Monthly Archives: December 2017

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 ) 6-12-19 02 జన్మించిన తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రిగారికి 12 వ ఏట ఉపనయనం జరిగింది .వీరిది తెలంగాణా మహబూబ్ నగర్ గోపాల్ పేట .పానుగంటి ప్రభువుల చేత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 2-దైవ స్తోత్ర ధురీణ –అప్పాల విశ్వ నాథ శర్మ (1927 -2000)-2 (చివరి భాగం )

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 2-దైవ స్తోత్ర ధురీణ –అప్పాల విశ్వ నాథ శర్మ (1927 -2000)-2 (చివరి భాగం ) అప్పాల వారు ‘’శ్రీ క్రష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతి శేఖరం –భావనా బలసంపన్నం భావానంద గురుం భజే ‘’అనే శ్లోకం తో తండ్రిగారైన భావానంద భారతీ స్వామిపై స్తోత్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 (నాలుగవ భాగం ) 1-,ఆంధ్ర-సంస్కృత నిఘంటు కర్త – ‘’ఆంధ్ర బిల్హణ’’- శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి (1911 –1981)9(

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 (నాలుగవ భాగం ) సాహితీ బంధువులకు వైకుంఠ(ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలు – —  మా అబ్బాయి శర్మ గ్రంధ ద్వయ ఆవిష్కరణ సభకు ఉయ్యూరు వస్తూ కెసిఆర్ సభలలో అమ్మకానికి పెట్టిన 15 రూపాయల పుస్తకాలు 5 తెచ్చాడు అందులో సంస్కృత కవుల గురించి ఉన్న పుస్తకాలలో ఇప్పటికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రంధ ద్వయ పుస్తక ఆవిష్కరణ న్యూస్ కవరేజ్

గ్రంధ ద్వయ పుస్తక ఆవిష్కరణ న్యూస్ కవరేజ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ -1

 సరసభారతి ఏర్పడి 8 సంవత్సరాలు దాటి 9 వ  సంవత్సరం లో  ప్రవేశించింది .అన్నికార్యక్రమాల విశేషాలూమీకు ఎప్పటికప్పుడు తెలియ జేస్తూనే ఉన్నాం .8 ఏళ్ళకు నెలకొకటి లెక్కేస్తే 96 కార్యక్రమాలు జరగాలి .కాని ఈ ఆవిష్కరణ సభ 116 వ సభకావటం మరింత ఉత్సాహాన్నిస్తోంది .ఇప్పటికి సరసభారతి ,సువర్చలాన్జనేయ  బ్లాగుల వీక్షకుల సంఖ్య 5 లక్షల … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ-2

    సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ-2 శ్రీ రావెల సాంబశివరావు గారు ,శ్రీ పాపినేని శివ శంకరరావు గారు ,రోజూ అయిదు నిమిషాలు కూడా ఖాళీ ఉండని బిజీ డాక్టర్  అయినా వందకు పైగా ఉద్గ్రంధాలు రచించి సాహిత్య సేవలోనూ డాక్టర్ అనిపించిన డా శ్రీ లంకా శివరామ్ ప్రసాద్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి ఆధ్వర్యం లో’’వేద సభలు ‘’?

సరస భారతి ఆధ్వర్యం లో’’వేద సభలు ‘’? కాశీలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ‘’న్యాయ శాస్త్ర ‘’ప్రొఫెసర్ ,సంస్కృతం లో మహాదిట్ట ,కృష్ణా జిల్లా ఎలమర్రు గ్రామస్తులు ,గీర్వాణం -3 లో చోటు చేసుకొన్న కవి ,గ్రంథద్వయ ఆవిష్కరణ సభకు కాశీ నుంచి శ్రమపడి రేపల్లెకు విచ్చేసిన గీర్వాణ భాషాభిమాని డా . శ్రీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు గ్రంథ  ప్రాయోజకులు    

– ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు గ్రంథ  ప్రాయోజకులు       సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు  శ్రీ మైనేని గోపాల కృష్ణ        జననం –విద్యా భ్యాసం    శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న ఆరవసంతానం గా జన్మించారు .వీరి అన్నగార్లు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనే రాజ శేఖర్ ,అక్కయ్యలు శ్రీమతి అన్నపూర్ణాదేవి ,స్వర్గీయ శ్రీమతి  కనక దుర్గా దేవి,శ్రీమతి భారతీదేవి .చెల్లెళ్ళు శ్రీమతి హేమలతా దేవి ,శ్రీమతి సత్యవాణి .బాల్యం లోనే పిల్లల చదువుకోసం తండ్రిగారు కుటుంబాన్ని ఉయ్యూరు కు మార్చారు .ప్రాధమిక విద్య ను గోపాలకృష్ణ గారు కీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .కోటమాస్టారు అంటే మైనేని వారికి అమితమైన గౌరవం భక్తీ .వారి పేరు చెబితే పులకి౦చి పోతారు ..1950వరకు తాడంకిస్కూల్ లోచదివి ఎస్. ఎస్. ఎల్. సి .పాసై ,తరువాత విజయవాడ ఎస్ .ఆర్ .ఆర్ .కాలేజి లో ఇంటర్ చదివి 1954లో ఉత్తీర్ణులయ్యారు .కొంతకాలం నాటకాలు ,సోషలిస్ట్ పార్టీ సభలతో కాలేజీకి  డుమ్మా కొట్టారు ..బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్ తో చేరి ,వర్కర్ల జీవన పరిస్థితులను మెరుగు పరచటానికి వారిని యాజమాన్యం గౌరవం గా చూడటానికి కృషిచేశారు .                       ఉన్నత విద్య –వివాహం –మొదటిసారి అమెరికా ప్రయాణం    1953-54లో ఉయ్యూరులో డ్రమాటిక్ అసోసియేషన్ స్థాపించి ఆత్రేయ గారి యెన్ .జి.వో నాటికను ప్రాక్టీస్ చేశారు .1955-58కాలం లో విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీమెయిన్ సబ్జెక్ట్ గా ఎడ్యుకేషనల్,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ మైనర్ సబ్జెక్ట్ లుగా తీసుకొని చదివి 1959లో ఏం.ఏ .సెకండ్ క్లాస్ లో పాసైనారు .1960లో గుంటూరు జిల్లా రేపల్లెతాలూకానల్లూరు గ్రామవాసి కీ శే .పరుచూరి భావ నారాయణ చౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకొన్నారు .1960-61లో అమెరికా వెళ్లిమిన్నియా పోలీస్ లోని మిన్నెసోటా యూని వర్సిటి లో ఎడ్యుకేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు  .గోపాల కృష్ణ గారు 1961-62లో మాడిసన్ లోని విస్కాన్సిన్విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అనుబంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికి సహాయ పడుతూ ,కొన్ని లైబ్రరీ కోర్సులు పూర్తి చేశారు . .1962లోఇండియా తిరిగి వచ్చికొంతకాలం  .చిరు ఉద్యోగాలు చేస్తూ ,కొంతకాలం నిరుద్యోగి గా ఉంటూ ,కొంతకాలం ఉయ్యూరు కే సి పిలో అతి చిన్న ఉద్యోగం  చేసి,స్థిరమైన రాబడి లేకకుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ 1968వరకు ఆరేళ్ళు  గడిపారు .                      తలపు తట్టిన అదృష్టం  లైబ్రరీ సైన్స్  కోర్స్ –ఉద్యోగం   అదృష్టం తలుపు తట్టగా 1969లో అమెరికా వెళ్లి టెన్నేసిలో   లైబ్రరీ  సైన్స్ లో ఎం..ఎస్..చేసి,,అందరి ఆదరాభిమానాలు పొంది డిగ్రీ తీసుకొని సంతృప్తి చెందారు .సుమారు ఏడేళ్ళుపడిన మానసిక వేదనకు ,శారీరక శ్రమకు విముక్తికలిగింది . కోర్సులో ఉండగానే  కెంటకీలోని లూవిల్  యూని వర్సిటి లో కేటలాగర్  అండ్  ఇన్ స్త్రక్టర్  ఇన్ లైబ్రరీ సైన్స్ కు ఎంపికై,పదవీ  బాధ్యతలు చేబట్టారు .అమెరికన్ లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ ,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరి ,ఇతర విశ్వ విద్యాలయాల లైబ్రరీలను సందర్శించారు . .