గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
226-జవహర్ జ్యోతి ర్మహాకావ్య కర్త –రఘునాధ ప్రసాద్ చతుర్వేది (1911-198 8 )
1911 లో యుపి మధురలో పుట్టిన రఘునాధ ప్రసాద్ చతుర్వేది 1988 లో 77 వ ఏట మరణించాడు .జవహర్ జ్యోతి మహాకావ్యం రాశాడు .
227- హస్తామలక స్తోత్ర అనుశీలన కర్త –రామేశ్వర ప్రసాద్ చతుర్వేది (19 62)
196 2 అక్టోబర్ 15 యుపి లో పుట్టిన రామేశ్వర ప్రసాద్ చతుర్వేది ఎం ఏ పిహెచ్ డి.రామ్బాయ్ నగర్ సంస్కృత కాలేజి లో సంస్కృత హెడ్ . హస్తామలక స్తోత్ర అనుశీలన,వేద ఏవం అవెస్టా రచించాడు .
228- వైదిక శిక్షా స్వరూప విమర్శ కర్త –రామ మూర్తి చతుర్వేది (19 58 )
శుక్ల యజుర్వేద ,ఋగ్వేద న్యాయ వ్యాకరణ ఆచార్య రామ మూర్తి చతుర్వేది 19 58 జనవరి 1 యుపి శాంతాకబీర్ లో పుట్టాడు .వారణాసి కాశీ విద్యా పీఠ సంస్కృత ప్రొఫెసర్ .రాం సజీవన్ శుక్లా ,ఆచార్య రాం రాజ్ త్రిపాఠీ ,ఆచార్య రాధేశ్ మణి తిపాఠీలు గురువులు .శిష్యులు శ్రీ వాణీ విలాస దిమారి , డాక్టర్ ప్రవేశ కుమార్ మిశ్ర ,డా.శశి శేఖర్ మిశ్ర .సంస్కృతం లో యజ్ఞోపవీత వేదారంభ సమావర్తన సంస్కారః , వైదిక శిక్షా స్వరూప విమర్శరాశాడు .
229- సారస్వత సందర్శనం కర్త -సరస్వతీ ప్రసాద్ చతుర్వేది (1902-1979 )
1902 అలహాబాద్ జిల్లా లాలాపూర్ లో పుట్టాడు .నాగపూర్ ఎం హెచ్ యూని వర్సిటి ప్రొఫెసర్ .అలహాబాద్ యూని వర్సిటి డైరెక్టర్ .భారత ప్రభుత్వ సంస్కృత డైరెక్ట రేట్ డైరెక్టర్ .సారస్వత సందర్శనం ఒక్క పుస్తకమే రాశాడు .77 వ ఏట 1979 లో చనిపోయాడు .సంస్కృత సాహిత్య ,వ్యాకరణాలపై సంస్కృత హిందీ ఇంగ్లిష్ లలో చాలా పుస్తకాలు రాశాడు .
230-గోస్వామి తులసీ దాస శతక కర్త –శివ దత్త శర్మ చతుర్వేది (1934 )
19 34 ఏప్రిల్ 16 రాజస్థాన్ జైపూర్ లో పుట్టిన శివదట్ట శరం చతుర్వేది సాహిత్య ,వ్యాకరాన్ ఆచార్య .వారణాశి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ ప్రాచ్య విద్యా ప్రొఫెసర్ .6 గ్రంధాలు రాశాడు .గోస్వామి తులసీ దాస శతకం ,స్పూర్తి సప్తశతి ,లాలస మైత్రి చర్చా మహాకావ్యం ,సత్యం శివం సుందరం మహా కావ్యం . అభినవ కథా కుంజ .గొప్ప కదా వ్యాస రచయితా .ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మహా మహోపాధ్యాయ పొందాడు .మాఘ ,కాళిదాస పురస్కార గ్రహీత .
