మనకు తెలియని మహాయోగులు—6 11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911

మనకు తెలియని మహాయోగులు—6

11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911

హిందూ సన్యాసి వేషం లో కనిపించే ముస్లిం యోగి ‘’సయ్యద్ సుల్తాన్ మొహియుద్దీన్ ఖాదిరీ ‘’నే ‘’భంభం’’ స్వామి అంటారు . ఆయన వంశీకులు  చాలాకాలంగా కర్నూలుజిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి లో ఉంటున్నారు .ఈయన చాలాప్రదేశాలు తిరిగి ఎన్నో మహిమలు ప్రదర్శించాడు .దేవుడు ఒక్కడే అన్నాడు .’’శరీరం అనే మసీదులో ఆవాజ్ అంటే ధ్వని లేకుండా నమాజు  అంటే ప్రార్ధన చేయటం శ్రేష్టం ‘’అని బోధించాడు .తన అవతార సమాప్తి గ్రహిచి ఆలూరులో ఉన్న శిష్యుడు భం షేక్అబ్దుల్  దాసు  దగ్గరకు వెళ్లి సందేశం ఇచ్చి,అక్కడే యోగనిద్రలో తన వంశ మూలపురుషుడు సత్తార్ హాని మహాత్ముడు,దర్శనమిచ్చి ఆదేశించగా ,మళ్ళీ చిప్పగిరి చేరి 11-10-1911 న 78 వ ఏట బుధవారం సజీవ సమాధి అయ్యాడు .

12- కుంభక యోగి  -సచ్చిదానంద పరమహంస -1865-1957

తమిళనాడుకంచి దగ్గర తిరుప్పనం కాడ గ్రామంలో సోమసుందరం ,విశాలాక్షీ అనే శివభక్త దంపతులకు 16-2-1865 రక్తాక్షి సంవత్సర మాఘబహళ పంచమి ఉత్తరానక్షత్ర సింహలగ్నం లో ఏకా౦బరేశ్వరస్వామి వరప్రసాదంగా కుప్పుస్వామి  జన్మించాడు .లోయర్ ఫోర్త్ ఫారం చదువుమానేసి 12వ ఏట కంచిలోని వివిధదేవాలయాల్ను సందర్శించి అర్చామూర్తులను పూజించాడు .ఇంటివద్ద శుచిగా పీటపై  జింక చర్మం  వేసి దానిపై తెల్లని బట్ట పరచి దానిపై కూర్చుని ,చిన్ముద్రతో ,భ్రుకుటి మధ్య చూపు నిల్పి ,,షోడషోప చారాలతో  మానసిక పూజ త్రికరణ శుద్ధిగా చేసి ఏకా౦బరేశ్వరునికి అంకితమిచ్చాడు

   13వ ఏట 46వ రోజున ఏకాంబరేశ్వరుడు నిత్యానందుడు అనే ముసలి బ్రాహ్మణ వేషం  లో వచ్చిరేచక పూరక కు౦భకాలు నేర్పి ,సాధన చేయమని మానసిక పూజ చాలించమని చెప్పి కుప్పుస్వామికి ‘’పరమహంస సచ్చిదానంద యోగి ‘’జ్ఞాననామం ప్రసాదించాడు .17వ ఏట పెరు౦దేవితో వివాహమైంది .సంసారంచేస్తూ రాజయోగిగా ఉన్నాడు సచ్చిదానంద .ఇంట్లోనే ఒక చిన్న గుహ నిర్మించుకొని నెలల కొలదీ ధ్యాన నిష్టలో గడిపాడు .సంతానం లేదన్న దిగులుతో బార్య చనిపోయింది .

  సత్యానంద సర్వం త్యజించి మద్రాస్ దగ్గర విద్యానర్సరి తోటలో కొన్ని నెలలు గడిపి ఆంధ్రప్రదేశ్ కడపకు చేరాడు .అక్కడే ‘’జీవబ్రహ్మైక్యవేదాంత రహస్యం ‘’ముందు తమిళం ,తర్వవాత తెలుగు లో రాసి ప్రచురించాడు .తపస్సుకు ధ్యానానికి గడికోట ను ఎంచుకొని ,మద్రాస్ దగ్గర పన్ చెట్టలో మఠం నిర్మించారు .ఆంద్ర తమిళ రాష్ట్రాలలోనేకాక ఆఫ్రికా శ్రీలంక సింగపూర్ బర్మా ,మలేషియాలలో కూడా తన యోగశాక్తులు ప్రదర్శించి ,యోగ కేంద్రాలు ఏర్పరచి వేలాది శిష్యులను తయారు చేశారు .చివరకు బెంగుళూరు   కె౦పాపురం అగ్రహారం లో 9-1-1957సాయంత్రం 92వయేటపరమహంస జీవ సమాధి చెందారు .హంస పరమహంసలో ఐక్యమైంది. ప్రతియేటా జనవరి 9ఆరాధనోత్సవం, ఫిబ్రవరి 16జయంతి ఉత్సవం ఘనం గా నిర్వహిస్తారు .మఠంలో మూడుపూటలాపూజ జరుగుతుంది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-9-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.