మెషీన్ రీడబుల్ కేట లాగింగ్ కు ఇన్హౌస్ ట్రెయినింగ్ ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆబ్ స్ట్రాక్ట్ ఆఫ్ అకడేమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కు సహకరించారు .లాంగ్  రేంజ్ బడ్జెట్,పర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలందించారు .యూనివర్సిటి ఆఫ్ లూయీ విల్ లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అందించటం లో ప్రముఖ పాత్ర పోషించారు .మైనేనిగారి బాస్   ప్రోత్సాహం తో  కేటలాగింగ్ కన్సల్టంట్ గా  1974నుంచి 76వరకు రెండేళ్ళు   యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్ట్ నాక్స్ లైబ్రరీ  ,నేషనల్ ఆర్కైవ్స్ ,సన్స్ఆఫ్ అమెరికన్ రివల్యూషన్ లో 1976-78 వరకుసలహా దారుగా ,కెంటకీ లోని లూయీ విల్ లో ఉన్న లైబ్రరీ ఆఫ్ వరల్డ్ ఫెయిత్  సెంటర్ లో 1980-82 వరకు  ఏంతో సంతృప్తిగా సేవలందించారు .  తనపై బాస్ కున్న నమ్మకానికి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు శ్రీ గోపాల కృష్ణ ..,పై ఉద్యోగులచేత ప్రశంసలు ,సహోద్యోగుల చేత ఆత్మీయ మిత్రులుగా అభినందనలుపొందారు .1997లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటి లైబ్రేరియన్ గా పదవీ విరమణ చేశారు .                          కుటుంబం   మొదటి నుండి సత్యం ధర్మం న్యాయం లపై మక్కువ ఉన్న గోపాల కృష్ణగారు కెంటకీ సదరన్ బాప్టిస్ట్ దియలాజికల్  సెమినరి,ముర్రె స్టేట్ యూని వర్సిటీలలో హిందూ ధర్మం పైప్రసంగాలు చేశారు .లూయీవిల్ యూని వర్సిటి లో రెలిజియన్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధ ధర్మం పై దార్మికోపన్యాసమిచ్చి అందరి మన్ననలు అందుకొన్నారు .అతిధులనుగౌరవం గా ఆదరించటం .బాధితులకు సాను భూతి సహవేదనలనుచూపటం మైనేని వారికి తలిదండ్రుల నుండి సంక్రమించిన గొప్ప సుగుణం .గోపాల కృష్ణ దంపతులకు   ఇద్దరుకుమారులు .పెద్దకుమారుడు శ్రీ కృష్ణ –కోడలు శ్రీమతి రమ.మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన.చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు శ్రీమతి కవిత .మనుమడు ఛి కిరణ్ .మనుమరాళ్ళు ఛిరియా ,కరీనా .  మనసాంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకొని సంతానం పొంది ,అమెరికాలోనే తాము ఎంచుకొన్న వృత్తిలో రాణిస్తూ ,తలిదండ్రులను కనిపెడుతూ ఆదర్శంగా ఉంటూసంతోష పెడుతున్నారు .గోపాల కృష్ణ గారు భార్య శ్రీమతి సత్యవతి గారితో  అనుకూల దాంపత్యం వలన సుఖ సౌఖ్య ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు .                ఉయ్యూరుపై అభిమానం –వితరణ    అమెరికాలో ఉన్నా గోపాల కృష్ణ గారికి ఉయ్యూరు పై అభిమాన ,మమకారాలు ఏ మాత్రమూతగ్గ లేదు .ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే ఉంటారు .దక్షిణ భారతదేశం లోనే మొట్ట మొదటి సారిగా ఏర్పడిన ఉయ్యూరు ఏ .సి .లైబ్రరీకి వారి తలిదండ్రులు కీ శే మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతి సౌభాగ్యమ్మ గార్ల పేరు మీద 5లక్షల రూపాయలు భూరివిరాళం ఇచ్చి మరో లక్ష రూపాయల విలువైన రిఫరెన్స్ గ్రంధాలను బహూకరించి ,లైబ్రరీ ప్రారంభోత్సవ సభకుమరో లక్ష రూపాలు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించారు .  .మచిలీ పట్నంకృష్ణా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  షట్కర్మ యుక్తా  

