అక్షరం లోక రక్షకం
సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
సరసభారతి ఆధ్వర్యం లో రేపల్లె వాస్తవ్యులు డా .శ్రీ యల్లాప్రగడ రామ మోహనరావు ,శ్రీ పరుచూరి శ్రీనాథ్ గార్ల సౌజన్య సహకారాలతో సంయుక్తంగా గుంటూరు జిల్లా రేపల్లె లో నిర్వహిస్తున్న
సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ
సాహితీ బంధువులకు శుభకామనలు – సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి ,సరసభారతి ముద్రిస్తున్న రెండు అమూల్య గ్రంథాల ఆవిష్కరణ సభ గుంటూరు జిల్లా రేపల్లె(పరుచూరి ,ఎల్లా ప్రగఢ వారి స్వగ్రామం ) లో 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది . దీనితోపాటు
గుంటూరు ,కృష్ణా జిల్లాల లో ప్రసిద్ధ కవులచే
‘’సాహితీ బంధం ‘’అంశం పై కవి సమ్మేళనం కూడా నిర్వహింపబడుతుంది .
పాల్గొన నున్న ప్రముఖ అతిథులు
శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్- పులిచింతల మరియు ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు) డా .శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి (ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ ,పారిస్ ),శ్రీమాన్ వేదాల వెంకట సీతారామాచార్యులు (రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంస్కృత కళాశాల ,పొన్నూరు ) ,అవధాన సరస్వతి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా సవరం వెంకటేశ్వరరావు(చరిత్ర శాఖాధిపతి హిందూ కాలేజి ,మచిలీపట్నం ) ,డా. శ్రీతూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంస్కృత కళాశాల ,పొన్నూరు )డా శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి(రిటైర్డ్ సంస్కృత అధ్యాపకులు ,శ్రీ పరశు రామాయణాది గీర్వాణగ్రంథకర్త ) డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ ,(ప్రముఖ కవి) డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి(న్యాయ శాఖాధ్యక్షులు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం –వారణాసి ) , డా శ్రీ గబ్బిట జయమాణిక్య శాస్త్రి(న్యాయ శాఖాధ్యక్షులు శ్రీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం –పూరీ ) – డా శ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి ( ప్రాచ్య సాఖ్యాన వివరణ కర్త –వారణాసి ) — డా రేమెళ్ళఅవధానులు(వేద గణిత నిధి,శ్రీ వేద భారతి నిర్వాహకులు ) ) శ్రీపరాశరం భావనారాయణా చార్యులు(వనౌషధి నిఘంటు కర్త ) –డా శ్రీమతి అయ్యగారి ప్రభావతీదేవి(విశ్వనాథ ‘’వేయి పడగలు’’ నవల కు సంస్కృతానువాదకర్త ) -డా శ్రీ ఇనగంటి ఉమారావు(తత్వ చింతామణి సిద్దా౦జన కర్త ) – శ్రీ చలపాక ప్రకాష్ (రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్య దర్శి ) మొదలగు విశిష్ట అతిథులతో పాటు-
రేపల్లె పుర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహిత్య ,సంగీత ప్రియులందరికీ ఆహ్వానం . పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
ఆవిష్కరింపబడే గ్రంథాలు
1-ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు
తమ సృజనాత్మక ప్రతిభతో ప్రపంచ ప్రగతిని మార్చి మలుపు త్రిప్పి ,ఆధునిక ప్రపంచానికి దారులు వేసిన వేదాంతం, తత్వశాస్త్రం ,కవిత్వం ,నాటకం నవల సంగీతం,నాట్యం, సినిమా ,శిల్పం, చిత్రకళ మొదలైన రంగాలలో లబ్ధ ప్రతిష్టు లైన 91 మంది మహానుభావుల జీవిత చిత్రణ .
అంకితం – రేపల్లె లో జన్మించి స్టాటిస్టిక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతులైన గణిత శాస్త్ర వేత్త కీ శే . డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య (అమెరికా )గారికి
ప్రాయోజకులు -సరసభారతి ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ(రేపల్లె అల్లుడుగారు ) శ్రీమతి సత్యవతి(రేపల్లె ఆడపడుచు ) దంపతులు -అమెరికా (పరుచూరి వారికి బావగారు ,సోదరి
—
ముందు మాటలు -డా .శ్రీ సవరం వెంకటేశ్వర రావు – చరిత్ర శాఖాధిపతి -హిందూకాలేజి -మచిలీ పట్నం
2- గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 -మూడవ భాగం
భారత దేశం లోని అన్ని రాష్ట్రాలకు,అన్నికాలాలకు చెందిన 462 మంది సంస్కృత కవుల జీవితాలు, ,దర్శనం ,కావ్యం ,నాటకం ,కధ నవల ,చరిత్ర ,సాహిత్యం ,వ్యాఖ్యానం మొదలైన ప్రక్రియలలో వారి రచనా విశేషాలపై వెలువడిన ముచ్చటైన మూడవ గ్రంథం .
అంకితం – దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి(రేపల్లె అల్లుడుగారు ) ,శ్రీమతి డా సులోచన –రేపల్లె ఆడపడుచు- (అమెరికా ) దంపతులకు
ప్రాయోజకులు –రేపల్లె లో జన్మించిన విద్యాసంపన్నులు , వితరణ శీలి ,దేశభక్తి పరాయణులు,
ప్రొఫెసర్ యల్లాప్రగడ రామమోహన రావు గారు(అమెరికా )
(మూర్తిగారి బావమరిది ,సులోచనగారి అన్నగారు )
ముందుమాటలు -అవధాన సరస్వతి డా శ్రీ పాపపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు
— వేదిక తో సహా అన్ని వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం డిసెంబర్ మొదటి వారం లో అంద జేస్తాం
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు –
డా .ఎల్లాప్రగడ రామమోహనరావు-రేపల్లె
పరుచూరి శ్రీనాథ్(కీ శే .డా పరుచూరి రామ కృష్ణయ్య గారి సోదరుడు )-రేపల్లె
23-11-17
—
—

