సర్పవర క్షేత్ర

అభినవ వాగనుశాసనుడు ,కవి సార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి ‘’సర్పవర క్షేత్రాన్ని

Go back

Your message has been sent

Warning
Warning
Warning
Warning

Warning.

‘’గురించి లీలాసు౦దరీ పరిణయం ‘’అనే కావ్యం రాశాడు .కవి నియోగి కౌన్డిన్యస గోత్రం  బయ్యనామాత్యుని ముని మనవడు .తిమ్మయ మనవడు .గంగనామాత్యుని కొడుకు .తల్లి లక్ష్మమ .జగ్గన సింగన నరసన పెద తండ్రులు .వీరమ ,పాపమ మేనత్తలు .రాజన,సింగన ,పెద్దన పెత్తండ్రి కొడుకులు . రాజన్న  జగ్గన సూరన సోదరులు .భార్య బుచ్చమ .నివాసం పిఠాపుర సంస్థానం లోని కందరాడ గ్రామం .ఆవూరి కరణం మనకవి .పుట్టి పెరిగింది చంద్రమపాలెం . దెందులూరి లింగారాధ్య దత్త ఉమా మహేశ్వరాచార్య౦ వాడైనా ,అద్వైతమతమే అవలంబించాడు .ఒకరోజు భావనారాయణ స్వామి కలలో కనిపించి ‘’శివుడికి నాకు భేదం లేదు .శివుడికి చాలకృతులు రాసి సమర్పించి పేరు పొందావు .నాకూ ఒకటి అంకితం చేయి ‘’అని అడిగాడు .దానిప్రకారమే పై కావ్యం రాసి ఆయనకు సమర్పించాడు కూచిమంచి తిమ్మనకవి .

  పీఠికాపుర సంస్థాన ప్రభువు రావు మాధవరావు కాలం లో ఉండేవాడు .కావ్యాలురాసి కవి సార్వభౌముడు మొదలైన బిరుదులు పొందాడు .రెండవ కావ్యం రుక్మిణీ పరిణయం1715లో, చివరిది శివలీలా విలాసం 1756లో రాసినట్లు భావిస్తారు .తిమ్మకవి 18వ శతాబ్ది ప్రారంభం లో పుట్టి ,ఆ శతాబ్ది మధ్యవరకూ జీవించాడు .పైన చెప్పినవే కాక రాజశేఖర విలాసం లేక భళ్ళాల చరిత్ర ,సింహాచల మహాత్మ్యం ,అచ్చ తెనుగు రామాయణం ,సారంగధర చరిత్ర,సాగర సంగ మహాత్మ్యం ,,లక్షణ సార సంగ్రహం ,రసిక జన మనోభిరామం తో పాటు చాలా శతకాలు దండకాలు కూడా రాశాడు .’’ప్రబంధ రాజ వెంకటేశ్వర విజయ విలాసం’’ రాసిన గణపవరం వెంకట కవి తర్వాత ఇన్ని రచనలు చేసినవారు లేరు .ఇతని కవితా ప్రతిభ అమోఘం కనుకనే బంధువైన ఏనుగు లక్షణ కవి ‘’హాటక గర్భ  వదూలీ లాటన చలితా౦ఘ్రినూపురా రావ శ్రీ పాటచ్చరములు ,తేనియ తేటలు మా కూచిమంచి తిమ్మయమాటల్’’అని అందరికీ తెలిపాడు .               కథ

     ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్తా విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహాతి (వీణ) కానీ, కమండలం కానీ కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి మోహించిన పీఠికాపురం (పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. దానితో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ, కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది. దానితో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.

పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను . ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణం. శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. ‘వైశాఖ శుద్ధ ఏకాదశి’ రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరుపబడుతుంది. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.

 సర్పవరం కాకినాడకు 5కిలో మీటర్ల దూరం లోనే ఉంటుంది .

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.