  షట్కర్మ యుక్తా    ఒక మొగుడు ఒక పెళ్ళాన్ని ఒక అంటే అనేకమంది పెళ్ళాలు న్నారను  కోవద్దు తన స్వంత పెళ్లాన్నే ఒక ”చానల్ రావు ” గారి ప్రవచనం విని శ్లోకం బట్టీ పట్టి భార్యను అందులో ఆమెవిధిగా చేయాల్సినపనులను  ,ఆపనులకు తగ్గ పేర్లతో  పురమాయిస్తున్నాడు . ఇంత సోది చెప్పి అసలు శ్లోకం శోకి౦చ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు జగదభ్యుదయాభివృద్ధి కారకులకు జేజేలు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు  జగదభ్యుదయాభివృద్ధి కారకులకు జేజేలు                                          రచన –మైనేని గోపాలకృష్ణ –హ౦ట్స్ విల్-యు. ఎస్ .ఏ . 19 ,20 శతాబ్దాలను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం )అంకితం ,స్పాన్సర్ వ్యాసాలూ వగైరా

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం )    రచన –గబ్బిట దుర్గా ప్రసాద్   అంకితం   దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు  రాధా కృష్ణ మూర్తి ,డా. శ్రీమతి సులోచన దంపతులకు జీవిత విశేషాలు జననం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా నదీ తీరాన నందిగామ తాలూకా వేములపల్లి గ్రామం లో శ్రీ బండారు రాధాకృష్ణ మూర్తిగారు కీ. శే . శ్రీ బండారు రాజేశ్వర రావు ,కీ.శే .శ్రీమతి సత్యవతి దంపతులకు 1-7-1929 న జన్మించారు .వీరి అన్నగారు శ్రీభోగేశ్వరావు గారు స్వాతంత్ర సమర యోధులు ,నందిగామలో ప్రముఖ సాంఘిక సేవకులు .వీరికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు .అమరావతి పాలకులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వీరి కుటుంబానికి వేములపల్లి గ్రామాన్నిఈనాముగా రాసిచ్చారు .కనుక వీరు వేములపల్లి అగ్రహారీకులు . కళాశాల విద్య –ఉద్యమ నిర్వహణ  శ్రీ రాధాకృష్ణ మూర్తిగారు 1946 లో విజయవాడ లోని ఎస్ ఆర్ ఆర్ . అండ్ .సి.వి . ఆర్.కాలేజీ లో ఇంటర్ చదివి ఉత్తీర్ణులయ్యారు . స్వాతంత్రోద్యమం దేశం లో విస్తృతంగా  విస్తరిస్తున్న కాలంలో దేశభక్తి వారిలో పురివిప్పగా మాతృదేశ సేవలో తరించాలన్న ధ్యేయం తో నాయకుల పిలుపు నందుకొని విద్యకు ఎగనామం పెట్టి స్వాతంత్రోద్యమం లో స్వచ్చందం గా చేరి,తమ వంతు పాత్ర పోషించిన దేశభక్తులు .  . తరువాత 1947 లో దేశం  స్వతంత్ర పొందాక  భారత దేశం లోని సంస్థానాలను భారత దేశ  అంతర్భాగంలో   చేయటానికి నాటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేస్తున్న ప్రయత్నాలకు దాదాపు అందరు సంస్థానాధిపతులు స్వచ్చందంగా కలిసి వస్తే ,ఒక్క నైజాం నవాబుమాత్రం మొండి కేసి నయానా భయానా చెప్పినా లొంగకపోతే , నైజాం నవాబు పెంచి పోషించిన రజాకార్లు ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తుంటే  రజాకార్ ల దౌష్ట్యాన్ని యెదిరించి  పోరాడే ప్రజా ఉద్యమం లో ప్రజల తరఫున ప్రాణాలకుతెగించి పోరాడిన పోరాట యోధులు శ్రీ మూర్తిగారు . గత్య0తరం