231-కావ్య దోష విమర్శ కర్త –ఉమాకాంత చతుర్వేది( 19 60 )
3-11-1960 బీహార్ బాభువా జిల్లా బనౌళి లో పుట్టిన ఉమాకాంత చతుర్వేది ఎం ఏ పిహెచ్ డి.ఆచార్య .జైపూర్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రోఫెసార్ .కావ్య దోష విమర్శ ,అయోధ్యా తీర్ధ ప్రశంస ,స్తుతి కుసుమాంజలి రాశాడు .
232- శ్రీ వ్రజ స్తవ మాలిక కర్త –వాసుదేవ కృష్ణ చతుర్వేది (20 వ శతాబ్దం )
న్యాయ వ్యాకరణ ధర్మ శాస్త్ర ఆచార్య ,పురాణ జ్యోతిష సాంఖ్య యోగ సాహిత్య వల్లభుడు వాసుదేవ కృష్ణ చతుర్వేది,త్రిభాషలలో ఎం ఏ సాహిత్య రత్న,డిలిట్ ,కావ్యతీర్ధ, విద్యా వాచస్పతి ‘.కాలం 20 వ శతాబ్ది . ఓరియెంటల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ హెడ్.రాసిన 5 గ్రంధాలలో ద్వారకాధీశ మహాకావ్యం ,శ్రీ వ్రజస్తవ మాలిక , నందోత్సవ ,భారత రాష్ట్ర గీతి, శ్రీమతి ఇందిరాగాంధీ కావ్యం ,.యుపి సంస్కృత అకాడెమి అవార్డీ .
233-తర్క భాష కర్త –అర్కనాద చతుర్వేది (1956 )
1956 ఆగస్ట్ 15 బిహార్ మధుబని జిల్లా రుద్ర పురి లో పుట్టిన అర్కనాద చతుర్వేది వ్యాకరణ ఆచార్య .రాజస్థాన్ జైపూర్ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .గురుపరంపర –పండిట్ ఉమేష్ చౌదరి ,డా.హర్ష నాద మిశ్ర ,డా.మణినాద ఝా .20 కి పైగా గ్రంధాలు రాశాడు .వాటిలో –లఘు సిద్ధాంత కౌముది ,వైయాకరణ సిద్ధాంత కౌముది ,మధ్య సిద్ధాంత కౌముది ,నిఘంటు శబ్ద కోశం ,తర్కభాష ,మేఘదూతం ఉన్నాయి .
234 –సరోజ సుందర కావ్యకర్త –గుంజేశ్వర చౌదరి (194 9 )
గుంజేశ్వర చౌదరి 7-8-1949 హర్యానాలో పుట్టి ,సాహిత్యం లో ఎం ఏ చేసి ,హర్యానాలోని హగోలా సంస్కృత విద్యా పీఠప్రొఫెసర్ ,ప్రిన్సిపాల్ . 8 పుస్తకాలు రాశాడు –విదుర నీతి ,పండిత రాజ కృత అప్పయ దీక్షిత సమీక్షా వివేచనం ,సరోజ సుందరం ,వాణీవీణా .ఆలిండియా రేడియో లో గీత రామాయణ భారత ,సంస్కృత సాహిత్యాలపై 20 కి పైగా ప్రసంగాలు చేశాడు .
235—నిబద్ద సౌరభ కర్త -ప్రభాదేవి చౌదరి (1954 )
27-7-1954 బీహార్ లో పుట్టిన ప్రభాదేవి చౌదరి ఎం ఏ పిహెచ్ డి.భోపాల్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ .రాసిన 5 పుస్తకాలలో జలద్ రాగ, , నిబద్ద సౌరభ,భారతీయ శిక్షణం ,సమ సామయిక సమస్య నవీన ప్రత్యశ్చ ఉన్నాయి .
226- నుంచి 235 వరకు ఆధారం –Inventory of Sanskrit Scholors
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-18 –ఉయ్యూరు
