సూత్రం లోనే కవిత్వాన్ని నిర్వచించాను కావ్యం గద్య ,పద్య రూపక భేదంగా ఉంటుంది .కావ్యం అలంకార శోభితమైనప్పుడే రాణిస్తుంది దోషాలు లేకుండా గుణ అలంకారాలు చేరిస్తే కావ్య శోభ పెరోగి సౌందర్య వికసనమవుతుంది .అలంకార శాస్త్ర పఠనం ద్వారానే ఉత్తమ కవిత్వం రాయగలరు .ఉత్తమ కావ్య రచన వలన ఆనందం కీర్తి లభించి ,ప్రత్యక్ష ,పరోక్ష ఫలితాలు లభిస్తాయి .

రాజశేఖరుడు –నేను  ఆలంకారి కుడనే కాక  కవి , నాటక కర్తనూ కూడా . 9వ శతాబ్ది చివరివాడిని ..మా తండ్రిపేరు దుర్దకుడు .కాలచూరి రాజుల మహా మంత్రి . అమ్మపేరు శీలవతి .మాది యాయవారాబ్రాహ్మణ వంశం .అవంతీ సుందరి అనే  విద్యావతి అనేకళ ల లో ఆరితేరిన క్షత్రియ కన్యను పెళ్లి చేసుకొన్నాను .నేను రాసిన కావ్య మీమాంసలో ఆమె అభిప్రాయాలనూ చేర్చాను .కనౌజ్ ప్రతీహార రాజు మహేంద్ర పాలుని ఆస్థానకవిని .రాజు నా శిష్యుడే.  ఆ రాజు కొడుకు మహీపాలుని కాలం లో కవి రాజు నయ్యాను బాల రామాయణం బాల భారతం కర్పూర మంజరి అనే మూడు నాటకాలు రాశాను .కనౌజ్ లో కర్పూర మంజరి ప్రదర్శించాం .కాలకూట రాజు మూడవ ఇంద్రుడు కనౌజ్ ను ధ్వసం చేస్తే త్రిపురి  పాలించే కాల చూరిరాజు మొదటి యువరాజ దేవుడి ఆస్థానానికి తిరిగొచ్చాను  మా  రాజు  రాష్ట్ర కూటు లను ఓడించినప్పుడు నా నాల్గవ నాటకంప్రాకృత0  లో రాసిన  ‘’విద్ధ శాల భంజిక ‘’(కదలని బొమ్మ )ప్రదర్శించారు .నేను అలంకార శాస్త్ర ,ఛందో శాస్త్ర విషయాలపై కూడా ఒక గ్రంధం  ‘’కావ్య మీమాంస ‘’రాశాను కవిత్వానికి సంబంధించిన సకల విషయాలు ఉన్న విజ్ఞాన సర్వస్వము అది .కానీ దురదృష్ట వశాత్తు ఇందులో ‘’కవి రహస్య ‘’అనే మొదటిభాగమే ప్రచురింపబడింది ఇందులో 18 ఖండాలున్నాయి ..

సశేషం

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.