లేని పరిస్థితులలో సర్దార్ పటేల్  1949 లో పోలీస్ యాక్షన్ జరిపి తరతరాలబూజు నైజాం నవాబును గద్దె దింపి నైజాం సంస్థానాన్ని భారత దేశం లో విలీనం చేశాడు . ఉన్నత విద్యాభ్యాసం –ఉద్యోగం–రచన   పోలీస్ యాక్షన్ తర్వాత  నాటి ముఖ్యమంత్రి మహా విద్యావేత్త డా బూర్గుల రామకృష్ణారావు ,డా మేల్కొటే మొదలైన ప్రముఖుల సలహా తోశ్రీ మూర్తిగారు ఉస్మానియా యూని వర్సిటీ లో చేరి ఆగిపోయిన విద్యను కొనసాగించి విద్యారంగంలోను మేటి అనిపించారు .ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ,మహా విద్యావేత్త , గ్రంథకర్త , ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రధమ సభాపతి డా శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారు వీరికి ముఖ్య బంధువు .      మూర్తిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి 1953 లో ఏం ఎస్ సి ,1958 లో పి. హెచ్ . డి .పొందారు . 19 53 నుంచి 61 వరకు యూనివర్సిటీ సైన్స్ కాలేజీ లెక్చరర్ గా పని చేశారు . 1961 లో ‘’ఫుల్ బ్రైట్ఎక్స్చేంజి ప్రోగ్రాం ‘’లో అమెరికాలోని లూసియానా రాష్ట్రయూనివర్సిటీ కాలేజీ మెడికల్ కాలేజీ లో హృద్రోగ0పై రీసెర్చ్ చేయటానికి ,గ్రాడ్యుయేట్ స్కూల్ లో బయో కెమిస్ట్రీ బోధించటానికి అమెరికా వెళ్లారు . 1961 నుంచి 1992 వరకులూసియానా స్టేట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది మూడు దశాబ్దాలు సేవలందించారు . 1992 నుంచి  టులేన్ యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్పబ్లిక్ హెల్త్ లో గుండె జబ్బులపై పరిశోధనలు చేశారు .హృద్రోగాలకు సంబంధిన అనేక అమెరికా జాతీయ , అంతర్జాతీయ రీసెర్చ్ సమావేశాలలో ఆహ్వానితులుగా పాల్గొన్నారు .గుండె జబ్బులపై 200 లకు పైగా రీసెర్చ్పేపర్లుసమర్పించారు . ”గుండె జబ్బు -నివారణోపాయాలు ”పుస్తకాన్నిమూర్తిగారు ఆంగ్లం లో రచిస్తే ,వారి అర్ధాంగి సులోచనగారు తెలుగులోకి అనువాదం ,చేసి ప్రచురించిన ఘన వైద్యులు శ్రీ మూర్తిగారు . వివాహ బంధం –సంతానం  రాధా కృష్ణ మూర్తిగారు శ్రీమతి శకుంతల గారిని వివాహమాడా రు .వీరి సంతానం  1-శ్రీ రాజేశ్వరరావు2- శ్రీమతి ఉమ3-కుమారి హేమ 4-శ్రీనివాస ప్రసాద్  గార్లు . ఈ నలుగురూ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం లో ఆరోగ్య శాఖా సంబంధ  వృత్తులలో స్థిరపడ్డారు .  దురదృష్ట వశాత్తు శ్రీమతి శకుంతలగారు కేన్సర్ వ్యాధితో 1981 లో మరణించి కుటుంబానికి తీరని శోకం కలిగించారు .                        బండారు వారి బంగారు దాంపత్యo 1983 లో మూర్తిగారు గుంటూరు జిల్లా రేపల్లె లోని యల్లాప్రగడ వారి ఆడబడుచుప్రొఫెసర్ శ్రీ యల్లాప్రగడ రామ మోహన రావు గారి చెల్లెలు   డా శ్రీమతి సులోచన ఏం డి . గారిని ద్వితీయ వివాహం చేసుకొన్నారు .శ్రీమతి సులోచనగారు 1969 కాకతీయ యూని వర్సిటీ లో ఏం. బి . బి. ఎస్.,1973 లో ఉస్మానియా యూనివర్సిటీలో డి. జి …

