ప్రపంచ దేశాల సారస్వతం 8- కొరియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం
8- కొరియన్ సాహిత్యం
కొరియన్ భాష జపనీస్ –కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని చాలామంది అభిప్రాయం కానీ అది సరికాదు ఒక స్వతంత్ర భాష అని కొందరి భావన .మొదట్లో చైనీస్ లిపినే వాడుకొన్నా ,తర్వాత ద్వన్యాత్మక లిపిని అనుసరించారు .
కొరియాలో అంతా సారస్వతమే అని ఒక పాశ్చాత్య వ్యాఖ్యాత చెప్పాడు .కాని క్రీ శ 4వ శతాబ్దిలో చైనా లిపి ప్రవేశ పెట్టబడినప్పటి నుంచి వ్రాయబడినదంతా సారస్వతమే ఐతే అంత తక్కువగా ఉండటానికి కారణం ఏమిటో ఆశ్చర్యం గా ఉంటుంది .ప్రతిభ తక్కువ అనటానికి వీలులేదు చైనా ప్రభావంతో కొరియాలో నీతి వాజ్మయమే ఎక్కువగా వచ్చింది .కొరియా సంస్కృతిపై చైనాప్రభావం ఎక్కువే .చైనా సిద్దాం తాలను చైనాలో కంటే కొరియాలో చాలా ఎక్కువగా నిష్టగా అనుసరిస్తారు .సనాతనత్వం పై అభి రుచి ఎక్కువ అవటం వలన భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యం పై దృష్టి పెట్టలేదక్కడ .
క్రీ.శ 692లో పోల్ చాంగ్ చైనా ప్రాచీన గ్రంధాలను వివరించటానికి కొరియా భాషను ,కొరియన్ ధ్వనులకు అనుగుణంగా ఉపయోగించాడు .అయినా చైనా భాష నేర్వటం వీరికి కష్టంగానే ఉండేది .ఆ భాషను వశం చేసుకొన్న మొదటివాడు చోయ్ చివెన్ (858-910).ఇక్కడి నుంచి మనోజ్ఞమైన శైలి ,సుకుమార శబ్దజాలం తో గద్య పద్యాలు రాశారు కవులు .వాటిలో 1145లో వచ్చిన సంగూక్ సాగి ,సంగూక్ యూసా ముఖ్యమైనవి .మొదటి దాన్ని కిం పూసిక్ (1075-1151),రెండవ దాన్ని సెయింట్ ఇలియాన్ (1288)కూర్చారు .ఇవి చారిత్రక గ్రంథాలుగా ,కొరియన్ సాహిత్యముఖ్య గ్రంథాలుగా గుర్తింపు పొందాయి .అప్పుడప్పుడుచైనాభాషలో కూడా పద్యాలు రాసేవారు .కన్ఫూషియస్ సిద్ధాంత అనుయాయులు,మేధావులు కొన్ని నవలలు కూడా రాశారు .1637-92వాడిన కిం మున్జుంగ్’ ’ది క్లౌడ్ డ్రీం ఆఫ్ ది నైన్’’అనేది ప్రసిద్ధమైనది .ఇందులో ఐహిక వస్తువుల అశాశ్వతత్వం గురించి బోధన ఉంటుంది .నిర్మాణ లోపాలున్నా కొరియన్ ముఖ్య నవలగా గుర్తింపు పొందింది .
కొరియన్ పద్యాలు సమ్ గూక్ యూపా లో ఉద్ధరి౦ప బడ్డాయి వాటి అర్ధాలు ,వాటి ధ్వనులు సూచించటానికి చైనా అక్షరాలూ వాడారు .క్రీ.శ. 1438లో సెనాంగు రాజు (1419-51)’’ఓన్మం’’అనే అక్షరమాల కనిపెట్టి చైనా అక్షరావాడకాన్ని పూర్తిగా తొలగించేశాడు .ఈ కొత్తలిపి చైనా లిపి తెలియని కార్మికులకు స్త్రీలకూ అమ్మేవారు .దీనితో జానపద గాథలు రాయటం ప్రారంభమైంది .
