మూడవ మంత్రం-‘’నతత్ర చక్షుర్గచ్ఛతి-నో మనో న విద్మో న విజానీమో –యథైదనుశిష్యాత్ –అన్యదేవత ద్విదితాదధో అవిదితా దధి –ఇతి శుశ్రుమ పూర్వేషాం యేన స్తద్వాచ చక్షురే ‘’
భావం –అక్కడికి దృష్టి ప్రసరించదు.వాక్కు చేరలేదు ,మనస్సు అందలేదు .దాన్ని ఎలా అర్ధ మయేట్లు చెప్పాలో మాకు తెలియదు .అసలు ఆలోచించలేము కూడా .కారణం ,అది తెలిసిన దానికంటే వేరుగా ఉంటుంది .తెలియని దానికి అవతల చాలా దూరం లో ఉంటుంది .గురువు వివరించినా ,తెలుసుకోవటం కష్టం .మాకు తెలియబరచిన బుద్ధి జీవులవలన ఆ విధంగా ఉంటుందని మాత్రం విన్నాము .
నాలుగవ మంత్రం –‘’యద్వాచా నభ్యుదితం –యేన వాగభ్యుద్యతే-తదేవ బ్రహ్మత్వం విద్ధి-నేదం యయిద ముపాసతే ‘’
భావం –వాక్కు దేనిని చెప్పలేదో ,దేని చేత వాక్కు చెప్పబడుతుందో అదే బ్రహ్మ అని తెలుసుకో .ఇక్కడ మనుషులు ఉపాసించేది మాత్రం బ్రహ్మ కాదని గ్రహించు .
అయిదవమంత్ర –‘’యన్మనసా నను మనుతే –ఏనాహుర్మనో మతం –తదేవ బ్రహ్మత్వం విద్ధి-నేదం యదిద ముపాసతే ‘’
భావం – ఏ తత్వాన్ని మననం చేయటానికి వీలులేదో ,ఏ తత్త్వం మనసుకు మనన సామర్ధ్యాన్ని కలిగిస్తుందో ,ఆ తత్వమే బ్రహ్మ తత్త్వం అని గ్రహించు .భక్తులు ఉపాసించే ప్రతీక బ్రహ్మ తత్త్వం కాదు .
ఆరవ మంత్రం –యచ్చక్షుషా న పశ్యతి –ఏన చక్షూ౦సి పశ్యతి –తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే ‘’
భావం –ఏ తత్వాన్ని కంటితో చూడటానికి వీలులేదో ,ఏ తత్త్వం యొక్క ప్రేరణ చే కన్ను చూస్తోందో అదే బ్రహ్మ తత్త్వం గా భావించు .లోకం ఉపాసించే ప్రతీక బ్రహ్మ కాదు .
ఏడవ మంత్రం-‘’యచ్ఛోత్రేణ న శృణోతి-ఏన శ్రోత్ర మిదం శ్రుత౦-తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే ‘’
భావం –ఏ తత్వాన్ని చెవిద్వారా వినటానికి వీలు లేదో ,ఏ తత్వ ప్రేరణ తో చెవి విన గలుగుతోందో ,ఆతత్వమే బ్రహ్మతత్వం అని తెలుసుకో .ఇక్కడ ఉపాసించే ప్రతీక బ్రహ్మం కాదు .
ఎనిమిదవ మంత్రం –‘’యత్ప్రాణే న ప్రాణితి-యేన ప్రాణః ప్రణీయతే-తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే’’
భావం –ఏ తత్త్వం ప్రాణవాయువు చేత జీవించటం లేదో ,ఏ తత్త్వం చేత ప్రాణవాయువు నడపబడుతోందో ,అదే బ్రహ్మ తత్త్వం గా గ్రహించు .ఉపాసించే ప్రతీక బ్రహ్మకాదు.
ఈ మంత్రాలలో ‘’ తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే’’ అనేది మకుటం గా భావించవచ్చు .
మొదటిఖండం సమాప్తం .
రేపు 21-10-20-బుధవారం మూలానక్షత్రం ,సరస్వతీ పూజ శుభాకాంక్షలు
సశేషం –
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-20-ఉయ్యూరు