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేసీఆర్ సభలు 

కేసీఆర్ సభలు ఈ మధ్య హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ”పేరిట జరిగిన సభలు కేసి ఆర్ సభలై ముక్కున వేలేసుకొనేట్లు చేశాయి . ఎవరు అధికారం లో ఉన్నా ,తానూ అధికారం లో ఉన్నా ,లేకపోయినా తెలుగు అంటే ,తెలుగు సంస్కృతీ అంటే  వీరాభిమానం అంకిత భావం తో మాన్యశ్రీ మండలి బుద్ధ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గ్రంధద్వయ ఆవిష్కరణ -live

https://sarasabharathi.blogspot.in/

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -14

— మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -14 అద్వితీయ అమోఘ  మహోన్నత వ్యక్తిత్వం వెంకటేశ్వర్లు గారి గురించి ఎంత చెప్పినా ,ఆయన అమోఘ అద్వితీయ వ్యక్తిత్వం గురించి ఆవిష్కరించకపోతే అది సమగ్రం,పరిపూర్ణం కానేరదు . స్థిరచిత్తం,పట్టిన పట్టు విడవని సామర్ధ్యం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -13

మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -13  పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -7 3-నాన్ లీనియర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ నేషనల్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ నాన్ లీనియర్ ఆప్టిక్స్ అండ్  మెటీరియల్స్ సంస్థ ఇచ్చిన నిధితో ఈ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనిషిలో మనిషి

— మనిషిలో మనిషి ‘’ కాంగ్రెస్ ను ‘’ మోదీ ‘’చావుదెబ్బలతో మోది మోది బిజెపి ని గుజరాత్ లో గెలిపించాడు పటేల్ కుంపటి పెట్టినా ,దానికి కాంగీ అంటకాగినా ఓట్ల నిప్పు కమలానికే రాజుకొని హస్తాన్ని ఆర్పేసింది ‘’యువ రాజు ‘’పట్టాభి షేకమైన రెండో రోజే గుజరాత్ ఎన్నిక చావు కబురు చల్లగా తెలిసింది నాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-12

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-12             పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -7 7-నాన్ లీనియర్ ఆప్టిక్స్ లో సేవలు అలబామా అగ్రి మెకానికల్ సంస్థలో 1992 లో చేరి 15 ఏళ్ళు సేవ చేసి 1997  లో  చనిపోయే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-11

– మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-11             పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -6 6-సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి లో కృషి -2 సమయాధార అధ్యయనం స్థానికంగా తయారు చేసిన నైట్రోజెన్ లేజర్ ,క్షీణ వక్రతల ఫోటోగ్రాఫింగ్ లను స్టోరేజ్ ఆసిలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధనుర్మాసం మొదటి రోజు 17-12-17 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రభాత పూజ

ధనుర్మాసం మొదటి రోజు 17-12-17 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రభాత పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-10

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-10             పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -5 6-సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి లో కృషి నలుగురు నడిచే నలిగిన దారిలో నడిచే అలవాటు లేని వెంకటేశ్వర్లుగారు చేసినపనే చేస్తూ కూర్చోవటం లో సంతృప్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-9