కొరియా కవిత్వం ఉత్తమ శ్రేణి కి చెందింది .చాలాభాగం చైనా భాషనుంచి సంగ్రహింప బడినా బాల ,జానపద సాహిత్యం బహు సుందరం గ ఉంటాయి.కొరియన్ భాషలో ఛందో నియమాలు అతి తక్కువ .7లేక 8అక్షరాల ద్విపద లలో రాసేవారు . వ్యక్తీ కరణలో పద్యానికి గద్యానికి తేడా ఉంటుంది .
కాలక్రమంలో దేశీయ భాషా నురక్తి పెరిగి ,కొత్త ప్రక్రియలలో కవులు రచయితలూ రాస్తున్నారు .కొరియన్ గ్రంథాలు చాలా తక్కువగా అనువాదం పొందాయి .యాంగ్ హిల్ కాంగ్ రచన ‘’ది గ్రాస్ రూఫ్ ‘’,మిరాల్ లి రాసిన ‘’డేర్ యు ‘’పుస్తకాలు చూస్తె కొరియన్ రచయితలకు ఇతరభాషలలో రాసే ఆసక్తి తగ్గలేదని నిరూపిస్తాయి.
కొరియన్ పెనిన్సులా లోని జానపద కథలు సంప్రదాయ మత విశ్వాసాలు క్లాసికల్ కొరియన్ సాహిత్యం లో ప్రతిఫలించాయి .సంప్రదాయ కవిత్వం లో నాలుగు రకాలున్నాయి 1-హినగ్గా –స్థానిక గేయాలు 2-పైలోక్ – ప్రత్యేకపాటలు3-చా౦గ్గా-దీర్ఘ కవితలు ,4-సిజో-సద్యోమదురిమలు.వీటిలో కినోగ్గీ శైలి ఉంటుంది .14,15శతాబ్దాలలో ‘’ఆక్చాంగ్ ‘’-పద గేయాలు వచ్చాయి వీటిలోయంగ్ బి ఒచాన్ కా (1445-47) యి రాజవంశాన్నికీర్తిస్తూ రాసిన ఫ్లైయింగ్ డ్రాగన్ సాంగ్స్ లో మాధుర్యం నేటివిటి స్పష్టంగా ఉన్నాయి .వీటిలో ఒకప్రాచీన లిరిక్ సాంగ్- యియో ఒక్ గోజేసియాన్ కాలలో రాసిన ‘’గోమ్ఘూన్ ‘’.
హియా౦గ్గా –హియాంగ్గాలేక హంజా మార్పు చెందిన కొరియన్’’ఇడు’’ భాషలో రాసింది దీన్ని గుమాస్తా రాత అంటారు .దీనివలన కొరియన్ భాష వ్యాప్తి చెందింది .ఇదేమొదటి కొరియన్ కవిత్వం .వీటిలో 25మాత్రమె నిలిచాయి .సంగూక్ యూసాలో 14,సన్యాసుల మతకర్తలగురించి ఉన్న గున్యేజియాన్ లో 11,మాత్రమే దక్కాయి. యూనిఫైడ్ సిల్లా భాషవచ్చాక రాసిన ప్రాచీనకవిత్వం ఇదంతా .హియాంగ్గాకవిత్వం లో ని పద్యాలలో 4,8,10 లైన్లు ఉంటాయి .10లైన్ పద్యం లో 4,4,2పాదాలుంటాయి .వీటిని బౌద్ధ సన్యాసులు రాశారు .బౌద్ధమే వీటిలో ఎక్కువగా ఉంటుంది .తర్వాత ప్రాధాన్యం మరణం .బౌద్ధ ఋషులకు ,యుద్ధవీరులకు ,కుటుంబ సభ్యుఅలకు స్మ్రుస్మృత్యంజలిగా రాయబడినవే .
సశేషం
