462-21 వ శతాబ్దం లో గీర్వాణ భాషాభ్యసనం లో నవీన విధానాలు – బి .యెన్ .శశికిరణ్ ,హరి రవికుమార్ (జూన్ 2017 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

462-21 వ శతాబ్దం లో గీర్వాణ భాషాభ్యసనం లో నవీన విధానాలు – బి .యెన్ .శశికిరణ్ ,హరి రవికుమార్ (జూన్ 2017 )  (చివరి ఆర్టికల్ )

చిన్మయ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యం లో ‘’సంస్కృతం లో నూతన ఎల్లలు ,భారతీయ విజ్ఞానం ‘’పై 2017 జూన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ బి .యెన్ .శశికిరణ్ ,శ్రీ హరి రవికుమార్ లు సంయుక్తంగా ఒక పరి శోధనా పత్రాన్ని సమర్పించారు .అందులోని ముఖ్య విషయాలు మీ ముందు ఉంచుతున్నాను ..

‘’ ప్రపంచం లో భారత దేశానికి సంస్కృతభాష దైవమిచ్చిన విశేష వరం . అనేక విధాలుగా దాని ప్రత్యేకత ఉంది . వ్యాకరణం లో పాణిని పధ్ధతి  ఉత్కృష్ట మైనది  . భాషకు అది గొప్ప శక్తి సామర్ధ్యాలను చేకూర్చింది . శబ్దోత్పత్తికి దాని తోడ్పాటు చిరస్మరణీయ౦ .  . ఇతర భాషా బోధనా  విధానాలు సంస్కృతానికి నప్పవని ,శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి ,శ్రీ ఆర్ జి భండార్కర్ ,ఎ.ఎ.మాగ్డోనెల్ ,డి .యెన్. షాన్ బాగ్ మొదలైన ప్రముఖులు ,సంస్కృత భారతి ,బెనారస్ హిందూ యూనివర్సిటి ,రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ ,సుర సరస్వతి సభ ,కర్నాటక స్టేట్ ఓపెన్ యూని వర్సిటి ప్రసిద్ధ సంస్థలు ఆధునిక కాలం లో వారి వారి విధానాలలో సంస్కృతం నేర్పుతున్నారు .ఇందులో కొన్ని సత్ఫలితాలనిస్తే ,మరికొన్ని  అంతగా ప్రయోజనం చేకూర్చలేదు .కనుక ప్రాక్ ,పశ్చిమ దేశాలలో సంస్కృత బోధనకు ‘’కావ్య ఆధార విధానం ‘’(కావ్య సెంట్రిక్ అప్రోచ్ )చాలాబాగా ప్రయోజనాన్ని కలిగిస్తుందిఅని అధ్యయనం లో తేలింది .ఇది  సంప్రదాయ విధానం ఆధారంగా ఉన్నప్పటికీ ,ఆధునిక సాంకేతికను సమకూర్చటం తో విశేష ఫలితాలు వస్తున్నాయి .వ్యక్తి  విధానానికి అనుకూలంగా ఉంటూ , నేర్చేవారిని 1-సంస్కృతం తో ఏమాత్రం పరిచయం లేనివారు 2-భారతీయ సంస్కృతి పై అవగాహన ఉన్నా ,ప్రాంతీయ భాషపై అవగాహన లేనివారు 3-భారతీయ భాషా సంస్కృతి ,పరంపరాగత భాష లో  అవగాహనఉండి ఏదోఒక భాష బాగా తెలిసినవారు  4- ఒకప్పుడు సంప్రదాయ పద్ధతిలోనో వేరొక విధానం లోనో నేర్చి ,మరలా దానిపై అభిమానం తో నేర్వాలనుకోనేవారు గా విభజన చేశారు . పైన చెప్పిన  ద్వయం  వీరందరికోసం ఎనిమిదిరకాల భాషాభ్యసన పరికరాలను(లెర్నింగ్ టూల్స్ ) తయారు చేశారు .ఇవి రెడీ మేడ్ దుస్తులు లాగా ఎవరికి ఏది కావాలంటే వారికి అది సరిపోయేటట్లుగా  ఉంటాయన్నమాట .అవేమిటో ఇప్పుడు చూద్దాం –

1-సంప్రదాయ భారతీయ కళా సంస్కృతులపై అవగాహన 2-వివిధ రకాల సంస్కృత శ్లోకాలు వినటం ధారణ చేయటం 3-దేవనాగరి లిపి వర్ణక్రమం తెలుసుకొని రాయటం 4-సంస్కృత కవిత్వం కథలు,నాటికలు వినటం ,తెలుసుకొని అభిరుచి పొందటం  5-వ్యాకరణం ,నిఘంటువుల ను ఉపయోగించి భాషాభివృద్ధి సాధించటం 6-సాంప్రదాయ శిక్షణను ఈ క్రింది 8 విధానాలలోపొందటం –

1-    వాదనం –గురువు చెప్పిన ఒక శ్లోక ధారణ  2-అనువాదనం –అదే శ్లోకాన్నిరెండు సార్లు ధారణ చేయటం .3-పదచ్చేదం –పదాలను విడదీయటం 4-ఆకాంక్ష –శ్లోక భావం అర్ధం చేసుకోవటం 5-అన్వయం –పదాలను వరుసక్రమం లో పేర్చటం 6-వ్యాకరణ విశేషః –శ్లోకం లోని వ్యాకరణ సూత్రాలను గ్రహించి అర్ధం చేసుకోవటం 7-అన్య విశేషః –అలంకారాలు ,ఛందస్సు వగైరా విషయాలు తెలుసుకోవటం 8-భావార్ధం –శ్లోక సారాన్ని గ్రహించి అనుభవింఛి ఆనందించటం . ఇలా 8 పద్ధతులలో  6 వ దైన ‘’సాంప్రదాయ శిక్షణ’’ పొందాలన్నమాట .

 

7-భాషాభ్యసన పరి పుష్టి కోసం పదాలతో సరదాగా ఆటలాడుకోవటం 8-భాషలో అదనపు బలసామర్ధ్యాలు పొందటానికి శ్రేణీయ సాధనాలు (గ్రేడెడ్ ఎక్సర్ సైజెస్ )  చేయటం.

విద్య ర్చేటప్పుడు అన్ని స్థాయిలలోనూ సంస్కృతం మాత్రమే ఉపయోగించాలి .

సంస్కృతం అంటే బాగా పరిశుద్ధం చేయబడిన భాష అని ,చక్కగా కలిపి ఉంచేది అని అర్ధం .అనేక వేల సంవత్సరాలుగా అభి వృద్ధి చెందిన భాష సంస్కృతం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-17 -ఉయ్యూరు

సమాప్తం -17-11-17 –ఉయ్యూరు

— 

విన్నపం -గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవభాగం పై తాజా ఆర్టికల్ తో 462 మంది కవులతో వెలువడుతోంది అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది -దుర్గాప్రసాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.