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-9             పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -4                           ఎలక్ట్రానిక్ పారమాగ్నేటిక్ రిజోనెన్స్ 3-నూతన విధానాలు అయాన్స్ యొక్క EPR విశ్లేషణ లో భాగం గా స్పిన్ విలువ ఒకటి లేక ఒకటి కంటే ఎక్కువ ఉంటె … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-8

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-8             పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -3            అయస్కాంత అనునాదం (మాగ్నెటిక్ రేజో నెన్స్)లో అద్వితీయ కృషి 1-       ఎలక్ట్రానిక్ పారమాగ్నేటిక్ రిజోనెన్స్ 1960 ప్రధమార్ధం లో ఘనీకృత పదార్ధాలపై న్యూక్లియర్ మరియు స్పెక్ట్రో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

       తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు 

       తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు  బెంబేలెత్తి పోతున్న దేశ ప్రధాని  గుజరాత్ ఎన్నికలలకు  పన్నిన  సరి కొత్త వ్యూహం  మచ్చ  లేని వారిపై బురద చల్లటం   తనను చ0పేందుకు పధకం సిద్ధం  అంటూ కన్నీటి బొట్లు రాల్చి  అవి ప్రవాహ వేగంతో కదిలిపోవటం  ఆక్రోశం ,ఆవేశం తో స్థాయి మరచి  నిందారోపణ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-7

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-7             పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -2 2-మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లో డ్యూక్ యూని వర్సిటీలో ఉండగా వెంకటేశ్వర్లుగారు మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన ప్రారంభించారు .1953-54 కాలం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-6

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-6             పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర సాటి లేని డిపార్ట్ మెంట్ ను అలబామాలో ఏర్పరచి ,దాని నిర్వహణ కోసం 4 మిలియన్ డాలర్ల నిధి ని చేకూర్చిన దార్శనికులు శ్రీ వెంకటేశ్వర్లు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-5

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-5 అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో అందించిన సేవలు -2 1992లో ప్రొఫెసర్ పుచ్చా వెంకటేశ్వర్లు అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్  17/11/2017 గబ్బిట దుర్గాప్రసాద్ 1889 ఫిబ్రవరి 2 ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరం లో రాజకుమారి అమృత కౌర్ జన్మించింది .పంజాబ్ ప్రాంత కపుర్తలా రాష్ట్ర రాజు హర్మమ్ సింగ్ , రాణి హర్నాం సింగ్ దంపతుల ఎనిమిది మంది సంతానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-3

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-3 కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సేవ ఐ. ఐ. టి.కాన్పూర్ గా పిలువబడే ఈ విద్యాకేంద్రం స్వర్గీయ పీ.కే .కేల్కర్ అనేక సంప్రదాయేతర నిర్వహణ కార్యక్రమాలు అమలు చేయటం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ -రేపల్లెలో -24-12-17 ఆదివారం -మధ్యాహ్నం 3 గం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక  వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-2

 మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక  వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-2                                  బోధన పరిశోధన శాస్త్రీయ రంగం లో శ్రీ వెంకటేశ్వర్లు గారి అమూల్య సేవ1954 -1997 కాలం లో  మూడు గొప్ప విద్యాకేంద్రాలు1- ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి 2-,కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు -1

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు -1                     కుటుంబ నేపధ్యం శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు 25-10-1921న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దంతలూరు గ్రామం లో జన్మించారు .తలిదండ్రులు శ్రీ పుచ్చా చంద్ర మౌళి శాస్త్రి ,శ్రీమతి బాలా త్రిపుర … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1-12-17 శుక్రవారం శ్రీ హనుమద్వ్రతం

This gallery contains 35 photos.

More Galleries | Tagged | Leave a comment

1-12-17 శుక్రవారం శ్రీ హనుమద్వ్రతం సాయంత్రం భజన ,చాలీసా పారాయణ

This gallery contains 33 photos.

More Galleries | Tagged | Leave a comment