ఆధునిక ఆంద్ర శాస్త్ర వేత్తలు 49 –‘’ఇ మెయిల్ ఇన్ఫార్మర్’’ సృష్టికర్త –టి.సోనీ రాయ్(చివరిభాగం )

ఇ మెయిల్స్ చెక్ చెక్ చేసుకోవటానికి డెస్క్ టాప్ మీద  ఆధారపడి వచ్చేది .ఈ ఇబ్బందిని అధిగమించటానికి హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త సోనీ రాయ్ పరి శోధకుడిగా మారి తానె ఒక యంత్రాన్ని సృష్టించాడు .2001లో రూపొందించిన ఈ గాడ్జెట్ అంటే’’ ఇ మెయిల్ ఇన్ఫార్మర్ ‘’ ఎప్పుడు ఇ మెయిల్ వచ్చినా అందించి కాలాన్ని ఆదా చేస్తుంది .దీన్ని టెలిఫోన్ కు రిసీవర్ తో సిరీస్ లో  కలపాలి. సోని రాయ్ ఇన వెంటర్స్ అసోసియేషన్ సంస్థాపక అధ్యక్షుడు ..E.S.P.అంటే ఇ మెయిల్ సర్వీస్ ప్రోవైడర్ లో వినియోగదారులు తమ ఫోన్ నంబర్లతో ఇ మెయిల్ అడ్రస్ లను రిజిస్టర్ చేసుకోవాలి .ఇన్ బాక్స్ లో కొత్త మెయిల్ రాగానే యి .ఎస్. పి ‘’లైట్ ఎమిటింగ్ డయోడ్ ‘’C.E.D.ఒక బజ్ శబ్దం చేస్తుంది .ఇది P.C.మరియు I.S.P.ల చార్జి లవలన కలిగే విద్యుత్తును ,టెలిఫోన్ చార్జీలను ఆదా చేస్తుంది .

image.png

సోనీ రాయ్ ‘’చెక్ అథెంటిక్ సిస్టం ‘’C.A.S.పరికరాన్ని కూడా సృష్టించారు .ఇది బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం పై పని చేసి బ్యాంక్ చెక్ ల నిజస్వరూపాన్ని తెలిపి ,నకిలీ చెక్కుల వాడకాన్ని నిరోధిస్తుంది .ఈ ఎక్విప్ మెంట్ లోనే సిరా రహత వేలి ముద్రల సాంకేతిక పరిజ్ఞానం ,ఫింగర్ ప్రింట్స్ ను గుర్తించే సాఫ్ట్ వేర్ కూడా  ఉంది.చెక్ నిస్కాన్ చేసి చదివే  అవకాశమూ ఉన్నది  .ఇంతేకాదు ఒక హై స్పీడ్ కంప్యూటర్ కూడా ఇందులో ఉండటం విశేషం .C.A.S.ద్వారా ప్రతి చెక్కును నిర్దుష్టంగా పరిశీలించే అవకాశం కలిగింది .

సోనీ రాయ్ మేధస్సు కు తగిన అవార్డులు రివార్డ్ లు దక్కాయి .1905లో య౦గ్ సైంటిస్ట్ అవార్డ్ ,2001లో  చెస్ట్ ఇన్వెన్షన్ అవార్డ్ ,  నేషనల్  ఇన్నోవోషన్ ఫౌండేషన్ అవార్డ్ లను అందుకున్న ఆధునిక యువ సాంకేతిక శాస్త్ర వేత్త సోనీ రాయ్ .

50-హై స్పీడ్ చిప్ డిజైనర్ –శ్రీ రాం సుదీర్ రెడ్డి

ఖమ్మం జిల్లా భద్రాచలం లో 1968లో జన్మించిన శ్రీ రాం సుదీర్ రెడ్డి ,కోరుకొండ హై స్కూల్ చదువు తర్వాత కృష్ణాజిల్లా మచిలీపట్నం లో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్ ఇంజనీరింగ్ చదివి పాసై ,అమెరికా వెళ్లి క౦ ప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎం.యెస్.చేసి ,కొద్దికాలం లోనే విజయవంతమైన పారిశ్రామిక వేత్త అయ్యారు .బోస్టన్ నగరం లో ఐ .టి .లో.అకు౦ఠితదీక్ష తో  విశేష పరిశోధనలు చేశారు .

హైస్పీడ్ కమ్యూని కేషన్ కు అవసరమైన ‘’చిప్ డిజైనింగ్ ‘’లో అత్యంత ప్రతిభ కనబరచారు .అనేక మల్టీ నేషనల్ హార్డ్ వేర్ కంపెనీలు ఈయన అపార మేధాశక్తిని గుర్తించాయి .బోస్టన్ లో స్వంతంగా ‘’సిమ్రాన్ కమ్యూని  కేషన్స్’’కంపెనీ ప్రారంభించి ,ఒక్క ఏడాదిలో రెండు రకాల చిప్ లను అందించిన ఘనుడిగా గుర్తింపు పొందారు .నాన్ డాక్ లిస్టెడ్ కంపెనీ అయిన అప్లైడ్ మైక్రో సర్క్యూట్స్ కార్పో రేషన్, రెడ్డి గారి  సిమ్రాన్ కంపెనీని 120 మిలియన్ల డాలర్ల తో (575కోట్లరూపాయలు )కొను గోలు చేసింది .ఈ డీల్ వలన కొన్నకంపెనీ షేరు విలువ 4 డాలర్లనుంచి పదిరెట్లు పెరిగి 40 డాలర్లుగా దూసుకుపోయింది .ఈ కంపెని కాపిటలైజేషన్ 2,500కోట్ల డాలర్లకు  చేరింది .

image.png

2002కు రెడ్డిగారు అప్లైడ్ మైక్రో సర్క్యూట్ కార్పోరేషన్ కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్  అండ్ జనరల్ మేనేజర్ హోదాలో ‘’ఫ్రేమర్ లేయర్ ప్రాడక్ట్స్’’ కు ఇన్ చార్జి అయినారు .ప్రపంచవ్యాప్తంగా చిప్ డిజైనింగ్ విశేష ప్రతిభా పాటవాలు చూపిన ఈయన తన స్వంతప్రాంతం తెలంగాణలో ఒక ఆర్ అండ్ డి నెలకొల్పటానికి 2002 ఏప్రిల్ లో విశ్వ ప్రయత్నం చేశారు  , 25కోట్ల పెట్టుబడితో ఏర్పడే దీనికోసం జూబ్లి హిల్స్ లో భవన నిర్మాణం చేబట్టారు కూడా .ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వ ఐ టి వర్గాలతో సంప్రదింపులు జరిపినా స్పందన కరువైనందున నిరాశతో విరమించుకు-న్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’

మనవి-‘’ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు’’ ధారావాహిక ఈ 50మంది శాస్త్ర వేత్తలతో ప్రస్తుతం ముగిస్తున్నాను .ప్రజల  దృష్టిలో ఎక్కువగా పడనీ వారినే ఎక్కువమందిని తీసుకొని రాశాను .ఇంకాఎందరో మహాను భావులున్నారు .వీలున్నప్పుడు వారి గురించి తెలియ జేస్తాను .ఇప్పటికి ఇది విరామం .

రేపు 12-7-19 శుక్రవారం ‘’తొలి ఏకాదశి ‘’శుభా కాంక్షలు’’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.